
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తోంది ధర్మ దీక్ష కాదు.. నయవంచన దీక్ష అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్నందునే చంద్రబాబు దీక్షల డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు. నాలుగేళ్లు బీజేపీకి మద్దుతు ఇచ్చి, ఇపుడు ఉద్యమాలు చేస్తామంటే ప్రజలు నమ్మరని రఘువీరా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment