Special Category Status
-
ఏపీకి ప్రత్యేకహోదా తప్ప ఏమీ వద్దు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ మనుగడకు 16 మంది ఎంపీలను అందించిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తప్ప ఇంకేది అవసరం లేదని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.The people of AP whose 16 MPs are keeping the Central Government stable deserve nothing but Special Category Status. Not “arranged” additional loans, no Special Package, no concession, only Special Category Status. The General Budget is a play of words for us.— Vijayasai Reddy V (@VSReddy_MP) July 26, 2024శుక్రవారం(జులై 26) ఈ విషయమై ఆయన ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు. ‘కేంద్రం ఏర్పాటు చేసే అదనపు రుణాలు, ప్రత్యేక ప్యాకేజీ, మినహాయింపులు ఏవీ వద్దు. ఒక్క ప్రత్యేక హోదానే కావాలి. కేంద్ర బడ్జెట్ మాకు మాటల గారడిలా ఉంది అని విజయసాయిరెడ్డి విమర్శించారు. -
ఏ రాష్ట్రానికీ కొత్తగా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు: నిర్మలా సీతారామన్
-
వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా
పట్నా: కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకివస్తే దేశంలో వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా (స్పెషల్ కేటగిరీ స్టేటస్) కల్పిస్తామని జేడీ(యూ) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తమకు వస్తే వెనుకబడిన రాష్ట్రాలకు ఈ హోదా దక్కుతుందని, అలా జరగకపోవడానికి కారణమేదీ తనకు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నితీశ్ గురువారం పాట్నాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేయడం దారుణమని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దూరం చేయడం తగదని అన్నారు. బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు సుశీల్కుమార్ మోదీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్పై నితీశ్ విమర్శలు గుప్పించారు. బీజేపీ పెద్దల ఆదేశాలతో వారిద్దరూ తనపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. బీజేపీతో తాము చాలాకాలం కలిసి ఉండడం తప్పేనని నితీశ్ అంగీకరించారు. ప్రత్యేక హోదా కోసం బిహార్ చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బిహార్ను విభజించడం వల్ల రెవెన్యూ, గనుల ఆదాయం మొత్తం జార్ఖండ్కే వెళ్తోందని నితీశ్ కుమార్ చెబుతున్నారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే చాలు కేంద్రంలో ఏ ప్రభుత్వానికైనా మద్దతిస్తామని వివిధ సందర్భాల్లో ప్రకటించారు. బిహార్లో నెల రోజుల క్రితమే బీజేపీ కూటమి నుంచి బయటకువచ్చి, ప్రతిపక్షాలతో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్ కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీశ్ కుమార్ బరిలోకి దిగుతారని జేడీ(యూ) నాయకులు ఉద్ఘాటిస్తున్నారు. ఇదీ చదవండి: సర్వం అధినాయకత్వం కనుసన్నల్లోనే! -
370 రద్దు వల్లే చైనా దురాక్రమణ
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసినందుకే లద్దాఖ్లో చైనా దురాక్రమణకు పాల్పడిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రాన్ని తరచూ విమర్శించే ఫరూక్ అబ్దుల్లా ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడంపై మాట్లాడారు. ‘ఆర్టికల్ 370 రద్దును చైనా ఎన్నటికీ ఆమోదించదు. చైనా తోడ్పాటుతో స్వతంత్ర ప్రతిపత్తిని పొందుతామనుకుంటున్నాం. సరిహద్దుల్లో చైనా పాల్పడే చర్యలన్నిటికీ ఆర్టికల్ 370 రద్దుతో వచ్చిన ఆగ్రహమే కారణం’అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఎంపీ ఫరూక్ జాతి వ్యతిరేక, దేశద్రోహ వ్యాఖ్యలు చేశారని విమర్శించింది. ఫరూక్ చైనా దురాక్రమణను సమర్థిస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలతో ఆయన చైనాలో హీరో అయిపోయారని పేర్కొంది. ఆ పార్టీ ప్రతినిధి సంబిత్ మహాపాత్ర మాట్లాడుతూ.. రాజ్యాంగ పద్ధతిలో పార్లమెంట్ ఆమోదంతోనే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ప్రధాని మోదీపై వ్యతిరేకతతోనే ఆయన దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా తరచూ ఇలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలే చేస్తుంటారని తెలిపారు. -
పవన్ కల్యాణ్.. చెంగువీరా అయ్యారు..
సాక్షి, విజయవాడ : భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై సీపీఐ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ తీరును ఆ పార్టీ నేతలు ఎండగట్టారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ‘పవన్వి స్వార్థ ప్రయోజనాలు ...ఆయన మాకు దూరమైనందుకు బాధ పడటం లేదు. కమ్యూనిస్ట్ భావజాలం ఉందని చెప్పుకునే పవన్ కల్యాణ్ మతతత్వ పార్టీలోకి ఎలా వెళ్లారు. వామపక్షాలకు బాకీ లేదన్న ఆయన.. ప్రజాస్వామ్యానికి మాత్రం బాకీ పడ్డారు.అవకాశ వాదంతో పార్టీలు మారడం సహజం. అయితే.. సిద్ధాంతాలు నచ్చాయని వ్యాఖ్యలు చేయడం ఎందుకు? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో కలిసి పవన్ రాష్ట్రానికి ఏ ప్రయోజనాలను కాపాడతారు? సీఏఏ, ఎన్నార్సీని సమర్థించిన నరేంద్ర మోదీ, అమిత్ షా దేశద్రోహులు. అలాంటి చట్టాలను సమర్థిస్తున్న పవన్ కూడా దేశద్రోహే’ అని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ది అవకాశ వాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గతంలో ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్న ఆయన... నడ్డాను కలిసిన తర్వాత మంచి బందరు లడ్డూలు ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లిన నేతలు జేఎన్యూకు వెళితే పవన్ మాత్రం బీజేపీ కార్యాలయానికి వెళ్లారని విమర్శించారు. చేగువేరా ఆదర్శమన్నపవన్ ‘చెంగువీర’ అయ్యారని ఎద్దేవా చేశారు. అసలు బీజేపీతో పవన్ ఎందుకు కలుస్తున్నారో చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. దమ్మున్నవాడే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారని, పవన్ దమ్ముందో లేదో సమాధానం చెప్పాలని అన్నారు. చదవండి: వామపక్షాలకు పవన్ కల్యాణ్ ఝలక్ పవన్కు రాజకీయాల్లో స్థిరత్వం లేదు : అంబటి -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి : మిథున్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం లోక్సభలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ..విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విభజన వల్ల ఏపీ ఆర్థికంగా తీవ్ర స్థాయిలో నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరానికి వడ్డీలు, అసలు కలిపి 40 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వెనకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులను సత్వరమే మంజూరు చేయాలని వెల్లడించారు. ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా 800 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ ధనాన్ని ఆదా చేశామని తెలిపారు. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం గ్రాంట్లు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల నవీకరణ కోసం కేంద్రం నిధులను మంజూరు చేయాలని మిథున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఆ రికార్డు చంద్రబాబుకే దక్కుతుంది...
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం కోల్పోయాక మరోలా ప్రవర్తించడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన వ్యవహారశైలికి కొన్నిసార్లు ఊసరవెల్లి కూడా ఆశ్చర్యపోవాల్సిందే. యూటర్న్కు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు అందితే జుట్టు, అంతకపోతే కాళ్లు పట్టుకోవడం అలవాటే. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్తో లోపాయికారీ ఒప్పందం చేసుకుని, నరేంద్ర మోదీని తీవ్ర పదజాలంతో దూషించిన చంద్రబాబు తాజాగా బీజేపీలోకి కలిసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమయం లో రాహుతల్తో పొత్తు కోసం మోదీని నోటికొచ్చినట్టు మాట్లాడిన చంద్ర బాబు రాజకీయంగా కాంగ్రెస్కు హ్యాండిచ్చి మళ్లీ యూటర్న్ తీసుకుని బీజేపీకి దగ్గర కావాలని తహతహలాడుతున్నారు. కేంద్రం విభేదించి తప్పు చేశామంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ బీజేపి ఇంచార్జ్ సునీల్ దియోధరా మాత్రం బాబు ఎంట్రీకి ఎప్పుడో గేట్లు మూసేశామని చెబుతున్నారు. అయినా బాబు యూటర్న్ ప్రయత్నాలు, లాబీయింగ్ మాత్రం సుజనా చౌదరి ద్వారా నడుస్తూనే వుందని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. యూటర్న్ విషయానికి వస్తే... 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజనపై కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు... 2019 ఎన్నికలకు వచ్చేసరికి వ్యతిరేకతను పక్కనపెట్టి ఆ పార్టీతో చేతులు కలిపారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై ఆయన వేసిన పిల్లిమొగ్గలతో సొంత పార్టీ నేతలే అయోమయానికి గురయ్యారు. ఇక నాలుగున్నరేళ్లుగా బీజేపీతో పనిచేసిన చంద్రబాబు ఎన్నికల ముందు హఠాత్తుగా ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసి హోదాపై యూ టర్న్ తీసుకున్నారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి తానే పోరాటం చేస్తున్నానంటూ బిల్డప్ ఇచ్చిన ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే తాను అధికారంలో ఉన్న సమయంలో కాంట్రాక్టులు అప్పచెప్పి..సకాలంలో పూర్తి చేసిన వారిని భారీ బహిరంగ సభ పెట్టి మరీ సన్మానించిన చంద్రబాబే... పవర్ పోయి ప్రతిపక్ష నేతగా మారగానే యూ టర్న్ తీసేసుకున్నారు. చైనా మోటర్స్ పైనా , ఆ టెక్నాలజీ వల్ల రాష్ట్రానికి ఏదో నష్టం జరుగుతుందంటూ హడావుడి చేసేస్తున్నారు. గతంలో చైనా ప్రభుత్వం సహాయంతో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీ తో రాజధాని భవనాలను నిర్మిస్తున్నామని ఆ దేశంలో ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు చంద్రబాబు. చైనా ప్రతినిధులకు కూడా అమరావతి వచ్చి వెళ్లిపోయారు. యూటర్న్కు... బాబు కూడా కొత్త కాదు. అయితే నిజాన్ని చెప్పే అలవాటు ఏ రోజు చంద్ర బాబుకు అలవాటు లేదన్నది జనమెరిగిన సత్యం. నాలుగు నెలలకే తన అనుభవాన్ని ఉపయోగించి తిమ్మిని బమ్మిని చేసే చంద్రబాబు ఎప్పుడు ఏ యూటర్న్ తీసుకున్నా అది తన లాభాని తప్ప జనానికి ఉపయోగపడేది కాదనేది వాస్తవం. యూటర్న్ అనేపదం కూడా తన వ్యక్తిత్వాన్ని ,సహజత్వాన్ని వదులుకునేలా చంద్రబాబు ప్రవర్తిస్తుండటం సొంత పార్టీ నేతలకే మింగుడు పడటం లేదు. ఈ లెక్కన చూస్తుంటే...యూటర్న్ను ఇప్పటి దాకా లెక్కలేనన్ని సార్లు ఆచరణలో పెట్టిన రికార్డు చంద్రబాబుకే దక్కుతుంది. -
హోదాపై కేంద్రం మళ్లీ పాత పాటే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కేంద్రం ప్రభుత్వం మళ్లీ పాత పాటే పాడింది. ప్రత్యేక తరగతి హోదా ఉనికే లేదని 14వ ఆర్థిక సంఘం తేల్చిచెప్పినట్లు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘ప్రత్యేక తరగతి హోదా అనేది ఇప్పుడు లేదని 14వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. దీని స్థానంలో ఏపీకి ప్రత్యేక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సమానంగా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లింపు, విదేశీ ప్రాజెక్టులకు రీపేమెంట్ చేస్తామని చెప్పాం. ఆ మేరకు 2015 నుంచి 2020 వరకు ప్రత్యేక సహాయం చేస్తాం. ఏపీ విభజన చట్టం అమలుపై ఇప్పటివరకు 23 సమీక్షా సమావేశాలు నిర్వహించాం. విభజన చట్టం అమలు కోసం ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నాం. మౌలిక వసతుల ప్రాజెక్టులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాం’’ అని వివరించారు. అంతకుముందు పార్లమెంట్లో చర్చలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు సత్వరమే ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం లోక్సభలో బడ్జెట్ పై చర్చ లో పాల్గొన్న భరత్ విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు.తిరుపతిలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ఎన్నికల సభలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. -
‘సత్వరమే హోదా ప్రకటించాలి’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు సత్వరమే ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం లోక్సభలో బడ్జెట్ పై చర్చ లో పాల్గొన్న భరత్ విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు.తిరుపతిలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ఎన్నికల సభలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినా ఇప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వాగ్దానాలు ఆకాశాన్నిఆవరించిన మేఘంలా కనిపిస్తున్నా.. మేఘం వర్షిస్తేనే వాగ్దానాలు ఫలించినట్టు అని హిందీ కవిత చదివిన మార్గాని భరత్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో ఉందని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని,గాయపడిన రాష్ట్రాన్ని ప్రధానమంత్రి ఆదుకోవాలని కోరారు.చంద్రబాబును ప్రజలు పూర్తిగా తిరస్కరించారని అన్నారు.ఏపీ విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయడంతో పాటు రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు.13 జిల్లాల్లో 13 భారీ పరిశ్రమలు స్థాపించాలని కోరారు. ఇక ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు గోల్డ్ మెడల్ సాధించేందుకు ప్రభుత్వం వద్ద ఏమైనా రోడ్డుమ్యాప్ ఉందా అని భరత్ ప్రశ్నించారు. -
చంద్రబాబు బండారాన్ని బయటపెట్టిన గోయల్
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా యూటర్న్ తీసుకున్నారో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ బయటపెట్టారు. హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే ముఖ్యమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి 2016 అక్టోబర్ 24న చంద్రబాబు రాసిన పలు లేఖలను ఆయన విడుదల చేశారు. ప్యాకేజీ ద్వారా ఏపీకి ఎలా సహాయం చేయాలన్న విధానం గురించి కూడా చంద్రబాబు లేఖలో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ.. మంగళవారం గోయల్ విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2017 టీడీపీ మహానాడులో హోదా వద్దని ప్యాకేజీ కావాలంటూ చేసిన తీర్మానాన్ని ఆయన గుర్తుచేశారు. ప్యాకేజీని స్వాగతిస్తూ 2017 మార్చి 16న ఏపీ అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన అంశాన్ని గోయల్ ప్రస్తావించారు. ఇన్ని కుట్రలు చేసిన చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనం కోసం కేంద్రంపై ఆరోపణలను చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను తమపై నెట్టడానికే కేంద్రం నుంచి బయటకు వచ్చారని వెల్లడించారు. టీడీపీ, కాంగ్రెస్ జట్టుకడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రుజుమైందని గోయల్ అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి.. ఆయనను అవమానించిన కాంగ్రెస్తో జట్టు కట్టడం దుర్మార్గమన్నారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మీకు హైదరాబాద్లో ఆస్తులు లేవా.. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం రెండు తెలుగు రాష్ట్రల మధ్య చంద్రబాబు నాయుడు చిచ్చులు పెడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి హైదరాబాద్లో ఆస్తులు లేవా అని ప్రశ్నించారు. పక్కవారిని తిట్టడానికే ఆయన అనుభవం ఉపయోగపడుతోందని మండిపడ్డారు. మచిలీపట్నం పోర్టును కేసీఆర్ తెలంగాణకు తరలించుకుపోతారని మంత్రి లోకేష్ కనీస అవగహన లేకుండా మట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా బీజేపీ మ్యానిఫెస్టో ఉంటుందని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు. తన రాజకీయ స్వలాభం కోసమే చంద్రబాబు నాయుడు.. మోదీపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. -
ఇదీ కాపీయేనా..!
-
అది హోదాతోనే సాధ్యం : వైఎస్ వివేకానంద రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : పారిశ్రామిక విప్లవం రావాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం రాయచోటిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లుగా అనేక ఉద్యమాలతో ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచామన్నారు. చివరి అస్త్రంగా తమ పార్టీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించామని తెలిపారు. విభజన హమీలతో పాటు నదుల అనుసంధానమైన దొమ్మగూడెం, బ్రహ్మం సాగర్, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వేలిగోండ వంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకోరావాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం తెలంగాణ ఎంపీలు సహకరిస్తామంటున్నారని, మొత్తం 42 ఎంపీలతో కలిసి పోరాడితేనే తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని తెలిసినా.. టీడీపీ, కాంగ్రెస్లు ఏనాడు అడిగింది లేదని, బీజేపీ ఇచ్చింది లేదన్నారు. సరిగ్గా ఎన్నికల ముందు హోదా కావాలంటూ ప్రజాస్వామ్యాన్ని పునరుధ్ధరిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఘాటుగా విమర్శించారు. -
హస్తినలో వైఎస్సార్ సీపీ సమరభేరీ
-
గర్జించిన గళాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని వేదికగా హోదా గళాలు గర్జించాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న కపట నాట కాలపై సమరశంఖం పూరించాయి. టీడీపీ, బీజేపీ సర్కారుల ద్రోహానికి నిరసనగా హస్తినలో వైఎస్సార్ సీపీ గురువారం రోజంతా నిర్వహించిన ‘వంచనపై గర్జన’ ధర్నా కార్యక్రమానికి వణికించే చలి గాలుల్లోనూ ప్రజలు భారీగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలంటూ నినదించారు. జంతర్ మంతర్ వేదికగా... ప్రత్యేక హోదాపై నాలుగున్నరేళ్లుగా మడమ తిప్పకుండా పోరాడుతున్న వైఎస్సార్ సీపీ 16వ లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కావడంతో మరోసారి కేంద్రానికి ఏపీ ప్రజల ఆకాంక్షను చాటి చెప్పింది. హోదాపై ప్రభుత్వాల వంచనను గుర్తు చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఢిల్లీ పీఠాన్ని నిలదీసింది. ప్రత్యేక హోదా కోసం 2015 ఆగస్టు 10వతేదీన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే స్థలంలో భారీ ధర్నా నిర్వహించడం తెలిసిందే. 2018 మార్చి 5న పార్టీ శ్రేణులు మరోసారి పార్లమెంట్ పోలీస్ స్టేషన్ వీధిలో మహా ధర్నా కూడా చేపట్టాయి. హోదా కోరుతూ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన ఇటీవలే 12 ఏళ్ల నాటి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన ఢిల్లీలో శీతాకాలపు చలి గాలులను లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు, నేతలు ఉదయం 9 గంటలకే ధర్నా వేదిక వద్దకు చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు దివంగత వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ధర్నా కార్యక్రమాన్ని పార్టీ నేతలు ప్రారంభించారు. మరోవైపు పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పి.వి.మిథున్రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డి, మండలిలో విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించిన అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి రాజ్యసభలో ఆందోళన నిర్వహించి సభ వాయిదా పడిన అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సీనియర్ నేతలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని విజయవంతం చేశారు. సీనియర్ నేత కంతేటి సత్యనారాయణరాజు ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించారు. ఏపీకి ప్రాణవాయువు లాంటి హోదాను తాకట్టు పెట్టిన బాబు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.10 వరకు జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఏపీని వంచించిన తీరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నేతలు నిలదీశారు. మెజారిటీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ను విభజించిన తీరు, ప్రత్యేక హోదా తెస్తామని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు వంచించడాన్ని వివరించారు. ఏపీకి ఆక్సిజన్ లాంటి ప్రత్యేక హోదాకు చంద్రబాబు అడ్డుపడి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఎన్నికలు మంచుకొస్తుండటంతో ప్లేటు ఫిరాయించిన చంద్రబాబు ప్రత్యేక హోదా, శంకుస్థాపనలు అంటూ మరోసారి వంచించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. చంద్రబాబు, మోదీ నమ్మించి వంచించారు.. ‘ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేశారు. ఇద్దరూ పొత్తు పెట్టుకుని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి వంచించారు. ఢిల్లీని తలదన్నేలా ఏపీ రాజధాని నిర్మిస్తామని ఆనాడు మోదీ హామీ ఇచ్చారు. హోదా ఐదేళ్లు ఇస్తామని యూపీఏ అంటే 10 ఏళ్లు ఇస్తామని బీజేపీ నమ్మబలికింది. 15 ఏళ్ల పాటు హోదా సాధిస్తామని చంద్రబాబు చెప్పారు. వారిని నమ్మి రాష్ట్రం అన్యాయమైపోయింది. మోదీ గ్రాఫ్ తగ్గుతోందని చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. బాబు సిగ్గు లేని వ్యక్తి. నయవంచకుడు, రోషం లేని వ్యక్తి. బీజేపీకి మేం బీ–టీం అని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు కాపాడితే వారికే మా మద్దతు ఉంటుంది. చంద్రబాబు ఇప్పుడు రాహుల్గాంధీని వివిధ భంగిమల్లో ప్రేమిస్తున్నారు. ముద్దులు పెట్టుకుంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మీ మోసాన్ని మరిచిపోరు. ప్రతిపక్ష నేతనే అంతమొందించాలని చూశారు. ప్యాకేజీ కోసం, అసెంబ్లీ సీట్ల పెంపు కోసం ఆరాటపడ్డారే కానీ చంద్రబాబు ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేయలేదు’ – మేకపాటి రాజమోహన్రెడ్డి, మాజీ ఎంపీ ఎన్డీఏపై మొదట అవిశ్వాసం పెట్టిన ఘనత మాదే.. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసంపై వైఎస్సార్ సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. నాలుగున్నరేళ్లుగా ఐదు కోట్ల మంది ఆంధ్రులను మోసగించాయి. ఇన్నాళ్లూ ఎన్డీఏలో భాగంగా ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రత్యేక హోదాపై ప్రజలను వంచించాయి. వైఎస్సార్ సీపీ వీరి మోసాన్ని ఆనాడే గ్రహించి మడమ తిప్పకుండా పోరాడుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం మీద మొదటిసారిగా అవిశ్వాసం పెట్టిన ఘనత మాదే. 13సార్లు అవిశ్వాసం పెట్టినా చర్చకు రానివ్వలేదు. దీంతో రాజీనామాలు చేశాం. ఏపీ భవన్లోనే ఆమరణ దీక్షలు చేశాం. ఇవే పార్లమెంట్ చివరి సమావేశాలు. కేంద్రం మెడలు వంచేందుకుమరోసారి గర్జన నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్రం ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలి. బీజేపీతో నాలుగున్నరేళ్లు కాపురం చేసిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు వెన్నుపోటు పొడిచారు. ప్యాకేజీకి అంగీకరించి ఘోర తప్పిదం చేశారు. ఆయన చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. చంద్రబాబు తన దోపిడీ, అవినీతి వెలుగులోకి వస్తే జైలుకు వెళ్తాననే భయంతోనే మోదీని ప్రశ్నించడం లేదు’ – వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ జగన్ పోరాడకుంటే బాబు నోరెత్తేవారా? ‘హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడంతోపాటు తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి వంచించిన ఎన్డీఏ సర్కారు మెడలు వంచేందుకే ఈ గర్జన నిర్వహిస్తున్నాం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హోదాపై నిరంతరం పోరాడకుంటే చంద్రబాబు ఆ మాటే ఎత్తేవారా? ప్యాకేజీనే సంజీవని అంటూ రాష్ట్ర ప్రజలను వంచించినందుకే ఈ గర్జన చేపట్టాం. మేం అవిశ్వాసం పెడితే దానివల్ల ఏం వస్తుందన్నారు.. మేం రాజీనామా చేస్తే.. వాటితో ఏం ఒరుగుతుందన్నారు. చంద్రబాబు నాలుగున్నరేళ్లు నిద్రపోయారు. పోలవరం పూర్తిచేయకుంటే ఓట్లడగబోనన్నారు. ప్రభుత్వ సొమ్ముతో ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నారు. ఏపీకి హోదాను తెచ్చే ఏకైక శక్తి వైఎస్ జగన్’ – పీవీ మిథున్రెడ్డి, మాజీ ఎంపీ బడుగులంటే బాబుకు చిన్నచూపు ‘చంద్రబాబుకు పేదలంటే గౌరవం లేదు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ అవమానించేలా వ్యాఖ్యలు చేస్తారు. ఓ ముఖ్యమంత్రి ఇలా అవమానించడం సిగ్గు చేటు. బీసీలనూ మోసగించారు.వారిని చిన్నచూపు చూశారు. రిజర్వేషన్ల కోసం అడిగితే మత్స్యకారులను తోలు తీస్తా అని బెదిరించారు. నాయీ బ్రాహ్మణులు కలవటానికి వస్తే బెదిరించారు. ఎన్నికలొచ్చేసరికి ఆయనకు ప్రత్యేక హోదా, పేదోడి ఆకలి గుర్తొస్తుంది. స్టీలు ప్లాంటు కూడా గుర్తొస్తుంది. విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా సాధించలేని వ్యక్తిని సీఎం అని పిలుద్దామా? దుగరాజపట్నం ఇస్తామని గడ్కారీ చెబితే బాబు ప్రైవేట్ పోర్టు యాజమాన్యాలతో లాలూచీ పడి రాకుండా చేశారు. రైల్వే జోన్ చిన్న అంశం. అది కూడా సాధించలేని వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి విపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేసిన ఆయన దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తాడట. మేనిఫెస్టో అంశాలను కూడా అమలు చేయలేని ముఖ్యమంత్రి ధర్మ పోరాటం ఎవరిపై చేస్తున్నారు? – వెలగపల్లి వరప్రసాదరావు (మాజీ ఎంపీ) అప్పుడెందుకు హోదా అమలు చేయలేదు..? యూపీయే హయాంలో మంత్రిమండలిలో తీర్మానం చేసిన అనంతరం రెండు నెలల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడెందుకు హోదా అమలు చేయలేదు? రాష్ట్రాన్ని దారుణంగా విభజించి కంటితుడుపు చర్యగా హోదా హామీ ఇచ్చినా చట్టంలో చేర్చలేదు. 2014 ఎన్నికల అనంతరం వైఎస్ జగన్ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో కలసి హోదా హామీని అమలు చేయాలని మోదీని కోరారు. అప్పటి నుంచి జగన్ నిరంతరం హోదా కోసం పోరాటం చేస్తున్నారు. అమరణ దీక్షలు, ధర్నాలు, బంద్లు, యువభేరి కార్యక్రమాలు నిర్వహించారు. జగన్ తొలి అసెంబ్లీ భేటీ నుంచే హోదాపై మాట్లాడుతున్నారు. హోదా పోరాటంలో కలసి రావాలని టీడీపీకి పిలుపునిస్తే హేళన చేశారు. ఏపీకి ప్యాకేజీ ప్రకటనపై మోదీని అభినందిస్తూ బాబు సన్మానించారు. ప్యాకేజీలో కొత్తగా ఏమీ లేదని జగన్ ఆనాడే చెప్పారు. 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వవద్దని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని జగన్ అసెంబ్లీలో, బయట చెప్పినా ఆలకించలేదు. ఇప్పుడు హోదా ఇవ్వాలంటూ చంద్రబాబు ప్లేటు ఫిరాయించారు. వైఎస్సార్ సీపీ పోరాటంతో తన పుట్టి మునుగుతుందని ఆందోళన చెందిన చంద్రబాబు రాత్రికి రాత్రే కేంద్రం నుంచి బయటకొచ్చి డ్రామాలు ఆడుతున్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని మళ్లీ ప్రజల్ని మోసగించేందుకు సిద్ధమయ్యారు. ఏపీకి ఇచ్చిన హామీకి విలువ ఇచ్చి కేంద్రం ఈ రెండు నెలల్లో హోదాను అమలు చేయాలి. లేదంటే ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుతో ఢిల్లీకి వచ్చి కేంద్రం మెడలు వంచి జగన్ హోదా సాధిస్తారు. – సజ్జల రామకృష్ణారెడ్డి (వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) మోదీతో బాబు లాలూచీ.. హోదా విషయంలో ప్రధాని మోదీతో చంద్రబాబు లాలూచీ పడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించగానే స్వాగతించి సన్మానించారు. ఇప్పుడు యూటర్న్ తీసుకుని హోదా కావాలంటున్నారు. హోదా పేరెత్తితే పీడీ కేసులు నమోదు చేస్తామన్న చంద్రబాబుపై ఇప్పుడు ఏ కేసులు పెట్టాలి? రాష్ట్రంలో అవినీతి మినహా అభివృద్ధి లేదు. రైతుల గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. అధిక సంపాదన కోసం రైతులు వలస పోతున్నారని అంటూ వారిని అవమానించారు. గతంలో అంతా కలసి మోదీ వద్దకు వెళ్లి హోదాపై నిలదీద్దాం అని వైఎస్సార్ సీపీ సూచిస్తే పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే అడ్డుకుంటున్నారు. హోదా, విభజన హామీల సాధన కోసం ఆది నుంచి పోరాడుతోంది ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమే. – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (శాసన మండలిలో ప్రతిపక్ష నేత) ఎన్నికల వేళ శంకుస్థాపనలతో బాబు మోసం.. ‘చంద్రబాబు నాలుగున్నరేళ్లు మోదీతో అంటకాగి ఆయన చెప్పింది చేస్తూ ప్రత్యేక ప్యాకేజీనే మహద్భాగ్యంగా శాసనసభలో రెండుసార్లు తీర్మానం చేశారు. చంద్రబాబుకు స్వప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏనాడూ పట్టలేదు. మాయ మాటలతో అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయకుండా ఎన్నికలు సమీపిస్తుండటంతో సచివాలయం, ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన అంటూ ఇంద్రజాలం చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇలా రాజకీయ ఆయుధాలను సమీకరిస్తున్నారు. ప్రజలు మరోసారి మోసపోవద్దు. రాష్ట్రాన్ని మోదీ, బాబు వంచించడానికి నిరసనగా ఈ గర్జన నిర్వహిస్తున్నాం. మా పార్టీ సింహంలా గర్జిస్తోంది. సివంగిలా నిలదీస్తోంది’ – భూమన కరుణాకర్రెడ్డి (వైఎస్సార్ సీపీ సీనియర్ నేత) చీత్కారం తప్పదనే ఈ వేషాలు ‘టీడీపీ, బీజేపీ కుట్ర పన్ని రాష్ట్రానికి అన్యాయం చేశాయి. వారికి ఇక్కడ ఓట్లు లేవని గ్రహించిన బీజేపీ ప్రభుత్వం నిధులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేసింది. చంద్రబాబు, మోదీ కలిసి రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కారు. నీతి ఆయోగ్, 14వ ఆర్థిక సంఘం వద్దన్నదని చెబుతూ ప్యాకేజీ మాత్రమే కావాలంటూ చంద్రబాబే హోదాకు అడ్డుపడ్డారు. హోదా కోసం చట్టం చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రజల నుంచి చీత్కారాలు తప్పవని గ్రహించి నవనిర్మాణ దీక్షలు, ధర్మపోరాటం, శ్వేతపత్రాలు అంటూ రకరకాల వేషాలు వేస్తున్నారు. విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని సంపూర్ణంగా అమలు చేయించలేని వ్యక్తి సీఎంగా ఉన్నారు. రాష్ట్రానికి రూ. 90 వేల కోట్ల నష్టం జరిగిందని చెబుతున్న ఆయన మొదటి సంవత్సరం ఏం చేశారు? రెండో సంవత్సరం ఏం చేశారు? అవకాశం ఉన్నప్పుడల్లా మోదీని పొగిడారు. హోదా ఉద్యమాలను అణచి వేశారు’ – పార్థసారథి, మాజీ మంత్రి ఓటుకు కోట్లులో దొరికిపోయి పరార్.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ను వదిలి పారిపోయి వచ్చారు. ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏపీ అభివృద్ధి చెందకపోవడానికి వెంకయ్యనాయుడు కూడా కారణం. రాష్ట్రంలో ఇష్టానుసారంగా ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచి కమీషన్లు దోచుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడిన చంద్రబాబును ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ఏపీ అభివృద్ధి చెందాలంటే ఒక బలమైన శక్తి కావాలి. ఆ శక్తి జగన్కు ఉంది. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయం. – సి.రామచంద్రయ్య (మండలి మాజీ ప్రతిపక్షనేత) తెల్ల కాగితాలపై నల్ల అబద్ధాలు.. శ్వేతపత్రం పేరుతో చంద్రబాబు తెల్ల కాగితాలపై నల్ల అబద్ధాలు విడుదల చేస్తున్నారు. 650 అబద్ధపు హామీలతో ఆయన అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. హోదా కోసం జగన్ పోరాడుతుంటే హేళన చేసిన చంద్రబాబు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూశారు. – మహ్మద్ ఇక్బాల్, పార్టీ సీనియర్ నేత హోదా అంటే కేసులు పెడతానన్నారు.. ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు ఉద్యమిస్తే పీడీ కేసులు బనాయిస్తానని హెచ్చరించిన చంద్రబాబు ఈరోజు హోదా కోసం పోరాడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. హోదా కోసం నాలుగున్నరేళ్లుగా పోరాడుతోంది వైఎస్ జగన్ మాత్రమే. అందుకే వైఎస్సార్ సీపీ చేస్తున్న ప్రతి పోరాటానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు. – జంగా కృష్ణమూర్తి, పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు బాబు మోసాలను జనం క్షమించరు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. వైఎస్ జగన్ హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు అవహేళన చేశారు. హోదా వద్దు ప్యాకేజీ చాలంటూ బీజేపీ నేతలను ఊరూరా తిప్పి సన్మానించిన చంద్రబాబు ఇప్పుడు హోదా కావాలంటూ నాటకాలు ఆడుతున్నారు. చంద్రబాబు మోసపూరిత రాజకీయాలను ప్రజలు క్షమించరు. తెలంగాణలోని సీమాంధ్ర ప్రజలు చంద్రబాబును తిరస్కరించినట్టుగానే ఏపీ ప్రజలు కూడా ఆయన్ను గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కాకుండా ఎవరూ ఆపలేరు. – పృథ్వీ (ప్రముఖ నటుడు, వైఎస్సార్ సీపీ నేత) చంద్రబాబు అబద్ధాలకోరు... ‘చంద్రబాబు అబద్ధాలకోరుగా మారారు. రాష్ట్ర విభజనకు కారకుడైన చంద్రబాబు రంగులు మార్చి అధికారంలోకి వచ్చి మళ్లీ వంచించారు. రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ తన హక్కుల కోసం పోరాడుతోంది’– శారద, డ్వాక్రా సంఘాల ప్రతినిధి భారీగా హాజరైన వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఢిల్లీలో నిర్వహించిన వంచనపై గర్జన ధర్నా కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కోన రఘుపతి, ఆదిమూలపు సురేష్, జగ్గిరెడ్డి, రక్షణనిధి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, షేక్ మహ్మద్ ముస్తఫా, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, అంజాద్ బాషా, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, తిప్పేస్వామి, వేణుగోపాలరెడ్డి, కిలివేటి సంజీవయ్య, చింతల రాంచంద్రారెడ్డి, కంబాల జోగులుతోపాటు ఎమ్మెల్సీ గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ నేతలు పినిపె విశ్వరూప్, కాపు రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కన్నబాబు, జోగి రమేష్, గౌరు వెంకటరెడ్డి, మల్లాది విష్ణు, ముదునూరి ప్రసాదరాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, శిల్పా రవి, ఉండవల్లి శ్రీదేవి, పద్మజ, ఎం.శంకరనారాయణ, విజయశారద, పి.వి.సిద్దారెడ్డి, బీవై రామయ్య, రహమాన్, మాజీ ఎంపీ బాలశౌరి, కుంభా రవిబాబు, చల్లా మధుసూదన్రెడ్డి, ఆలూరి సాంబశివారెడ్డి, వంశీకృష్ణ శ్రీనివాస్, మల్లా విజయప్రసాద్, తిప్పల నాగిరెడ్డి, శ్రీపర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్, చెల్లుబోయిన శ్రీనివాస్ గోపాల కృష్ణ, గున్నం నాగబాబు, దూలం నాగేశ్వరరావు, నంబూరి శంకర్రావు, వెంకటరమణ, చంద్రగిరి యేసురత్నం, గరటయ్య, బాలాజీ, టీజేఆర్ సుధాకర్బాబు, మెరిగ మురళీధర్, గంగుల బ్రిజేందర్రెడ్డి, రవికిషోర్, కాటసాని రామిరెడ్డి, భరత్రామ్, కళ్యాణి, కడప రత్నాకర్, కడపల శ్రీకాంత్రెడ్డి, కంగటి శ్రీదేవి, హర్షవర్దన్రెడ్డి తదితరులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి: వైవీ
ఢిల్లీ: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు గురువారం ఢిల్లీలో వంచనపై గర్జన పేరుతో పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నది వైఎస్సార్సీపీయేనని తెలిపారు. హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, బంద్లు చేపట్టామని, పార్లమెంటులోపలా, బయటా పోరాటం చేశామని చెప్పారు. హోదా కోసం ఎన్డీయే ప్రభుత్వంపై 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. చివరకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేశామని అన్నారు. ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్మ పోరాట దీక్షలతో బాబు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. చంద్రబాబు నయవంచకుడు: మేకపాటి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీయే ముద్దు అని మొదట ద్రోహం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నయవంచకుడని తూర్పారబట్టారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి..ఇప్పుడు కాంగ్రెస్తో జతకట్టారని అన్నారు. హోదా వచ్చుంటే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నయవంచనను ప్రజల గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కచ్చితంగా 25 ఎంపీ స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హోదా సాధించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. -
చంద్రబాబు నయవంచకుడు: మేకపాటి
-
విజయం మాదే: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను నెరవేరుస్తుందని భావిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహిస్తున్న ‘వంచనపై గర్జన’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీలు నెరవేర్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు కొత్త డ్రామా: వైవీ సుబ్బారెడ్డి ధర్మపోరాట దీక్షలతో మరో డ్రామాకు సీఎం చంద్రబాబు తెర తీశారని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి హోదా ఆవశ్యకతను చాటిచెప్పడంతో ఈ అంశం ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్లేటు ఫిరాయించి ధర్మాపోరాట దీక్షలతో మరోసారి వంచించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం, ప్రత్యేక హోదా కోసం నాలుగన్నరేళ్లుగా చిత్తశుద్ధితో వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తోందన్నారు. దమ్మున్న నాయకుడు అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను సాధించుకుంటామని దీమా వ్యక్తం చేశారు. హోదా కవచంతో వస్తున్నారు: జంగా ప్రత్యేక హోదా భిక్ష కాదు, తెలుగు ప్రజల హక్కు అని వైఎస్సార్ సీపీ నాయకుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. హోదా కవచం కప్పుకుని ప్రజలను మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు వస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ పోరాటాలతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని తెలిపారు. ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. -
ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని: సజ్జల
ఢిల్లీ: కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని వంటిదని వైఎస్సార్సీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు గురువారం ఢిల్లీలో వంచనపై గర్జన పేరుతో పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతోంది వైఎస్సార్సీపీయేనని చెప్పారు. శ్వేతపత్రాలతో చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం మొదటగా అవిశ్వాసం పెట్టింది కూడా వైఎస్సార్సీపీయేనని తెలిపారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేసినట్లు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే ఎప్పుడో కేంద్రం దిగివచ్చేదని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర నిధులను తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని తూర్పారబట్టారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పచ్చి రాజకీయ అవకాశవాదని విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఇప్పుడు కాంగ్రెస్తో జతకట్టారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, 25 ఎంపీ స్థానాలు గెలిస్తే మనం అనుకున్నది సాధించవచ్చునని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. -
ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని: సజ్జల
-
‘ఆయన్ను బ్రోకర్లా బాబు వాడుకుంటున్నారు’
ఢిల్లీ: నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి తన సొంత ప్రయోజనాలు నెరవేరలేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బీజేపీని వదిలేశారని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అగ్రనేతలు ఢిల్లీలో వంచనపై గర్జన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో రామచంద్రయ్య మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో భయపడి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ పారిపోయారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలను వంచించింది ముమ్మాటికీ చంద్రబాబేనని నొక్కివక్కానించి చెప్పారు. ఎన్నోసార్లు మోదీని పొగుడుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబేనని పేర్కొన్నారు. ఏపీకి అన్యాయం చేసిన విషయంలో వెంకయ్యనాయుడు పాత్ర ఉందని అన్నారు. ఏపీకి మొదటి శత్రువు చంద్రబాబు నాయుడేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడి వల్ల ఏపీకి రూ. లక్షల కోట్ల నష్టం వచ్చిందన్నారు. పోలవరం కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి చంద్రబాబు తాకట్టు పెట్టారని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను తన అనుచరులకు ఇచ్చి చంద్రబాబు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. తెలుగు దేశం ఎంపీ సీఎం రమేష్ను ఒక బ్రోకర్లా చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా అన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల కేసు: కన్నబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించి వేధించిన చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. హోదాపై యూటర్న్ తీసుకుని హోదా నేనే తెస్తానంటూ చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ తీసుకురాకుండా బీజేపీని చంద్రబాబు తిడుతున్నారని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో రాహుల్ గాంధీతో చంద్రబాబు కలిసిపోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయారని గుర్తు చేశారు. ఎన్నికలైన తర్వాత చంద్రబాబు ఏంటో కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. -
గర్జించిన కాకినాడ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనపై ... ప్రత్యేక హోదా కావాలంటూ కాకినాడ మరోసారి గర్జించింది. బాలాజీ చెరువు కూడలి జన సంద్రమైంది. దిక్కులు పిక్కటిల్లేలా వైఎస్సార్సీపీ శ్రేణులు చేసిన నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. ఉదయం ఎనిమిది గంటలకుప్రారంభమై పది గంటలయ్యేసరికి జన ప్రవాహంగా మారిపోయింది. పూటకో మాట...రోజుకో మెలికపెడుతూ ఆది నుంచీ ప్రజలను మోసం చేస్తూ వచ్చిన టీడీపీ వైఖరిపైజనాగ్రహం ప్రస్ఫుటంగా కనిపించింది.విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో బీజేపీప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ సర్కార్ ఆడుతున్న నయవంచక నాటకాలపై నిరసన గళం విప్పారు. కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన సభలో హోదా ఇవ్వాల్సిందేనని పెద్ద ఎత్తున గర్జించారు. వంచనపై దీక్షకు ప్రజా మద్దతు,సంఘీభావం లభించింది. పార్టీ క్యాడర్లో నూతనోత్సాహం నింపింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఉదయం 9.50 గంటలకు జ్యోతి ప్రజ్వలన, వందేమాతరం గీతంతో సభ ప్రారంభం కాగా, సర్వమత ప్రార్థనలతో దీక్షకు శ్రీకారం చుట్టారు. హోదా కోసం పదవులకు రాజీనామా చేయడమే కాకుండా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసిన లోకసభ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వి.వరప్రసాద్లు వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం చూపించిన చిత్తశుద్ధిపై పార్టీ నేతలతో సహా వివిధ వర్గాల వారు ఉచిత రీతిన సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ నేతలంతా నల్ల దుస్తులతో దీక్షల్లో పాల్గొని నిరసన గళం వినిపించారు. సాయంత్రం 5 గంటల వరకు విరామం లేకుండా దీక్షను చేపట్టారు. తరలివచ్చిన ప్రజలు ఆద్యంతం అక్కడే ఉండి సంఘీభావం తెలియజేశారు. దీక్షల్లో పాల్గొన్న వారికితొలుత హిజ్రాలు మద్దతు పలికారు. అనంతరం ప్రత్యేక హోదా కోసం నాలుగున్నరేళ్లలో వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళనలు, నిరసనలు కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత మార్వాడీ సమాజం ప్రతినిధులు వేదికపైకి వచ్చి హోదా కోసం పదవులకు రాజీనామాలు చేసిన ఎంపీలను సన్మానించారు. తదుపరి న్యాయవాదులు, ఉపాధ్యాయ సంఘం నేతలు పెద్ద ఎత్తున వచ్చి, పదవులను త్యాగం చేసిన ఎంపీలను ఉచిత రీతిలో సత్కరించారు. తృణప్రాయంగా పదవులను త్వజించిన నేతలకు ఎంత గౌరవించినా తక్కువేనని, ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం హర్షదాయకమని అభినందించారు..చంద్రబాబు మోసాలపై నేతల గళం... నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు చేస్తున్న మోసపూరిత విధానాలను, హామీలు అమలు చేయడంలో చేస్తున్న వంచనపై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వి.వరప్రసాద్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎంత నయవంచనకు గురి చేస్తున్నారో కళ్లకు కట్టినటు వివరించారు. ప్రజల్ని మోసం చేయకుండా వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని, ఏఏ ప్రాజెక్టులు, కార్యక్రమాల ద్వారా దోపిడీ చేస్తున్నారని సమగ్రంగా వివరించారు. తండ్రి కొడుకులైన చంద్రబాబు,లోకేషే కాకుండా వారి బినామీలుగా సుజనా చౌదరి, సీఎం రమేష్ చేసిన అవినీతి భాగోతాలను బయటపెట్టారు. ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన దోపిడీ గతంలో ఎప్పుడూ జరగలేదని, ప్రజాధనాన్ని మింగేశాశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారన్నారు. ప్రజల్ని నయవంచనకు గురి చేయడమే కాకుండా తానేదో ఉద్దరించినట్టుగా అనుకూల మీడియాలో ఊదరగొట్టి మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. హోదా కోసం తొలినుంచి పోరాడుతున్నది వైఎస్సార్ సీపీ అని గుర్తు చేశారు. తన అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయనో, తన బినామీల బండారం వెలుగు చూస్తుందనో ఐటీ, సీబీఐ, ఈడీ అధికారుల విచారణలను అడ్డుకునేందుకు చంద్రబాబు శతవిధాలా యత్నిస్తున్నారని విమర్శించారు. పవన్ తీరును ఎండగట్టిన నేతలు ఎక్కడైనా అధికార పక్షాన్ని నిలదీయడం, ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలను ప్రశ్నించడం చూశాం గానీ ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేసే నేతగా ఒక్క పవన్ కల్యాణ్నే చూశామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, కాంగ్రెస్, ఇటు పవన్ కల్యాణ్లు జగన్ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడాన్ని తప్పు పట్టడమే కాకుండా వారి లోపాయికారీ కుట్రలను ఎండగట్టారు. ఇక కోడి కత్తే కదా, దానికంత రచ్చ అని పవన్ చేసే వ్యాఖ్యలపై కూడా అనిల్కుమార్ యాదవ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆ కోడి కత్తితో ఒక్కసారి చిన్న పిల్లాడితో రక్కిస్తే ఏమవుతుందో పవన్ కల్యాణ్కు తెలుస్తుందని సుతిమెత్తని చురక అంటించారు. ఇదే తరహాలో మిగతా నేతలు కూడా పవన్ కళ్యాణ్ తీరును తప్పుపట్టారు. వంచనపై గర్జన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పార్టీ సీనియర్నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కొప్పర మోహన్రావు, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కర్నూలు జిల్లా ముఖ్యనేత గౌరు వెంకటరెడ్డి, ఎంవీఎస్ నాగిరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి , తిప్పల నాగిరెడ్డి, కొయ్యా ప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, తానేటి వనిత, తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి బూసి వినీత. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కో–ఆర్డినేటర్లు వాసుబాబు, తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు రాజమహేంద్రవరం పార్లమెంట్ కో–ఆర్డినేటర్ కవురు శ్రీనివాస్, అసెంబ్లీ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు పర్వత ప్రసాద్, బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, ఆకుల వీర్రాజు, నాగులాపల్లి ధనలక్ష్మి, కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్వీజేఆర్కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు గిరిజాల బాబు, మిండకుదిటి మోహన్, కర్రి నారాయణరావు, కొలగాని దుర్గాప్రసాద్, ఇనుకొండ పట్టాభిరామయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు జంపని రామకృష్ణంరాజు, ముదునూరి మురళీకృష్ణంరాజు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, ఉభయగోదావరి జిల్లాల బూత్కమిటీల ఇన్చార్జ్ వీవీఎస్ చౌదరి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ముదునూరి మురళీకృష్ణంరాజు, జంపన రామకృష్ణంరాజు(బుజ్జిరాజు), నాయకులు బుర్రా అనుబాబు, కొయ్యా ప్రసాదరెడ్డి, తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయకుమార్, కాకినాడ పార్లమెంట్జిల్లా బూత్కమిటీల ఇన్చార్జ్ ఒమ్మిరఘురామ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆయన మాటలతో ఏపీ పరువు పోతోంది’
సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం ఏకపక్ష దోరణిలో ఆర్థిక సంఘానికి రిపోర్టు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదా ఇవ్వమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆనాడే ఏపీకి ప్యాకేజీకి ఒప్పుకోవద్దని టీడీపీ ప్రభుత్వానికి సూచిస్తే.. మగ బిడ్డను కంటానని అంటే ఏ అత్తయినా వద్దంటుందా అన్న మాటలను మర్చిపోయారా అంటూ టీడీపీ నాయకులకు గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటలను లెక్కలు చేయకుండా హోదా వద్దు.. ప్యాకేజీనే ముద్దు అంటూ చంద్రబాబు తీర్మానాలు ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒలంపిక్స్ అంట.. గెలిచినోళ్లకు నోబెలా? రాష్ట్రంలో స్థూల ఉత్పత్తి పెరుగుదలలో ఉందని అబద్దాలు చెబుతున్నారని, వాస్తవానికి రాయలసీమలో సాగు దెబ్బతిందని వివరించారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వానిది తప్పుడు లెక్కలు చూపిస్తోందని ఆరోపించారు. పరిశ్రమ రంగం, సేవా రంగం పడిపోయాయని అయినా రాష్ట్రం అభివృద్ది చెందుతుందనడం సరికాదన్నారు. చంద్రబాబు మాటలతో రాష్ట్రం పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్పలు చెప్పి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారిన మండిపడ్డారు. రాజధాని కట్టడానికి లక్ష కోట్లు అవుతాయని గతంలో చెప్పిన చంద్రబాబే.. ఇప్పుడు రెండు వేల కోట్లు ఇస్తే చాలు అనండం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అతి సుందరమైన నగరం అమరవాతి చెప్తున్నారని, కానీ ఇక్కడ కంప మొక్కలు అలానే ఉన్నాయని ఎద్దేవ చేశారు. ఒలంపిక్స్ అమరావతిలో జరుపుతామని.. గెలిచిన వాళ్లకి నోబెల్ ఫ్రైజ్ అంటున్నారని.. కనీసం ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వంగవీటి రాధా మా పార్టీలోనే ఉన్నారు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా కోసం తాము చేసిన రాజీనామాలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని టీడీపీ దోచుకుంటుందని, స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి యనమల రామకృష్ణుడు తమ రాజీనామాలపై మాట్లాడం సరికాదన్నారు. చంద్రబాబువి ఎప్పుడు వెన్నుపోటు రాజకీయాలేనని విమర్శించారు. చిత్త శుద్దితో ప్రత్యేక హోదాపై పోరాటాలు చేసింది తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలేనన్నారు. తమ పార్టీ అవిశ్వాసం కోసం తీర్మానం పెడితే చర్చ పెట్టలేదని, టీడీపీ ఇస్తే మాత్రం చర్చకు తీసుకువచ్చారని ఈ సందర్భంగా వైవీ గుర్తు చేశారు. వారి మధ్య కుమ్మకు రాజకీయాలు నడుస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. 23 మంది ఫిరాయింపు దార్లపై చర్యలు తీసుకుంటే ఎన్నిలు వచ్చేవి కాదా? అని ప్రశ్నించారు. బుట్టా రేణుకపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేశామని, ఆమెపై చర్య తీసుకున్నా ఎన్నికలు వచ్చేవన్నారు. కోట్లాది రూపాయలు దోచుకున్న ఘనత చంద్రబాబుదేనన్నారు. పగలు కాంగ్రెస్తో రాత్రిళ్లు బిజేపీతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు తమకు మిత్రుడేనని పార్లమెంట్ సాక్షిగా రాజ్నాథ్ సింగే చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయించారని తెలిపారు. ఎన్నికల కమీషన్ గైడ్ లైన్స్ ప్రకారం 14 నెలల ముందు రాజీనామా చేశామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 6, 2018న ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం రాజీనామాలు చేశామన్నారు. టీడీపీ, బీజేపీ భాగస్వాములుగా ఉండి హోదా విభజన హామీల విషయంలో మోసం చేశారని, ఇది ప్రజలకు చెప్పెందుకే రాజీనామాలు చేశామన్నారు. హోదా కోసం గుంటూరులో 8 రోజులు వైఎస్ జగన్ ఆమరణదీక్ష చేస్తే.. భగ్నం చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మా ఎంపీలందరూ రాజీనామా చేసి ఆమరమదీక్ష చేశారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజలే టీడీపీ ప్రభుత్వానికి బుద్ది చెబుతారని పేర్కొన్నారు. వంగవీటి రాధా తమ పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారు. తాము బీజేపీతో కలిసి ఉంటే తమపై, వైఎస్ భారతిపై ఎందుకు కేసులు పెడతారని ప్రశ్నించారు. -
హోదా కోసం తాము చేసిన రాజీనామాలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు
-
ప్రత్యేక హోదా కోసం యువకుడి ఆత్మహత్య
గోస్పాడు: ప్రత్యేకహోదా రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లెల్లకు చెందిన జమాల్బాషా(27)కు ఏడాది క్రితం ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన హరిఫాతో వివాహమైంది. డిగ్రీ చదివినా ఏ ఉద్యోగమూ రాకపోవడంతో సెల్ఫోన్లు మరమ్మతు చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే చాలీచాలని సొమ్ముతో జీవనం సాగించడం కష్టమైందని నిత్యం సతమత మవుతుండేవాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే తన లాంటి చదువుకున్న వారికి ఏదో ఒక ఉద్యోగం వచ్చేదని, కనీసం ప్రైవేటు ఉద్యోగమైనా చేసుకునేవాడినని తరచూ అంటుండేవాడు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా ప్రత్యేక హోదా రాలేదన్న మనస్తాపంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య హరిఫా చెబుతోంది. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసిపెట్టి.. ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె వాపోయింది. ఇదే విషయమై గోస్పాడు ఎస్ఐ నరేష్ను అడగ్గా.. మృతదేహం వద్ద తమకు ఎలాంటి లేఖ లభ్యం కాలేదని చెప్పారు. జమాల్బాషా భార్య చెబుతున్న సూసైడ్ నోట్పై అనుమానాలు ఉన్నాయన్నారు. -
హోదాకు అడ్డుపడింది చంద్రబాబు కాదా?: కోన రఘుపతి
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల చివరిరోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి విమర్శించారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో నాలుగోసారి తీర్మానం ప్రవేశపెట్టి చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు పదవీకాలం అంతా అయిపోయాక అసెంబ్లీలో తీర్మానం ఎందుకు అని ప్రశ్నించారు. గత నాలుగున్నరేళ్లగా ఏపీ ప్రజలను చంద్రబాబు అన్నిరకాలుగా నిరాశకు గురిచేస్తూ వచ్చారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాకు అడ్డుపడింది చంద్రబాబు కాదా? అని కోన రఘుపతి ప్రశ్నించారు. ప్యాకేజీ పేరిట ప్రత్యేక హోదాను ఆయన పక్కన పెట్టేసిన విషయాన్ని గుర్తుచేశారు. మొదట కేంద్రం బ్రహ్మాండమైన పాకేజీ ఇస్తుందని ఊరించిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి పోరాడుదామంటూ యూ టర్న్ తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబు నాలుగోసారి తీర్మానం పెట్టారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పెంచేందుకు ప్రయత్నిస్తామంటూ విద్యార్థులను బాబు మోసగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయి చంద్రబాబు.. నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ రిమోట్ కంట్రోల్ నాలుగేళ్లుగా బీజేపి ఆఫీస్లో ఉందని, బీజేపీ ఆఫీస్లో రిమోట్ కంట్రోల్ ఉండటం వల్లే.. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్న తమకు రిమోట్ కంట్రోల్ ఎందుకు అని ప్రశ్నించారు. ప్రతిపక్షంపై పసలేని ఆరోపణలు చేస్తూ చంద్రబాబు కాంగ్రెస్తో అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. -
రాష్ట్రానికి ద్రోహం.. కాంగ్రెస్ నిర్వాకం..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని, తొలిసంతకం దానిపైనే పెడతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్నూలు సభలో ఇచ్చిన హామీ హాస్యాస్పదంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆనాడే విభజన హామీలన్నిటికీ చట్టబద్ధత కల్పించేవారని, ప్రత్యేక హోదాను కూడా చట్టంలో పెట్టి ఉండేవారని గుర్తుచేసుకుంటున్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదాను పెట్టి ఉంటే ఇవాళ మాట తప్పిన భారతీయ జనతా పార్టీపై ఒత్తిడి చేయడానికి అవకాశం ఉండేదని, అమలుచేయాల్సిందిగా కోర్టుకు వెళ్లిఅయినా అమలు చేయించుకునే అవకాశం ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు. చట్టంలో పెట్టి ఉంటే ప్రభుత్వం చేయకపోతే నిలదీయడానికి, కోర్టుకు వెళ్లి అమలు చేయించుకోవడానికి వీలుండేది. అలాంటి అవకాశం లేకుండా చేసింది కాంగ్రెస్సేనన్న అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. దారుణంగా వంచించి.. ఇప్పుడు హామీలా.. ఒక రాష్ట్రాన్ని విభజించేటపుడు ఒక ప్రాంతం రెవెన్యూ పరంగా నష్టపోయే ప్రమాదం ఉంటే దాని గురించి కూలంకషంగా చర్చించి తగిన జాగ్రత్తలు పొందుపరచాల్సి ఉంటుంది. కానీ అలాంటివేవీ జరపకుండా హడావిడిగా పార్లమెంటు తలుపులు మూసి, ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి మరీ విభజనకు పూనుకున్న కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ క్షమించరని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక ప్రాంతంలో రాజకీయ ప్రయోజనాల కోసం మరో ప్రాంత ప్రజలను కాంగ్రెస్ పార్టీ దారుణంగా వంచించిందని వారు విమర్శిస్తున్నారు. అందుకే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి ఇప్పటికీ కనిపించడం లేదని పరిశీలకులంటున్నారు. అందువల్లే రాహుల్ ఇపుడు పర్యటనలు జరుపుతూ గుప్పిస్తున్న హామీలను విశ్వశించే పరిస్థితి లేదని వారు పేర్కొంటున్నారు. తప్పని సరిగా అమలు చేయాలని రాయలేదు.. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ‘ప్రత్యేక హోదా’ను విభజన చట్టంలో పెట్టినట్లయితే సుప్రీంకోర్టుకైనా వెళ్లి దానిని సాధించుకునే అవకాశం ఉండేది. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెట్టకపోవడం వల్ల మరింత నష్టపోయారు.. దారుణంగా మోసపోయారు. పోనీ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలనైనా కూడా తప్పనిసరిగా అమలు చేయాలి అని విభజన చట్టంలో కాంగ్రెస్ పెట్టిందా అంటే అదీ లేదు. 13వ షెడ్యూలులో పెట్టిన హామీలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేర్చాల్సినవేననే అర్ధంలో చట్టంలో రాయకుండా కాంగ్రెస్ పార్టీ మరో ద్రోహం చేసింది. 13వ షెడ్యూలులో పెట్టిన .. రైల్వే జోన్ నుంచి కడప స్టీల్ ఫ్యాక్టరీ వరకు, క్రూడాయిల్ రిఫైనరీ నుంచి ఇండస్ట్రియల్ కారిడార్ వరకు ఇలా ఏది తీసుకున్నా అన్నీ చట్టంలో.. ‘మే.. మే.. మే’ అని పెట్టింది. అంటే చేయవచ్చు అనే అర్ధంలో రాశారన్నమాట. ‘మే’ అని కాకుండా ‘షల్’ అని పెట్టి ఉంటే తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఆ రోజు చట్టంలో షల్ అని పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కచ్చితంతా చేయాలి అనే అర్ధంలో షల్ అని పెట్టి ఉంటే ఇవాళ బీజేపీకి ఈ వెసులుబాటు ఉండేది కాదు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టడంలో బీజేపీ వారు కూడా భాగస్వాములే. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను ఆ రెండు పార్టీలు అలా తుంగలో తొక్కాయి. ఇన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేసింది. ఒకవైపు అడ్డగోలుగా, అన్యాయంగా విభజించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలూ వహించకుండా వంచించిన కాంగ్రెస్పార్టీని ఏపీ ప్రజలు ఎన్నటికీ క్షమించబోరని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాకరాక చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్కు వచ్చిన రాహుల్గాంధీ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ అవినీతిపై విమర్శలు కురిపించడం బాగానే ఉంది కానీ రాష్ట్రంలో విశృంఖలంగా సాగుతున్న చంద్రబాబు అవినీతిపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. చంద్రబాబు అవినీతి గురించి యావద్దేశమంతా చర్చజరుగుతున్నా రాహుల్ గాంధీ కనీసం ప్రస్తావించకపోవడం విశేషమని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు
-
అంబానీ గజదొంగ: రాహుల్
సాక్షి, కర్నూలు: ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతానని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మంగళవారం కర్నూలులోని ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ఏమి చేయాలో ఆలోచించేవారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా మన్మోహన్ సింగ్ ఐదేళ్లు ఇవ్వాలని నిర్ణయిస్తే.. బీజేపీ పదేళ్లు కావాలని కోరిన విషయం గుర్తుచేశారు. కానీ అధికారం చేపట్టాక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన తరువాతే ఆంధ్రా గడ్డపై అడుగుపెడతానని, ప్రధాని అయ్యాక ప్రత్యేక హోదా అమలుపై తొలి సంతకం పెడతానని హామీ ఇచ్చారు. ప్రధాని ఎవరయినా ఏపీకి ప్రత్యేక హోదా శిరోధార్యం అంటూ వివరించారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చి తీరుతానని స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. కర్నూలు నిజాయితి పరుల గడ్డ ‘కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఆణిముత్యాలు దామోదరం సంజీవయ్య, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించాను. దేశంలో అవినీతి పెరిగినా దామోదరం సంజీవయ్య నిజాయితీగా పాలన చేశారు. నెహ్రూ హయాంలో సంజీవయ్య అవినీతి పరుడని కొందరు ముద్ర వేశారు. సంజీవయ్య తల్లి కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్న విషయాన్ని తెలుసుకొని నెహ్రూ సంజీవయ్యను ఏపికీ తొలి దళిత ముఖ్యమంత్రిని చేశారు. కర్నూలు నిజాయితి పరుల గడ్డ. కోట్లు విజయ భాస్కర్ రెడ్డి, దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి లాంటి నాయకులను తయారు చేసేందుకే కర్నూలుకు వచ్చా. విజయ్ మాల్య తొమ్మిది కోట్ల దొంగ అయితే అనిల్ అంబానీ 45 కోట్ల గజదొంగ విజయ మాల్య 9 వేల కోట్ల కొల్లగొట్టి ఆర్ధిక మంత్రిని కలిసి లండన్ పారిపోయారు. విజయ మాల్య ఒక దొంగని దేశం మొత్తం తెలుసు. ఆర్ధిక శాఖ మంత్రి లంచాలు తీసుకుని విజయ్ మాల్యాను విడిచి పెట్టారు. కాపలాదారుడిని అని చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ధిక శాఖ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలి. మోదీ ప్రధాని అయ్యాక రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్ను మార్చి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. విజయ్ మాల్య తొమ్మిది కోట్ల దొంగ అయితే అనిల్ అంబానీ 45 కోట్ల గజదొంగ. రాఫెల్ కుంభకోణంపై పార్లమెంటులో మోదీని ప్రశ్నిస్తే నా కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేక పోయారు. ఏపి ప్రజలు ప్రత్యేక హోదా అడిగితే మోదీ భూమి ఆకాశం వైపు చూస్తాడు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల వరకు రైతు రుణాలు మాఫీ. అన్ని వర్గాల వారు కలసి మెలసి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది’ అంటూ రాహుల్ ఉపన్యసించారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పాలన గురించి రాహుల్ ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. దీంతో కాంగ్రెస్-టీడీపీ పొత్తు ఊహాగానాలకు మరింత బలం చేరుకుంది. -
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు: రాహుల్
సాక్షి, కర్నూల్ : ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన బైరెడ్డి కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడారు. విభజన సమయంలో ప్రత్యేక హోదాపై ఆనాటి ప్రధాని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే మొదటగా ప్రత్యేక హోదా హామీని నెరవేరుస్తామని స్పష్టంచేశారు. జీఎస్టీని సమూలంగా మార్పు చేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థంతా కొంతమంది చేతుల్లోనే ఉందని, చిన్న, సన్నకారు రైతులు, వ్యాపారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదన్నారు. బడా వ్యాపారులకు మాత్రం బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయన్నారు. ప్రధానిగారు నోరు విప్పండి.. దేశంలో వరుసగా చోటు చేసుకుంటున్న అత్యాచారాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించక పోవడం ఆమోదయోగ్యం కాదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘దేశంలో మరో ఆడబిడ్డపై గ్యాంగ్రేప్ జరగడం సిగ్గు చేటు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నిశ్శబ్దం ఆమోదయోగ్యం కాదు. భారత మహిళలకు రక్షణ కల్పించలేనందుకు, రేపిస్ట్లను కఠినంగా శిక్షించకుండా వదిలేస్తున్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి’ అని ట్వీట్లో పేర్కొన్నారు. హరియాణలో సీబీఎస్ఈ టాపర్, 19 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన సామూహిక లైంగిక దాడి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. India hangs its head in shame as another one of its daughters is brutally gang raped. Prime Minister, your silence is unacceptable. Shame on a government that leaves India’s women unprotected and afraid and allows rapists to walk free. — Rahul Gandhi (@RahulGandhi) September 18, 2018 -
రాహుల్ గాంధీని పోరాడమంటాం: రఘువీరా
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా వస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హైదరాబాద్ నుంచి రాహల్ గాంధీ ప్రకటన చేశారని గుర్తు చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ విజయవాడలో రైల్వే స్టేషన్ నుంచి జింకానా గ్రౌండ్స్ వరకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి రఘువీరారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటికే సీపీఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని, ఏపీలో కూడా అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు సీపీఎస్ రద్దుకు డిమాండ్ చేయాలన్నారు. సీపీఎస్ రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, సీపీఎస్ నిర్బంధంగా అమలు చేయాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని అన్నారు. అక్టోబర్ 2 లోపు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో ఉద్యోగులతో పాటు కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు. సీపీఎస్ రద్దు చేయాలని జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ పోరాటం చెయ్యాలని కోరతామని వెల్లడించారు. -
త్రినాథ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
విశాఖపట్నం: ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణం చేసిన త్రినాథ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. మరికాసేపట్లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి త్రినాథ్ భౌతికకాయాన్ని రాజమండ్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆసుపత్రి వద్ద త్రినాథ్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేతలు గొల్లబాబూరావు, సీపీఎం నాయకులు అప్పల రాజు పరామర్శించారు. గొల్లబాబూ రావు మాట్లాడుతూ..త్రినాథ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమను ఆదేశించారని తెలిపారు. త్రినాథ్ కుటుంబాన్ని ఆదుకుంటామని కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. అప్పల రాజు మాట్లాడుతూ..ప్రభుత్వం కూడా త్రినాథ్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్రినాథ్ బంధువు నూకరాజు మాట్లాడుతూ..ప్రత్యేక హోదా కోసం అందరూ కలసి చిత్తశుద్ధిగా పోరాడాలని కోరారు. -
పోరాడాలే గానీ ప్రాణాలు తీసుకోవద్దు: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం విశాఖ జిల్లా నక్కపల్లిలో త్రినాథ్ ప్రాణత్యాగానికి పాల్పడటంపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. త్రినాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన లక్ష్యం కోసం పోరాడుదామని, ఆత్మహత్య లాంటి తీవ్ర చర్యలకు ఎవరూ పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. -
హోదా కోసం మరో నిరుద్యోగి బలి
నక్కపల్లి (పాయకరావుపేట): ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మరో యువకుడు ప్రాణత్యాగం చేశాడు. ప్రత్యేక హోదా రాకపోవడమే తన చావుకు కారణమంటూ శుక్రవారం విశాఖ జిల్లాలో నిరుద్యోగి త్రినాథ్ సెల్టవర్ ఎక్కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఎం చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ఆత్మహత్య లేఖలో ప్రశ్నించాడు. ‘ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తేనే నా మరణానికి అర్థం ఉంటుంది. మా అమ్మ నన్ను కన్నందుకు ఓ ప్రయోజనం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి రాసిన లేఖను త్రినాథ్ జేబులో పెట్టుకుని ప్రాణాలు వదిలాడు. డిగ్రీ చదివినా... రాజమండ్రికి చెందిన దొడ్డి త్రినాథ్ (28) డిగ్రీ చదివినా ఉద్యోగం రాకపోవడంతో విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న బావ వనం నర్సింగరావు వద్ద ఉంటున్నాడు. త్రినాథ్ తల్లిని తీసుకుని ఏడాది క్రితం అక్కాబావల వద్దకు వచ్చాడు. పంచాయతీ పనులు చూడటం, రికార్డులు రాయడం లాంటి పనులు చేస్తూ బావకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. వీరంతా పాయకరావుపేట మండలం నామవరంలో నివసిస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయం ఇంటినుంచి వెళ్లిపోయిన త్రినాథ్ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అతడి కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిపై కాగిత టోల్గేట్ సమీపంలోని సెల్టవర్ వద్ద కనిపించిన త్రినాథ్ కొన్ని కాగితాలు పంచడంతోపాటు చేతిలో నైలాన్ తాడు కలిగి ఉన్నట్లు ఓ వ్యక్తి అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే వారు సెల్ టవర్ వద్దకు చేరుకునేటప్పటికే త్రినాథ్ తాడుతో ఉరి వేసుకుని మృతి చెందాడు. త్రినాథ్ మృతితో తల్లి నూకరత్నం, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబీకులకు వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ త్రినాథ్ మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు స్పష్టం చేశారు. హోదా వస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడేవన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేసిన మోసానికి నిరుద్యోగి బలయ్యాడని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృçష్ణ పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబీకులను వైఎస్సార్ సీపీ నేతలు పరామర్శించి సంతాపం తెలిపారు. త్రినాథ్ ఆత్మహత్య లేఖ ఇదీ... ‘‘అయ్యా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారికి నమస్కరించి రాయునది. నేడు కేరళ వరదల్లో ఉందని అందరూ ముందుకొచ్చి తమ సహాయాన్ని ధనరూపంలో, మాటల రూపంలో తెలియజేస్తూ ఆదుకుంటున్నారు. సినీ ప్రముఖులు, మీడియా ప్రముఖులు సాయం చేయడం తప్పు అని నేను అనడం లేదు కానీ అంతకన్నా ఎక్కువగా కనపడని బాధితులు సార్ ఏపీ ప్రజలు. దయచేసి గుర్తించండి. ప్రత్యేక హోదా గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దయచేసి ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఆదుకోమని కోరుతున్నా. అప్పుడే నా మరణానికి ఒక అర్థం, మా అమ్మ నన్ను కన్నందుకు ప్రయోజనం ఉంటుంది. ప్లీజ్ సర్...! అమ్మా క్షమించు... అమ్మా నన్ను క్షమించు, నేను నిన్ను చూస్తానని ఇచ్చిన మాట తప్పుతున్నా. ఈ ప్రపంచంలో నువ్వంటే నాకు చాలా ఇష్టం. అక్కా.. అమ్మ జాగ్రత్త. నీ పిల్లలతో ఒక చంటి పిల్లలాగా చూసుకోండి. ఇక సెలవ్. అమ్మా నేను శరీరం మాత్రమే వదులుతున్నా. నా ఆత్మ నీలో ఉంటుంది. నీ సంతోషంలో ఉంటుంది. నేను మాట తప్పినందుకు క్షమించు. అక్కా.. చిన్నప్పటినుంచి నన్ను తమ్ముడిలా కాకుండా కొడుకులా చూశావు. అమ్మ జాగ్రత్త. కన్నబిడ్డలా చూసుకో. ఎక్కడ ఉన్నా సంతోషంగానే ఉంటా. మీరు అప్పగించిన పని మధ్యలోనే వదిలేసినందుకు క్షమించండి. మీ పట్ల తప్పుగా ప్రవర్తించి ఉంటే క్షమించండి’’ మునికోటి నుంచి త్రినాథ్ దాకా..హోదా కోసం ఆత్మార్పణలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో 2015 ఆగస్టు 9వతేదీన తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళన సందర్భంగా తీవ్ర మనస్తాపానికి గురైన మునికోటి అక్కడే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కలేదని బంధువులు, మిత్రుల వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన మునికోటి ప్రాణత్యాగానికి పాల్పడ్డాడు. తిరుపతి మంచాల వీధికి చెందిన మునికోటి సమైక్య రాష్ట్ర ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నాడు. కర్నూలు జిల్లాలో లెక్చరర్ మృతి... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ గనుమాల లోకేశ్వరరావు 2015 ఆగస్టు 28వతేదీ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. అంతకుముందు రోజు ప్రత్యేక హోదా కోసం కర్నూలులో నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. మృతుడికి భార్య కృష్ణవేణి, కుమారుడు గౌతమ్ ఉన్నారు. నెల్లూరులో హోదా కోసం ఆత్మహత్య నెల్లూరు వేదాయపాళెంకు చెందిన రామిశెట్టి లక్ష్మయ్య (55) ప్రత్యేక హోదా కోసం చనిపోతున్నట్లు 2015 ఆగస్టు 27వ తేదీన రాసిన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. ఆగస్టు 28వ తేదీన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నెల్లూరు చేరుకుని లక్ష్మయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. హోదా కోసం చేనేత కార్మికుడి ఆత్మహత్య ప్రత్యేక హోదా కోసం చిత్తూరు జిల్లా మదనపల్లెలో చేనేత కార్మికుడు నిమ్మన్నగారి సుధాకర్(29) ఈ ఏడాది జూలై 28న ప్రాణత్యాగం చేశాడు. ప్రత్యేక హోదా మన హక్కు అని ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. సుధాకర్ తల్లిదండ్రులు రామచంద్ర, సరోజమ్మలు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. మృతుడికి ఒక అక్క, చెల్లెలు ఉన్నారు. టీడీపీ కార్యకర్త బలవన్మరణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ సానుభూతిపరుడైన పైడికొండ యానాదిరావు(47) లేఖ రాసి చనిపోయాడు. ఈనెల 16వతేదీన అదృశ్యమైన యానాదిరావు 19వతేదీన శవమై కనిపించాడు.వైఎస్సార్ జిల్లా రాజంపేటకు చెందిన యానాదిరావు ఎనిదేళ్ల క్రితం ఉపాధి కోసం ఒంగోలు ప్రాంతానికి వలస వచ్చాడు. మృతుడికి భార్య శ్రీదేవి, ఇద్దరు పిల్లలున్నారు. -
మాట తప్పిన మోదీ.. మోసగాడు చంద్రబాబు
‘వంచనపై గర్జన’ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ఆంధ్రప్రదేశ్ ప్రజల న్యాయమైన హక్కు అయిన ప్రత్యేక హోదాను సాధించి తీరుతాం. ఈ పోరాటంలో ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మా పార్టీ, మేము సిద్ధంగా ఉన్నాం. హోదా కోసం మా పార్టీ లోక్సభ సభ్యులు పదవీ త్యాగం చేసి చరిత్రలో నిలిచి పోయారు. అవసరమైతే మరిన్ని త్యాగాలకూ మేం వెనుకాడం. ప్రత్యేక హోదాను సాధించుకుని, రాష్ట్రంలోని యువకులు, నిరుద్యోగుల భవితను కాపాడుకోవడమే మా ముందున్న కర్తవ్యం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నినదించారు. పౌరుషాల పురిటిగడ్డ అయిన గుంటూరు నగరంలో గురువారం జరిగిన ‘వంచనపై గర్జన’ ఒక రోజు నిరాహార దీక్షలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఫల్యం, రాష్ట్రం పట్ల నరేంద్ర మోదీ ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వీఏఆర్ గార్డెన్స్లో నాలుగో విడత వంచనపై గర్జన కార్యక్రమం జరిగింది. ఈ గర్జనకు జిల్లా నలుమూలల నుంచి భారీగా జనం తరలివచ్చారు. పార్టీ నేతల ఆవేశపూరిత ప్రసంగాలతో ఈ దీక్ష ఆద్యంతమూ ఉత్తేజ భరిత వాతావారణంలో సాగింది. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ దారుణంగా నష్టపోతున్న తీరును, నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి ఏనాడూ హోదా, విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా సీఎం చంద్రబాబు చేసిన మోసాన్ని, పూటకో మాట మాట్లాడే ఆయన నైజాన్ని, ప్రధాని నరేంద్ర మోదీ మాట తప్పిన తీరునూ పార్టీ నేతలు తమ ప్రసంగాల్లో ఎండగడుతున్నపుడు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతించారు. గుంటూరు పార్టీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ గర్జనలో ప్రసంగించిన వక్తలు విభజన తరువాత అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో వివరించారు. ఉదయం 9 గంటలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలతో నివాళులర్పించడంతో ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం 4.30 గంటలకు విజయవంతంగా ముగిసింది. చంద్రబాబు పెద్ద మాయావి బంగారంలాంటి రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తే.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హోదా హామీని అమలు చేయకుండా బీజేపీ నేడు విద్రోహానికి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ నేతలు దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా ఏ హామీ నెరవేర్చకపోయినా బీజేపీతో స్నేహం చేసిన చంద్రబాబు.. నేడు విభజన ద్వారా రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్తో స్నేహం కోసం అర్రులు చాస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అంతటి పచ్చి అవకాశవాది రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఉండరని, ఆయన ఓ పెద్ద మాయావి అని నేతలన్నప్పుడు దీక్షా స్థలిలో హర్షధ్వానాలు చెలరేగాయి. అన్యాయమంతా చేసి ధర్మపోరాటమా! హోదా విషయంలో అన్యాయమంతా చేసేసి.. ఇప్పుడు ధర్మపోరాట దీక్షలంటూ చంద్రబాబు బయలు దేరారని, ఆయన ఓ పెద్ద మోసగాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తానేమి చెబితే అది నమ్ముతారని చంద్రబాబు భావిస్తున్నారని, కానీ ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు. బీజేపీకి ద్రోహం చేసినందుకు చంద్రబాబుపై మోదీకి కోపం ఉంటే.. ఆయనపై చూపించుకోవాలే తప్ప రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయరాదని, హోదా హామీని అమలు చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన మాట తప్పకూడదన్నారు. కాగా, గుంటూరులో జరిగిన గర్జన కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ ఏడాది మార్చి–ఏప్రిల్ నెలల్లో గుంటూరు జిల్లాలో జరిగిన జగన్ ప్రజాసంకల్ప యాత్రతో పార్టీ శ్రేణుల్లో మంచి కదలిక తెచ్చిన దరిమిలా పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్న ఈ గర్జన కార్యక్రమం మరింత ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ శాసనసభాపక్షం ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీఏసీ మెంబర్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావులతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పదవులు వదులుకున్న మాజీ ఎంపీలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు, రాష్ట్రంలోని శాసనసభ, లోక్సభ పార్టీ సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. హోదాపై జగన్ది ఎప్పుడూ ఒకే మాట ప్రత్యేక హోదా సాధనపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తొలి నుంచీ ఒకే మాటపై నిలబడ్డారని వక్తలు గుర్తు చేశారు. హోదా వస్తే రాష్ట్రం ఎలా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందో, వందలాది పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చి లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఎలా లభిస్తాయో అనేక సందర్భాల్లో ఆయన విడమర్చి చెప్పారని పేర్కొన్నారు. హోదా కన్నా ప్యాకేజీయే ఉత్తమమని స్వాగతించడమే కాక ఎక్కువ ప్రయోజనాలు వస్తాయని చెప్పుకున్న చంద్రబాబు.. బీజేపీతో సంబంధాలు తెగదెంపులు చేసుకున్న తరువాత ‘యూటర్న్’ తీసుకున్నారని వక్తలు దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ఊసెత్తడమే పాపం అన్నట్లుగా చంద్రబాబు ఉక్కు పాదంతో ఉద్యమాలను అణచి వేయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులు, విద్యార్థులు, యువకులపై అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. నేడు ప్రత్యేక హోదా కావాలంటూ తానే యూటర్న్ తీసుకున్నపుడు ఉద్యమ కేసులను ఎందుకు ఎత్తి వేయలేదని నాయకులు సూటిగా ప్రశ్నించారు. కేంద్రం జీఎస్టీ విధానం అమలులోకి తెచ్చినపుడు, పెద్ద నోట్ల రద్దు చేసినపుడు ఆ సలహాలు తానే ఇచ్చానని గొప్పలు చెప్పుకుని.. తీరా వాటి అమలులో దుష్ఫలితాలు వచ్చిన తరువాత విమర్శించిన ఆపర మేధావి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తి తాను అనుభవజ్ఞుడనని చెప్పుకోవడమే సిగ్గు చేటని, నలభై ఏళ్ల అనుభవం ఎందులో వచ్చిందో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. యూటర్న్ తీసుకున్నందుకు ఏ కేసు పెట్టాలి.. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తూ యువభేరీలు జరిపితే మద్ధతు తెలిపిన విద్యార్థులపై పీడీ కేసులు పెడతానని తల్లిదండ్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు బెదిరించారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు యూటర్న్ తీసుకున్న ఆయనపై ఎలాంటి కేసు పెట్టాలి? రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు, 2014 ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా 5 కోట్ల మందిæ రాష్ట్ర ప్రజలను ప్రధాని మోదీ, చంద్రబాబు వంచించారు. విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా మాజీ ప్రధాని మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని చెప్పారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీగా ఉన్న వెంకయ్యనాయుడు 10ఏళ్లు హోదా కావాలంటే.. ఆ తర్వాత తిరుపతి సభలో చంద్రబాబు 15 ఏళ్లు కావాలని కోరారు. అలాంటి వ్యక్తి అర్ధరాత్రి జైట్లీ ప్యాకేజీ ప్రకటిస్తే స్వీకరించారు. అంతే కాకుండా ఆయనకు సన్మానాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వంచనపై రాష్ట్ర ప్రజానీకం గర్జిస్తోంది. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసనమండలి ప్రతిపక్ష నేత ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు తెస్తున్నారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు కొనుగోలు చేశారు. పార్లమెంటు నేతగా ఫిరాయింపుల నిరోధక చట్టంలోని అవకతవకలను సరిదిద్దమని పలుమార్లు ప్రధాని మోదీని నేను కోరాను. అయినా ఆయన స్పందించలేదు. చంద్రబాబు, ప్రధాని మోదీలు ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు తెస్తున్నారు. విభజన సమయంలో ఏపీ నష్టపోయింది. ఆ నష్టాన్ని పూడ్చడంలో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చి దాన్ని పూర్తి చేయడం, విశాఖ రైల్వే జోన్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ వంటి ముఖ్యమైన అంశాలు ఏపీకి చేకూర్చాలని చట్టంలో ఉంది. విభజన జరిగి నాలుగేళ్లు అవుతున్నా వాటిని కేటాయించలేదు. దోచుకోవడానికే చంద్రబాబు పోలవరం బాధ్యతలు తీసుకున్నారు. కేంద్రంలో నాలుగేళ్లు నాలుగేళ్లు భాగస్వామిగా ఉండి కూడా వాగ్ధానాలను నెరవేర్చలేకపోయారు. అలాంటి వ్యక్తికి ప్రజలకు ముందుకు వచ్చి ఓట్లు అడిగే అర్హత లేదు. – మేకపాటి రాజమోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ ఆ మూడు పార్టీలూ మోసం చేశాయి.. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ఎంత మోసం చేసిందో, అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీజేపీ అంతే మోసం చేసింది. అందుకు నిరసనగానే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్ణయం మేరకు రాజ్యసభలో జరిగిన డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా ఎన్నికలను బహిష్కరించాం. నాలుగేళ్లుగా మాయమాటలు చెబుతూ.. హామీల సాధనకు కృషి చేయకుండా టీడీపీ దగా చేసింది. విభజన చట్టంలోని అంశాల సాధన కోసం ప్ర«ధాన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తోంది. ఎన్డీయే ప్రభుత్వంపై మొదటిసారిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే. అయితే ఆ తీర్మానాన్ని చర్చకు రానివ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పైరవీలు చేశాయి. ఆ తర్వాత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఐదుగురు ఎంపీలం రాజీనామాలు చేశాం. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాం. అప్పుడే వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి దీక్షకు కూర్చుని ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. – వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ బాబు ఇంటి పేరు మోసం, గోత్రం ద్రోహం... 600 అబద్ధపు హామీలను ఇచ్చి ఒక్కదానిని కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజల జీవితాలను సీఎం చంద్రబాబు చిన్నాభిన్నం చేశారు. చంద్రబాబు కుల దైవం వంచన, గోత్రం ద్రోహం, ఇంటి పేరు మోసం. ప్రజలను మనుషులుగా కాకుండా కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా ఆయన చూస్తున్నారు. ఎన్నికల ముందర హోదా కావాలని కోరిన చంద్రబాబు.. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన మోదీకి అభినందనలు తెలిపిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎలా మరచిపోతారు. ప్రజాభిమానం వైఎస్సార్సీపీకి వస్తుందని గ్రహించిన చంద్రబాబు మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై «నిరసిస్తూ ధర్మ పోరాటం చేస్తున్న వైఎస్ జగన్కు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు నిండుగా వుండాయి. – భూమన కరుణాకర్రెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత త్యాగం చేశానన్న తృప్తి జీవితాంతం ఉంటుంది.. ప్రత్యేక హోదా సాధన, 5 కోట్ల మంది ప్రజల కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశానన్న తృప్తి నాకు జీవితాంతం ఉంటుంది. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని అసమర్థుడు చంద్రబాబు. బడుగు బలహీన వర్గాలు, బీసీ, దళితులు అంటే ఆయనకు ఏమాత్రం గౌరవం లేదు. ఏపీని నంబర్–1 చేస్తానని చెప్పి నాలుగేళ్లలో అవినీతిలో నెంబర్–1 చేశారు. రెండు ఎకరాల నుంచి దేశంలోనే అత్యంత ధనవంతునిగా నిలిచిన ఘనత చంద్రబాబుకే దక్కింది. – వెలగపూడి వరప్రసాద్, వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల సాధన విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు. విభజన చట్టంలోని అంశాల గురించి వారు ఎంత అపహాస్యంగా మాట్లాడుకున్నారో సోషల్ మీడియా వేదికగా ప్రజలందరూ చూశారు. టీడీపీ కార్యకర్త నుంచి నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ పథకాలకు రేట్లు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. నాలుగేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం గ్రామదర్శిని, ధర్మ పోరాట దీక్షల పేరుతో చంద్రబాబు మోసపూరిత కార్యక్రమాలు చేపడుతున్నారు. – వైఎస్ అవినాశ్రెడ్డి, వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ హోదా ఉద్యమాన్ని సజీవంగా ఉంచిన జగన్ నాలుగేళ్లుగా పోరాటాలు చేస్తూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సజీవంగా ఉంచారు. హోదా వల్ల ఉపయోగం లేదంటూ రకరకాలుగా మాటలు మార్చి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబును.. హోదా స్టాండ్ తీసుకునేలా వైఎస్సార్సీపీ చేసింది. హోదా కోసం తృణప్రాయంగా ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ నేతలు ఏం సాధించారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు.. మరి రాజీనామాలు చేయకుండా పార్లమెంటులో ఉండి టీడీపీ ఎంపీలు ఏం సాధించారో ఆయన సమాధానం చెప్పాలి. – అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్ చెప్పిందే.. గల్లా పార్లమెంటులో చెప్పారు హోదా వల్ల పారిశ్రామిక రాయితీలు వస్తాయని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చెబుతుంటే.. ముఖ్యమంత్రి విమర్శిస్తూ వచ్చారు. హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టి రాయితీలు పొందుతున్న గల్లా జయదేవ్, సుజనా చౌదరి వంటి వారిని అడిగి చంద్రబాబు తెలుసుకోవాలి. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చెప్పలేదనే విషయాన్ని మూడేళ్ల కిందటే అసెంబ్లీ సాక్షిగా జగన్ వివరించారు. అదే విషయాన్ని మొన్న పార్లమెంటులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంగ్లీషులో చెప్పారు. – కొలుసు పార్థసారథి, మాజీ మంత్రి స్వార్థం కోసం చంద్రబాబు లాలూచీ స్వార్థ రాజకీయాల కోసం ఎవ్వరితోనైనా లాలూచీపడే వ్యక్తి చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐదుగురు వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేసి ప్రజల మధ్యకు వస్తే దానిని కూడా వక్రబుద్ధితో చూసే చంద్రబాబుకు ప్రజలు తొందరలోనే గుణపాఠం చెబుతారు. విభజనతో కాంగ్రెస్, ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ దారుణంగా మోసం చేస్తే జనసేన అధినేత పవన్ వారికి వంతపాడారు. 2019 ఎన్నికల కోసం చంద్రబాబు కొత్త నాటకం మొదలెట్టి మళ్లీ మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే పిల్లల భవిష్యత్తు అంధకారమైపోతుంది. – వాసిరెడ్డి పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి టీడీపీ తెలుగు ప్రజల ద్రోహుల పార్టీ టీడీపీ అంటే.. తెలుగు ప్రజల ద్రోహుల పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పలు మార్లు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారు. విభజన హామీల అమలు కోసం వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడారు. టీడీపీ ఎంపీలకు రాజీనామా చేసే దమ్ము, ధైర్యం లేదు. చంద్రబాబు పచ్చి దగాకోరు రాజకీయాలు నడుపుతున్నారు. – రెహమాన్, మాజీ ఎమ్మెల్సీ హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన చంద్రబాబు చంద్రబాబు జీవితమంతా మోసమే. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. ఓటుకు కోట్లు కుమ్మరించి అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పుడు ప్రత్యేక హోదాను కేంద్ర కాళ్ల వద్ద తాకట్టు పెట్టి కపటనాటకాలు ఆడుతున్నారు. ఆయన రాష్ట్రానికి పట్టిన శనిలా ప్రజలు భావిస్తున్నారు. త్వరలోనే ప్రజలు శనిని సాగనంపుతారు. – మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కులాల మధ్య చంద్రబాబు చిచ్చు 40సంవత్సరాల అనుభవమని రాష్ట్రాన్ని చంద్రబాబు నిలువునా ముంచాడు. కులాల మధ్య చిచ్చుపెట్టి ఆమంటతో చలికాచుకునే ఆయన.. కాపు రిజర్వేషన్ విషయంలో జగన్ అన్న మాటలు వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్నాడు. జగన్ ప్రజల తరఫున పోరాటం చేస్తుంటే, చంద్రబాబు పదవి కోసం ఆరాటపడుతున్నాడు. టీడీపీ ఇస్తామన్న ఎంపీ పదవికి ఆశపడి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం జగన్పై విమర్శలు చేయడం మానుకోవాలి. నిత్యం ప్రజల కోసం పరితపించే జగన్ను ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. – పృధ్వీరాజ్, సినీ నటుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవమానాలు అనైతిక పాలనతో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు అవమానాలు మిగిల్చిన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతాడు. రాష్ట్ర విభజన తరువాత ప్రతీ ఒక్కరూ హోదా కావాలని ఆశిస్తుంటే ప్యాకేజీలు కావాలంటూ రాష్ట్ర అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు దెబ్బతీశాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలన్నా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీనవర్గాలకు సరైన న్యాయం జరగాలన్నా వైఎస్ జగన్తోనే సాధ్యపడుతుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వశిస్తున్నారు. – జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ బీసి సంక్షేమ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు -
‘అందుకే ఏ పార్టీకి ఓటెయ్యలేదు’
సాక్షి, గుంటూరు : ఏపీని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించి అన్యాయం చేస్తే.. సరిచేస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. అందుకే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఏ పార్టీకి వైఎస్సార్సీపీ ఓటెయ్యలేదని పేర్కొన్నారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్లు హోదా ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు.రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ లోపల, వెలుపలా బీజేపీని నిలదీసిన ఎకైక పార్టీ వైఎస్సార్సీపీయేనని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా హోదా కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంటే టీడీపీ మాత్రం యూటర్న్ తీసుకొని ప్యాకేజీకి ఒప్పుకుందని విమర్శించారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం మొదటగా పెట్టింది వైఎస్సార్సీపీయేనని గుర్తుచేశారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ఎవరు అడ్డుకున్నారో ప్రజలకు తెలుసునని, సమయం వచ్చినప్పుడు వారే బుద్ది చెబుతారన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తమ ఎంపీలు రాజీనామ చేస్తే, టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హోదాపై యుటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా వైఎస్ జగన్తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. -
బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజలను మోసం చేశాయి
-
‘వైఎస్ జగన్తోనే ప్రత్యేక హోదా సాధ్యం’
సాక్షి, గుంటూరు : ఐదు, పది కాదు ఏకంగా 15 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న వాళ్లు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజలను మోసం చేశాయని.. అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా కన్నా ప్యాకేజీయే గొప్పదన్నారని చెప్పారు. రాష్ట్రానికి హోదా కోసం మొదటి నుంచి పోరాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హోదా కావాలన్నారని గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం హోదా కంటే ప్యాకేజీయే గొప్పదని ప్రకటించారని, మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారని, టీడీపీ స్టాండ్ ఇదేనని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని చెప్పారు. వైఎస్సార్ సీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేదని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్ జగన్తోనే సాధ్యం అవుతుందని తేల్చి చెప్పారు. -
గుంటూరులో హోదాపై వైఎస్సార్సీపీ వంచన దీక్ష
-
ఎస్వీయూ విద్యార్థుల అర్ధనగ్న ప్రదర్శన
సాక్షి, తిరుపతి : జ్ఞానభేరీ సభలో విద్యార్థుల అక్రమ అరెస్టులకు నిరసనగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆదివారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న జ్ఞానభేరి సభ రసాభాసంగా మారిన సంగతి తెలిసిందే. విద్యార్థులు ప్రత్యేక హోదా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఊహించని ఈ పరిమాణాలతో సభ అంతా గందరగోళంగా మారింది. నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని కోరారు. -
కేంద్రంపై టీడీపీ ఒత్తిడి తీసుకురాలేదు..
-
రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉంది
ఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉందని తిరుపతి వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎంపీగా రాజీనామా చేసినా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం వివిధ శాఖల మంత్రులను కలుస్తున్నానని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము రాజీనామా చేశామని, ఆ విషయం ప్రజలకు తెలుసునని అన్నారు. బీజేపీ, టీడీపీలు ప్రత్యేక హోదా హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నాయని ఆరోపించారు. కేంద్రంపై టీడీపీ ఒత్తిడి తీసుకురాలేదు..అందుకే బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని విమర్శించారు. లోక్సభలో తామే ముందు అవిశ్వాస తీర్మానం పెట్టామని..కానీ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్లే రాజీనామా చేశామని తెలిపారు. కేంద్రమంత్రులను, అధికారులనూ తాను కలుస్తున్నానని చెప్పారు. ఓఎన్జీసీ అధికారులను కలిసి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరాను..ఆరోగ్య మంత్రిని కలిసి రూయా ఆసుపత్రికి రూ.50 కోట్లు, స్విమ్స్కి రూ.50 కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. మా సమయం వృథా కానివ్వకుండా ప్రత్యేక హోదా కోసం ప్రజలతో కలిసి పోరాడుతున్నామని చెప్పారు. ఇప్పుడు ఎంపీలం కాకపోయినా నిథుల కోసం మంత్రులు, అధికారులను కలుస్తున్నామని వివరించారు. వైఎస్ జగన్ వల్లే ప్రత్యేక హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కడప స్టీల్ ఫ్లాంట్, దుగరాజపట్నం పోర్టు, ఎయిర్పోర్టు కావాలంటే..ఒక డైనమిక్ లీడర్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. -
జగన్ వల్లే హోదా సజీవంగా ఉంది: భూమన
తిరుపతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పోరాటాల వల్లే ప్రత్యేక హోదా సజీవంగా ఉందని వైఎస్సార్సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతిలో గురువారం భూమన విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఊసరవెల్లిలా రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తన సభలలో తాను ఏం చేశాడో చెప్పుకోలేక పోతున్నాడని ఎద్దేవా చేశారు. కేవలం వైఎస్ జగన్ మీద ఆరోపణలకే సమయం కేటాయిస్తున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా సభలో వైఎస్ జగన్ మీద దుర్మార్గంగా మాట్లాడుతూ.. వ్యక్తిగత ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తొమ్మిది సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబూ ఎన్ని ప్రాజెక్టులు కట్టావో సమాధానం చెప్పాలి..రాజశేఖర్ రెడ్డి దాదాపు పూర్తి చేసిన ప్రాజెక్టులకు చంద్రబాబు ఇప్పుడు గేట్లు ఎత్తుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్ వీరోచిత పోరాటం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాపుల ఉద్యమాన్ని ఉక్కు పాదంతో తొక్కింది చంద్రబాబేనని అన్నారు. తుని ఘటనకు చంద్రబాబే కారణమని, ఆయన మనుషులే హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. బాబు పాలన మీద, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన మీద చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. దమ్ముంటే చర్చకు సిద్ధపడాలని ఈ సందర్భంగా చంద్రబాబుకు భూమన సవాల్ విసిరారు. సోనియా గాంధీతో కలిసి వైఎస్ జగన్ మీద తప్పుడు కేసులు పెట్టించింది నువ్వు(చంద్రబాబు) కాదా అని సూటిగా అడిగారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు తిరుమల ప్రసాదంలా భావించాడని పేర్కొన్నారు. -
చంద్రబాబుకు భూమన సవాల్
-
టీడీపీపై విష్ణుకుమార్ రాజు మండిపాటు
సాక్షి, గన్నవరం : విశాఖపట్నం రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీలను ఏపీకి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. బీజేపీ కోర్ కమిటీ మీటింగ్లో పాల్గొనేందుకు కృష్ణా జిల్లా గన్నవరం చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. గత నెల జూన్ 13న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను బీజేపీ నేతలు కలవడం జరిగిందని, త్వరలో విశాఖ రైల్వే జోన్ అధికారికంగా ప్రకటించనున్నారని తెలిపారు. దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయ భూమి చూపిస్తే పోర్టు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మించి ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. పోలవరానికి అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే పెడుతుందని తెలిపారు. రాజకీయ లబ్ది కోసం కడప ఉక్కు ఫ్యాక్టరీపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ గురించి ధర్నాలు, నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరం లేదన్నారు. మీరు ధర్నాలు చేయదలచుకుంటే ఏపీలో జరిగే అవినీతి, ఇసుక మాఫియా, లంచగొండితనంపై చేయాలని అన్ని పార్టీలకు సూచించారు. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్, సహ ఇంచార్జ్ సునీల్ దేవధర్, రాష్ట్ర అధ్యక్షులు కన్నాతో పాటు సమావేశంలో పాల్గొన్న 16 మంది కోర్ కమిటి సభ్యులు, ఇతర బీజేపీ ముఖ్యులు హాజరయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది. ఏపీలో బీజేపీ బలోపేతానికి ఎవరేం చేయాలో నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఈ సమావేశానికి ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభం హారిబాబు గైర్హాజరయ్యారు. -
హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: ఉమెన్
ఏలూరు : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీ స్పష్టం చేశారు. ఏలూరులో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశం గురించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు అని యూపీఏ ప్రతిప్రాదిస్తే కాదు పదేళ్లు ఇవ్వాలన్న బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రజలను మోసం చేసిందని వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో నాలుగేళ్లుగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తాజా తీర్పుపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కాపులకు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ వెనుకడుగు వేయడం దారుణమన్నారు. 25 మంది ఎంపీలుంటే ప్రత్యేక హోదా తీసుకు వస్తానని వైఎస్ జగన్ ఎలా అన్నారు...ప్రత్యేక హోదా కూడా కేంద్ర పరిధిలోనిదే కదా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రమే కాపులకు రిజర్వేషన్లు ఇవ్వగలదన్నారు. ప్రత్యేక హోదా, కాపుల రిజర్వేషన్ల విషయంలో ప్రాంతీయ పార్టీలు ఏమీ చేయలేవని చెప్పారు. ఏపీలో 44000 బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తెలిపారు. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్ల గురించి నేను ఎలా మాట్లడతా..నేను ఏపీకి మాత్రమే ఇన్చార్జిని అని స్పష్టం చేశారు. తమిళనాడులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి...అదే విధంగా ఏపీలో కూడా ఇబ్బందులు రాకుండా రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఆలోచన చేస్తామని వ్యాఖ్యానించారు. కొంగ దీక్షలు చేస్తే జనం ఒప్పుకోరు: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఏపీకి జరిగిన అన్యాయంపై, పార్లమెంట్లో అవిశ్వాసం చర్చపై మొదట మాట్లాడిందే కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఎన్డీఏపై అవిశ్వాసంపై టీడీపీతో పాటు మిత్ర పక్షాలు కూడా నోటీసులు ఇచ్చాయని..టీడీపీ నోటీసులకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని చంద్రబాబు చెప్పుకోవడం ముఖ్యమంత్రి స్ధాయికి తగదన్నారు. చంద్రబాబు నాలుగేళ్లు ఎన్డీఏలో ఉండి ఇపుడు బయటకు వచ్చి కొంగ దీక్షలు చేస్తే జనం ఒప్పుకోరు...ఎవరూ నమ్మరని విమర్శించారు. ప్రత్యేక హోదా పై ఏఐసీసీ సమావేశంలో తీర్మానం చేశాం...రాహుల్ ప్రధాని అయిన వెంటనే తొలిసంతకం ప్రత్యేక హోదాపైనే ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు తప్పితే ఏపీకి మరే పార్టీ న్యాయం చేయలేవని వ్యాఖ్యానించారు. -
టీడీపీలో ‘యూ’ టెన్షన్ !
‘యూటర్న్..’ పేరు వింటేనే టీడీపీ నేతలు కొద్ది రోజులుగా ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పది రోజులుగా ఆ పదం వాడకుండా ఏ సమావేశాన్ని ముగించడం లేదు. తాను యూటర్న్ తీసుకోలేదంటూ పార్టీ సమావేశాలు, టెలికాన్ఫరెన్స్ల్లో పదేపదే ప్రస్తావిస్తున్నారు. దీన్నిబట్టే ‘యూటర్న్’ టీడీపీని ఎంత కలవరపాటుకు గురి చేస్తోందో తెలిసిపోతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. –సాక్షి, అమరావతి టర్నుల మీద టర్నులు ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న విభిన్న వైఖరులతో ఆయన ‘యూటర్న్’ల గురించి దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. గత ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని 15 ఏళ్లు కావాలని మోదీ సమక్షంలో కోరారు. తర్వాత బీజేపీతో కలసి అధికారాన్ని పంచుకుని హోదా అవసరం లేదని ప్రత్యేక ప్యాకేజీ అత్యుత్తమమని మాట మార్చారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి హోదానే కావాలంటూ మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. హోదా కోసం పోరాడుతున్న యువతను బెదిరించిన నోటితోనే ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటూ కొత్త పాట పాడుతున్నారు. ‘యూటర్న్ అంకుల్’: తాను కారులో వెళ్తుంటే ఎక్కడ యూటర్న్ కనబడినా చంద్రబాబే గుర్తుకొస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన అనంతరం చంద్రబాబు యూటర్న్ల గురించి జోరుగా ప్రచారం సాగుతోంది. ఫేస్బుక్, యూట్యూబ్, ఇతర మాధ్యమాల్లో బాబు యూటర్న్పై అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. గూగుల్లో ‘యూటర్న్ అంకుల్’ అంటే చంద్రబాబు ఫొటోలు, యూటర్న్ సింబల్తో ఉన్న ఫొటోలు దర్శనమిస్తుండడం విశేషం. ఇటీవల ప్రధాని మోదీ సైతం లోక్సభలో మాట్లాడుతూ చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విమర్శించిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు బీజేపీపై ఎదురుదాడికి సిద్ధమయ్యారు. 40 ఏళ్లుగా బాబు యూటర్న్లు (సోషల్ మీడియాలో వైరల్గా మారాయి) 1978 - కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు 1983 - కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిన తరువాత ఆ పార్టీకి ఝలక్ ఇచ్చి టీడీపీలోకి జంప్ 1995 - సొంత మామ ఎన్డీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాడు 1998 - యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉండగానే యూటర్న్తో ఎన్డీఏలో చేరిక 1999 - బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ 2004 - ఎన్నికల తర్వాత ఎన్డీఏకు హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చిన బాబు 2009 - టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐలతో కలిసి పోటీ, ఎన్నికలయ్యాక ఆ పార్టీలకు ఝలక్ 2014 - మళ్లీ ఎన్డీఏలో చేరిక 2018 -మరోసారి ఎన్డీఏకు ఝలక్ ఇచ్చి బయటకు వచ్చారు ప్రత్యేక హోదాపై బాబు యూటర్న్లు 2014 ఏప్రిల్ 29 - మనకు ప్రత్యేక హోదా కావాలి. ఐదేళ్లే ఇస్తామంటున్నారు. 15 ఏళ్లు ఇవ్వాలని మోదీ గారిని కోరుతున్నా (తిరుపతి సభలో) 2015 ఆగస్టు 25 - ప్రత్యేక హోదా సంజీవని కాదు. (ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఢిల్లీలో) 2016 మే 17 - హోదాతో ఏమొస్తుంది? హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి? 2016 సెప్టెంబర్ 15 - హోదాతో పరిశ్రమలు రావు. పారిశ్రామిక రాయితీలకు, హోదాకు సంబంధం లేదు. 2017 ఫిబ్రవరి 3 - హోదా వేస్ట్. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు. 2018 మార్చి 2 - రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని టీడీపీ ఎప్పుడూ అనలేదు. 2018 మార్చి 10 - కేంద్రంపై వైఎస్సార్ సీపీ పెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వం. 2018 మార్చి 15 - వైఎస్సార్సీపీ అవిశ్వాసానికి మద్దతిస్తాం. 2018 మార్చి 16 - వైఎస్సార్ సీపీ పెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వం. మేమే అవిశ్వాసం పెడతాం. 2018 మే - రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. 2018 జూలై 25 - ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి. -
ఇది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య
-
ఇది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య: రోజా
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఇంకా ఎంత మంది ప్రాణాలు తీసుకుంటారంటూ ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. గతంలో ఏపీ హోదా కోరుతూ మునికోటి అనే యువకుడు ఆత్మహత్య చేసుకుంటే, ఆ కుటుంబాన్ని ఇప్పటివరకూ ప్రభుత్వం ఆదుకోలేదనే విషయాన్ని రోజా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇలా ఎంతా మంది ప్రాణాలు తీసుకుంటారంటూ ప్రభుత్వాన్ని రోజా నిలదీశారు. శనివారం ప్రత్యేక హోదా కోరుతూ మదనపల్లిలో చేనేత కార్మికుడు సుధాకర్ బలవన్మరణానికి పాల్పడ్డిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం రోజా మీడియాతో మాట్లాడుతూ.. సుధాకర్ది ఆత్మహత్య కాదని.. ఇది ముమ్మాటికీ సర్కార్ చేసిన హత్యేనన్నారు. వెంకన్న సాక్షిగా నరేంద్ర మోదీ-చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమాయ్యాయని ప్రశ్నించారు. హోదాపై ఉద్యమాలు చేస్తుంటే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని రోజా పేర్కొన్నారు. పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు డ్రామాలు చేస్తున్నారే తప్ప హోదాపై నిలదీయడం లేదని రోజా విమర్శించారు. -
ఏపీ కోసం తెలంగాణ యువకుడు పోరాటం
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ శుక్రవారం ఓ తెలంగాణ యువకుడు ఢిల్లీలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలియజేశాడు. మెట్రో భవన్కు చేరువలో భారీ టవర్ ఎక్కిన యువకుడు ఏపీ నీడ్ స్పెషల్ స్టేటస్, సేవ్ ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ ప్లకార్డులతో తన డిమాండ్ను తెలియపర్చాడు. జోరున వర్షం కురుస్తున్నా వెరువక రాష్ట్ర భవిష్యత్ కోసం యువకుడు భారీ టవర్ను ఎక్కాడు. వర్షం కారణంగా అతను జారి కిందపడతాడేమోనని ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ ఘటనతో స్థానిక పోలీసులు పరుగులు తీయాల్సివచ్చింది. ఆగమేఘాలపై ఆ ప్రాంతానికి చేరుకుని ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. గంటల తరబడి అతను టవర్పైనే ఉన్నట్లు డీసీపీ మాధుర్ వర్మ చెప్పారు. చివరకు అతనికి నచ్చజెప్పి భారీ క్రేన్ సాయంతో అతన్ని కిందకు దించి పీఎస్కు తరలించారు. -
ప్రత్యేక హోదా : ఢిల్లీలో సెల్ టవర్ ఎక్కి నిరసన
-
మోదీనే ట్రాప్లో పడ్డారు.. చంద్రబాబు ఎదురుదాడి!
సాక్షి, కొవ్వూరు : అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక టీడీపీ అధినాయకత్వం సతమతమవుతోంది. ప్రత్యేక హోదా వద్దంటూ తొలుత ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు.. ఆ తర్వాత మాట మార్చి యూటర్న్ తీసుకున్నారని, ఈ విషయంలో ఆయన వైఎస్సార్సీపీ ట్రాప్లో పడ్డారని ప్రధాని మోదీ ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక.. తాజాగా చంద్రబాబు ఎదురుదాడి మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్ సీపీ ట్రాప్లో తాను పడలేదని, ప్రధాని మోదీనే ట్రాప్లో పడ్డారని ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ఉండి తెలుగువాడి సత్తా చూపిస్తామని చెప్పిన చంద్రబాబు. టీడీపీ ఎంపీలు మాత్రం రాజీనామా చేయరని అన్నారు. అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై పోరాటం చేస్తామని చెప్పారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. విభజనతో నష్టపోయిన ఏపీకి అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మొదటినుంచి అవకతవక వైఖరిని అవలంబించారు. ఆయన హోదా కాదని ప్యాకేజీకి స్వాగతించడమే కాక.. ఈ విషయంలో ప్రధాని మోదీని, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు అభినందనలు తెలిపారు. చంద్రబాబు ఒకవైపు ప్రత్యేక హోదాను ఖూనీ చేసేవిధంగా ప్రవర్తించినా.. వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం మొక్కవోని పట్టుదలతో, నిరంతర పోరాటాలతో హోదా ఆకాంక్షను ఆయన సజీవంగా నిలిపారు. అలుపెరగని పోరాటాలతో ఇటు చంద్రబాబు ప్రభుత్వంపై, అటు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో మొదట ప్యాకేజీ కోసం పాకులాడిన చంద్రబాబును.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన యూటర్న్ రాజకీయాలను తెరపైకి తెచ్చి.. ఇటీవల హోదా నినాదం ఎత్తుకొని ఆర్భాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ట్రాప్లో తాను పడ్డానని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక.. కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఏకంగా మోదీని ట్రాప్లో పడ్డారని ఆయన ఎదురుదాడి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
‘తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా కావాలి’
న్యూఢిల్లీ : విభజన చట్టంలో పొందు పరిచిన హామీలు అమలు చేయలేదని, తెలంగాణకు న్యాయం చేయాలని కోరిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి నేతృత్వంలోని టీఆర్ఎస్ ఎంపీల బృందం గురువారం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ను కలిశారు. తెలంగాణలో విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్ర మంత్రితో టీఆర్ఎస్ నేతలు చర్చించారు. విభజన చట్టంలో పొందుపరిచిన తెలంగాణకు సంబంధించిన అంశాలు పట్టించుకోలేదని, హైకోర్టు విభజన, బయ్యారం స్టీల్ ప్లాంట్, విద్యాసంస్థలు లాంటి అన్ని అంశాల్లో అన్యాయం జరిగిందని జవదేకర్కు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకేం అభ్యంతరం లేదని, తెలంగాణకు ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చేయాలని లేనిపక్షంలో దానికి సమానంగా నిధులిచ్చి సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ‘ప్రత్యేక హోదా ఫలాలు తెలంగాణకు ఇవ్వాలి. పరిశ్రమలు ఏపీకి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఏపీ నేతలు తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రాజకీయ లబ్దికోసం ఏపీలో పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. విభజన చట్టం చేసిన కాంగ్రెస్ రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణకు అన్యాయం చేసింది. తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేయాలని’ టీఆర్ఎస్ ఎంపీలు సూచించారు. సోనియా ఇస్తే కాదు.. తెలంగాణ రాష్ట్రం సోనియా ఇస్తే రాలేదని, ప్రజలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని కడియం శ్రీహరి అన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉన్నా కేంద్రం చిన్నచూపు చూస్తుందన్నారు. త్వరలోనే గిరిజన వర్సిటీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఐఐఎం తెలంగాణకు ఇవ్వాలని నాలుగేళ్ల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రాన్ని అడినట్లు గుర్తుచేశాం. 14 కొత్త జిల్లాలలో కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విధ్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరాం. త్రిపుల్ ఐటీ ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరాం. గణిత శాస్త్రం కోసం విద్యార్థులకు అడ్వాన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాథమెటిక్స్ను హైదరాబాదులో ఏర్పాటు చేయాలని కోరాం. మధ్యాహ్న భోజన పథకాన్ని 12వ తరగతి విద్యార్థుల వరకు పొడిగించాలని’ కేంద్ర మంత్రి జవదేకర్ను కడియం శ్రీహరి కోరారు. -
ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లేదు కానీ..
సాక్షి, న్యూఢిల్లీ : గతంలో ఉన్న ప్రత్యేక హోదా, పరిశ్రమలకు రాయితీలు లేవని కేంద్రం స్పష్టత ఇచ్చింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. గతంలో హోదా ఉన్న రాష్ట్రాలకు ఇప్పుడు హోదా పేరు లేదు కానీ అవే ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొంది. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, మూడు హిమాలయ రాష్ట్రాలు హోదా ద్వారా ప్రయోజనాలు పొందుతున్నాయని కేంద్రం తెలిపింది. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుతో ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా తొలగించామని కానీ హోదాతో వచ్చే ఆర్థిక సహాయం మాత్రం అందజేస్తుమని సమాధానమిచ్చారు. వాటిల్లో ఆంధ్రప్రదేశ్కు ఉందని తెలిపారు. కేంద్ర ప్రయోజిత పథకాలలో హోదా కలిగిన 11 రాష్ట్రాలకు 90:10 ప్రకారం నిధులు అందుతున్నాయని సమాధానమిచ్చింది. విదేశీ సహాయ ప్రాజెక్టులు(ఈఏపీ) కింద వచ్చే నిధులను 90శాతం ఈశాన్య రాష్ట్రాలకు, హిమాలయ రాష్ట్రాలకు గ్రాంటుగా అందజేస్తున్నట్లు స్ఫష్టం చేసింది. ఏపీకి ఐదేళ్లకుగాను రెవెన్యూ లోటు భర్తీకి గ్రాంట్ గా 22 వేల 112 కోట్ల రూపాయలను కేంద్రం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ అభివృద్ధి మండలి ద్వారా మంజూరయ్యే స్పెషల్ స్టేటస్లో ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఉండవని మరో ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. -
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి ప్రతినిధి, విజయనగరం/ కాశీబుగ్గ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం యవత కదం తొక్కింది. రాష్ట్రంలో విద్యార్థి, యువజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు పలు చోట్ల పెద్ద ఎత్తున మానవహారాలు చేపట్టారు. బుధవారం విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులో వందలాది మంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడి, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆమ్ ఆద్మీ, అనుబంధ విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. విభజన హామీలన్నీ అమలు చేస్తున్నామని బీజేపీ పార్లమెంటులో చెప్పడం సిగ్గుచేటన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. విద్యార్థులు తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని హెచ్చరించారు. సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ గంగాధర్తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ బస్స్టాండ్ వద్ద వందలాది మంది బుధవారం మానవహారం చేపట్టారు. అలాగే విజయనగరం జిల్లాలో, పార్వతీపురంలో విద్యార్థులు ఆందోళన చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్, రాష్ట్రంలో జాతీయ విద్యా సంస్థలను, జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకుడు, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి మద్దిల వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ నేతల అరెస్టు సాక్షి, గుంటూరు: ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ గుంటూరు జిల్లా పొన్నూరు ఐలాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించిన ఎస్ఎఫ్ఐ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. వారిని అరెస్టు చేసి చెంపలపై కొట్టడం వివాదానికి దారితీసింది. వివరాల్లోకెళ్తే.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులు పొన్నూరులో మానవహారం నిర్వహించారు. పోలీసులు వచ్చి మానవహారాన్ని విరమించాలని కోరడంతో ఎస్ఎఫ్ఐ నేతలు ఎస్.కె.జాఫర్ఖాన్, ఎం.కిరణ్, తిరుమలరెడ్డి విద్యార్థులను పంపివేశారు. ఇదే తరుణంలో అక్కడకు వచ్చిన పొన్నూరు పోలీసులు ముగ్గురిని బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. సీఐ వీరిని అసభ్యపదజాలంతో దూషిస్తూ చెంపలపై తీవ్రంగా కొట్టడమే కాకుండా ఒంటిపై ఉన్న బట్టలన్నీ తీయించి లాకప్లో పడేశారు. ఎస్ఎఫ్ఐ నేతలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు భగవాన్దాస్తోపాటు మరికొందరు గుంటూరు రూరల్ జిల్లా ఏఎస్పీ వరదరాజులును కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసులు కొట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య, సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు తదితరులు ఖండించారు. -
ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా అవసరమని సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని, హోదా ఇచ్చి ఉంటే ఇంకా వేగంగా అభివృద్ధి చెందేవాళ్ల మన్నారు. బుధవారమిక్కడ మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో కలసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. విభజన సమయంలో అప్పటి ప్రధాని ప్రత్యేక హోదా ఇస్తామన్నారని.. ఆ హామీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రధానిపై ఉందన్నారు. అయినా కూడా వృద్ధి రేటులో రాష్ట్రం నంబర్ వన్గా నిలుస్తోందని.. మూడేళ్లుగా వృద్ధిరేటు స్థిరంగా ఉందని చెప్పారు. గ్రామాలకు వెళ్లి పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. 10 నెలల్లో 40 రోజులపాటు గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సీనియర్ అధికారులు ఒకసారి పర్యటన చేయాలని స్పష్టం చేశారు. అలాగే నాలుగేళ్లల్లో రాష్ట్ర పరిస్థితిని ఎలా మార్చేశామో ప్రజలకు వివరించాలని సూచించారు. రానున్న 115 రోజుల పాటు గ్రామదర్శిని నిర్వహించి.. గ్రామీణాభివృద్ధి కోసం విజన్ డాక్యుమెంట్ తయారుచేయాలని సూచించారు. పౌర సరఫరాలు, చంద్రన్న బీమా, ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ, అన్న క్యాంటీన్లు, ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి, చంద్రన్న పెళ్లి కానుక, అన్ని స్కాలర్షిప్లను ఒకే విండో నుంచి అమలు చేయటంపై దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం వరకు ఈ సమావేశం జరిగింది. అనంతరం ఉన్నతాధికారులు, మంత్రులకు ముఖ్యమంత్రి ఉండవల్లిలోని తన నివాసంలో విందు ఇచ్చారు. అంతకుముందు పనితీరు బాగున్న అధికారులతో పాటు ఇటీవల పలు అవార్డులు పొందిన వారిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. కాగా, బుధవారం సాయంత్రం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాకేశ్ శర్మ భేటీ అయ్యారు. సాధికార మిత్రలు, బీమా మిత్రలు, ఆశ వర్కర్లు, డ్వాక్రా మహిళలు క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తున్నారని ఆమె అభినందించారు. ఆమె వెంట రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఉన్నారు. నాలుగేళ్లుగా జగన్ చెబుతున్నదే సీఎం నోటి వెంట.. ప్రత్యేక హోదా వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పన్నులు తక్కువగా ఉంటాయని, పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నాలుగేళ్లుగా చెబుతున్న మాటలనే.. సీఎం చంద్రబాబు ఇప్పుడు వల్లె వేయడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో కలిసి కేంద్ర ప్రభుత్వంలో కొనసాగినంతకాలం ప్రత్యేక హోదా అవసరం లేదని.. హోదా వస్తే పరిశ్రమలు ఏమైనా వచ్చేస్తాయా అంటూ ముఖ్యమంత్రి ఎద్దేవా చేస్తూ వచ్చారు. ప్రత్యేకహోదా ఎంత అవసరమో యువభేరీలు, ధర్నాలు, దీక్షల ద్వారా ప్రజలకు జగన్ వివరిస్తుంటే.. హోదాతోనే అన్నీ అయిపోతాయని ప్రచారం చేయడం తగదని చంద్రబాబు ఎదురుదాడి కూడా చేశారు. హోదా వల్ల పరిశ్రమలు రావని, వస్తాయని ఎక్కడుందో చూపాలంటూ మీడియా ప్రతినిధులను సైతం బెదిరించిన ఉదంతాలున్నాయి. హోదా అమలవుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితేమీ మెరుగుపడలేదని.. హోదా ఒక్కటుంటే చాలు, మిగిలినవేవీ అవసరం లేదని ప్రతిపక్షం చెప్పడం తప్పని వాదించారు. అయినా కూడా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ హోదా సాధన కోసం నాలుగేళ్లుగా అలుపెరుగకుండా పోరాడుతూనే ఉంది. మరోవైపు నాలుగేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. ప్రత్యేక హోదాపై యూ టర్న్ తీసుకున్నారు. హోదా సంజీవని కాదని చెప్పడమే కాక, ప్యాకేజీ ప్రకటించిన కేంద్రాన్ని అభినందిస్తూ తీర్మానాలు చేసిన ముఖ్యమంత్రి.. ఇప్పుడేమో హోదా వద్దని తాను ఏనాడూ అనలేదంటూ కొత్త రాగం అందుకోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పరిశ్రమలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రత్యేక హోదా కావాలంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడంతో.. ఇదేదో నాలుగేళ్ల కిందటే గ్రహించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. -
మాకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలి
సాక్షి, సిద్దిపేట: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే విభజన సందర్భంగా నాటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ చెప్పినట్టు తెలంగాణకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేటలో టీఆర్ఎస్వీ జిల్లా శిక్షణతరగతుల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. ఎవరిని అడిగి రాష్ట్ర విభజన చేశారని పార్లమెంట్లో టీడీపీ నాయకులు ప్రశ్నించడం శోచనీయమన్నారు. 1956లో ఇక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొనే అప్పటి ప్రధాని నెహ్రూ, తెలం గాణను ఏపీలో కలిపారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు విభజన సందర్భంగా కూడా తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలిపారని, పోలవరానికి జాతీయ హోదా ప్రకటించిన కాంగ్రెస్ తెలంగాణలోని ప్రాణహిత, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయహోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణపై విషం కక్కిన చంద్రబాబుతో దోస్తీకి తెలంగాణ కాంగ్రెస్ సమాయత్తం కావడం సిగ్గుమాలిన చర్యగా హరీశ్ అభివర్ణించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇక్కడి పరిశ్రమలు తరలిపోతాయని, యువత నిరుద్యోగులుగా మిగులుతారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడి అభివృద్ధిని అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. -
తెలంగాణకూ ప్రత్యేక హోదా ఇవ్వాలి
నల్లగొండ రూరల్: తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా పేరుతో తెలంగాణను మరో సారి అన్యాయానికి గురి చేయవద్ద న్నారు. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ నేతలు అడగడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానం చేస్తే, తెలంగాణకు కూడా ఇవ్వాలని ఇక్కడి కాంగ్రెస్ నేతలు అడగకపోవ డం వారి అసమర్థతకు నిదర్శనమన్నారు. -
‘దుర్గారావుది మరణం కాదు.. హత్య’
సాక్షి, కర్నూలు : చంద్రబాబు మోసానికి, ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్తో వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్యవాదాలు అని ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. బుధవారం ఆయన ఎమ్మెల్యే ఐజయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్లతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు తొత్తులుగా మారిన పోలీసులు పచ్చ చొక్కాలేసుకొని హోదా ఉద్యమాన్ని అనగదొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రజల సంకల్పం ముందు బాబు కుట్రలు, ఖాకీల కర్కశత్వం తుడిచిపెట్టుకు పోయాయని విమర్శించారు. బంద్లో పాల్గొని గుండెపోటుతో మృతి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త దుర్గారావు కుంటుంబానికి సానుభూతిని తెలిపారు. హోదా పోరులో వైఎస్సార్సీపీ సైనికుడు అశువులు బాయటం బాధాకరమని పేర్కొన్నారు. దుర్గారావుది మరణం కాదని చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. ఒక్క రోజు బంద్కు పిలుపు నిస్తే అదేదో నేరం అన్నట్లు, ప్రజలు దేశ ద్రోహులు అన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ చేట్టిన బంద్ను ప్రభుత్వం విఫలం చేయలేదని ప్రజలే భగ్నం చేశారని డిప్యూటి సీఎం కేఈ క్రిష్ణమూర్తి అనడం సిగ్గుచేటన్నారు. ఒక్కరోజు బంద్తో హోదా వస్తుందా అన్న కేఈ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని విమర్శించారు. హోదా పోరాటంలో యూటర్న్ తీసుకుంది చంద్రబాబేనని ఆరోపించారు. నమ్మక ద్రోహం చేసి ఫిరాయించిన మంత్రులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఫిరాయింపుతో వచ్చిన మంత్రి పదవి శాశ్వతం కాదని అఖిలప్రియ తెలుసుకోవాన్నారు. ప్రత్యేక హోదా బంద్తో ఎవరు ఎటువైపో తేలిపోయిందన్నారు. ధ్వంద ప్రమాణాల రాజకీయ పార్టీల నైజం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. హోదా కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. -
‘తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలి’
సాక్షి, నల్గొండ : తెలంగాణ ప్రజలకు వంచించడం చేతకాదని, అందుకే ప్రతీసారీ మోసపోతున్నామని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ మినహా మిగిలిన ప్రాంతమంతా వెనుకబడిందేనని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సమగ్రంగా వివరిస్తూ 2015లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు లేఖ రాశానని గుర్తు చేశారు. అన్ని వనరులతో అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే.. వెనుకబడిన తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కనీసం ఒక్క ప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేంద్రానికి విఙ్ఞప్తి చేశారు. అధిష్టానంపై ఒత్తిడి తీసుకురండి.. ఏపీకి హోదా కల్పిస్తామని సీడబ్ల్యూసీ కమిటీ సమావేశంలో తీర్మానం చేస్తోంటే తెలంగాణ గురించి మాట్లాడకుండా ఏం చేశారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలను గుత్తా ప్రశ్నించారు. విభజన చట్టం హామీలు నెరవేర్చాలని ఎంపీలు అడగలేక పోవడానికి కారణాలేంటో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా నోరు తెరచి అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించారు. -
హోదా కోసం విద్యార్థుల మానవహారాలు
అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా13 జిల్లాల్లో మానవహారాలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ మానవహరాల్లో సుమారు కోటి మంది విద్యార్థులు పాల్గొన్నారని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ప్రత్యేక హోదాను వెంటనే ఇవ్వాలని, హోదా ఇస్తేనే విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్యాకేజీకి ఒప్పుకుని చంద్రబాబు విద్యార్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హోదాపై చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేసినట్లే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామలో ప్రత్యేక హోదా కోరుతూ గాంధీ సెంటర్లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థులకు మద్య వాగ్వివాదం జరిగింది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్ జిల్లా కడప కోటిరెడ్డి సర్కిల్లో విద్యార్థుల భారీ మానవహారం ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా, కడప ఉక్కు కోసం విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్, ఏఐఎస్ఎఫ్, జనసేన విద్యార్థి విభాగం, ఎస్ఎఫ్ఐ తదితర సంఘాలకు చెందిన విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. కాసేపయిన తర్వాత విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి మానవహారాన్ని పోలీసులు భగ్నం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విధ్యార్ధి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మానవాహారం. భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్ధులు. చిత్తూరు జిల్లా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద విద్యార్థుల మానవహారం. విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద విద్యార్ధి యువజన సంఘాల ఆధ్వర్యంలో మానవహారం. దీనికి సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలు మద్దతు తెలిపాయి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ నిరసన తెలిపారు. నెల్లూరు జిల్లా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ నెల్లూరు నగరం మాగుంట సర్కిల్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో మానవహారం. హోదా కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు తెలిపారు. -
ప్రత్యేక హోదా కోసం విద్యార్ధి,యువజన సంఘాల నిరసన
-
అనుకుంటే ఎన్కౌంటర్ చేస్తా..
చిత్తూరు, సాక్షి: ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. అందుకే వైఎస్సార్సీపీ నాలుగు సంవత్సరాలుగా పోరాడుతోంది. ఈనేపథ్యంలో ‘హోదా’ పై కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల వంచనను నిరసిస్తూ మంగళవారం ఆ పార్టీ బంద్కు పిలుపుని చ్చింది. జిల్లాలో పోలీసులు బంద్ను అడుగడుగునా భగ్నం చేసేందుకు యత్నించినా పార్టీ శ్రేణులు.. ప్రజలు ముందుకు కదిలారు.. నిరసనను జయప్ర దం చేశారు. రూరల్జిల్లా పరిధిలో 1,006 మంది, అర్బన్ జిల్లాలో 196 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమైన నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. సామాన్యులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, బ్యాంకులు మూతపడ్డాయి. తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డిని పోలీసులు ఉదయం 4 గంటల సమయంలోనే అదుపులోకి తీసుకున్నారు. దీన్ని అడ్డుకునేందుకు ఆ పార్టీ కార్యకర్తలు విఫలయత్నం చేశారు. గంటసేపు కరు ణాకర్రెడ్డి కోసం పోలీసులతో పోరాడారు. కార్యకర్తలందరినీ అరెస్టు చేసిన తరువాత భూమనను పోలీసులు ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. తిరుచానూర్లో బంద్ నిర్వహిస్తున్న భూమన అభినయ్ను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి నుంచి నగరికి వెళ్తున్న ఎమ్మెల్యే ఆర్కే రోజాను పుత్తూరు పున్నమి సర్కిల్లో పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా ధర్నా చేసేం దుకు కూడా పోలీసులు అనుమతించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా కోసం చేస్తున్న పోరాటాన్ని అణచివేస్తే చంద్రబాబుకు పుట్టగతులుండవని విమర్శించారు. 180 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను బంద్లో పాల్గొనకుండా అరెస్టు చేశారు. పుత్తూరులో ఎమ్మెల్యే నారాయణస్వామిని ఉదయం 8గంటలకు అరెస్టు చేశారు. అయినా పార్టీ శ్రేణులు స్పందించి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో బంద్ విజయవంతం చేశారు. ఆ పార్టీ కార్యకర్తలందరూ ‘హోదా’ వస్తే కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ వీ«ధివీధి తిరిగారు. ఉదయం నుంచే దుకాణాలు తెరుచుకోలేదు. నియోజకవర్గ వ్యాప్తంగా 40 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రత్యేక హోదా కోసం విన్నూత్నంగా నిరసన తెలిపారు. వాహనాలను శుభ్రం చేస్తూ హోదా వస్తే రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలను చెవిరెడ్డి వివరించారు. చంద్రబాబే రాష్ట్రానికి పెద్ద విలన్ అని ఆయన విమర్శించారు. మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిని పోలీ సులు హౌస్ అరెస్టు చేశారు. అరెస్టును ఆయన ప్రతిఘటిస్తుండటంతో పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేశారు. 42 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అయినా నిమ్మనపల్లి, రామసముద్రం మండలంలో బంద్ విజయవంతంగా జరి గింది. ప్రజలుస్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో జరుగుతున్న బంద్లో పాల్గొన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో 165 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను నిర్భందించారు. పీలేరులో ఉదయం 4 గంటల నుంచే ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బస్సులు డిపోలకే పరిమితం అయ్యా యి. దుకాణాలు మూతపడ్డాయి. ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు. కలికిరిలో కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం చేసినందుకు ఆ పోలీస్ స్టేషన్ ఎదుట రెండు గంటల పాటు చింతల దర్నా నిర్వహించారు. చిత్తూరులో జంగాలపల్లి శ్రీనివాసులు బంద్లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటల సమయంలో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. కార్యకర్తలు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేయడంతో విడుదల చేశారు. ఆయన ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. బంద్కు సహకరించాలని కలెక్టరేట్ ఉద్యోగులను కోరేందుకు వెళుతున్న జ్ఞాన జగదీశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా సచివాల యం సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద గాయత్రీదేవి నిరసన దీక్ష చేశారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలో 35 మంది కార్యకర్తలను ఉద్యమంలో పాల్గొనకుండా నిర్బంధించారు. కుప్పంలో చంద్రమౌళిని పోలీసులు గృహ నిర్బధం చేశారు. 140 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బంద్కు సామాన్య ప్రజలు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు సహకరించారు. ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు టీడీపీ నాయకులు, పోలీసులు శథవిధాల ప్రయత్నించారు. బస్సులకు భద్రత కల్పిస్తామని పోలీసులు ఆర్టీసీ అధికారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. శ్రీకాళహాస్తిలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్కు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దుకాణాలు మూతపడ్డాయి. బస్సులు డిపోలకు పరిమితం అయ్యాయి. టూటౌన్ సీఐ చంద్రశేఖర్ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. అకారణంగా దుర్బాషలాడారు. జెండా కనిపిస్తే అరెస్టు చేస్తామని కార్యకర్తలను బెరించారు. 53 మందిని అరెస్టు చేశారు. పలమనేరులో ఉదయమే వైఎస్సార్సీపీ నాయకులందరినీ అరెస్టు చేశారు. రోడ్డుపైకి వస్తే అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు వచ్చాయి. 144 సెక్షన్ వి«ధించి బంద్లో పాల్గొన్న నిర్భందించారు. దీన్ని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎదుట ధర్న నిర్వహించారు. పుంగనూరులో బంద్ ప్రశాతంగా ముగిసింది. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 20 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో బంద్ పాక్షికంగా జరిగింది. బంద్లో పాల్గొనడానికి వస్తున్న ద్వారకనాథ్రెడ్డిని ములకలచెరువు పోలీసులు అరెస్టు చేశారు. నియోజకవర్గ వ్యాప్తం 139 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో బంద్ ప్రశాతంగా ముగిసింది. ఉదయం కార్యకర్తలను అరెస్టు చేశారు. ఉదయం 9 గంటల సమయంలో సమన్వయకర్త ఆదిమూలంను సత్యవేడు క్లాక్ టవర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 60 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. పీలేరులో 38 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. కలికిరి: మండలంలో బంద్ పాటిస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై ఎస్ఐ శ్రీనివాసులు జులుం ప్రదర్శించారు. కలికిరి ఎల్లమ్మ ఆలయం నుంచి ర్యాలీగా వెళుతున్న పార్టీ నాయకులపై అకారణంగా తన ప్రతాపం చూపించారు. తాను అనుకుంటే ఎన్కౌంటర్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కొందరు కార్యకర్తలను బలవంతంగా స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. స్టేషన్ ఎదుట బైటాయించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఎన్కౌంటర్ చేస్తాననడం ఏంటని ప్రశ్నించారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు గంటల పాటు ధర్నా చేశారు. డీఎస్పీలు వీవీ గిరిధర్, చిదానందరెడ్డి, వాల్మీకిపురం సీఐ సిద్ధతేజోమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యేతో మాట్లాడారు. ధర్నా విరమించాలని కోరారు. ఎస్ఐపై చర్యలు తీసుకునేంత వరకు విరమించేది లేదని ఎమ్మెల్యే తేల్చిచెప్పారు. రేపటి నుంచి కలికిరి పోలీస్స్టేషన్ సీఐ పర్యవేక్షణలో ఉంటుందని, ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మండల కన్వీనర్లు రమేష్కుమార్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, నీళ్ల భాస్కర్, ఎంపీటీసీ సభ్యులు వెంకటరెడ్డి, ప్రతా ప్కుమార్రెడ్డి, పార్టీ నాయకులు హరీష్రెడ్డి, హబీబ్బాషా తరుణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎస్ఐ జులుం విజయపురం : ప్రత్యేకహాదా కోసం శాంతియుతంగా బంద్ చేస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై నగరి ఎస్ఐ మునస్వామి విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ఆర్కే రోజా సోదరుడు కుమార్స్వామి, నగరి రూరల్ నాయకులు నాగలాపురం బైపాస్రోడ్డుపై మంగళవారం ఉదయం బైఠాయించి బంద్ పాటిస్తున్నారు. అక్కడికి చేరుకున్న ఎస్ఐ మునస్వామి వారిపై ఒక్కసారిగా జులుం ప్రదర్శించారు. ప్రత్యే క హోదాకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై భౌతిక దాడికి దిగారు. కొట్టుకుంటూ వారిని పోలీస్ వాహనంలోకి ఎక్కిం చారు. కాగా ఎస్ఐ మునస్వామి తీరు తొలినుంచి వివాదాస్పదంగానే ఉందని, సామాన్యులతో ఆయన మరీ దురుసుగా ప్రవర్తిస్తున్నారని పట్టణవాసులు ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలపై ఎస్ఐ దాడికి దిగడాన్ని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న వారిపై ఎస్ఐ భౌతిక దాడికి దిగడాన్ని ఆమె తప్పుపట్టారు. -
ప్రత్యేక హోదా కోసం బంద్ సక్సెస్
-
అరెస్టులు.. అణచివేతలు
ప్రత్యేక హోదా..ఐదు కోట్ల మంది హక్కు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశ, శ్వాస. అయితే అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీలు ప్రజాకాంక్షను నెరవేర్చలేక పోయాయి. ఇచ్చిన మాట తప్పి ప్రజలను వంచించాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి..మంగళవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు ఇందుకు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలు ముందుగానే సెలవు ప్రకటించాయి. ప్రజాసంఘాల నాయకులు సైతం సంఘీభావం ప్రకటించారు. బంద్ను నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డింది. పోలీసులతో బలవంతంగా అరెస్ట్ చేయించింది. వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు బయటకు కదలకుండా గృహనిర్బంధం చేశారు. అయినా జిల్లా వ్యాప్తంగా హోదా కాంక్ష పెల్లుబికింది. ప్రజలు పిడికిళ్లు బిగించి ప్రత్యేక హోదా కావాలంటూ నినదించారు. ర్యాలీలు, రాస్తారోకోలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ను విజయవంతం చేశారు. కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన బంద్ను నీరుగార్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. హోదా అంటూ రోడ్లపైకి వచ్చిన వారిని ఎక్కడికక్కడే అరెస్టు చేయాలని ఆదేశించింది. పోలీసు 30 యాక్ట్ పేరుతో ధర్నాలు, రాస్తారోలకు అనుమతులు లేవని పోలీసులు బలవంతంగా అరెస్టులు చేశారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 511 మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల్లో మాత్రం హోదాగ్ని రగిలింది. జిల్లావ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. పోలీసు 30 యాక్ట్ పేరుతో అరెస్టులు.... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన రాష్ట్రబంద్ను సీఎం చంద్రబాబునాయుడు అణచి వేయాలని పకడ్బందీ వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. అందుకోసం పోలీసు 30 యాక్ట్ను వినియోగించుకున్నారు. ఈ యాక్ట్ ప్రకారం ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేసేవారు పోలీసుల అనుమతి తీసుకోవాలి. అయితే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బంద్కు అనుమతి ఇవ్వమని అడిగినా పోలీసులు పట్టించుకోలేదు. పైగా బంద్లో పాల్గొంటే కేసులు పెడతామని హెచ్చరించారు. కొందరు నాయకులకు రాత్రి నుంచే పోలీసుల వేధింపులు మొదలయ్యాయి. మామూలుగా రాష్ట్రబంద్ల్లో 10–11 గంటల మధ్య ప్రజలకు మరీ ఇబ్బందులు తలెత్తుతాయన్న నేపథ్యంలో సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేస్తారు. అయితే ఇప్పుడు మాత్రం ఉదయం ఏడు గంటల నుంచే అరెస్టులు చేయడం మొదలు పెట్టారు. జిల్లావ్యాప్తంగా 511 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఉదయం 7.10 గంటలకే కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా చేస్తున్న కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, కర్నూలు సమన్వయకర్త హఫీజ్ఖాన్లను అరెస్టు చేశారు. ఇక్కడి నుంచి మొదలైన అరెస్టులు ఆగకుండా కొనసాగాయి. బండిఆత్మకూరులో నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డిని, కర్నూలులో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త గౌరు వెంకటరెడ్డిలను గృహ నిర్బంధం చేశారు. పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి బేతంచెర్లలో ఇంటి నుంచి అడుగు బయట పెట్టగానే అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఆదోనిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్రెడ్డి, ఆలూరులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలను అరెస్టు చేశారు. నంద్యాలలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డితోపాటు పలువురు మహిళలను అరెస్టు చేసే సందర్భంలో డీఎస్పీ గోపాలకృష్ణ అనుచితంగా ప్రవర్తించారు. మహిళలను మగపోలీసులతో ఈడ్చి వేయించడంతో తోపులాట జరిగి కొందరికి రక్తగాయాలయ్యాయి. హోదా కోసం చేస్తున్న ఉద్యమాన్ని సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం దగ్గరుండి పోలీసులతో అణచివేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా కోసం టీడీపీ కూడా «ధర్మ పోరాటాల పేరుతో ప్రభుత్వ ధనంతో సభలు, సమావేశాలను నిర్వహిస్తోంది. ఇదే సమయంలో ఇతర పార్టీల బంద్లను నిర్వీర్యం చేయడంలో పరమార్థం ఏమిటో ప్రభుత్వమే చెప్పాలని వైస్సార్సీపీ నేతలు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య ప్రశ్నించారు. రగిలిన హోదాగ్ని: సీఎం చంద్రబాబునాయుడు ఎన్ని కుట్రలు చేసి హోదా ఉద్యమాన్ని అణచాలని కుట్ర చేసినా.. ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా బంద్ను పాటించారు. జిల్లాలోని 12 డిపోల్లో 850 బస్సులు ఉండగా.. 350 డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా సెలవును ప్రకటించుకొని బంద్కు సంఘీభావం తెలిపాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థలు తెరచుకోలేదు. కొన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఎక్కడికక్కడే వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసినా ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టిన బంద్ మాత్రం సంపూర్ణమైంది. హోదాకు చంద్రబాబే అడ్డు ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా సీఎం చంద్రబాబునాయుడు అడ్డుకుంటున్నారు. హోదా కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచి వేయాలని చూస్తున్నారు. హోదా రావడం చంద్రబాబు ఇష్టం లేనట్టు ఉంది. బంద్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తల అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనం. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉండి.. హోదాను పక్కన పెట్టి ఇప్పుడు ఆకస్మాత్తుగా ధర్మ పోరాటాల పేరుతో ప్రజలను దగా చేస్తున్నారు. ఆయన చేస్తే పోరాటం..ఇతరులు చేస్తే పోరాటం కాదా? అరెస్టులతో హోదా ఉద్యమాలను అపలేరు. – బీవై రామయ్య, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు టీడీపీపై నమ్మకం సన్నగిల్లింది ప్రత్యేక హోదాతోనే ఏపీ భవిష్యత్ ముడిపడి ఉంది. అయితే హోదా రాకుండా టీడీపీ, బీజేపీ కలిసికట్టుగా అడ్డుకుంటున్నాయి. హోదా ఏమైనా సంజీవనినా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేసి ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం రగలడంతో ముఖ్యమంత్రి యూ టర్న్ తీసుకున్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. – శిల్పా చక్రపాణిరెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు -
ప్రత్యేక హోదాకు పలు పార్టీల మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ఇచ్చిన హామీకి కట్టుబడి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని పలు పార్టీలు కోరాయి. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలుపై మంగళవారం రాజ్యసభలో నాలుగు గంటల పాటు జరిగిన స్వల్పకాలిక చర్చలో దాదాపు 25 మంది సభ్యులు మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి వి.విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి వై.ఎస్.చౌదరి, సీఎం రమేష్, కాంగ్రెస్ నుంచి మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్, గులాం నబీ ఆజాద్, కేవీపీ రాంచంద్రరావు, జైరాం రమేశ్, ఆనంద్శర్మ, సమాజ్వాదీ పార్టీ నుంచి రాంగోపాల్యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి డెరెక్ ఒబ్రెయిన్, ఏఐఏడీఎంకే నుంచి నవనీత్ కృష్ణన్, బీజేడీ నుంచి ప్రసన్నాచార్య, జేడీయూ నుంచి రామచంద్ర ప్రసాద్ సింగ్, టీఆర్ఎస్ నుంచి కె.కేశవరావు, సీపీఎం నుంచి టి.కె.రంగరాజన్ తదితరులు మాట్లాడారు. ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రాల విభజనతో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడంతో పొరుగు రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయని వివరించారు. టీఎంసీ నుంచి డెరెక్ ఒబ్రెయిన్ మాట్లాడుతూ ఎన్డీయే నుంచి పార్టీలు ఎందుకు దూరమవుతున్నాయో గమనించాలని, సమాఖ్య స్ఫూర్తిని కోరుకునే పార్టీలన్నీ బీజేపీని వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీతో పాటు ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేడీ సభ్యుడు ప్రసన్నాచార్య పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్నట్టు శిరోమణి అకాళీదళ్ సభ్యుడు నరేష్ గుజ్రాల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదనను పంచుకుంటున్నట్టు సీపీఐ సభ్యుడు డి.రాజా పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆప్ సభ్యుడు సంజయ్ సింగ్ పేర్కొన్నారు. ఏపీకి రైల్వే జోన్ ఇస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే తమ పరిధిలోని రైల్వేను ఆ జోన్లో కలపరాదని ఒడిశాకు చెందిన బీజేడీ సభ్యుడు అనుభవ్ మొహంతీ పేర్కొన్నారు. -
హోదా ఉద్యమంలో నేలకొరిగిన దుర్గారావు
బుట్టాయగూడెం/జంగారెడ్డిగూడెం రూరల్: ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసానికి నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర బంద్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్త కాకి దుర్గారావు(55) అనే గిరిజనుడు గుండెపోటుతో మృతిచెందాడు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో దుర్గారావు బంద్లో పాల్గొన్నాడు. కార్యకర్తలు, నాయకులతో కలసి సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ తీరును నిరసిస్తూ నినాదాలు చేస్తుండగా పోలవరం సీఐ ఎం.రమేశ్బాబు ఆధ్వర్యంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజును అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో దుర్గారావు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. బాలరాజును అదుపులోకి తీసుకొని పోలీసులు స్టేషన్కు తరలించారు. ప్రధాన సెంటర్ నుంచి పోలీస్స్టేషన్కు అర కిలోమీటర్ పైనే ఉంది. నినాదాలు చేస్తూ కార్యకర్తలందరూ పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. ఆ సమయంలో కొంతమందిని స్టేషన్ లోపలే ఉంచి గేటు మూసివేశారు. దీంతో దుర్గారావు గుండెపోటుతో ఒక్కసారిగా స్టేషన్ ప్రాంగణంలోనే పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని బుట్టాయగూడెం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం తరలించారు. వైద్యం పొందుతూ దుర్గారావు మరణిం చాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దుర్గారావు మృతికి జగన్ సంతాపం సాక్షి, అమరావతి: రాష్ట్ర బంద్లో పాల్గొన్న వైఎస్సార్ సీపీ కార్యకర్త దుర్గారావు పోలీసుల అదుపులో ఉండగా మృతి చెందడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోదా కావాలని ఉద్యమిస్తూ దుర్గారావు మృతి చెందడం విషాదకరమని ఆయన ట్వీట్టర్ ట్వీట్ చేశారు. దుర్గారావు కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
హోదా కోసం ఉద్యమిస్తే అరెస్టులా?
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా కోరుతూ జరిగే ఆందోళనను అణగదొక్కడం అంటే పరోక్షంగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. కేంద్రం చేసిన విద్రోహానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్పై రాష్ట్ర ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బంద్ చేస్తున్న ఉద్యమకారుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ మంగళవారం వారు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. నాలుగు సంవత్సరాల పాటు బీజేపీతో అంటకాగిన టీడీపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతోందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కావాలంటూ దీక్షలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం.. బంద్ను విఫలం చేయడానికి నిర్బంధాన్ని ప్రయోగించడం ఆక్షేపణీయమని తప్పుబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని అణచివేసే చర్యలు విడనాడాలని వారు హితవు పలికారు. కాగా, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం విద్యార్థి, యువజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగే ‘మానవహారం’ను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కోటి మందితో మానవహారం నిర్వహించాలని జేఏసీ నిర్ణయించిందన్నారు. -
ఉక్రోషం.. ఉక్కుపాదం
ప్రత్యేక హోదా కావాలంటూ ఉద్యమించిన వారిపై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం మోపింది. హోదా అంటే జైలుకే అంటూ మరోసారి గుడ్లురిమింది. పోలీసుల సాయంతో బంద్ను నిర్వీర్యం చేయడానికి విఫలయత్నం చేసింది. సర్కారు పెద్దల గట్టి ఆదేశాలతో పోలీసులు సైతం రెచ్చిపోయి వ్యవహరిస్తూ బంద్లో పాల్గొన్న వారిని ఎక్కడికక్కడ ఈడ్చి పడేశారు. మహిళలన్న కనికరం కూడా లేకుండా లాగిపడేశారు. పెద్దవాళ్లని కూడా చూడకుండా దురుసుగా తోసివేశారు. సర్కారు వైఖరి చూసిన జనం మనమేమైనా ఎమర్జెన్సీలో ఉన్నామా.. అంటూ నివ్వెరపోయారు. చంద్రబాబు హోదా పట్ల యూటర్న్ తీసుకోవడం అంతా డ్రామా అని, ఆయనకింకా జ్ఞానోదయం కాలేదని బాహాటంగానే వ్యాఖ్యానించారు. సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: ఆంధ్రప్రదేశ్కు సంజీవని వంటి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్ను విచ్ఛిన్నం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను పురిగొల్పింది. వైఎస్సార్సీపీకి ఎక్కడ మైలేజ్ వస్తుందోనని ఆక్రోసిస్తూ దుర్మార్గంగా వ్యవహరించింది. సర్కారు ఆదేశాలతో బంద్పై ఖాకీల దాష్టీకం హద్దులు దాటింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం, కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. బంద్ను విఫలం చేసేందుకు చంద్రబాబు సర్కారు అన్ని ప్రయత్నాలు చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30, ఐపీసీ సెక్షన్ 144లను అమలులోకి తెచ్చిన పోలీసులు అడుగడుగునా బంద్ను విఫలం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయినా వెనకడుగు వేయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు మంగళవారం తెల్లవారుజాము 5 గంటల నుంచే రాష్ట్ర బంద్లో పాల్గొన్నాయి. దీంతో ప్రతీ జిల్లాలోను వందలాది మంది పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టుల పర్వాన్ని కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మందికిపైగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు అనేక పోలీస్స్టేషన్లకు తిప్పి సాయంత్రం వరకు నిర్బంధించారు. రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లు వైఎస్సార్సీపీ శ్రేణులతో నిండిపోయాయి. బంద్లో పాల్గొన్న మహిళలను మగ పోలీసులే దురుసుగా ఈడ్చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో డీఎస్పీ గోపాలకృష్ణ మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించారు. అక్రమ అరెస్టులకు నిరసనగా కర్నూలు పోలీస్ స్టేషన్ వద్దే వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా నగరి ఎస్.ఐ మునిస్వామి ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను కొట్టుకుంటూ తీసుకెళ్లి పోలీస్ జీపు ఎక్కించారు. విజయవాడ బస్టాండ్, బీసెంట్రోడ్డు, లెనిన్ సెంటర్లలో శాంతియుతంగా ధర్నా, ర్యాలీలు నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విజయవాడతోపాటు పలుప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నాం నుంచి కొన్ని ఆర్టీసీ బస్సులను పోలీసు పహారాతో బలవంతంగా నడిపి ఏపీ బంద్ విఫలమైందని చూపించేందుకు ప్రభుత్వం తాపత్రయ పడింది. వాగ్వాదాలు.. తోపులాటలు.. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తుంటే పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడంపై పలుచోట్ల వైఎస్సార్సీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, పశ్చిమ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఆళ్ల నానిని పోలీసులు అరెస్ట్ చేయటం అన్యాయమంటూ పార్టీ నేతలు, శ్రేణులు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. పార్టీ కార్యకర్తలను లాగిపడేసి వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి గృహ నిర్భంధం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నా శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డితోపాటు పలువురు మహిళలను అరెస్టు చేసే సందర్భంలో డీఎస్పీ గోపాల కృష్ణ అనుచితంగా ప్రవర్తించాడు. మహిళలను మగ పోలీసులతో ఈడ్చి వేయిచండంతో తొపులాటలో వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలు రాజ్యలక్ష్మి, హుసేనమ్మలకు రక్తగాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద తెల్లవారుజామునే భూమన కరుణాకర్రెడ్డి ప్రత్యేక హోదా కోసం ధర్నా చేస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్టు చేస్తుండగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించడంతో బలవంతంగా అందరినీ తోసివేశారు. బంద్లో పాల్గొనేందుకు తిరుపతి నుంచి నగరికి వస్తున్న ఎమ్మెల్యే రోజాను పుత్తూరు పున్నమి సర్కిల్లో పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా పుత్తూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. పీలేరు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారు. పీలేరు నియోజకవర్గం కలికిరిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎన్కౌంటర్ చేస్తానని ఎస్ఐ శ్రీనివాసులు బెదిరించారు. వైఎస్సార్సీపీ కార్యకర్త తరుణ్ను చొక్కా పట్టుకొని లాక్కుంటూ వెళ్లాడు. నగరిలో ఎస్సై మునుస్వామి కార్యకర్తలపై జులుం ప్రదర్శించాడు. చిన్నాపెద్దా తేడా లేకుండా దుర్భాషలాడారు. 80 సంవత్సరాల తాతపై కూడా చేయి చేసుకున్నాడు. వైఎస్సార్ జిల్లాలో ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను బలవంతంగా అరెస్ట్ చేశారు. అనంతపురంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ‘అనంత’ గొంతుపై చేయి వేసి బలవంతంగా లాగేశారు. విశ్వేశ్వరరెడ్డిని కార్యకర్తల మధ్య నుంచి బలవంతంగా లాగేసి స్టేషన్కు తరలించారు. అరెస్టులు తగవు : జనసేన, హోదా సాధన సమితి వైఎస్సార్సీపీ నేతల అరెస్టులను జనసేన పార్టీ ఖండించింది. వైఎస్సార్సీపీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ బంద్ను ప్రభుత్వం అణచివేయాలని చూసిందని, ప్రజాస్వామ్యంలో నిరసన అనేది రాజకీయ పార్టీల హక్కు అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. రోడ్డుపై దీక్షలు చేస్తున్న చంద్రబాబు.. ఎవరైనా హోదా కోసం ఉద్యమిస్తే అక్రమంగా అరెస్టులు చేయించి.. రోడ్లు వెంట తిప్పడం దారుణమని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. హోదా ఉద్యమంలో దుర్గారావు మృతి బాధాకరమన్నారు. -
కుట్ర భగ్నం.. బంద్ విజయం
ప్రజా సంకల్పం ముందు సర్కారు ఎత్తులు చిన్నబోయాయి. బంద్ను నిర్వీర్యం చేయాలనుకున్న ప్రభుత్వ పెద్దల పాచిక పారలేదు. పోలీసులను ఎంతగా ఉసిగొల్పినప్పటికీ ప్రజలు రోడ్లపైకొచ్చి హోదా కావాల్సిందేనంటూ పిడికిళ్లు బిగించారు. ఎక్కడికక్కడ దుకాణాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేయడంతో పాలకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. బంద్ గ్రాండ్ సక్సెస్ అయింది. సాక్షి, అమరావతి/నెట్వర్క్: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నిన కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు. మంగళవారం రాష్ట్ర బంద్ను విజయవంతం చేశారు. హోదా ఆకాంక్ష ఢిల్లీ పెద్దలకు వినిపించేలా గట్టిగా నినదించారు. హోదా సాధనలో సీఎం చంద్రబాబు చేసిన మోసం, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఇచ్చిన బంద్ పిలుపునకు ప్రజలు పెద్దఎత్తున స్పందించారు. స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని హోదాపై ప్రభుత్వాల దుర్నీతిని ఎండగట్టారు. బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. షాపులు మూతబడ్డాయి. స్కూళ్లు తెరుచుకోలేదు. పెట్రోల్ బంక్లను కూడా మూసివేశారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు శాంతియుతంగా బంద్ నిర్వహిస్తుంటే.. హోదా కోసం పోరాడుతున్నట్లు నాటకాలు ఆడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. బంద్ను విఫలం చేయాలని విశ్వప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ పోలీసులను భారీ ఎత్తున మోహరించారు. వేలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నేతలను గృహనిర్భందంలో ఉంచారు. వందలాది మందిని అరెస్టులు చేశారు. పలు ప్రాంతాల్లో పోలీసులు లాఠీచార్జీకి దిగారు. అయినా హోదా సాధనే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రజలు ఢిల్లీకి సెగ తగిలేలా.. ప్రతిపక్షానికి సహకరించవద్దని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా బంద్ను సంపూర్ణం చేశారు. బంద్లో వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెంలో వైఎస్సార్సీపీ కార్యకర్త కాకి దుర్గారావు గుండెపోటుతో మృతి చెందాడు. అన్ని జిల్లాల్లో పోలీస్ యాక్ట్తో పాటు 144 సెక్షన్ విధించి ఉద్యమంపై ఉక్కుపాదం మోపాలని ప్రయత్నించారు. రోడ్లు దిగ్బంధం..డిపోల్లోనే బస్సులు ప్రభుత్వ అణచివేత చర్యలతో ప్రజలు రగిలిపోయారు. రోడ్ల మీదకు వచ్చి రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. తెల్లవారుజామునే వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు బస్టాండ్లకు చేరుకున్నారు. బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో బస్సులన్నీ బస్టాండ్లకే పరిమితమయ్యాయి. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇతర నేతలో కలసి విశాఖపట్నంలోని మద్దిలపాలెం బస్కాంప్లెక్స్ ఎదురుగా హైవేపై బైఠాయించి రాస్తారోకో చేశారు. మరో సీనియర్ నేత, శాసనమండలి ఫ్లోర్లీడర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ నేతలతో కలసి జగదాంబ సెంటర్ నుంచి డాబాగార్డెన్స్ వరకు పాదయాత్ర చేశారు. నెల్లూరులో భారీఎత్తున బైక్ భారీ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమలోని బస్టాండ్ల వద్ద వైఎస్సార్సీపీ నేతలు ధర్నా చేసి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి, పలాస ఆర్టీసీ డిపోల ముందు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం తదితర వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఏలూరులోని ఆర్టీసీ బస్ డిపో వద్ద ఉదయం నుంచే నాయకులు బైఠాయించి బస్సులను రోడ్డుపైకి రాకుండా అడ్డుకున్నారు. మూతపడ్డ వ్యాపార సంస్థలు హోదా కోసం జరిగిన బంద్కు వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు, విద్యాసంస్థల అధిపతులు మద్దతు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. దీంతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. చిన్న చిన్న షాపులు కూడా తెరచుకోలేదు. దుకాణాలు మూతబడ్డాయి. తోపుడు బళ్ల వ్యాపారులు కూడా బంద్లో పాల్గొని తమ వ్యాపారాలకు బ్రేక్ ఇచ్చారు. ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. అధికారుల ఆదేశాలతో పలు జిల్లాల్లో ప్రభుత్వ బడులు తెరిచినా విద్యార్థులు లేక ఖాళీగా ఉండిపోయాయి. చాలా చోట్ల బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. సినిమా థియేటర్లలో తొలి రెండు ఆటలను నిలిపివేశారు. రాజధానిలో స్తంభించిన జనజీవనం రాజధాని ప్రాతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. విజయవాడలో జనజీవనం స్తంభించిపోయింది. వాణిజ్య రాజధానిలో వర్తక, వాప్యార కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడలో 150కు పైగా హోల్సేల్ అసోసియేషన్లకు చెందిన వెయ్యికుపైగా దుకాణాలు మూతబడ్డాయి. ఆటోనగర్లో పారిశ్రామిక యూనిట్లు పనిచేయలేదు. వైఎస్సార్సీపీ నేతలు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, యలమంచిలి రవి తదితర పార్టీ నేతలు ఉదయం 5గంటలకే నెహ్రూ బస్స్టేషన్కు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు. వారిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత బస్సులు కొన్నింటిని తిప్పారు. అయినా జనంలేక అవి బోసిపోయాయి. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు సంఘీభావం తెలిపాయి. మరోపక్క గుంటూరులో బంద్ సంపూర్ణమైంది. పార్టీ నేతలు తెల్లవారుజామునే బస్టాండ్లకు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు. పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులను అరెస్టు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి ఉద్రక్త పరిస్థితులు తలెత్తకుండా బంద్ ప్రశాంతంగా ముగిసింది. కుప్పంలో గ్రాండ్ సక్సెస్ ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో హోదా ఉద్యమం గ్రాండ్ సక్సెస్ అయింది. బంద్ను విఫలం చేసేందుకు పోలీసులు శథవిధాల ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఆ నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త చంద్రమౌళిని హౌస్ అరెస్ట్ చేశారు. దుకాణదారులు, చిన్న చిన్న తోపుడుబండ్ల వ్యాపారులు, ఆర్టీసీ కార్మికులు బంద్లో పాల్గొన్నారు. దీంతో కుప్పం పట్టణంలోని వీధులన్నీ బోసిపోయాయి. సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులు రోడ్డుపైకి రాలేదు. -
బాబూ.. భావితరాలు నిన్ను క్షమించవు
బంద్ కూడా ఉద్యమంలో భాగమే. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన ఉద్యమమైనా, మరేదైనా.. ఉద్యమమనేది ఒక మూమెంటం.. అనుకున్న లక్ష్యం సాధించే వరకు ఉద్యమం అనేది సజీవంగా ఉండాలి. ఆ ఇష్యూ చనిపోకూడదు. నాలుగేళ్లుగా చంద్రబాబు అనే వ్యక్తి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగారుస్తున్నా కూడా.. ఆ ఉద్యమాన్ని జగన్ అనే వ్యక్తి లైవ్లీగా పెట్టాడు కాబట్టే ఈవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు యూ టర్న్ తీసుకోకతప్పలేదు. చంద్రబాబు నిర్వహిస్తున్నవి ధర్మపోరాట సభలో.. అధర్మపోరాట సభలో.. ఆయన తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. అప్పుడు సమాధానం వస్తుంది. ధర్మమా? అధర్మమా? తాను చేస్తున్నదని.. ప్రజాసంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పనిగట్టుకుని నీరుగార్చేందుకు ప్రయత్నించిన చంద్రబాబును భావి తరాలు క్షమించవని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. హోదా కోసం కలిసి నడవాల్సిన పెద్ద మనిషి అతి కిరాతకంగా, దారుణంగా ఏపీ బంద్ను విఫలం చేసేందుకు ప్రయత్నించినా.. ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేశారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక హోదా ఆకాంక్ష ఎంత బలంగా ఉందో మరోసారి రుజువైందన్నారు. బంద్ సందర్భంగా చనిపోయిన వైఎస్సార్సీపీ కార్యకర్త దుర్గారావు మృతికి చంద్రబాబే బాధ్యుడని ఆరోపించారు. లాఠీలు, తూటాలు, అరెస్ట్లు తమ ఉద్యమాన్ని ఆపలేవన్నారు. హోదా వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట వద్ద బస చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. బంద్ను విఫలం చేసేందుకు చంద్రబాబు చేయని కుట్రలు లేవని ధ్వజమెత్తారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సందేహాలు నివృత్తి చేశారు. ఈ సమావేశంలో జగన్ ఇంకా ఏమన్నారంటే... బంద్ను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు.. ‘‘ప్రత్యేక హోదా కావాలంటూ రాష్ట్ర ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. కానీ చంద్రబాబు మాత్రం అతి కిరాతకంగా, దారుణంగా హోదాకు వ్యతిరేకంగా దగ్గరుండి బంద్ను విఫలం చేయడానికి చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ఇన్ని కుట్రలు, దారుణమైన అణిచివేత మధ్య కూడా బంద్ విజయవంతమైంది. బంద్లో పాల్గొని ప్రత్యేక హోదా మా హక్కు అని చాటిన ప్రతి ఒక్కరికీ, నైతికంగా మద్దతు తెలిపినవారికి, జర్నలిస్టు సంఘాలకు, మేధావులకు, కార్మిక సంఘాలకు, దుకాణాల యజమానులకు, స్కూళ్ల విద్యార్థులు, యాజమాన్యాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇన్ని అరెస్టులా? శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా 300 మందికి పైగా అరెస్టు చేశారు. తమ్మినేని సీతారాం, కృష్ణదాస్, అప్పలరాజు, తిలక్ తదితర నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. సెక్షన్ 144, 30 పెట్టి మరీ ఉక్కుపాదంతో అణిచివేసే చర్యలకు పాల్పడ్డారు. విజయనగరం జిల్లాలో 300పైగా అరెస్టులు జరిగినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. విశాఖలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో సహా 600 మందికి పైగా కార్యకర్తలను అరెస్టు చేశారు. అక్కడ షాపులు, విద్యాసంస్థలు మూసేసి బంద్కు మద్దతు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య, విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. కన్నబాబు, జగ్గిరెడ్డి, విశ్వరూప్, ద్వారంపూడి, వీర్రాజుతో సహా అనేక మందిని అరెస్టు చేశారు. నాయకులను అదుపులోకి తీసుకుని మరీ బస్సులు నడిపించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. 538 మందిని అరెస్టు చేశారు. 38కి పైగా కేసులు పెట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల నాని తదితర నేతలను అరెస్టు చేశారు. తణుకులో సీనియర్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బుట్టాయిగూడెంలో ధర్నాలో పాల్గొన్న సోదరుడు కాకి దుర్గారావు గుండెపోటుతో మరణించాడు. జిల్లాలో 300 మందికి పైగా అరెస్టులు జరిగాయి. ప్రకాశం జిల్లాలో 144 సెక్షన్ కింద నిర్భందం పెట్టారు. బంద్లో పాల్గొన్న ముఖ్యనేతలు, కార్యకర్తలను పోలీస్స్టేషన్లకు తరలించారు. బాలినేని వాసు మొదలుకొని మాజీ మంత్రి మహీధర్రెడ్డితో పాటు 600 మందిని అరెస్టు చేశారు. అయినా కూడా దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్, అనిల్కుమార్ యాదవ్, కాకాణి గోవర్థన్ వరకూ అందరూ అరెస్టే. ఈ జిల్లాలో 800 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడా స్వచ్ఛందంగా బంద్ జరిగింది. కర్నూలు జిల్లాలో సీనియర్ నాయకులందరినీ అరెస్టు చేశారు. నంద్యాలలో డీఎస్పీ గోపాలకృష్ణ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. మహిళా పోలీసులు లేకుండా వారిని లాగేయడంతో గాయాలయ్యాయి. ఈ జిల్లాలో 600 మందికి పైగా అరెస్టు చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలు, బ్యాంకులన్నీ మూతపడ్డాయి. వైఎస్సార్ జిల్లాలో ఎక్కడపడితే అక్కడ అరెస్టులే. మొత్తం 1,500 మందిని అరెస్టు చేశారు. ఆర్టీసీ బస్టాండుల్లో బస్సులను అడ్డుకున్నందుకు మేయర్ సురేశ్ను, అమర్ను అరెస్టు చేశారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లును అరెస్టు చేశారు. అనంతపురంలో సీనియర్ నేత అనంత వెంకటరామిరెడ్డిని లెక్కజేయలేదు. గృహ నిర్భందం, తోపులాట, వెయ్యి మందికి పైగా అరెస్టులు. పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించినా బంద్ విజయవంతమైంది. చిత్తూరులో భూమన కరుణాకర్రెడ్డి, రామచంద్రారెడ్డి సహా 1,200 మందిని అరెస్టు చేశారు. ప్రత్యేక హోదా కావాలన్న నినాదం చివరకు కుప్పంలో విన్పిస్తున్నా.. చంద్రబాబుకు విన్పించడం లేదు. కృష్ణా జిల్లాలో సీనియర్ నేతలు పార్థసారథి, మల్లాది విష్ణు, యలమంచిలి రవి, భవకుమార్, రాధాతో పాటు అనేక మందిని ఉదయాన్నే అరెస్టు చేశారు. బస్టాండు దగ్గర పోలీసులు వాగ్వాదానికి దిగి మరీ అరెస్టులు చేశారు. ఈ జిల్లాలో 600 మందిని అరెస్టు చేశారు. గుంటూరులో 1,100 మందిని అరెస్టు చేసినా బంద్ విజయవంతమైంది. బంద్ను నీరుగార్చేందుకు ఇన్ని అరెస్టులా? చివరకు బంద్ను విఫలం చేసేందుకు ఆర్టీసీ బస్సులను తిప్పేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించాడు. హోదా కోసం నినదిస్తే చనిపోయేలా చేస్తారా? పశ్చిమగోదావరి జిల్లాలో దుర్గాప్రసాద్ గుండెపోటుతో చనిపోయాడు. దీనికి కారణంగా చంద్రబాబు కాదా? ప్రత్యేక హోదాకోసం ఒక స్వరం గట్టిగా విన్పిస్తే, దాన్ని పోలీసు జులుంతో గుండెపోటు వచ్చేలా చేసి, చనిపోయేట్టు చేస్తావా? ఇంతకన్నా దారుణం ఉంటుందా? కాలర్పట్టుకుని పోలీసులు ఈడ్చుకుంటూ పోయారు. లాఠీచార్జి చేశారు. ఇదా పరిస్థితి? మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులతో నిర్బంధిస్తావా? విద్యార్థులను ఈడ్చుకుంటూ పోయారు. ఐదారు సార్లు ఎంపీగా గెలిచిన అనంత వెంకట్రామిరెడ్డి పట్ల మీరు వ్యవహరించిన తీరు ఇంత దారుణమా?(పోలీసుల దౌర్జన్యానికి సంబంధించిన ఫొటోలు చూపిస్తూ..) ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని వాసు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించారు? చంద్రబాబుకు బుద్ధి వచ్చే రోజు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆయన చెప్పే అబద్ధాలు, చేసే మోసాలు తారాస్థాయికి చేరాయి. వంద తప్పుల తర్వాత శిశుపాలుడికి కూడా శిక్ష పడ్డట్లు.. చంద్రబాబు కూడా వంద తప్పుల దగ్గరకొచ్చాడు. దేవుడు మొట్టికాయలేస్తాడు. ప్రజలు శిక్షిస్తారు. ఇంత దారుణంగా ఆయన వ్యవహరించినందుకు, ప్రత్యేక హోదాను దగ్గరుండి కాలరాసినందుకు శిక్ష తప్పదు. చెయ్యాల్సిన సమయంలో పనులు చేయకపోవడమే హోదా రాకపోవడానికి కారణం. ఈ నేపథ్యంలోనే హోదా కోసం ప్రజలు ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. హోదా వచ్చేదాకా కొనసాగిస్తాం. చంద్రబాబుకు సిగ్గు, శరం ఏమాత్రం ఉన్నా ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం ముందుకు రావాలి. భావి తరాలు చరిత్ర హీనుడిగా చూస్తారన్న విషయం మర్చిపోవద్దు. రాజకీయ స్వార్థం తప్ప మరో కారణం ఉందా? బంద్లో పాల్గొనడానికి కొందరు ఎందుకు ఆసక్తి చూపలేదో ప్రజలందరికీ తెలుసు. రాజకీయ స్వార్థం తప్ప మరొకటి కన్పించడం లేదు. హోదా కోసం ఎవరు పిలుపునిచ్చినా మద్దతిచ్చాం. ఎవరు వచ్చినా అండగా నిలబడ్డాం. ఎవరికైనా క్రెడిట్ వస్తుందని ఆలోచించలేదు. రాజకీయ స్వార్థంతో వెనకడుగు వేసే ప్రతి ఒక్కరికీ సలహా ఇస్తున్నాను. ప్రత్యేక హోదా అనేది వ్యక్తిగత రాజకీయాలు చూసుకునే అంశం కాదు. పార్టీలకు అతీతంగా ఒక్కటై సాధించాల్సిన అంశమిది. రాజకీయ స్వార్థంతో పాల్గొనని పార్టీల విజ్ఞతకే దాన్ని విడిచిపెడుతున్నా. వాళ్లు చేసింది కరెక్టేనా? కాదా? అనేది వాళ్లే నిర్ణయించుకోవాలి. మొదట్నుంచీ పోరాడుతున్నది మేమే... బీజేపీకి గానీ కేంద్ర ప్రభుత్వానికి గానీ వ్యతిరేకంగా మొదటి నుంచి మాట్లాడుతున్నదెవరు? సెప్టెంబర్ 8, 2016న కేంద్ర ప్రభుత్వం లేని ప్యాకేజీ ఉన్నట్టుగా, ప్రత్యేక హోదా బదులుగా చంద్రబాబు ఆమోదంతో.. టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రుల సమక్షంలో అరుణ్జైట్లీ అర్ధరాత్రి ప్రకటన చేశారు. అదే అర్ధరాత్రి చంద్రబాబు ప్రెస్కాన్ఫరెన్స్ పెట్టి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మర్నాడు నేను ప్రెస్మీట్ పెట్టాను. కేంద్ర ప్రభుత్వం కాలిఫ్లవర్ పెడుతోందయ్యా చంద్రబాబూ.. దీన్ని ఒప్పుకోవడం వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తున్నారా? కీడు చేస్తున్నారా? అని కేంద్రాన్ని తిడుతూ మాట్లాడింది నేను. మర్నాడు.. సెప్టెంబర్ 9న.. ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యావాదాలు తెలుపుతూ అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం పెట్టాడు. దాన్ని వ్యతిరేకించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబుకు జ్ఞానం వచ్చేట్టుగా ప్రత్యేక హోదా అంటే ఏమిటని ట్యూషన్ చెప్పి.. కేంద్ర ప్రభుత్వం చేత చెవిలో పువ్వు పెట్టించుకుని రాష్ట్ర ప్రజలను నాశనం చేస్తున్నావని కేంద్రాన్ని, చంద్రబాబును తిట్టింది నేను. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు.. ఎన్నికలకు ఆరు నెలల ముందు విడాకులు తీసుకుని ప్రత్యేక హోదా కోసం ఆయనే పోరాటం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఎన్నికల ముందు హోదా గురించి మోదీ మాట్లాడిన మాటలివి అని చెప్పి టేపులు, వీడియో రికార్డింగ్స్ చూపిస్తున్నాడు. నా యువభేరీ సభల రికార్డులు చూసుకోండి. ప్రత్యేక హోదా కోసం నేను చేసిన ధర్నాలు, దీక్షలు చూడండి. ఆ యువభేరి సభల్లో.. మోదీ ఏం మాట్లాడారు. వెంకయ్యనాయుడు ఏం మాట్లాడారు... చంద్రబాబు ఊసరవెల్లిలా ఎలా ప్లేటు మార్చారో రికార్డులతో సహా ఉంది. బీజేపీ చేస్తున్న అన్యాయంపై తుదివరకు పోరాటం చేసి, ఎన్నికలకు 15 నెలల ముందే బడ్జెట్ చివరి సమావేశాలు, చివరి రోజున బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు. చివరి బడ్జెట్ సమావేశాల్లో హోదా అంశాన్ని గట్టిగా పట్టుబడుతూ బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది జగన్ అనే వ్యక్తి. ఇన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున చిత్తశుద్ధితో, కేంద్రంలో ఎవరున్నా లెక్కజేయకుండా జగన్ పోరాటం చేస్తుంటే, జగన్ మీద బండలేస్తారు. కాంగ్రెస్ను, బీజేపీని మేనేజ్ చేయగల గొప్ప వ్యక్తి చంద్రబాబు.. మరోవైపు ఇదే చంద్రబాబు బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేస్తారు. హోదాకు దగ్గరుండి తూట్లు పొడిచి పూటకో మాట, గంటకో వేషం వేస్తారు. ఎన్నికలకు ముందు హోదా సంజీవని అంటాడు. పదేళ్లు కాదు. 15 ఏళ్లు తెస్తానంటాడు. ఎన్నికలయ్యాక ఈశాన్య రాష్ట్రాలు హోదా వల్ల ఏం బాగుపడ్డాయి.. హోదా ఏమైనా సంజీవినా అని మనకు ఎదురు ప్రశ్న వేస్తాడు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అని ప్రశ్నిస్తాడు. లేని ప్యాకేజీ ఉన్నట్టుగా తనంతట తానే ఆమోదం తెలిపి, ప్యాకేజీ తెచ్చి దానికి ఏకంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టి కృతజ్ఞతలు తెలుపుతాడు. బీజేపీతో విభేదించినట్టుగా బిల్డప్ ఇస్తూ బయటకొచ్చాక కూడా.. బీజేపీకి చెందిన మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యకు టీటీడీ బోర్డు మెంబర్ పదవిస్తాడు. బీజేపీ నుంచి బయటకు వచ్చామని చెబుతూ.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ను తన కొలువులో పెట్టుకుంటాడు. ఆయన్ని ఇప్పటికీ తీసేయలేదు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చానంటాడు. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్కు బాలకృష్ణ షూటింగ్ చేస్తుంటాడు.. పక్కనే వెంకయ్యనాయుడు కూర్చుని చప్పట్లు కొడుతుంటాడు. 25 మంది ఎంపీలు రాజీనామా చేసి, నిరాహార దీక్షకు కూర్చుంటే దేశం మొత్తం మనవైపు చూసుండేది కాదా? కేంద్రం దిగివచ్చి ఉండేది కాదా? ఇవన్నీ వాస్తవాలని తెలిసినా చంద్రబాబు ఓ వైపు బీజేపీతో చెలిమి కొనసాగిస్తాడు. మరోవైపు కాంగ్రెస్నూ మేనేజ్ చేస్తాడు. అంతగొప్ప వ్యక్తి ఆయన. ప్రజలను ఇంత గొప్పగా మోసం చేస్తున్నానని క్రెడిట్ తీసుకోవచ్చేమోగానీ, మోసపోయిన ప్రజలకు మాత్రం ఆ బాధ తెలుస్తుంది. అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా బుద్ధి చెబుతారు. ఆరు నెలలకోమారు బైటకొచ్చే వ్యక్తి కూడా మాట్లాడటమే! అసెంబ్లీలో ఉండాల్సిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేలా బయట తిరుగుతున్నారు. ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా నేను పోరాటం చేసేవాడినని పవన్ కళ్యాణ్ అన్నారని ఓ విలేఖరి ప్రస్తావించగా.. జగన్ స్పందించారు. ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నా కూడా మనం వినాల్సి వస్తోంది. నిజంగా ఇది మన ఖర్మే. నాలుగేళ్లు ఇదే పెద్దమనిషి చంద్రబాబుతోనూ, బీజేపీతోనూ.. ఇద్దరితోనూ కలిసి కాపురం చేశాడు. సంసారం చేశాడు తాను కూడా. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయన బయటకు వచ్చి నేను(పవన్) తప్పు చేశాను కాబట్టి పూర్తిగా పతివ్రతను అని గట్టిగా చెబుతా ఉన్నాడు. ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని పొడిచేశారు. పొడిచిన తర్వాత నాలుగేళ్లు గమ్మునున్నారు. కలిసికట్టుగా సంసారం చేశారు. ఆరు నెలలు ఎన్నికల ముందు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. ఒకరేమో తాను తప్పు చేశానంటాడు. మరొకరేమో నేను కాదు తప్పు చేసింది మిగతా ఇద్దరు నన్ను మోసం చేశారంటాడు. ఇంకో ఆయనేమో.. ఆ ఇద్దరూ ఆమోదం తెలిపిన తర్వాతే చంపేశాను అని అంటాడు. మన ఖర్మ ఇలాంటి వాళ్లు కూడా మాట్లాడడం.. చంద్రబాబు నాలుగేళ్లు అన్యాయం చేసినా ఆయన ఏనాడు నోరు విప్పలేదు. ఆరునెలలకో, ఏడాదికో ఒకసారి బయటికి వచ్చి ఒక ట్వీటో, ఒక ఇంటర్వ్యూ ఇచ్చి పోతాడు. నాలుగేళ్లుగా మనం ఆయన్ను చూసింది అంతే.. ఈ నాలుగేళ్లలో కూడా పవన్ చేసిందేమైనా ఉందంటే చంద్రబాబును కాపాడడానికి బయటికి రావడమే. ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాలు మాట్లాడితే దాన్ని గురించి మనం సమాధానం చెప్పాలంటే... నిజంగా రాజకీయాలు ఎక్కడి పోతున్నాయి? విలువల గురించి తాను మాట్లాడతాడు.. నిజంగా తనకు ఎక్కడున్నాయి విలువలు? నలుగురు, నలుగురు పెళ్లాలు. కొత్త కారును మార్చినట్టుగా పెళ్లాన్ని మారుస్తాడు. నాలుగేళ్లకోసారి, ఐదేళ్లకోసారి పెళ్లాన్ని మారుస్తాడు.. నిజంగా ఇలాంటి వ్యక్తి.. ఆయన కాకుండా నువ్వో (ప్రశ్న అడిగిన విలేఖరి), నేనో, ఇంకొకరో ఆ పని చేసి ఉంటే మనల్ని ఏమంటారు? నిత్యపెళ్లికొడుకని చెప్పి బొక్కలో వేసేవారా? లేదా? ఇది పాలిగమీ (బహుభార్యత్వం) కాదా? ఇలాంటి వాళ్లు ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటికి వచ్చి తానేదో సచ్ఛీలుడినని, ఇంకొకటో ఇంకొకటో అని మాట్లాడడం.. వాళ్లను కూడా మనం సీరియస్గా తీసుకుని విశ్లేషించుకోవాల్సి రావడం అంటే రాజకీయాల్లో నిజంగా బాధనిపిస్తుంది’’ అని జగన్ పేర్కొన్నారు. – నేను చంద్రబాబును ఒకటే అడుగుతున్నా. మీరే ముందుకొచ్చి, మీ ఎంపీల చేత రాజీనామాలు చేయించి, దేశం మొత్తం మనవైపు చూసేలా చేసి, స్వయంగా బంద్లో పాల్గొనాల్సిన పరిస్థితిలో నువ్వు చేసిన నిర్వాకం ఇదా? అవిశ్వాస తీర్మానంలో ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. కేంద్రమేమో మీ వల్లే హోదా ఇవ్వలేదని చెబుతుంటే మీరు ఒప్పుకున్నారు. మీరు అడిగారనే హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చామని వాళ్లు చెబితే నిరసన తెలపాల్సిందిపోయి.. బీజేపీకి వ్యతిరేకంగా, 25కు 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే హోదా వస్తుందని తెలిసినా.. దాన్ని నీరుగార్చిన నీ మోసానికి వ్యతిరేకంగా బంద్కు పిలుపునిస్తే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? – చంద్రబాబును గట్టిగా ఓ విషయం అడగండి.. అయ్యా చంద్రబాబూ.. స్వాతంత్య్రానికి ముందు నువ్వు ఓ నాయకుడిగా లేకపోవడం భారతదేశం చేసుకున్న అదృష్టం. నువ్వు గనుక స్వాతంత్య్రానికన్నా ముందు ఓ నాయకుడిలా ఉండుంటే.. ఎందుకయ్యా స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేస్తున్నారు? బ్రిటీష్ వాళ్లు బాగానే చేస్తున్నారు కదా? ఒక ప్యాకేజీ తీసుకుని సర్దుకుపోదామని అనుండేవారు. సంబంధిత కథనాలు: కుట్ర భగ్నం.. బంద్ విజయం ఉక్రోషం.. ఉక్కుపాదం ప్రతిపక్ష పార్టీ బంద్ చేయకూడదా? -
ఏపీకి హోదా ఇస్తే.. తెలంగాణకూ ఇవ్వాలి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణకూ ఇవ్వాలని నీటి పారుదల, మార్కెటింగ్ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఏపీకి హోదా ఇస్తే తెలంగాణలోని పరిశ్రమలు అక్కడికి తరలివెళ్తాయని, దీంతో స్థానికులు రోడ్డు మీద పడతారని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై రూ.26 కోట్లతో నిర్మించ తలపెట్టిన అండర్పాస్కు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. ఏపీకి హోదా కల్పిస్తామ ని సీడబ్ల్యూసీ కమిటీ సమావేశంలో తీర్మానించడంపై ఇక్కడి కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సంగారెడ్డి, పటాన్చెరు ప్రాంతాల నుంచి ఏపీకి పరిశ్రమలు తరలివెళ్తే మనమేం చేయాలన్నారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. తెలంగాణలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకూ ఇవ్వలేదని మండిపడ్డారు. ‘సింగూరు’కు కాళేశ్వరం నీళ్లు... కాళేశ్వరం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి సింగూరు ప్రాజెక్టును నింపుతామని హరీశ్రావు ప్రకటించారు. ‘హస్తం అంటేనే ఉత్త చేతులు.. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు మేలు జరగలేదని’విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో కేవలం నాయకులు, కార్యకర్తలకే మేలు జరిగిందన్నారు. నిరుపేదలే లక్ష్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్ధిని ‘కల్యాణలక్ష్మి’చెక్కులు అందుకుంటున్న తల్లిదండ్రుల కళ్లలో, పింఛన్ అందుకుంటున్న వృద్ధుల బోసి నవ్వుల్లో, ఉచిత కరెంటు అందుకుంటున్న రైతు మనసులో చూడాలని మంత్రి హరీశ్ వ్యాఖ్యానించారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి హరీశ్ ఇస్నాపూర్ చౌరస్తా విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. -
ఏపీ బంద్ సక్సెస్!
-
ఉద్యమాన్ని కొనసాగిస్తాం : వైఎస్ జగన్
సాక్షి, తూర్పుగోదావరి(సామర్లకోట) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ మంగళవారం స్వచ్ఛందంగా ఏపీ బంద్లో పాల్గొని విజయవంతం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బంద్ సక్సెస్పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అతి కిరాతకంగా, అతి దారుణంగా సీఎం చంద్రబాబు నాయుడు బంద్ను విఫలం చేయడానికి కుట్రలు పన్నారని ఆరోపించారు. అన్ని కుట్రలు, అణచివేతల మధ్య కూడా బంద్ విజయవంతమైందని తెలిపారు. బంద్లో పాల్గొని ‘ప్రత్యేక హోదా అన్నది మా హక్కు’ అని చాటినందుకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. బంద్ను నీరుగార్చేందుకు, బలవంతంగా ఆర్టీసీ బస్సులను సైతం తిప్పడానికి చంద్రబాబు ప్రయత్నించారని చెప్పారు. హోదా కోసం ముందుకొచ్చి ఎంపీలతో రాజీనామాలు చేయించి దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా చేసి, మీరే బంద్లో పాల్గొనాల్సింది పోయి మీరు చేసే నిర్వాకం ఇదా అంటూ చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు. ప్రత్యేక హోదా కావాలని తన స్వరం వినిపించేందుకు వచ్చిన కాకి దుర్గాప్రసాద్ మరణించడానికి కారణం మీరు కాదా? అని ప్రశ్నించారు. పోలీసు జులుం ద్వారా దుర్గాప్రసాద్ గుండెపోటుతో మరణించేలా చేశారని అన్నారు. ఇంతకన్నా దారుణం ఏదైనా ఉందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హోదా కోసం నిరసనలు తెలుపుతున్న వారిని కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటు వెళ్లారని, లాఠీ చార్జ్లు జరిపారని, మహిళలను అని కూడా చూడకుండా పురుష పోలీసులు వారిని నిర్భందించారని, విద్యార్థులను ఈడ్చుకుంటూ వెళ్తున్న ఫొటోలను వైఎస్ జగన్ మీడియా ప్రతినిధులకు చూపించారు. అయినప్పటికీ ప్రజలు బంద్ను విజయవంతం చేయడం హోదా ఆకాంక్షిస్తున్న ప్రజల మనోభావలను తెలియజేస్తుందన్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. వంద తప్పుల తర్వాత శిశుపాలుడికి కూడా శిక్ష తప్పదన్నట్లుగా చంద్రబాబు కూడా కచ్చితంగా శిక్ష పడి తీరుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చేయాల్సిన సమయంలో చేయాల్సిన పనులను సీఎంగా చంద్రబాబు నిర్వర్తించకపోవడమేనని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలుగా మనం అందరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. హోదా కోసం పోరాటం ఇక్కడితో ఆగదని, దాన్ని సాధించే వరకూ ఒత్తిడిని కొనసాగిస్తామని వెల్లడించారు. చంద్రబాబుకు ఏ మాత్రం సిగ్గు, శరం ఉన్నా కూడా ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో ఇప్పటికైనా ముందుకు రావాలని కోరారు. భావితరాలు బాబును చరిత్ర హీనుడిగా చూస్తాయన్న విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు. రాజకీయ స్వార్థంతోనే కొందరు బంద్లో పాల్గొనలేదని చెప్పారు. హోదాపై పోరులో భాగంగా ఎవరు పిలుపు ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. హోదా అన్నది వ్యక్తిగత స్వార్ధాల కోసం చూసుకునేది కాదు, రాజకీయాలకు అతీతంగా అందరం ఒక్కటై సాధించాల్సిందని పునరుద్ఘాటించారు. ‘కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కాకుండా ప్రజలు ఇబ్బందులు పడేలా వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారన్న టీడీపీ ఆరోపణలపై.. మీరు స్వతంత్రానికి ముందు ఒక నాయకుడిగా లేకపోవడం(చంద్రబాబును ఉద్దేశించి) భారతదేశం చేసుకున్న ఒక అదృష్టం అయ్యా. నువ్వు గనుక అప్పట్లో ఉండివుంటే ఎందుకయ్యా స్వతంత్రం కోసం పోరాటాలు చేస్తున్నారు. బ్రిటీష్ వాళ్లు బాగానే పాలిస్తున్నారు కదా. ఒక ప్యాకేజి తీసుకుని సర్దుకుపోదామని చెప్పివుండే వాడివయ్యా అని చంద్రబాబుకు చెప్పాలి. ప్రత్యేక హోదాకు సంబంధించి బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ వ్యతిరేకంగా మాట్లాడటం లేదనే మరో ఆరోపణపై స్పందిస్తూ.. 2016 సెప్టెంబర్లో ప్యాకేజి స్టేట్మెంట్ వచ్చింది. చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి ధన్యావాదాలు తెలిపారు. మరుసటి రోజు నేను మీడియా సమావేశం పెట్టాను. ఒకసారి ఆ రికార్డును పరిశీలించండి. కేంద్ర ప్రభుత్వం చెవిలో క్యాలీఫ్లవర్ పెడుతోందని తిడుతూ మాట్లాడాను. ఏపీ అసెంబ్లీలో ప్యాకేజీ ఇవ్వడంపై ధన్యవాద తీర్మానాన్ని వైఎస్సార్ సీపీ వ్యతిరేకించింది. ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ జగన్ అనే వ్యక్తి చంద్రబాబుకు ప్రత్యేక హోదా అంటే ఏంటో ట్యూషన్ చెప్పాడు. ఇవాళ చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో కలసి నడిచి, ఎన్నికలు ఆరు నెలల ముందు విడాకులు తీసుకుని, హోదా కోసం ఆయనే పోరాటం చేస్తున్నట్లు బిల్డప్లు ఇస్తున్నారు. మోదీ ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలను సభలలో చంద్రబాబు వినిపిస్తున్నారు. హోదా కోసం నేను చేసిన యువభేరీ సభలను చూడండి. ప్రత్యేక హోదా కోసం జగన్ చేసిన ధర్నాలు, నిరాహార దీక్షల ఫుటేజీలను పరిశీలించండి. యువభేరీల్లో మోదీ ఏం మాట్లాడారు. వెంకయ్య నాయుడు ఏం మాట్లాడారు. చంద్రబాబు ఏం మాట్లాడారు. ఊసరవెల్లుల్లా రంగులు ఎలా మార్చారు వంటి అన్నీ విషయాలను చెప్పాను. హోదా కోసం ఎన్నికలకు 15 నెలల ముందే రాజీనామా చేశాం. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలుత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది వైఎస్ జగన్ అనే వ్యక్తి. ఇన్ని రకాలుగా చిత్తశుద్ధితో ఏపీ ప్రజల తరఫున కేంద్రంలో ఎవరున్నా లెక్కచేయకుండా పోరాటం చేస్తుంటే నిందలు వేస్తారు. మరొవైపు ఇదే చంద్రబాబు పూటకో మాట మాట్లాడతాడు. గంటకో వేషం వేస్తాడు. ఎన్నికలకు ముందు హోదా 10 కాదు 15 ఏళ్లు తెస్తానంటాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలు హోదా వల్ల ఏం బాగుపడ్డాయని ప్రశ్నిస్తాడు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని చెబుతూ అదే పార్టీకి చెందిన నాయకుడి భార్యకు టీటీడీలో బోర్డు మెంబర్గా పదవి ఇస్తాడు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ను తన కొలువులో పెట్టుకున్నాడు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చానంటాడు. బాలకృష్ణ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే వెంకయ్య పక్కన కూర్చొని చప్పట్లు కొడుతుంటాడు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసి, దీక్షలకు కూర్చుంటే దేశం మొత్తం మనవైపు చూసేది కాదా?. ఇవన్నీ వాస్తవాలు అని తెలిసినా చంద్రబాబు ఒకవైపు బీజేపీతో తన చెలిమిని కొనసాగిస్తాడు. కాంగ్రెస్ను మేనేజ్ చేస్తాడు. ప్రజలను గొప్పగా మోసం చేస్తాడు. చంద్రబాబు చేసేవి ధర్మపోరాట సభలు కావు. అవి అధర్మపోరాట సభలు. ఈ విషయంపై చంద్రబాబును తనను తాను ప్రశ్నించుకోమని చెప్పండి(మీడియా ప్రతినిధులను ఉద్దేశించి). మన కర్మ ఏంటంటే ఇవాళ పవన్ అనే వ్యక్తి మాట్లాడుతున్నా వినాల్సివస్తోంది. నిజంగా ఇది మన కర్మ. నాలుగేళ్లు టీడీపీ, బీజేపీతో కలసి నడిచాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయనా బయటకు వచ్చి నేను తప్పుచేశాను అని చెప్పి చెబుతున్నారు. ఒక మనిషిని ముగ్గురు కలసి పొడిచేశారు. పొడిచిన తర్వాత నాలుగేళ్లు సైలెంట్గా ఉండి బయటకు వచ్చి ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడతారు. మన కర్మ ఇలాంటి వాళ్ల కూడా ఉన్నారు. ఆరు నెలలకు ఒకసారి వచ్చి ట్వీట్ ఇవ్వడం, ఇంటర్వూలు ఇవ్వడం చేశారు. గత నాలుగేళ్లలో మనం చూశాం. చంద్రబాబును రక్షించేందుకే అలా పవన్ వచ్చారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో మాట్లాడటం మొదలుపెడితే ఎలా?.’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. బంద్ గురించి వైఎస్ జగన్ వెల్లడించిన వివరాలు.. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 మంది అరెస్టు అయ్యారు. తమ్మినేని సీతారాం, కృష్ణదాసు, అప్పలరాజు, తిలక్ వంటి కీలక నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 144, సెక్షన్ 30లను విధించారు. బంద్ను ఉక్కుపాదంతో అణచివేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. విజయనగరం ఇక్కడ కూడా 300 మందికి పైగా అరెస్టు చేశారు. వ్యాపారస్తులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. విశాఖపట్టణం బొత్స సత్యనారాయణ సహా సీనియర్ నాయకులందరినీ అరెస్టు అయ్యారు. షాపులు, విద్యాసంస్థలు, సినిమా హాళ్లు కూడా స్వచ్ఛందంగా మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 600 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి వాణిజ్య, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. నాయకులు కన్నబాబు, జగ్గిరెడ్డి, ద్వారపూడి, వీర్రాజు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. నేతలను అదుపులోకి తీసుకుని బస్సులను నడిపించేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. ఇప్పటివరకూ 538 మంది అరెస్టు చేశారు. వీరిలో 38 మందిపై కేసులు పెట్టారు. పశ్చిమ గోదావరి మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల నానిలను ఏలూరు అరెస్టు చేశారు. తణుకులో కారుమూరి తదితర సీనియర్ నాయకులను అరెస్టు చేశారు. బుట్టాయిగూడెంలో ధర్నాలో పాల్గొన్న కాకి దుర్గారావు అనే సోదరుడు గుండెపోటుతో మరణించాడు. జిల్లాలో 300లకుపైగా అరెస్టులు అయ్యాయి. ప్రకాశం 144 సెక్షన్ను జిల్లా వ్యాప్తంగా అమలు చేశారు. కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. బాలినేని వాసు మొదలుకుని మాజీ మంత్రి మహిధర్ రెడ్డి వరకూ అరెస్టులు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 600 మందికి పైగా అరెస్టు అయ్యారు. అయినా దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడి బంద్ను విజయవంతం చేశాయి. నెల్లూరు కోటంరెడ్డి శ్రీధర్, అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాం రెడ్డి ప్రతాప్ తదితర నాయకులు అరెస్టు అయ్యారు. జిల్లా వ్యాప్తంగా 800 మందిపైగా అరెస్టు అయ్యారు. అయినా బంద్ స్వచ్ఛందంగా జరిగింది. కర్నూలు సీనియర్ నాయకులు అందరూ అరెస్టు అయ్యారు. నంద్యాలలో డీఎస్పీ గోపాలకృష్ణ మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించారు. మహిళా పోలీసులు లేకుండా వారిని లాగడంతో వారికి గాయాలయ్యాయి. కర్నూలులో దాదాపు 600 మంది అరెస్టు అయ్యారు. స్వచ్ఛందంగా ప్రజలు బంద్ను పాటించారు. వైఎస్సార్ కడప ఎక్కడిపడితే అక్కడ అరెస్టులు జరిగాయి. మొత్తం 1500 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఆర్టీసీ బస్టాండ్లో అడ్డుకున్నందుకు మేయర్ సురేష్, ఆకేపాటి అమర్లను అరెస్టు చేశారు. ప్రొద్దుటూరులో శివాలయం ఎదుట ఎమ్మెల్యే రాచమల్లు భిక్షాటన చేయగా అరెస్టు అయ్యారు. అనంతపురం సీనియర్ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి గృహ నిర్భందం చేశారు. జిల్లా వ్యాప్తంగా 1000 మందికి పైగా అరెస్టు అయ్యారు. స్వచ్ఛందంగా బంద్ పాటించారు. చిత్తూరు భూమన కరుణాకర్ రెడ్డి, పీలేరు రామచంద్రారెడ్డిలతో పాటు సీనియర్ నాయకులందరినీ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 1200 మంది అరెస్టు అయ్యారు. కుప్పంలో కూడా స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి బంద్ను పాటించాయి. ప్రత్యేక హోదా కావాలన్న నినాదం చివరకు కుప్పంలో కూడా వినిపిస్తున్నా చంద్రబాబుకు కనిపించడం లేదు. కృష్ణా సీనియర్ నాయకులు అందరూ అరెస్టు అయ్యారు. తెల్లవారుజామున 5 గంటలకు పార్థసారధి, మల్లాది విష్ణు, యలమంచిలి రవి, బాబు కుమార్, వంగవీటి రాధా, కార్పొరేటర్లు అందరినీ బస్స్టాండ్ వద్ద అరెస్టు చేశారు. జిల్లాలో దాదాపు 600 మంది అరెస్టు అయ్యారు. గుంటూరు సీనియర్లు అందరూ అరెస్టు అయ్యారు. జిల్లాలో దాదాపు 1100 మందిని అరెస్టు చేశారు. అయినా కృష్ణా, గుంటూరులలో బంద్ విజయవంతమైంది. -
బంద్ను విఫలం చేయడానికి కుట్రలు పన్నారు
-
ఏపీ అంతటా పోలీసు రాజ్యం
సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమంపై చంద్రబాబు సర్కారు మరోసారి ఉక్కుపాదం మోపింది. వైఎస్సార్సీపీ ఇచ్చిన బంద్పిలుపును భగ్నం చేయడానికి సర్కారు శతవిధాలా ప్రయత్నించింది. బంద్ను అడ్డుకునేందుకు అన్నిజిల్లాలలో పోలీసులను మోహరించింది. పోలీసుల ఆంక్షలను, సెక్షన్లను లెక్కచేయని జనం ఎక్కడికక్కడ రోడ్డెక్కి ప్రత్యేకహోదా ఆకాంక్షను ఎలుగెత్తిచాటారు. బీజేపీ టీడీపీల మోసపూరిత వైఖరిని ఎండగట్టారు. ఏపీ వ్యాప్తంగా పోలీసుల రాజ్యం నడిచింది. కనపడిన ప్రతి వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితోపాటు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. రాజంపేటలో అమర్నాథ్ రెడ్డిని, జమ్మలమడుగులో డాక్టర్ సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతపురంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డిని, రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మాజీ ఎంపీ వరప్రసాద్, వెంకటగిరిలో జడ్పీ చైర్మన్ రాఘవేంద్రరెడ్డితోపాటు పలువురిని అరెస్ట్ చేశారు. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేశారు. విజయవాడలో పార్థసారథి, మల్లాది విష్ణు, యలమంచిలి రవి, వంగవీటి రాధాకృష్ణ, బొప్పన, అడపా శేషు, మహమ్మద్లను అరెస్ట్ చేశారు. అలాగే విద్యాధరపురం వద్ద వెల్లంపల్లితోపాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి బస్టాండ్ వద్ద సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డితోపాటు దాదాపు 200 మంది పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయటం ఉద్రిక్తలకు దారితీసింది. విజయనగరం బస్టాండ్ వద్ద ఎమ్మెల్సీ కోలగట్ల, మజ్జి శ్రీనివాసరావు, పార్వతీపురం డిపో వద్ద జోగారావులను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, గుంటూరు బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే ముస్తఫా, మేరుగ నాగార్జున, అప్పిరెడ్డి, రేపల్లెలో మాజీ మంత్రి మోపీదేవి వెంకటరమణలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు విశాఖ మద్దిలపాలెంలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణతోపాటు పలువురు నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కలికిరినూ పోలీసులు రెచ్చిపోయారు. ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా నిరసన చెబుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు. విచక్షరహితంగా కొట్టడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. -
‘బంద్ను ప్రభుత్వం అణచివేయాలని చూసింది’
-
వైఎస్సార్సీపీ పోరాటానికి అండగా ఉంటాం : చలసాని
సాక్షి, విజయవాడ : రాష్ట్ర బంద్ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్త దుర్గారావు చనిపోవడం బాధాకరమని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. దుర్గారావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హోదా కోసం బంద్ నిర్వహించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన బంద్ను ఇతర పార్టీలు కానీ, ప్రజలు కానీ ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. శాంతియుతంగా బంద్లు, దీక్షలు, ధర్నాలు ఎవరైనా చేసుకోవచ్చునని దానిని అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. గతంలో కూడా తాము దీక్షలు చేస్తామంటే చంద్రబాబు అనేక ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు.. చంద్రబాబు నడి రోడ్డుపై దీక్షలు చేస్తే తప్పు లేదు కానీ, ఎవరైనా దీక్షలు చేస్తే పోలీసులచే అరెస్ట్ చేయిస్తున్నారని మండిపడ్డారు. హోదా కోసం వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటానికి అందరం అండగా ఉంటామని పేర్కొన్నారు. హోదా కోసం చంద్రబాబు అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. -
‘బంద్ను ప్రభుత్వం అణచివేయాలని చూసింది’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్పై టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బంద్కు అన్ని వర్గాలు సహకరించాయి. ప్రభుత్వం పోలీసులతో బంద్ను అణచివేయాలని చూసింది. హోదాపై చిత్తశుద్ది ఉంటే పోలీసులతో దాడులు ఎందుకు చేయిస్తారు. హోదాను ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకే కేంద్రంలో మద్దతిస్తాం. హోదా కోసం ఢిల్లీతో పోరాటమే మా ధ్యేయం. కేసులున్నాయని చంద్రబాబు కేంద్రంతో, టీఆర్ఎస్తో లాలూచీ పడ్డారు. వైఎస్సార్సీపీ ప్రజల్లోకి వెళ్తోందని టీడీపీ భయపడుతుంది. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, టీడీపీలు గత ఎన్నికల్లో హామీ ఇచ్చాయి. ఎన్నికలు పూర్తవ్వగానే మాట మార్చాయి. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో డ్రామాలు మొదలుపెట్టారు. అప్పుడు, ఇప్పుడు వైఎస్సార్సీపీ ఒకే మాటపై ఒంటరి పోరు కొనసాగిస్తోంది. టీడీపీ హోదాపై ఇప్పటికైనా తన వైఖరిని వెల్లడించాలి. హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు మాట తప్పకుండా పదవులను వదిలేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీనే కావాలన్నారు. పార్లమెంట్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడిన అంశాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల నుంచి చెబుతున్నారు. కానీ టీడీపీ నేతలు అప్పుడు వైఎస్సార్సీపీని హేళన చేశారు. రాష్ట్రం నష్టపోతుందని చెబుతున్నా పట్టించుకోలేదు. రానున్న కాలంలో మరిన్ని పోరాటాలకు ప్రజలు సహకరించాలి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి చేయడానికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంద’ని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు నాయుడు మోసాలు, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ మంగళవారం బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
‘దుర్గారావు మృతి.. ప్రభుత్వానిదే బాధ్యత’
సాక్షి, ఏలూరు : ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో సీఎం చంద్రబాబు నాయుడు మోసాలు, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్లో విషాదం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో బంద్లో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతి చెందారు. టీడీపీ ప్రభుత్వం కుట్ర వల్లే దుర్గారావ్ మృతి చెందాడని కుటుంబసభ్యులు, బంధువులు, పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దుర్గారావు మృతితో ఆయన స్వస్థలం బుట్టాయిగూడెం మండలం కృష్ణాపురంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. చంద్రబాబు ఏ రోజు నిజం మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. హోదా కోసం శాంతియుతంగా బంద్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని మండిపడ్డారు. పోలీసుల తోపులాట వల్లే వైఎస్సార్సీపీ కార్యకర్త దుర్గారావు మరణించారని తెలిపారు. ఈ ఘటన చూస్తుంటే ఇది ప్రభుత్వ హత్యలా అనిపిస్తోందన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దుర్గారావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇలాంటి ఎన్ని ప్రాణాలు పోతే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దుర్గారావు మృతదేహానికి వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాళులు ఆర్పించారు.