
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఒక్క ఎంపీ ఉంటేనే తామే తెలంగాణ తెచ్చామని గొప్పలు చెప్పుకున్నారని, ఇప్పుడు 20 మంది టీఆర్ఎస్ ఎంపీలు ఉండి తెలంగాణకు ఏం చేసినట్లని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ప్రశ్నించారు. నాడు ఒక్క ఎంపీనే తెలంగాణ సాధించగలిగితే, నేడు 20 మంది ఎంపీలుండి రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు కాపాడలేకపోతున్నారని ప్రశ్నించారు.
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్తో కలసి గాంధీభవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో నాలుగేళ్లుగా టీఆర్ఎస్ విఫలమైందని ఆరోపించారు. బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తు న్నా, ప్రధాని మోదీ రాష్ట్ర ఏర్పాటును కించపరిచేలా మాట్లాడినా కనీసం తెలిపే దమ్ము కూడా టీఆర్ఎస్ ఎంపీలకు లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్లో ఉన్న 17 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీ లు ఏనాడైనా దళితుల సంక్షేమం గురించి సీఎంతో మాట్లాడారా అని ప్రశ్నించారు. నేరెళ్ల వంటి ఘటనలను కూడా ఖండించలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment