సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు కాపలాకుక్కలా ఉంటానన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు అధికారం కోసం వెంపర్లాడుతున్నారని కాంగ్రెస్ నాయుకుడు గజ్జెల కాంతం విమర్శించారు. మంగళవారం ఆయున విలేకరులతో వూట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు చేస్తే,టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తాననిఅన్నారని, దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న మాటపైనా ఆయన నిలబడడం లేదన్నారు. మాటపై నిలక డలేని కేసీఆర్ను ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు టికెట్లు కేటాయిస్తే కాంగ్రెస్కు వందకుపైగా స్థానాలు వస్తాయన్నారు.