గవర్నర్‌తో జేడీఎస్‌-కాంగ్రెస్‌ బృందం భేటీ | JDS Leaders Along With Congress Men Met Governor | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో జేడీఎస్‌-కాంగ్రెస్‌ బృందం భేటీ

May 15 2018 6:38 PM | Updated on May 16 2018 6:55 PM

JDS Leaders Along With Congress Men Met Governor - Sakshi

రాజ్‌భవన్‌లో జేడీఎస్‌ నేత కుమారస్వామితో కాంగ్రెస్‌ నాయకులు

సాక్షి, బెగళూరు: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని జేడీఎస్‌-కాంగ్రెస్‌లు గవర్నర్‌ చెప్పాయి. కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సభ్యుల బృందం మంగళవారం సాయంత్రం గవర్నర్‌ వజుభాయ్‌ రుడాభాయ్‌ వాలాను మర్యాదపూర్వకంగా కలిసింది. భేటీ అనంతరం రాజ్‌భవన్‌ వద్ద నేతలు మీడియాతో మాట్లాడారు. ‘‘జేడీఎస్‌కు కాంగ్రెస్‌ మద్దతు ఇస్తున్న విషయాన్ని గవర్నర్‌కు స్పష్టం చేశామని, సంబంధిత తీర్మానాలు కూడా సమర్పించామని కర్ణాటక పీసీసీ చీఫ్‌ పరమేశ్వర చెప్పారు. ‘కుమారస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్‌ మద్దతు ఇస్తున్నది. ఆయనను(స్వామిని) ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరాం. ఏ విషయమైంది రెండు రోజుల్లో చెబుతానని గవర్నర్‌ అన్నారు’’ అని సిద్దరామయ్య తెలిపారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన నేతల్లో మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement