
సాక్షి, ఒంగోలు(కనిగిరి) : ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 97వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. ఈమేరకు పాదయాత్ర షెడ్యూల్ను వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. ఆదివారం ఉదయం 8.00 గంటలకు వైఎస్ జగన్ నైట్ క్యాంపు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి చాల్ల గిరిగేల చేరుకుంటారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి గద్ద మీద పల్లి క్రాస్, నంద మారెళ్లకు చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. మద్యాహ్నం 12.00 గంటలకు యేదవెల్లి క్రాస్ చేరుకొని, భోజన విరామంతీసుకుంటారు.
అనంతరం మద్యాహ్నం 3.00 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4.00 గంటలకు పెద్దరికట్లకు చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు పాదయాత్రను ముగించి రాత్రికి అక్కడే బస చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment