ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ మంగళవారం ఇంగ్లండ్ తో జరుగునున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ మంగళవారం ఇంగ్లండ్ తో జరుగునున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ లో ఓటమి పాలుకావడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా, ఇంగ్లండ్ లు ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
గత కొన్ని మ్యాచ్ ల నుంచి టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. ఈ మ్యాచ్ లో ఓపెనర్లపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది.