అండర్‌–14 చాంప్స్‌ అర్జున్, జిషిత | under 14 champains14 arjun, jishitha | Sakshi
Sakshi News home page

అండర్‌–14 చాంప్స్‌ అర్జున్, జిషిత

Published Mon, Jan 8 2018 4:32 AM | Last Updated on Mon, Jan 8 2018 4:45 AM

under 14  champains14 arjun, jishitha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముంబై ఇంటర్నేషనల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ ప్లేయర్‌ ఎరిగైసి అర్జున్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జిషిత ఆకట్టుకున్నారు. అండర్‌–14 ఓపెన్‌ విభాగంలో అర్జున్‌... అండర్‌–14 బాలికల విభాగంలో జిషిత అగ్రస్థానాన్ని సంపాదించారు. ముంబైలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో అర్జున్‌ తొమ్మిది రౌండ్లకుగాను 6.5 పాయింట్లు సంపాదించి ఓవరాల్‌గా 16వ స్థానంలో... తన విభాగంలో టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు.

నాలుగు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని ఈ టోర్నీలో అర్జున్‌ అజేయంగా నిలిచాడు. జిషిత 5.5 పాయింట్లు సంపాదించింది. ఆమె ఐదు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మూడు గేముల్లో ఓడిపోయింది. అండర్‌–14 ఓపెన్‌ విభాగంలో హైదరాబాద్‌కే చెం దిన రాజా రిత్విక్‌ 6 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. అండర్‌–20 బాలికల విభాగం లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి బొడ్డ ప్రత్యూష ఆరు పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement