గోదావరిలో దూకి యువతి ఆత్మహత్య
Published Tue, Aug 30 2016 11:40 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద ఉన్న గోదావరి కాలువలో దూకి బేడి వేదిక(18) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా నెల్లిమర్ల గ్రామానికి చెందిన వేదిక దండేపల్లిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చిన వేదిక సమీపంలోని గోదావరి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
Advertisement
Advertisement