స్వామిజీ ముసుగులో ఓ వ్యక్తి మహిళను మోసం చేసి బంగారు నగలను అపహరించాడు.
దీంతో ఆమె అతన్ని నమ్మి ఇంట్లోకి తీసుకెళ్లి పూజలు చేయమని కోరగా ఆయన ఆమె నుదుటిన బొట్టు పెట్టి పూజ చేస్తానని చెప్పి తాళిబొట్టు ఉన్న బంగారు సరుడు ఇవ్వమని అడిగాడు. కొద్దిసేపటికే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దీంతో అతను ఐదు సవర్లు బంగారు నగలు తీసుకుని వెళ్లిపోయారు. పది నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చి చూసే సరికి అతను కనిపించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పట్టపగలే స్వామీజీ ముసుగులో చోరీకి పాల్పడిన వైనం స్థానికంగా సంచలనం రేపింది. ఏఎస్ఐ మల్లికార్జునరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.