న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే అసీం అహ్మద్ ఖాన్ మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై విమర్శలు చేశారు. కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనను చంపించేందుకు కేజ్రీవాల్ కుట్ర పన్నారని ఇటీవల అసీం సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేజ్రీవాల్ పోరాటం తనపైనే కానీ, తన కుటుంబ సభ్యులపై కాదని, తమ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోరాదని అన్నారు. కేజ్రీవాల్, ఆయన అనచరులు తన కుటుంబ సభ్యులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు చూస్తున్నారని చెప్పారు. తన తండ్రి హజి మున్నె అలీపై తప్పుడు కేసు పెట్టవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయంలో తనకు కావాల్సినవారు గత నెల 31న హెచ్చరించారని వెల్లడించారు. ఈ నెల 2న పాత ఢిల్లీ మీనా బజార్లోని తన తండ్రి షాప్ వద్దనకు ఇద్దరు మహిళలు వచ్చి కావాలనే ఆయనతో గొడవపెట్టుకున్నారని, అనుచితంగా ప్రవర్తించి తిట్టారని అసీం చెప్పారు. ఇది కుట్ర అయివుంటుందని సందేహం వ్యక్తం చేశారు.
సీఎం గారూ.. మావాళ్ల విషయంలో జోక్యం వద్దు
Published Wed, Aug 3 2016 8:18 PM | Last Updated on Wed, Apr 4 2018 7:02 PM
Advertisement
Related news by tags
-
బ్రజ్ మండల్ యాత్ర.. 24 గంటల ఇంటర్నెట్ బంద్
చండీగఢ్: బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది చోటుచేసుకున్న ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా నుహ్ జిల్లాలో 24 గంటలపాటు మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించింది. నుహ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సర్వీస్ను నిలిపివేస్తున్నట్లు హర్యానా అడిషినల్ చీఫ్ సెక్రటరీ( హోం ) అనురాగ్ రస్తోంగి తెలిపారు. అసత్యాలు, పుకార్లు.. సోషల్మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వ్యాప్తి చెందకుండా అడ్డుకుంనేందుకు వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్(ఎక్స్)పై సస్పెన్షన్ విధించామని పేర్కొన్నారు.మరోవైపు.. యాత్ర ప్రశాంతంగా జరిగేలా నుహ్ జిల్లా మొత్తం భద్రత ఏర్పాట్లు చేసినట్ల పోలీసులు తెలిపారు. గతేడాది జూలై 31న యాత్ర సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నిర్వహించి ఊరేగింపులో చోటుచేసుకున్న ఘర్షణలో ఇద్దరు హోంగార్డులు, 15 మంది మృతి చెందారు. రాళ్లు విసిరి.. కార్లకు నిప్పుపెట్టారు. అదే రాత్రి గురుగ్రామ్లోని ఓ మసీద్పై దాడి ఘటనలో ఓ వ్యక్తి మరణించారు. ఆ తర్వాత కూడా పలు ఘర్షణలు చోటుచేసుకోగా.. ఆరుగురు మృతి చెందారు. అప్పడు సీఎంగా ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి మనోహర్ కట్టర్ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించారు. -
తుపాకీతో భార్య కాల్చివేత
మండ్య: ఓ మహిళను ఆమె భర్త తుపాకీతో కాల్చి చంపిన ఘటన కొడగు జిల్లా విరాజపేటె సమీపంలోని బేటోళి గ్రామంలో జరిగింది. బేటోళి గ్రామ పంచాయతీ మాజీ సభ్యురాలు శిల్పా సీతమ్మ (40) అనే మహిళను ఆమె భర్త సి. నాయకండ బోపణ్ణ తుపాకీతో కాల్చి హత్య చేశాడు. భార్యాభర్తల మధ్య చాలా రోజులుగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి శిల్పా వేరొకరితో ఫోన్లో మాట్లాడుతుండగా, బోపణ్ణ అడ్డు చెప్పాడు. ఈ విషయమై గొడవ జరగడంతో కసితో రగిలిపోయిన బోపణ్ణ శనివారం ఉదయం ఇంట్లోని సింగిల్ బ్యారెల్ తుపాకీతో భార్య శిల్పాపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించింది. శిల్పా సీతమ్మ 2012 నుంచి 2017 వరకు బేటోళి గ్రామ పంచాయతీ సభ్యురాలిగా పనిచేశారు. జిల్లా ఎస్పీ కే.రామరాజన్, విరాజపేటె గ్రామీణ పోలీసు అధికారులు గ్రామానికి వెళ్లి పరిశీలించి నిందితున్ని అరెస్టు చేశారు. కొడగు జిల్లాలో ఇళ్లలో తుపాకులు ఉంచుకోవడం సాధారణం. దీని వల్ల అప్పడప్పుడు తుపాకీ కాల్పుల ఘటనలు జరుగుతూ ఉంటాయి. -
రెండున్నర కిలోమీటర్లు.. మహిళను వెంబడించి..
పూణే : ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సరదాగా గడిపేందుకు స్కూటీ మీద ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నారు. అయితే జాతీయ రహదారి మీద వెళ్తున్న ఆమె స్కూటీని ఓ కారు సుమారు రెండున్న కిలోమీటర్లు వెంబడించింది. తన కారు వెళ్లేందుకు దారి ఇవ్వలేదనే నెపంతో స్కూటీని అడ్డుకున్నారు. అనంతరం కారులో నుంచి దిగిన భార్య, భర్తలు సదరు మహిళపై దాడికి దిగారు. పిడుగుద్దులు గుద్దుతూ దూర్బుషలాడారు. అక్కడి నుంచి పరారయ్యారు.పూణే పోలీసుల కథనం ప్రకారం.. పూణేలో నివాసం ఉండే జెర్లిన్ డిసిల్వా కంటెంట్ క్రియేటర్గా, మార్కెటింగ్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో శనివారం తన ఇద్దరు పిల్లలతో స్కూటీ మీద పాషన్-బానర్ లింక్ రోడ్డు మీద వెళ్తున్నారు. ఆ సమయంలో డిసిల్వా స్కూటీని కారు యజమాని స్వప్నిల్ కేకరేలు రెండున్న కిలోమీరట్లు వెంబడించారు. స్కూటీని ఆపేశారు. View this post on Instagram A post shared by Jerllyyn || Pune Content Creator (@jerlyndsilva) అనంతరం కారులో నుంచి దిగిన స్వప్నిల్ కేకరే దంపతులు డిసిల్వాను జుట్టు పట్టుకుని ఈడ్చారు. పిల్లలు ఎదురుగా ఉన్న పట్టించుకోకుండా భర్త బాధితురాలిపై పిడుగులు గుద్దారు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.ముక్కు నుంచి రక్తం దారాళంగా కారుతుండగా డిసిల్వా తనపై జరిగిన దాడిని వివరిస్తూ వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డిసిల్వా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నెంబర్ ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా డిసిల్వా మాట్లాడుతూ.. జాగ్రత్తగా ఉండండి. ఈ నగరం ఎంత సురక్షితంగా ఉందో చూడండి? ప్రజలు ఉన్మాదుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అని ప్రశ్నించారు. డిసిల్వా మేనమామ విశాల్ సంఘటన జరిగిన తర్వాత ఆమె నాకు ఫోన్ చేసి కారణం లేకుండా నిందితుడు తనపై దాడి చేశాడని చెప్పారు.తన మేనకోడలు స్కూటీ ఆ కారును ఢీకొట్టలేదు. అయినా కారణం లేకుండా దాడి చేశాడు. తానెంత శక్తివంతుడినో చూపించడానికి అతను అలా చేసి ఉండవచ్చు. స్వప్నిల్కేకరే’తోపాటు ఆయన భార్య ఉంది. కానీ ఆమె దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
సనత్నగర్ ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు
సనత్నగర్: సనత్నగర్ ఇన్స్పెక్టర్ పురేందర్రెడ్డి సస్పెన్షన్కు గురయ్యారు. ఓ కేసు విషయమై ఫిర్యాదు చేసేందుకు వచి్చన మహిళతో చాటింగ్ చేస్తూ అసభ్యకర మెసేజ్లు పంపించడంపై ఇన్స్పెక్టర్పై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తక్షణ చర్యలు తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మూడు నెలల క్రితం సనత్నగర్ ఇన్స్పెక్టర్గా పురేందర్రెడ్డి బదిలీపై వచ్చారు. ఇటీవల ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్కు వచ్చారు. ఈ నేపథ్యంలో పురేందర్రెడ్డి ఆమెతో ఫోన్లో చాటింగ్ చేయడం మొదలుపెట్టారు. ‘నువ్వు అందంగా ఉన్నావు.. నేను చెప్పిన చోటికి రావాలి’ అంటూ అసభ్య పదజాలంతో మెసేజ్లు పంపించారు. దీంతో బాధితురాలు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతిని నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ అభ్యంతరకరంగా చేసిన చాటింగ్ సందేశాలను ఆధారాలతో కమిషనర్కు ఆమె చూపించారు. దీంతో ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. పోలీసు శాఖలో దుష్ప్రవర్తనను సహించేది లేదన్న బలమైన సందేశాన్ని సీపీ పంపించారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించే పౌరులకు, ముఖ్యంగా మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని అందించేలా ఒక భరోసా కలిగించేలా సీపీ చర్యలు తీసుకున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. నూతన ఇన్స్పెక్టర్గా శ్రీనివాసులు.. సనత్నగర్ పోలీస్స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్గా కె.శ్రీనివాసులును నియమిస్తూ సీపీ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్ఓగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసులు.. ఉత్తర్వులు వెలువడిన వెంటనే శనివారం సాయంత్రం సనత్నగర్ ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించారు. -
హైదరాబాద్లో దారుణం.. భార్య, కుమార్తె ప్రాణాలు తీసి..
సాక్షి, హైదరాబాద్: ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఆ కుటుంబంలో విధి విషాదం నింపింది. చూడచక్కని ముగ్గురు పిల్లలతో సాఫీగా సాగుతున్న జీవనంలో ఏం కష్టం వచ్చిందో ఏమో...తండ్రి గణేష్ ఆత్మహత్యే శరణ్యమంటూ బేగంపేట్ రైల్వేస్టేషన్లో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య,పిల్లల్ని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.బోయిన్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. భార్య, 10 సంవత్సరాల కుమార్తెను చంపి ఆ తర్వాత భర్త ఆత్మ చేసుకున్నాడు. బేగంపేట వద్ద రైలు కిందపడి భర్త గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆయన కుటుంబ సభ్యుల సమాచారం మేరకు..వృత్తి రిత్యా డాక్టరైన భర్త గణేష్ కుటుంబానికి గత కొంతకాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువైనట్లు తెలుస్తోంది. దీంతో భార్య, భర్తల మధ్య మనస్పర్దలు తలెత్తాయి. ఓ వైపపు అప్పుల బాధలు, మరోవైపు కుటుంబంలో కలహాలు తట్టుకోలేక గణేష్ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న బేగం పేట్ రైల్వే పోలీసులు,బోయిన్ పల్లి పోలీసులు గణేష్ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య, ఆత్మహత్యకు గల కారణాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Related News by category
-
తుపాకీతో భార్య కాల్చివేత
మండ్య: ఓ మహిళను ఆమె భర్త తుపాకీతో కాల్చి చంపిన ఘటన కొడగు జిల్లా విరాజపేటె సమీపంలోని బేటోళి గ్రామంలో జరిగింది. బేటోళి గ్రామ పంచాయతీ మాజీ సభ్యురాలు శిల్పా సీతమ్మ (40) అనే మహిళను ఆమె భర్త సి. నాయకండ బోపణ్ణ తుపాకీతో కాల్చి హత్య చేశాడు. భార్యాభర్తల మధ్య చాలా రోజులుగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి శిల్పా వేరొకరితో ఫోన్లో మాట్లాడుతుండగా, బోపణ్ణ అడ్డు చెప్పాడు. ఈ విషయమై గొడవ జరగడంతో కసితో రగిలిపోయిన బోపణ్ణ శనివారం ఉదయం ఇంట్లోని సింగిల్ బ్యారెల్ తుపాకీతో భార్య శిల్పాపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించింది. శిల్పా సీతమ్మ 2012 నుంచి 2017 వరకు బేటోళి గ్రామ పంచాయతీ సభ్యురాలిగా పనిచేశారు. జిల్లా ఎస్పీ కే.రామరాజన్, విరాజపేటె గ్రామీణ పోలీసు అధికారులు గ్రామానికి వెళ్లి పరిశీలించి నిందితున్ని అరెస్టు చేశారు. కొడగు జిల్లాలో ఇళ్లలో తుపాకులు ఉంచుకోవడం సాధారణం. దీని వల్ల అప్పడప్పుడు తుపాకీ కాల్పుల ఘటనలు జరుగుతూ ఉంటాయి. -
సనత్నగర్ ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు
సనత్నగర్: సనత్నగర్ ఇన్స్పెక్టర్ పురేందర్రెడ్డి సస్పెన్షన్కు గురయ్యారు. ఓ కేసు విషయమై ఫిర్యాదు చేసేందుకు వచి్చన మహిళతో చాటింగ్ చేస్తూ అసభ్యకర మెసేజ్లు పంపించడంపై ఇన్స్పెక్టర్పై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తక్షణ చర్యలు తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మూడు నెలల క్రితం సనత్నగర్ ఇన్స్పెక్టర్గా పురేందర్రెడ్డి బదిలీపై వచ్చారు. ఇటీవల ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్కు వచ్చారు. ఈ నేపథ్యంలో పురేందర్రెడ్డి ఆమెతో ఫోన్లో చాటింగ్ చేయడం మొదలుపెట్టారు. ‘నువ్వు అందంగా ఉన్నావు.. నేను చెప్పిన చోటికి రావాలి’ అంటూ అసభ్య పదజాలంతో మెసేజ్లు పంపించారు. దీంతో బాధితురాలు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతిని నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ అభ్యంతరకరంగా చేసిన చాటింగ్ సందేశాలను ఆధారాలతో కమిషనర్కు ఆమె చూపించారు. దీంతో ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. పోలీసు శాఖలో దుష్ప్రవర్తనను సహించేది లేదన్న బలమైన సందేశాన్ని సీపీ పంపించారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించే పౌరులకు, ముఖ్యంగా మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని అందించేలా ఒక భరోసా కలిగించేలా సీపీ చర్యలు తీసుకున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. నూతన ఇన్స్పెక్టర్గా శ్రీనివాసులు.. సనత్నగర్ పోలీస్స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్గా కె.శ్రీనివాసులును నియమిస్తూ సీపీ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్ఓగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసులు.. ఉత్తర్వులు వెలువడిన వెంటనే శనివారం సాయంత్రం సనత్నగర్ ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించారు. -
హైదరాబాద్లో దారుణం.. భార్య, కుమార్తె ప్రాణాలు తీసి..
సాక్షి, హైదరాబాద్: ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఆ కుటుంబంలో విధి విషాదం నింపింది. చూడచక్కని ముగ్గురు పిల్లలతో సాఫీగా సాగుతున్న జీవనంలో ఏం కష్టం వచ్చిందో ఏమో...తండ్రి గణేష్ ఆత్మహత్యే శరణ్యమంటూ బేగంపేట్ రైల్వేస్టేషన్లో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య,పిల్లల్ని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.బోయిన్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. భార్య, 10 సంవత్సరాల కుమార్తెను చంపి ఆ తర్వాత భర్త ఆత్మ చేసుకున్నాడు. బేగంపేట వద్ద రైలు కిందపడి భర్త గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆయన కుటుంబ సభ్యుల సమాచారం మేరకు..వృత్తి రిత్యా డాక్టరైన భర్త గణేష్ కుటుంబానికి గత కొంతకాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువైనట్లు తెలుస్తోంది. దీంతో భార్య, భర్తల మధ్య మనస్పర్దలు తలెత్తాయి. ఓ వైపపు అప్పుల బాధలు, మరోవైపు కుటుంబంలో కలహాలు తట్టుకోలేక గణేష్ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న బేగం పేట్ రైల్వే పోలీసులు,బోయిన్ పల్లి పోలీసులు గణేష్ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య, ఆత్మహత్యకు గల కారణాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
దళితుడి లాకప్డెత్?
సాక్షి, నంద్యాల : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ముచ్చుమర్రి మైనర్ బాలిక హత్యాచారం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల్లో ఒక దళిత వ్యక్తి శనివారం లాకప్డెత్కు గురైనట్లు తెలుస్తోంది. విచక్షణారహితంగా కొట్టడంతో పాటు థర్డ్ డిగ్రీ ఉపయోగించడంవల్లే అతని ప్రాణాలు పోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు.. మైనర్ బాలిక హత్యాచారం ఘటనతో సంబంధం ఉన్న అనుమానంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిచ్చిన సమాచారంతో గురువారం సాయంత్రం మరో ఆరుగురిని నందికొట్కూరు, ముచ్చుమర్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని మొదట జూపాడు బంగ్లా పోలీస్స్టేషన్కు తరలించి అక్కడ రెండు గంటల పాటు విచారించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసుల దెబ్బలు తాళలేక నిందితులు అరిచిన అరుపులు తమకు వినిపించాయని వారంటున్నారు.అయితే, ఈ విచారణలో నలుగురు వ్యక్తులకు ఈ ఘటనతో సంబంధంలేదని తేలడంతో వారిని వదిలేసి అంబటి హుస్సేన్ అలియాస్ యోహాన్ (36), అంబటి ప్రభుదాస్ను తమదైన శైలిలో గట్టిగా విచారించారు. వీరిద్దరినీ మిడుతూరు పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి శుక్రవారం అంతా విపరీతంగా కొట్టినట్లు సమాచారం. ఆ తర్వాత నంద్యాల పట్టణంలోని సీసీఎస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే, హుస్సేన్ మిడుతూరులో మృతిచెందితే నంద్యాల సీసీఎస్కు తరలించి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారా? లేక సీసీఎస్ పోలీస్స్టేషన్లో మృతిచెందిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారా అన్న దానిపై స్పష్టతలేదు.బంధువులతో రాజీ..ఇక హుస్సేన్ చనిపోయాడన్న సమాచారం తెలుసుకున్న బంధువులు శనివారం ఉదయాన్నే ముచ్చుమర్రి, నందికొట్కూరు నుంచి నంద్యాలకు బయల్దేరారు. మార్గమధ్యంలోనే పోలీసులు వీరిని అడ్డుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. అక్కడ లాకప్డెత్ విషయంలో రాజీకి ప్రయత్నించినట్లు సమాచారం. వీరితో సంతకం చేయించుకున్న తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అప్పటివరకు క్యాజువ్యాలిటీలోనే ఉ.6 నుంచి సా.4 వరకు మృతదేహాన్ని ఉంచారు. ఆయాసంతో చనిపోయాడంట..ఇక బాధితులతో రాజీ ప్రయత్నం సఫలం కావడంతో జిల్లా ఎస్పీ కార్యాలయం శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. హుస్సేన్ను అదుపులోకి తీసుకుని నందికొట్కూర్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్తుండగా నిందితుడు పోలీస్ వాహనం నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు హుస్సేన్ను పట్టుకోవడంతో తనకు ఆయాసంగా ఉందని, గుండెనొప్పిగా ఉన్నట్లు పోలీసులకు తెలిపాడని.. దీంతో పోలీసులు అతన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. (నిజానికి.. దగ్గర్లోని నందికొట్కూరు ఆస్పత్రికి తరలించకుండా 60 కి.మీ దూరంలోని నంద్యాలకు తరలించారు.) డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లు నిర్ధారించారని ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే, మిడుతూరు పోలీస్స్టేషన్లో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది.నోట్లో గుడ్డలు కుక్కి మరీ..నిజానికి.. హుస్సేన్, ప్రభుదాస్ ఇద్దరూ అన్నదమ్ములు. మైనర్ బాలిక హత్యాచారం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులలో ఒక బాలుడికి వీరు మేనమామ అవుతారని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటన జరిగిన తర్వాత నిందితుల్లో ఒకరైన పదో తరగతి బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని మాయం చేయడంలో హుస్సేన్ ప్రధాన పాత్ర పోషించాడని పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం.దీంతో మృతదేహం ఎక్కడ వేశారు.. ఆ సమయంలో ఎవరెవరున్నారు అన్న కోణంలో విచారణ సాగింది. ఈ సందర్భంగా మృతుడిని విచక్షణారహితంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. హుస్సేన్ రెండు చేతులు, వేళ్లు, కాళ్లు ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. డొక్క, వీపు భాగంలో గట్టిగా కొట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొట్టే సమయంలో బాధితుడు అరవకుండా నోట్లో గుడ్డ పేలికలు పెట్టినట్లు తెలుస్తోంది. చనిపోయిన తర్వాత మృతుడి నోరు తెరుచుకుని ఉండడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.రాజీ కుదిర్చిన టీడీపీ నేత?.. గుట్టుగా అంత్యక్రియలుమరోవైపు.. లాకప్డెత్ కేసులో నియోజకవర్గానికి చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధి తండ్రి రాజీ కుదిర్చినట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలిస్తామని చెప్పి రాజీచేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.ఆ నేత ఇచ్చిన హామీ మేరకు హుస్సేన్ మృతిపై బంధువులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. హుస్సేన్ మృతదేహాన్ని పోలీస్ ఎస్కార్ట్ సాయంతో అంబులెన్స్ ద్వారా రాత్రి ఎనిమిది గంటల సమయంలో నంద్యాల నుంచి పాత ముచ్చుమర్రికి తరలించి అక్కడి శ్మశాన వాటికలో ఉంచారు. కుటుంబ సభ్యులను మాత్రమే అక్కడికి అనుమతిచ్చి అంత్యక్రియలు గుట్టుగా పూర్తిచేయించారు. మృతుడికి తల్లి, ముగ్గురు సోదరులు, ఇద్దరు అక్కలు ఉన్నారు. తాళం వేసి పోస్టుమార్టం?మరోవైపు.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హుస్సేన్ మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రొ. డాక్టర్ రాజశేఖర్ దీనిని పూర్తిచేశారు. ఈ గదికి లోపల వైపు తాళం వేసి మరీ ఈ ప్రక్రియను చేపట్టారు. ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఎవరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశారు. లాకప్డెత్ కానప్పుడు తాళంవేసి రహస్యంగా పోస్ట్మార్టం చేయించాల్సిన అవసరమేంటని బంధువులు ప్రశ్నిస్తున్నారు. అధికారం అండతో కేసును లాకప్డెత్ కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్కు అక్కడి నుంచి ఆస్పత్రికి..ఇక పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున హుస్సేన్ మృతిచెందినట్లు తెలిసింది. కానీ, ప్రభుదాస్ ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడనే సమాచారం తెలీకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. అంతకుముందు.. హుస్సేన్ను హుటాహుటిన నంద్యాల సర్వజన ఆస్పత్రిలోని క్యాజువల్ వార్డుకు తరలించారు. పోలీసులు రోగుల సహాయకులను అక్కడ నుంచి పంపించేసి వార్డులోకి ఎవరూ వెళ్లకుండా కాపలా ఉన్నారు.హుస్సేన్ను మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్ స్టేషన్కు అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి ఉదయం 5–6 గంటల సమయంలో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్రెడ్డితో పాటు ఆరుగురు సీఐలు, నలుగురు ఎస్ఐలు దాదాపు 30 మంది కానిస్టేబుళ్లు ఆస్పత్రిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. మీడియా సిబ్బంది ఎవరూ ఆసుపత్రిలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా, మృతుడి ఫొటోలు మీడియాకు లభ్యం కావడంతో వాటిని పోలీసులే దగ్గరుండి మరీ తొలగించారు.విచారణలో సస్పెండ్ అయిన పోలీసులు?మైనర్ బాలిక హత్యాచారం ఘటనలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, మరో సబ్ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కేసులో మొదటి నుంచి వీరు ఉండడంతో సస్పెండ్ అయిన తర్వాత కూడా వీరు పోలీసు విచారణలో పాల్గొన్నట్లు అత్యంత శ్వసనీయంగా తెలిసింది. అనుమానితులను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేసే సమయంలో వీరిద్దరూ సంఘటన స్థలంలోనే ఉన్నట్లు సమాచారం. -
‘రాయల్’ దొంగ అరెస్టు
మోతీనగర్: జల్సాలకు అలవాటు పడి రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి అమ్ముతున్న ఓ దొంగను అల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సామల వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..అల్లాపూర్లో ఓ రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం దొంగతనం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అల్లాపూర్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా..గోల్కొండకు చెందిన సయ్యద్ సాహిల్ ఎన్ఫీల్డ్ వాహనానికి సంబంధించిన పేపర్లు పరిశీలించారు. అనుమానాస్పదంగా వ్యవహరించడంతో విచారించగా తాను రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకుకున్నాడు. జగద్గిరిగుట్ట, సనత్నగర్, జూబ్లీహిల్స్, జంజారాహిల్స్, మధురానగర్, అల్లాపూర్, పటాన్చెరు పోలీస్స్టేషన్ల పరిధిలో పలు రాయల్æఎన్ఫీల్డ్ వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దొంగ నుంచి 5 రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు, ఒక సెల్ఫోన్ను రికవరీ చేశారు. ఈ మేరకు సయ్యద్ సాహిల్ను అరెస్టు చేసినట్లు తెలిపారు.