ఆప్ పనితీరు చూద్దాం: పవార్
Published Tue, Dec 24 2013 11:28 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
నాసిక్: ఉల్లిగడ్డలతో పాటు ఇతర నిత్యావసర సరుకుల ధరలను తగ్గిస్తామన్న ఎన్నికల హామీని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎలా నెరవేరుస్తుందో చూద్దామని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శరద్పవార్ అన్నా రు. ఇంతకుముందు ఉల్లితో పాటు నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల వల్ల సుష్మా స్వరాజ్ నేతృత్వంలోని బీజేపీ, షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలు మట్టికరిచాయని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు ఏఏపీ వాటి ధరలను ఎలా నియంత్రిస్తుందో చూద్దామన్నారు. నంద్గావ్లో ఎన్సీపీ కార్యాలయాన్ని, పంచాయతీ సమితి కార్యాలయాన్ని పవార్ మంగళవారం ప్రారంభించారు.
Advertisement
Advertisement