ఆ ఫోన్ ఉన్నవారికి జియో ఎక్స్ట్రా డేటా | Reliance Jio is offering extra data to these customer | Sakshi

ఆ ఫోన్ ఉన్నవారికి జియో ఎక్స్ట్రా డేటా

Jun 12 2017 4:24 PM | Updated on Sep 5 2017 1:26 PM

ఆ ఫోన్ ఉన్నవారికి జియో ఎక్స్ట్రా డేటా

ఆ ఫోన్ ఉన్నవారికి జియో ఎక్స్ట్రా డేటా

రిలయన్స్ జియో ఎల్వైఎఫ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

న్యూఢిల్లీ : రిలయన్స్ జియో ఎల్వైఎఫ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ ఎల్వైఎఫ్ స్మార్ట్ ఫోన్లు వాడే కస్టమర్లకు 20 శాతం అదనపు డేటా ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది. మైఎల్వైఎఫ్ వెబ్ సైట్ లో ఈ విషయాన్ని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం రూ.6,600 నుంచి రూ.9,700 మధ్యలో ధర కలిగిన హ్యాండ్ సెట్ వాడే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అంటే వాటర్ సబ్ బ్రాండ్ మోడల్ కిందకి వచ్చే వాటిపై మాత్రమే  ఈ ఆఫర్ వర్తిస్తోంది. ఈ ప్రకటనతో ప్రస్తుతం 1జీబీ 4జీ ఉచిత డేటాను పొందుతున్న ఎల్వైఎఫ్ స్మార్ట్ ఫోన్లు కలిగిన యూజర్లు ఇకనుంచి రోజుకు 1.2జీబీ డేటా పొందనున్నారు.
 
ఇటీవలే ఎల్వైఎఫ్ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పడిపోయినట్టు రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఎల్వైఎఫ్ కస్టమర్ల కోసం స్పెషల్ గా ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ముందు కూడా ఎల్వైఎఫ్ స్మార్ట్ ఫోన్ హ్యాండ్ సెట్ ఉన్నవారికే రిలయన్స్ జియో ఆఫర్లు అందుబాటులో ఉండేవి. అనంతరం జియో ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంతో ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ కు ప్రస్తుతం ఈ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎల్వైఎఫ్ స్మార్ట్ ఫోన్లు రూ.2999 నుంచే అందుబాటులో ఉండటం, ఉచిత 4జీ డేటా వస్తుండటంతో అప్పట్లో ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో సంచలనం సృష్టించాయి. రిలయన్స్ జియో 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ స్మార్ట్ ఫోన్లు అన్ని రిలయన్స్ రిటైల్స్ లోనూ దొరుకుతున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement