ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్దార్
కాజీపేట్: లంచం తీసుకుంటూ కాజీపేట్ డిప్యూటీ తహశీల్దార్ ఏసీబీకి దొరికాడు. ఓ రైతు నుంచి రూ.6 లక్షలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్ అనిల్కుమార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. హన్మకొండ టీచర్స్ కాలనీ ఫేస్-2 లో ఉన్న ఆయన ఇంట్లో ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.