‘మరోసారి ఆశీర్వదించండి’ | BB Patil Said To People Give Me One Chance In Elections | Sakshi
Sakshi News home page

‘మరోసారి ఆశీర్వదించండి’

Apr 8 2019 3:10 PM | Updated on Apr 8 2019 3:10 PM

BB Patil Said To People Give Me One Chance In Elections - Sakshi

సభలో మాట్లాడుతున్న బిబి పాటిల్‌

తాడ్వాయి(ఎల్లారెడ్డి): తనను మరోసారి ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని జహీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్‌ కోరారు. తాడ్వాయిలో ఆదివారం టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పాస్‌పోర్టు కార్యాలయం మంజూరుకు తన వంతు కృషి చేశానన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయిస్తానని హామీ ఇచ్చారు.

బీబీపాటిల్‌ను భారి మెజారిటీతో గెలిపించాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీలను చిత్తుగా ఓడించాలన్నారు. ఎంపీపీ బసంత, జెడ్పీటీసీ మద్ది సావిత్రి, రుద్రమదేవి, రవీందర్‌రెడ్డి సతీమణి మంజుల, పులుగం సాయిరెడ్డి, మహేందర్‌రెడ్డి, శ్యాంరావు, వెంకట్‌రాంరెడ్డి, సాయిరెడ్డి, గడ్డం రాంరెడ్డి, నర్సారెడ్డి, గోపాల్‌రావు, రఘుపతిరెడ్డి, సంజీవులు, నర్సింలు, జైపాల్‌రెడ్డి, కృష్ణమూర్తి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement