వరంగల్: జ్యోతిరావు పూలే 189వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం ఉదయం వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు జంక్షన్ వద్ద పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్భాస్కర్, జిల్లా కలెక్టర్ వాకాటి కర్ణ పాల్గొన్నారు.