వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో పలువురిని నియమిస్తూ రాష్ర్ట పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.
హైదరాబాద్: వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో పలువురిని నియమిస్తూ రాష్ర్ట పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. రాష్ర్ట పార్టీ కార్యదర్శులుగా కె.రుక్మారెడ్డి (రంగారెడ్డి), సయ్యద్ అలీ సయ్యద్ (హైదరాబాద్), సంయుక్త కార్యదర్శులుగా మహ్మద్ అష్వఖ్అలీఖాన్, జెఎల్ మేరీ, డాక్టర్ ఎం.వరలక్ష్మీ, మహ్మద్ అజ్మేరీ ఖురేషి, రాష్ట్రకార్యాలయంలో పదిజిల్లాల సమన్వయకర్తగా ఆరె లింగారెడ్డి(నల్లగొండ) నియమితులయ్యారు.
అనుబంధ విభాగాలకు.. పార్టీ రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శిగా జాలా మహేశ్యాదవ్ (హైదరాబాద్ జిల్లా), రాష్ట్ర విద్యార్తి విభాగం కార్యదర్శిగా కుక్కల హనుమంతరెడ్డి (నల్లగొండ జిల్లా)లను నియమించారు. మహిళా విభాగం ప్రధానకార్యదర్శిగా ఇందిరారెడ్డి.. పార్టీ రాష్ట్ర మహిళావిభాగం ప్రధానకార్యదర్శి సింగిరెడ్డి ఇందిరారెడ్డి (కరీంనగర్జిల్లా), కార్యదర్శులుగా కట్టా సంధ్యారాణి (కరీంనగర్జిల్లా), ఎస్కె బీబీజాన్ (హైదరాబాద్) నియమితులయ్యారు.