మణుగూరు ఎక్స్ ప్రెస్ లో బంగారు గొలుసు చోరీ | gold chain robbed in manugur express | Sakshi
Sakshi News home page

మణుగూరు ఎక్స్ ప్రెస్ లో బంగారు గొలుసు చోరీ

Published Sun, Mar 29 2015 2:52 PM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM

సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్న మణుగూరు ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి చోరీ జరిగింది.

వరంగల్: సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్న మణుగూరు ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి చోరీ జరిగింది. వివరాలు...వరంగల్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కేస సముద్రం రైల్వేస్టేషన్‌లో రైలు ఆగింది. సికింద్రాబాద్ న్యూబోయిన్‌పల్లికి చెందిన తాళ్ల విజయలక్ష్మి ఈ రైలులో కుటుంబంతో కలిసి భద్రాచలం బయలుదేరింది. కిటికీ పక్కన కూర్చున్న విజయలక్ష్మి మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి లాక్కెళ్లాడు. చేసేదేమీ లేక తిరిగి వరంగల్ చేరుకుని రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వరంగల్ జీఆర్‌పీ సీఐ రవికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement