హైదరాబాద్: పంచాయతీలకు విధులతో పాటు నిధులు కూడా ఇస్తేనే గ్రామజ్యోతి పథకం విజయవంతం అవుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. గ్రామజ్యోతి పథకం ప్రచార ఆర్భటంగానే కనిపిస్తోందన్నారు. గ్రామ పాలనా సిబ్బంది భర్తీ, పంచాయతీల ఆర్థిక నిర్వహణ భారాన్ని ప్రభుత్వమే చేపట్టాలన్నారు. పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.