
కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటన దురదృష్టకరం: కేసీఆర్
బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు.
హైదరాబాద్ : బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన కాల్పుల ఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు. కాల్పుల ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన బుధవారం మాట్లాడుతూ ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు జరుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి,భద్రతలపై గురువారం సభలో చర్చ పెట్టాలని కేసీఆర్ అన్నారు. కాల్పుల ఘటనపై సభలో ప్రకటన చేస్తామని కేసీఆర్ తెలిపారు. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఈరోజు ఉదయం ఆగంతకుడు ఏకే 47తో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.