చెరువులో పడి వ్యక్తి మృతి | Man dies in Pond | Sakshi
Sakshi News home page

చెరువులో పడి వ్యక్తి మృతి

Published Sat, Sep 5 2015 4:56 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Man dies in Pond

నెన్నల్ (ఆదిలాబాద్) : ఓ వ్యక్తి చెరువులో పడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నెన్నల్ మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గుండ్ల సోమారం గ్రామానికి చెందిన రైతు చింత స్వామి(32) పొలం పనులు ముగించుకుని తిరిగి వస్తూ చెరువులోకి స్నానానికి దిగాడు. అయితే చెరువు నీటిలోని తుంగ కాళ్లకు చుట్టుకుని మునిగి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement