
సాక్షి, సిద్దిపేట: ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని పారిశుధ్య కార్మికులను శుక్రవారం ఉదయం సన్మానించారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు. కొండమల్లయ్య గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. కోవిడ్ పోరులో పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి కొనియాడారు.