సరి‘హద్దు’ దాటిన టిక్‌టాక్‌ ప్రేమ` | Siddipet Tik Tok Duo Desires To Marry Anantapur Youth | Sakshi
Sakshi News home page

సరి‘హద్దు’ దాటిన టిక్‌టాక్‌ ప్రేమ

Nov 11 2019 6:59 AM | Updated on Nov 11 2019 7:49 AM

Siddipet Tik Tok Duo Desires To Marry Anantapur Youth - Sakshi

సిద్దిపేట జిల్లా, గజ్వేల్‌ మండలం ముక్తమా సనపల్లి గ్రామానికి చెందిన సౌందర్య, మమత అనంతపురం జిల్లా బొమ్మన హాళ్‌ మండలం దర్గాహొన్నూరు గ్రామానికి చెందిన వన్నూరు స్వామి, వంశీలకు టిక్‌టాక్‌లో పరిచయమ య్యారు.  

బొమ్మనహాళ్‌: టిక్‌టాక్‌ ద్వారా పరిచయమైన యువకులను పెళ్లి చేసుకునేందుకు అనంత పురం జిల్లా బొమ్మనహాళ్‌కు వచ్చిన ఇద్దరు తెలంగాణ యువతులను పోలీసులు ఆదివా రం వారి తల్లిదండ్రుల వెంట పంపారు.  సిద్దిపేట జిల్లా, గజ్వేల్‌ మండలం ముక్తమా సనపల్లి గ్రామానికి చెందిన సౌందర్య, మమత అనంతపురం జిల్లా బొమ్మన హాళ్‌ మండలం దర్గాహొన్నూరు గ్రామానికి చెందిన వన్నూరు స్వామి, వంశీలకు టిక్‌టాక్‌లో పరిచయమ య్యారు.  అది ప్రేమగా మారింది. దీంతో యువతులిద్దరూ ఈ నెల 7న దర్గా హొన్నూరు గ్రామానికి చేరుకుని తమను వివాహం చేసుకో వాలని యువకులను పట్టుబట్టారు.
(చదవండి : పెళ్లి చేసుకున్న టిక్‌టాక్‌ జోడీ )

గ్రామ స్తులు జోక్యం చేసుకుని యువతులిద్దరికీ సర్దిచెప్పి వారి స్వస్థలానికి పంపించే ప్రయ త్నం చేసినా వారు వినిపించుకోలేదు. దీంతో ప్రేమ పంచాయతీ బొమ్మనహాళ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. ఎస్‌ఐ రమణారెడ్డి యువతు లతో మాట్లాడి వారిని కళ్యాణ దుర్గంలోని ఉజ్వల హోంకు తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. యువతుల తల్లిదండ్రులు ఆదివారం బొమ్మనహాళ్‌  పోలీస్‌ స్టేషన్‌కు రాగా.. యువతులిద్దరికీ నచ్చజెప్పి వారి తల్లిదండ్రుల వెంట పంపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement