TikTok
-
యాప్ స్టోర్లో టిక్టాక్ పునరుద్ధరణ!
చైనాకు చెందిన బైట్డ్యాన్స్ యాజమాన్యంలోని టిక్టాక్ యాప్ను తన యూఎస్ యాప్ స్టోర్లో పునరుద్ధరిస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. కొంతకాలంగా యాప్పై నిషేధం ఉంది. దాంతో ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు ఈ యాప్ను తొలగించాయి. ఈ యాప్ను హోస్ట్ చేసినందుకు కంపెనీలు జరిమానాలు ఎదుర్కోబోవని తాజాగా అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ హామీ ఇచ్చారు. దాంతో తిరిగి యూఎస్లోని యాప్ స్టోర్లో యాపిల్ దీన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకుంది.అసలు వివాదం ఏమిటి?చైనాకు చెందిన బైట్డ్యాన్స్(ByteDance) ఆధ్వర్యంలోని టిక్టాక్ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. టిక్టాక్పై నిషేధం ఉత్తుర్వులను తాము అధికారంలోకి వచ్చేదాకా నిలుపుదల చేయాలని ట్రంప్ తరఫు లాయర్లు కోర్టును కోరారు. అయినాసరే వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కంటే దేశభద్రత ముఖ్యమని తేల్చిచెబుతూ కోర్టు 2025 జనవరి 17న వ్యాఖ్యానించింది.భద్రతపై ఆందోళనలుఅమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో గత అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది. యూజర్ లొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికన్లు చూసే కంటెంట్ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్టాక్ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: లవర్స్డే రోజున బంగారం గిఫ్ట్ ఇస్తున్నారా? తులం ఎంతంటే..ఈ నేపథ్యంలో బైట్డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్టాక్ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా టిక్టాక్ను పునరుద్ధరించే ప్రణాళికలను ప్రకటించారు. 75 రోజుల పాటు నిషేధం అమలును వాయిదా వేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు టిక్టాక్ తన సేవలను పునరుద్ధరించినట్లు ధ్రువీకరించింది. -
టిక్టాక్ యాప్ ఉన్న ఫోన్ రూ.43 కోట్లు?
భారతదేశంలో టిక్టాక్(TikTok)ను పూర్తిగా నిషేధించినప్పటికీ.. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ చైనా యాప్పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే ఇటీవల అమెరికా దీనిపై నిషేధం విధించింది. దీంతో చాలామంది యూజర్లు.. ఇకపై టిక్టాక్ ఉండదని, యాప్ అన్ఇన్స్టాల్ చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో మళ్ళీ వారు ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. కాగా ఈ యాప్ ఉన్న ఫోన్ల ధరలు యూఎస్ఏలో భారీగా పెరిగినట్లు కొన్ని సోషల్ మీడియా పోస్టులు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం.. టిక్టాక్ యాప్ ఉన్న 'ఐఫోన్ 15 ప్రో 125 జీబీ' మోడల్ ధర 5 మిలియన్ డాలర్లు (రూ. 43కోట్లు) అని తెలుస్తోంది.నేను టిక్టాక్ తొలగించాను.. ఇప్పుడు దానిని ఇన్స్టాల్ చేయలేకపోతున్నాను. టిక్టాక్ యాప్ ఉన్న ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉన్నవాళ్లు.. ఎవరైనా విక్రయించదలిస్తే.. వారికి 5000 డాలర్లు (రూ. 4.3 లక్షలు) ఇస్తాను అని ఓ వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.I deleted TikTok and now I can’t get it back! I will pay someone $5,000 for an iPhone 16 Pro Max with TikTok still installed. DM me.— Terrell from Sales (@Terrell_2_Cold) January 20, 2025సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు చూస్తుంటే.. అమెరికా ప్రజలు టిక్టాక్కు ఎంతగా అలవాటు పడ్డారో అర్థమవుతోంది. ఈ ఒక్క యాప్ ఉన్న మొబైల్ ఫోన్స్ కోసం లక్షలు, కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా ఏ మాత్రం వెనుకాడటం లేదు.ఇదీ చదవండి: ఊహించని రేటుకు చేరిన బంగారం.. అదే బాటలో వెండినిజానికి జనవరి 19న టిక్టాక్ నిషేధం అమల్లోకి వచ్చింది. కానీ 12 గంటల్లోనే ఆ నిషేధం ఎత్తివేశారు. అప్పటికే ఈ యాప్ అన్ఇన్స్టాల్ చేసుకున్నవారు.. మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ.. ప్రస్తుత యూఎస్ చట్టపరమైన కారణాల కారణంగా డౌన్లోడ్ కావడం లేదు. దీంతో మళ్ళీ టిక్టాక్ పొందటానికి.. యాప్ ఉన్న మొబైల్ ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.This is INSANE! eBay is full of phones with TikTok already downloaded on it selling for thousands!! pic.twitter.com/juxXtINQ9z— Gentry Gevers (@gentrywgevers) January 22, 2025 -
‘ఏ తప్పు చేయనప్పుడు క్షమాభిక్షలు దేనికి?’
క్యాపిటల్ ఘటనలో నిందితులకు క్షమాభిక్ష, టిక్టాక్ అంశంతోపాటు పలు ఆసక్తికర అంశాలపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం తొలిసారి వ్యక్తిగత ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఫాక్స్ న్యూస్ ఛానెల్ ప్రతినిధి సీన్ హన్నిటీ అధ్యక్షుడు ట్రంప్ను పలు ఆసక్తికర అంశాలపై ప్రశ్నలు సంధించగా.. తనదైన శైలిలో ఆయన స్పందించారు.టిక్ టాక్ బ్యాన్పై.. చైనాలో ఆ యాప్ తయారైందని మీరు అంటున్నారు. కానీ, ఆ దేశంలో ఇంకా చాలా తయారవుతున్నాయి. మరి ఇక్కడ వాటి ప్రస్తావన ఎందుకు రావడం లేదు. కేవలం అమెరికా యువతపై నిఘా పెట్టడమే చైనా పనా?. యువత కేవలం సరదా కాలక్షేపం కోసం మాత్రమే ఆ యాప్ను ఉపయోగిస్తున్నారు. టిక్టాక్పై తాజాగా అమెరికా నిషేధం విధించగా.. దానిని ఎత్తివేసే ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టింది👉కాపిటల్ భవనంపై దాడి కేసులో.. చాలా మంది అమాయకులు. అర్థమైందా?. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ హిల్(Capitol Hill) భవనంపై జరిగిన దాడి ఘటనలో పాల్గొన్న 1,600 మందికి ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. ఆ అల్లర్లలో పాల్గొన్న తన మద్దతుదారులను విడుదల చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.👉జో బైడెన్(Joe Biden) పోతూపోతూ..విశిష్ట అధికారాలను ఉపయోగించి స్వీయ క్షమాభిక్ష పెట్టుకున్నారు. తన కుటుంబ సభ్యులతో సహా తనకు కావాల్సిన వాళ్లకు క్షమాభిక్షలు ప్రసాదించుకున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. గతంలో నేను అధ్యక్షుడిగా దిగిపోయే సమయంలో.. నన్ను అలా చేయమని నా చుట్టూ ఉన్న అధికారులు సూచించారు. చివరకు.. నాకు నేనుగా క్షమాభిక్ష విధించుకునే ఆప్షన్ను కూడా నా ముందు ఉంచారు. కానీ, నేనెవరికీ క్షమాభిక్ష ప్రసాదించే ఉద్దేశం లేదని చెప్పా. మేం ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటప్పుడు క్షమాభిక్ష ఎందుకు?. మా వాళ్లంతా దేశభక్తులే అని అన్నారాయన.👉ఓవల్ ఆఫీస్(అమెరికా అధ్యక్ష కార్యాలయం)కు తిరిగి రావడంపై.. స్పందిస్తూ.. ఇక్కడ బోలెడంత పని ఉంది. ద్రవ్యోల్బణం, యుద్ధాలు.. ఇలా ఎన్నో సంక్షోభాలు నడుస్తున్నాయి. అసలు ఈ టైంలో మనం ఇక్కడ ఉండాల్సింది కాదు(నవ్వుతూ..). 👉లాస్ ఏంజెల్స్ కార్చిచ్చుపై.. ఇది ముమ్మాటికీ ఆ రాష్ట్ర గవర్నర్ గావిన్ న్యూసోమ్ చేతకానితనమే. ఉత్తరాది నుంచి వచ్చే నీటిని అతను విడుదల చేయాల్సి ఉంది. తద్వారా మంటలను కట్టడి చేసే అవకాశం ఉండేది.👉అక్రమ వలసదారుల్లో(Illegal Immigrants) నేరస్తుల సంఖ్య అధికంగానే ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి 2 కోట్లకు పైగా నేరస్తులు అమెరికాకు అక్రమంగా వలసలు వచ్చారు!. బైడెన్ పాలనతో ప్రపంచంలోని జైళ్లన్నీ ఖాళీగా మగ్గుతున్నాయి(సెటైరిక్గా). వలసదారుల చట్టం అమలు కోసం శాంక్చురీ సిటీలకు కేటాయించే ఫెడరల్ ఫండ్స్కు కోత విధించాల్సిన అవసరం ఉంది. నేను చేయగలిగిన పని అదొక్కటే అనిపిస్తోంది. 👉దేశంలో ఉగ్రవాదుల సంఖ్య పెరిగిపోయింది. వాళ్ల లెక్కలు తేల్చాల్సి ఉంది. -
అమెరికాలో టిక్ టాక్ నిలిపివేత.. నిషేధానికి ముందే చైనా కంపెనీ నిర్ణయం
-
టిక్టాక్ పునరుద్ధరణ.. ట్రంప్ పుణ్యమే..!
అమెరికాలో టిక్టాక్ తన సేవలను పునరుద్ధరించిందని, అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇందుకు కారణమని పేర్కొంది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ తాత్కాలికంగా నిలిచిపోతుందని అందరూ భావించారు. ఇది మిలియన్ల మంది అమెరికన్ వినియోగదారులపై ప్రభావం చూపుతుందని అనుకున్నారు. అయితే, ట్రంప్ జోక్యంతో యాప్ను తిరిగి పునరుద్ధరించడంతో యూజర్లకు ఊరట లభించింది.ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా టిక్టాక్ను పునరుద్ధరించే ప్రణాళికలను ప్రకటించారు. మిలియన్ల మంది అమెరికన్లు ఈ యాప్పై ఆధారపడ్డారని ఆయన నొక్కిచెప్పారు. ఈ యాప్ యూఎస్లో కొనసాగేలా, ఇది నిరంతరం వినియోగదారులకు అందుబాటులో ఉండేలా మధ్యవర్తిత్వం వహిస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇది సర్వీస్ ప్రొవైడర్లకు అవసరమైన స్పష్టతను అందించింది. దాంతోపాటు టిక్టాక్ జరిమానాలు ఎదుర్కోకుండా తాత్కాలికంగా కాపాడినట్లయింది.అసలు వివాదం ఏమిటి?చైనాకు చెందిన బైట్డ్యాన్స్(ByteDance) ఆధ్వర్యంలోని టిక్టాక్ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. టిక్టాక్పై నిషేధం ఉత్తుర్వులను తాము అధికారంలోకి వచ్చేదాకా నిలుపుదల చేయాలని ట్రంప్ తరఫు లాయర్లు కోర్టును కోరారు. అయినాసరే వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కంటే దేశభద్రత ముఖ్యమని తేల్చిచెబుతూ కోర్టు 2025 జనవరి 17న వ్యాఖ్యానించింది.భద్రతపై ఆందోళనలుఅమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో గత అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది. యూజర్ లొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికన్లు చూసే కంటెంట్ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్టాక్ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో బైట్డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్టాక్ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. తాజాగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా టిక్టాక్ను పునరుద్ధరించే ప్రణాళికలను ప్రకటించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు టిక్టాక్ తన సేవలను పునరుద్ధరించినట్లు ధ్రువీకరించింది.ఇదీ చదవండి: ఆరోపణలపై పోరాడేందుకు న్యాయ సంస్థల నియామకంభవిష్యత్తుపై ప్రశ్నలుటిక్టాక్కు తక్షణ సంక్షోభం తప్పినప్పటికీ, అమెరికాలో కంపెనీ భవిష్యత్తుపై ప్రశ్నలు వస్తున్నాయి. అమెరికాలో తన కార్యకలాపాలు సాగించాలంటే మాత్రం ఏదైనా యూఎస్ కంపెనీతో చైనీస్ మాతృసంస్థ బైట్ డాన్స్ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని ట్రంప్ సూచించారు. అందులో అమెరికన్ ఇన్వెస్టర్లు కనీసం 50 శాతం వాటా కలిగి ఉండాలి. అమెరికాలో ఈ యాప్ కార్యకలాపాలు కొనసాగేలా చూస్తూనే జాతీయ భద్రతా సమస్యలను పరిష్కరించడం సవాలుగా మారనుంది. -
టిక్ నో టాక్
స్వల్పనిడివి వీడియో మెసెంజింగ్ యాప్గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరి స్మార్ట్ఫోన్లలో స్థానం సంపాదించిన టిక్టాక్ యాప్ ఇప్పుడు అమెరికాలో అదృశ్యం కానుంది. ఆదివారం (జనవరి 19వ తేదీ) నుంచి అమెరికాలో యాప్ సేవలు దాదాపు ఆగిపోయినట్లేనని టిక్టాక్ యాజమాన్యం శుక్రవారం అర్ధరాత్రిదాటాక ఒక ప్రకటనలో పేర్కొంది. యాప్ యూజర్ల డేటా దాని మాతృ సంస్థ అయిన ‘బైట్డ్యాన్స్’ద్వారా చైనా వామపక్ష ప్రభుత్వానికి చేరుతోందని అమెరికా ప్రధాన ఆరోపణ. చైనాతో బంధం తెంచుకుని, టిక్టాక్ను ఆదివారంకల్లా అమెరికా కేంద్రంగా పనిచేసే ఏదైనా అమెరికన్ కంపెనీకి అమ్మేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా దేశ సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టంచేసినప్పటికీ బైట్డ్యాన్స్ ఈ దిశగా అడుగులువేయలేదు. దీంతో అమెరికాలో టిక్టాక్ సేవలు నేటి నుంచి నిలిచిపోనున్నాయి. వినోదం పంచిన యాప్ తర్వాత దేశభద్రత అంశంతో ముడిపడి చివరకు అగ్రరాజ్యాన్నే వదిలేస్తున్న వైనం ఆద్యంతం ఆసక్తిదాయకం. అగ్రస్థానం నుంచి అదృశ్యం దాకా.. చైనా వ్యాపారి ఝాంగ్ యిమిన్ 2012లో బైట్డ్యాన్స్ అనే సంస్థను స్థాపించారు. తర్వాత రెండేళ్లకు అలెక్స్ ఝూ అనే వ్యాపారి Musical.ly అనే స్టార్టప్ను రూపొందించాడు. వీడియోలకు తగ్గట్లు పెదాలు కదిలిస్తూ వీడియో తీసి అప్లోడ్ చేసే యాప్గా దీనిని అందుబాటులోకి తెచ్చాడు. ఇది 2015 జూలైకల్లా ఆపిల్ యాప్స్టోర్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ Musical.ly ను బైట్డ్యాన్స్ ఒక బిలియన్ డాలర్లకు కొనుగోలుచేసి సొంత ‘డౌయిన్’యాప్లో విలీనంచేసి విదేశీ యూజర్ల కోసం కొత్తగా టిక్టాక్ యాప్ను తెచ్చింది. ర్యాపర్ లిల్ నాస్ ‘ఓల్డ్ టౌన్ రోడ్’పాటకు చేసిన డ్యాన్స్ వీడియో టిక్టాక్లో పాపులర్ అవడంతో అందరూ టిక్టాక్ బాట పట్టారు. పాపులర్ డ్యాన్స్ స్టెప్పులు, వంటల విశేషాలు, బ్యూటీ టిప్స్, పాటలకు తగ్గ పార్ఫార్మెన్స్ ఛాలెంజ్లను ప్రోత్సహిస్తూ సాగే వీడియోలతో టిక్టాక్ అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా నంబర్వన్ షార్ట్వీడియో మెసేజింగ్ యాప్గా అవతరించింది. చైనా వ్యతిరేకత అస్సలు కనపడదు ట్రెండింగ్లో ఉన్న ప్రతి అంశం ఒక పాటగానో, డ్యాన్స్గానో టిక్టాక్లో ప్రత్యక్షమైనా చైనా వ్యతిరేక వీడియోలు మాత్రం అస్సలు కనబడవు. 1989 తియాన్మెన్స్కే్వర్ ఉద్యమం, నాటి ఊచకోత, టిబెటన్ల స్వాతంత్య్రపోరాటం, హాంకాంగ్లో ప్రజాస్వామ్య ఉద్యమంపైనా అన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు కనిపించినా టిక్టాక్లో మాత్రం అలాంటివేమీ దర్శనమివ్వలేదు. కానీ ట్రంప్కు మద్దతు పలుకుతూ పెట్టిన #trump2020 హ్యాష్ట్యాగ్తో వచ్చిన పోస్టులు మాత్రం కోట్లాదిగా షేర్ అయ్యాయి. 2019లో అమెరికాలో తొలి ఆందోళన సెన్సార్టవర్ అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్గా టిక్టాక్ నిలిచింది. టిక్టాక్కు ప్రస్తుతం అమెరికాలో 17 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అయితే అమెరికా సైన్యానికి చెందిన సమాచారాన్ని టిక్టాక్ తన మాతృసంస్థకు చేరవేస్తోందని 2019లో తొలిసారిగా ఆందోళన వ్యక్తమైంది. దీంత అన్ని స్మార్ట్ఫోన్లలో టిక్టాక్ యాప్ తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలిచి్చంది. అయినాసరే విపరీతంగా యాప్కు బానిసలుగా మార్చేసి అమెరికా చిన్నారుల పరిరక్షణా చట్టాలను టిక్టాక్ ఉల్లంఘిస్తోందని 2020 లో ప్రైవసీ సంస్థలు ఆందోళనకు దిగాయి. దీంతో తాము అమెరికన్లకు దగ్గరి వాళ్లమని మభ్యపెట్టేందుకు డిస్నీ ఉన్నతాధికారి కెవిన్ మేయర్కు టిక్టాక్ తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించుకుంది. భారత్లో బ్యాన్ సరిహద్దుల్లో చైనా సైనికులతో ఘర్షణ తర్వాత జాతీయభద్రత ప్రమాదంలో పడిందని పేర్కొంటూ భారత్ టిక్టాక్ను 2020 జూలైలో నిషేధించింది. కోవిడ్ సంక్షోభంలో వాస్తవాలను ప్రపంచానికి వెల్లడించని చైనాకు బుద్ధిచెప్పేందుకైనా టిక్టాక్ను నిషేధించాలని డొనాల్డ్ ట్రంప్ సైతం నిషేధాన్ని సమరి్థంచారు. 90 రోజుల్లోపు అమెరికా నుంచి వైదొలిగితే మంచిదని 2020 ఆగస్ట్లో ట్రంప్ ఒక ప్రభుత్వ ఉత్తర్వు జారీచేశారు. తర్వాత టిక్టాక్ను కొనేందుకు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, వాల్మార్ట్ ప్రయతి్నంచినా అది కార్యరూపం దాల్చలేదు. బైడెన్ వచ్చాక.. 2021 ఫిబ్రవరిలో కొత్త అధ్యక్షుడు బైడెన్ టిక్టాక్పై నిషేధానికి ట్రంప్ ఇచి్చన ఉత్తర్వులు అమలుకాకుండా మూలనపడేశారు. అయితే బక్కచిక్కిపోయేలా అతి ఆహార నియమాల వంటి తప్పుడు సూచనలు ఇచ్చే వీడియోల వరద టిక్టాక్లో ఎక్కువైందని వాల్స్ట్రీట్ జర్నల్ ఒక నివేదిక ఇవ్వడంతో టిక్టాక్పై బైడెన్ మళ్లీ దృష్టిసారించారు. అమెరికాలో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుంటూనే ఇన్స్టా గ్రామ్ను వెనక్కినెట్టి ప్రపంచంలో అత్యధిక డౌన్లోడ్లు జరిగిన యాప్గా టిక్టాక్ చరిత్ర సృష్టించింది. వంద కోట్ల మంది నెలకు తమ యాప్ వాడుతున్నారని ప్రకటించింది. మరోవైపు అమెరికా యూజర్ల డేటా భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో నష్టపరిహార చర్యలకు టిక్టాక్ దిగింది. అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ పర్యవేక్షణలో ఉండే సర్వర్లకు డేటాను బదిలీచేస్తున్నట్లు ప్రకటించింది. రంగంలోకి ఎఫ్బీఐ జాతీయ భద్రత కీలకాంశం కావడంతో అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. అమెరికన్లను ప్రభావితం చేసేలా యాప్ అల్గారిథమ్ను చైనా మాతృసంస్థ మార్చేస్తోందని ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ వ్రే 2022 డిసెంబర్లో ఆరోపించారు. 30 రోజుల్లోపు అన్ని ప్రభుత్వం జారీచేసిన స్మార్ట్ఫోన్ల నుంచి యాప్ను తీసేయాలని శ్వేతసౌధం 2023 ఫిబ్రవరిలో ఆదేశాలిచి్చంది. యాప్ నిబద్ధతపై టిక్టాక్ సీఈవో షూఝీ ఛెవ్ను మార్చిలో అమెరికా పార్లమెంటరీ కమిటీ గంటలతరబడి ప్రశ్నించింది. నిషేధానికి తొలి అడుగు అమెరికన్ సంస్థకు టిక్టాక్ను అమ్మాలని లేదంటే నిషేధిస్తామని 2024 మార్చిలో అమెరికా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఆమోదం పొందిన బిల్లుపై 2024 ఏప్రిల్లో అధ్యక్షుడు బైడెన్ సంతకంచేశారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై బైట్డ్యాన్స్ కోర్టును ఆశ్రయించింది. మిగతా యాప్లను వదిలేసి మా సంస్థపైనే ప్రభుత్వం కక్షగట్టిందని వాదించింది. అయితే నిషేధాన్ని సమరి్థస్తూ ఫెడరల్ అప్పీళ్ల కోర్టు 2024 డిసెంబర్ ఆరున తీర్పు చెప్పింది. మాట మార్చిన ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిషేధిస్తానని ప్రతిజ్ఞచేసిన ట్రంప్ ఆ తర్వాత పదవి నుంచి దిగిపో యాక మాటమార్చారు. 2024 జూన్లో మళ్లీ టిక్టాక్ ఖాతా తెరచి ఈ యాప్కు మద్దతు పలికారు. టిక్టాక్ను నిషేధిస్తే ఫేస్బుక్కు లాభం చేకూరుతుందని ట్రంప్ వింత వాదన చేశారు. టిక్టాక్పై నిషేధం ఉత్తుర్వులను తాము అధికారంలోకి వచ్చేదాకా నిలుపుదల చేయాలని ట్రంప్ తరఫు లాయర్లు సుప్రీంకోర్టును కోరారు. అయినాసరే వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కంటే దేశభద్రత ముఖ్యమని తేల్చిచెబుతూ కోర్టు 2025 జనవరి 17న వ్యాఖ్యానించింది. పొలోమంటూ రెడ్నోట్ డౌన్లోడ్ టిక్టాక్ కనుమరుగు దాదాపు ఖాయంకావడంతో ఇప్పటికే ఇలాంటి వీడియోలకు బానిసలైన అమెరికన్లు వెంటనే రెడ్నోట్ యాప్కు జై కొట్టారు. దీంతో అమెరికాలో అత్యంత ఎక్కువ డౌన్లోడ్లు ఉన్న యాప్గా రెడ్నోట్ రికార్డు సృష్టించింది. అయితే రెడ్నోట్ కూడా చైనా యాప్ కావడం విశేషం. లైఫ్స్టైల్ సోషల్మీడియా యాప్ అయిన రెడ్నోట్లోనూ చిన్నపాటి వీడియోలు చేయొచ్చు. ఫొటోలు, సందేశాలు పంపొచ్చు. లైవ్ స్ట్రీమింగ్, షాపింగ్ చేసుకోవచ్చు. గ్జియోహోంన్షు యాప్నే సులభంగా రెడ్నోట్గా పిలుచుకుంటారు. దీనిని ప్రస్తుతం 30 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. బద్ధశత్రువుల దేశాలకు చెందిన పౌరులు ఒకే ప్లాట్ఫామ్లను ఆశ్రయించడం వింతే. ఇన్స్టా గ్రామ్, ‘ఎక్స్’యాప్లను చైనీయులు వాడలేరు. చైనా ఇంటర్నెట్లో వీటిని అక్కడి ఫైర్వాల్స్ అడ్డుకుంటాయి. మరోవైపు చైనా యూజర్లు టిక్టాక్ను వాడలేరు. వీళ్లనూ బుట్టలో వేసుకునేందుకు వాళ్ల కోసం చైనాలోనే డౌయిన్ అనే యాప్ను బైట్డ్యాన్స్ అందుబాటులో ఉంచింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టిక్టాక్పై నిషేధం సబబే
వాషింగ్టన్: చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్టాక్పై అమెరికాలో నిషేధం విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీకోర్టు శుక్రవారం సమర్థించింది. ఈ నిషేధం ఆదివారం నుంచే అమల్లోకి రానుంది. చైనాలోని టిక్టాక్ మాతృ సంస్థ టిక్టాక్ను ఇతరులకు విక్రయించకపోతే నిషేధాన్ని అమల్లోకి తీసుకురావొచ్చని అమెరికా సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఒకవేళ ఇతరులకు విక్రయించిన పక్షంలో నిషేధం అవసరం లేదని వెల్లడించింది. టిక్టాక్తో చైనాకు సంబంధాలు ఎప్పటిలాగే కొనసాగితే అమెరికా జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని, అందుకు తాము అనుమతించలేమని న్యాయస్థానం స్పష్టంచేసింది. అమెరికాలో టిక్టాక్ యాప్ను 17 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. టిక్టాక్పై నిషేధం విధించి వారి భావప్రకటనా స్వేచ్ఛను హరించవద్దన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, భావప్రకటనా స్వేచ్ఛ కంటే దేశ భద్రతే ముఖ్యమని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. టిక్టాక్పై నిషేధం విధిస్తూ జో బైడెన్ ప్రభుత్వం చట్టం తీసుకొచి్చంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న బాధ్యతలు చేపట్టబోతున్నారు. యాప్పై ఆంక్షలను 90 రోజులపాటు నిలిపివేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఈ అధికారాన్ని ట్రంప్ వాడుకొనే అవకాశం కనిపిస్తోంది. -
ఎలాన్ మస్క్ చేతికి టిక్టాక్..?
టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) చైనాకు చెందిన బైట్డ్యాన్స్ ఆధ్వర్యంలోని టిక్టాక్(TikTok) అమెరికా కార్యకలాపాల(US operations)ను కొనుగోలు చేయవచ్చనే వార్తలొస్తున్నాయి. అమెరికాలో జాతీయ భద్రత, డేటా గోప్యతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బైట్డ్యాన్స్ యూఎస్ కార్యకలాపాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నేపథ్యంలో టిక్టాక్ను స్థానికంగా నిషేధించనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు.చైనాకు చెందిన బైట్డ్యాన్స్(ByteDance) ఆధ్వర్యంలోని టిక్టాక్ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. లేదంటే ఈ యాప్పై నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై తుదితీర్పు రావాల్సి ఉంది.అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది.డేటా భద్రతలొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.కంటెంట్ మానిప్యులేషన్అమెరికన్లు చూసే కంటెంట్ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్టాక్ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: మరింత క్షీణిస్తున్న రూపాయి!ఈ నేపథ్యంలో బైట్డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్టాక్ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. ఈ తరుణంలో ఎలాన్మస్క్ టిక్టాక్ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేయబోతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురిస్తున్నాయి. -
టిక్టాక్పై నిషేధం ఆపండి: ట్రంప్
వాషింగ్టన్:అమెరికాలో అధికారం చేతులు మారనున్న వేళ టిక్టాక్(TikTok) యాప్ నిషేధం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పదవీ బాధ్యతలు చేపట్టేవరకు టిక్టాక్పై నిషేధం విధించవద్దని ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు.వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్టాక్పై నిషేధం కేసులో మరింత సమయం ఇవ్వాలని ట్రంప్ న్యాయవాదులు సుప్రీం కోర్టు(Supreme Court)ను కోరారు.దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వారు కోర్టుకు తెలియజేశారు. కాగా,యాప్ వినియోగదారుల డేటా సేకరిస్తున్నారనే ఆరోపణలతో భారత్ సహా పలు దేశాలు చైనాకు చెందిన టిక్టాక్పై ఇప్పటికే నిషేధం విధించాయి. గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాలో టిక్టాక్ నిషేధానికి ప్రయత్నాలు జరిగాయి. న్యాయపరమైన చిక్కుల వల్ల నిషేధం ఆచరణలోకి రాలేదు.అప్పట్లో ట్రంప్ టిక్టాక్ నిషేధానికి తీవ్రంగా ప్రయత్నించారు. జాతీయ భద్రతకు టిక్టాక్ పెద్ద ముప్పుగా పరిణమించిందని ఆరోపణలు చేశారు.ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ టిక్టాక్పై నిషేధంపై బిల్లు ప్రవేశపెట్టారు.నిషేధానికి మద్దతుగా 352 మంది ఓటు వేయగా 65 మంది వ్యతిరేకించారు.దీంతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ట్రంప్ కూడా పరోక్షంగా మద్దతు పలికారు. అయితే,కొన్ని రోజుల తర్వాత అనూహ్యంగా ఆయన టిక్టాక్ వాడకం మొదలుపెట్టారు. దీంతో యాప్ నిషేధంపై తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ టిక్టాక్ నిషేధంపై మాట మార్చారు. తాను అధికారంలోకి వస్తే టిక్టాక్ను నిషేధించబోనని స్పష్టం చేశారు. -
అమెరికాలో టిక్టాక్ భవితవ్యం ప్రశ్నార్థకం
అమెరికాలో టిక్టాక్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. చైనాకు చెందిన బైట్డ్యాన్స్ ఆధ్వర్యంలోని టిక్టాక్ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. లేదంటే ఈ యాప్పై నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది.అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది.డేటా భద్రతలొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.కంటెంట్ మానిప్యులేషన్అమెరికన్లు చూసే కంటెంట్ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్టాక్ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: స్వయంకృషితో ఎదిగిన తెలుగు వ్యాపారవేత్తలుఈ నేపథ్యంలో బైట్డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్టాక్ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ ఇటీవల దానిపై అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించాలని నిర్ణయించుకుంది. దాంతో జనవరి 19 కంటే ముందే అంటే 10వ తేదీనే తన వాదనలు వినిపించనుంది. -
చైనా కుబేరుడి కంటే అంబానీ సంపద రెండింతలు!
చైనాలోని అత్యంత ధనవంతుల జాబితాను ‘హురున్ చైనా రిచ్ లిస్ట్’ పేరుతో విడుదల చేశారు. అందులో బైట్డ్యాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ మొదటిస్థానంలో నిలిచారు. ఈయన సంపద దాదాపు 49.3 బిలియన్ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు)గా ఉందని హురున్ నివేదించింది. అయితే తన సంపద గతంలో కంటే పెరిగినప్పటికీ భారత్లో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీను మాత్రం మించలేకపోయారు.చైనాలో కుబేరుల పెరుగుదల తగ్గిపోతుందని హురున్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఇటీవల భారీగా తగ్గిన చైనా ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ల ప్రభావంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. ప్రస్తుతం చైనా కుబేరుల మొత్తం సంపద మూడు ట్రిలియన్ డాలర్లు(రూ.250 లక్షల కోట్లు)గా ఉంది. అయితే ఇది గతంలోకంటే 10 శాతం తగ్గినట్లు హురున్ నివేదిక ఛైర్మన్ రూపెర్ట్ తెలిపారు.చైనా కంటే భారత్లో పెరుగుదలచైనాలో బిలియనీర్ల జాబితా తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా భారత్లో మాత్రం వారి సంఖ్య పెరుగుతోంది. ఆగస్టులో విడుదల చేసిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం..భారత్ గతంలో కంటే 29 శాతం బిలియనీర్ల సంఖ్యను పెంచుకుంది. ఇది రికార్డు స్థాయిలో 334కు చేరుకుంది. అయితే, మొత్తం బిలియనీర్ల సంఖ్య విషయానికి వస్తే భారతదేశం ఇప్పటికీ చైనా కంటే వెనుకబడే ఉంది. చైనాలో 753 మంది బిలియనీర్లు ఉన్నారు.ఇదీ చదవండి: కొత్త అప్డేట్..యాపిల్లో అదిరిపోయే ఫీచర్!చైనా కుబేరుడు జాంగ్ యిమింగ్హురున్ నివేదిక ప్రకారం జాంగ్ యిమింగ్(41) సంపద నికర విలువ 49.3 బిలియన్ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు). ఆన్లైన్ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్లు డౌయిన్, టిక్టాక్ మాతృ సంస్థ బైట్డాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు యిమింగ్. కాగా, భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ సంపద నికర విలువ 102 బిలియన్ డాలర్ల(రూ.8.5 లక్షల కోట్లు)కు చేరుకుంది. అంబానీ సంపద గతేడాది కంటే 25 శాతం పెరిగింది. -
మనిషిగా, మంచిగా బతకలేను..అందుకే వెళ్లిపోతున్నా: టిక్టాక్ స్టార్, షాక్లో ఫ్యాన్స్
"వెడ్డింగ్ విత్ ఎ గ్రూమ్" అంటూ తనను తాను పెళ్లి చేసుకున్న టిక్టాక్ స్టార్ కుబ్రా అయ్కుట్ (Kubra Aykut) అనూహ్యంగా ప్రాణాలు విడిచింది. టర్కీలోని తన అపార్ట్మెంట్ భవనంలోని ఐదో అంతస్తు దూకి ఆత్మహత్యకు పాల్పడటం సోషల్మీడియ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 26 ఏళ్ల ‘సోలోగామి’ ఫేమ్ ఇన్ఫ్లుయెన్సర్ అయుకుట్ 2023లో విలాసవంతమైన వివాహ వేడుక, వీడియో ఫోటోలతో ఇంటర్నెట్లోఅనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. ఇపుడు తన ఆకస్మిక మరణంతో కూడా అనేక ప్రశ్నల్ని మిగిల్చి వెళ్లిపోయింది .స్థానిక మీడియా నివేదికల ప్రకారం సెప్టెంబర్ 23న ఆమె చనిపోయింది. టిక్టాక్ వీడియోలో, ఆమె ఆత్మహత్యకు కొద్దిసేపటి ముందు, కుబ్రా తన ఇంటిని శుభ్రం చేస్తూ కనిపించడంతో ఈ ఘటన ప్రమాదమా లేక ఆత్మహత్యా అనే చర్చకు దారి తీసింది. అయితే సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.టిక్టాక్లో 10 లక్షలకుపైగా ఫాలోవర్లు,ఇన్స్టాగ్రామ్లోరెండు లక్షలకుపైగా ఫాలోవర్లున్నారు. సూసైడ్ నోట్"నేను నా ఇష్టపూర్వంకంగానే దూకాను. ఎందుకంటే నాకు ఇక జీవించాలని లేదు. ఫిస్టిక్ని బాగా చూసుకోండి. నేను నా జీవితంలో అందరికీ మంచిదాన్నే, ఇక మంచిగా ఉండలేను. మంచిగా బతకడం వల్లన నాకేమీ ఒరగలేదు. స్వార్థం ఉంటేనే, సంతోషంగా ఉంటారు చాలా రోజులుగా కష్టపడుతున్నా ఎవరూ గమనించలేదు.. నన్ను నేను ప్రేమించానుకుంటూ వెళ్లిపోతున్నాను. ఒక్క సారి నన్ను క్షమించండి’’ (హరివరాసనం : చిన్నారి విష్ణుప్రియ నృత్యాభినయం, వీడియో వైరల్) అనూహ్యంగా బరువు తగ్గడంపై ఆమె బాగా ఆందోళనలో పడిన్నట్టు తెలుస్తోంది. మరణానికి కొన్ని గంటల ముందు, సోషల్ మీడియా ఇలా పోస్ట్ చేసింది "నేను నా శక్తిని సేకరించాను, కానీ నేను బరువు పెరగడం లేదు. ఈ రోజు నేను 44 కిలోగ్రాములకు పడిపోయాను, నేను ప్రతిరోజూ ఒక కిలోగ్రాము తగ్గుతాను. నేను ఏమి చేయాలో నాకు తెలియదు; నేను అత్యవసరంగా బరువు పెరగాలి”. గత కొన్నిరోజులుగా వస్తున్న ఇలాంటి పోస్ట్లపై అనుచరులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వారి భయాలను నిజం చేస్తూ ఆమె తీసుకున్న కఠిన నిర్ణయం ఫ్యాన్స్ను విషాదంలో ముంచేసింది.ఇదీ చదవండి: చదరంగం ఎత్తులే కాదు, డ్యాన్స్ స్టెప్పుల్లోనూ మనోడు తోపు, వైరల్ వీడియో -
గెలిపిస్తే టిక్టాక్ను కాపాడుతా: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే చైనాకు చెందిన సోషల్ మీడియా వేదిక ‘టిక్టాక్’ను కాపాడుతానని అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో టిక్టాక్కు తాను రక్షకుడిని అవుతానని ఉద్ఘాటించారు. టిక్టాక్ కావాలని కోరుకునేవారంతా అధ్యక్ష ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. అమెరికాలో తన ప్రత్యర్థి వర్గం టిక్టాక్ను మూసివేయడానికి కుట్ర పన్నుతోందని పరోక్షంగా అధ్యక్షుడు జో బైడెన్పై ఆరోపణలు గుప్పించారు. టిక్టాక్ను అమెరికా కంపెనీకి విక్రయిండానికి దాని మాతృ సంస్థపై ఒత్తిడి పెంచేలా లేదా అమెరికాలో టిక్టాక్ను నిషేధించేలా జో బైడెన్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో ఓ బిల్లుపై సంతకం చేసింది. నిజానికి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2020లో టిక్టాక్పై నిషేధం విధించడం గమనార్హం. -
హేట్ టు లవ్.. నాలుక మడతేసిన ట్రంప్
-
తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లల డేటా సేకరణ!
ప్రముఖ సోషల్మీడియా యాప్ టిక్టాక్పై యూఎస్ ప్రభుత్వం కోర్టులో దావా వేసింది. పదమూడేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల సమాచార గోప్యతను పాటించడంలో కంపెనీ యాజమాన్యం విఫలమైందని ఆరోపించింది. పిల్లల తల్లిదండ్రుల అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా సమాచారాన్ని సేకరించిందని చెప్పింది. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వం టిక్టాక్, దాని మాతృసంస్థ బైట్డాన్స్పై కోర్టులో దావా వేసింది.యూఎస్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం..చైనా ఆధారిత సోషల్మీడియా యాప్ టిక్టాక్ యూఎస్లో 13 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. అందుకు వారి తల్లిదండ్రుల సమ్మతిని పొందాల్సి ఉంటుంది. కానీ కంపెనీ యాజమాన్యం ఎలాంటి నిబంధనలు పాటించలేదు. పిల్లల ఆన్లైన్ గోప్యతా రక్షణ చట్టాన్ని టిక్టాక్ ఉల్లంఘించింది. ఇది భవిష్యత్తులో అమెరికన్ల సమాచార భద్రతకు హాని కలిగించే ప్రమాదం ఉంది.ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీలోని డెమొక్రాట్ ప్రతినిధి ఫ్రాంక్ పల్లోన్ మాట్లాడుతూ..‘చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణలోని టిక్టాక్ను ఉపసంహరించుకోవాలి. పిల్లల తల్లిదండ్రులకు తెలియకుండానే కుంటుంబ సభ్యుల సమాచారాన్ని సేకరించడం సరికాదు. అమెరికన్ల సమాచార గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది’ అన్నారు. ఈ నేపథ్యంలో పిల్లల నుంచి డేటా సేకరించినందుకుగాను టిక్టాక్పై రోజూ ఒక్కో ఉల్లంఘనకు 51,744 డాలర్లు(రూ.43 లక్షలు) జరిమానా విధించాలని ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ఎఫ్టీసీ) ప్రతిపాదించింది. ఇదే జరిగితే కంపెనీ కోట్ల రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: బ్యాంకు సర్వీసులను అప్డేట్ చేయట్లేదుఈమేరకు టిక్టాక్ స్పందిస్తూ..యూఎస్ ప్రభుత్వం కోర్టులో వేసిన దావాను తీవ్రంగా ఖండించింది. అందులోని వివరాలు పూర్తిగా అబద్ధమని చెప్పింది. కొన్ని సంఘటనలు గతంలో జరిగినా అవి చాలాకాలం కిందటే పరిష్కరించామని పేర్కొంది. పిల్లల భద్రతకు కంపెనీ యాజమాన్యం పూర్తి మద్దతు ఇస్తోందని స్పష్టం చేసింది. టిక్టాక్ను మరింత మెరుగుపరిచేందుకు చేస్తున్న సన్నాహాలు ఆపమని తేల్చి చెప్పింది. ఇదిలాఉండగా, చైనీస్ యాజమాన్యంలోని టిక్టాక్ షార్ట్ వీడియో ప్లాట్ఫామ్ను యూఎస్లో దాదాపు 170 మిలియన్ల(17 కోట్లు) మంది వినియోగిస్తున్నారు. పిల్లల డేటా నిర్వహణకు సంబంధించి సరైన నిబంధనలు పాటించకపోవడంతో సంస్థపై గతేడాది యూరోపియన్ యూనియన్, యూకే ప్రభుత్యాలు జరిమానా విధించాయి. -
యువతను ఆకర్షిస్తున్న ఫేస్బుక్
మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్ సంస్థ తన బేస్ వినియోగదారుల్లో యువతను అధికంగా ఆకర్షిస్తోంది. పాత యూజర్ బేస్తో పోలిస్తే యువకుల సంఖ్యను పెంచుకుంటున్నట్లు ఫేస్బుక్ తెలిపింది.టిక్టాక్తో పోటీపడేలా ఫేస్బుక్లో తీసుకొచ్చిన మార్పులు, గ్రూప్ ఫీచర్ల ద్వారా యూజర్లను పెంచుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. యూఎస్, కెనడాకు చెందిన 18 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న 40 మిలియన్ల మంది యువత రోజూ ఫేస్బుక్ను వాడుతున్నారని చెప్పింది. ప్రాంతాలవారీగా డెమోగ్రఫిక్ వినియోగదారుల సమాచారాన్ని మొదటగా ఫేస్బుక్ సంస్థే విడుదల చేసినట్లు తెలిపింది.ఇదీ చదవండి: తగ్గనున్న ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ నివేదికయువత యాప్ను ఎలా ఉపయోగిస్తుందో తెలియజేసేలా న్యూయార్క్లో ఒక కార్యక్రమం నిర్వహించారు. అందులో ఫేస్బుక్ మెటా హెడ్ టామ్ అలిసన్ మాట్లాడుతూ..‘చైనాకు చెందిన బైట్డాన్స్ యాజమాన్యంలోని స్మాల్ వీడియో యాప్ టిక్టాక్ వైపు మొగ్గు చూపుతున్న యువత దృష్టిని తిరిగి తనవైపు ఆకర్షించడానికి కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రయత్నించింది. తరువాతి తరానికి ఉపయోగపడేలా ఉండేందుకు ఎంతో అభివృద్ధి చెందాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మార్కెట్ప్లేస్, గ్రూప్లు, స్మాల్ వీడియా ఫీచర్లను తీసుకొచ్చాం. ప్రస్తుతం ఎక్కువగా యువత ఫీడ్ లేదా రీల్స్ను వాడుతున్నారు. సంస్థను స్థాపించిన 2004నుంచి మూడేళ్లలో 50 మిలియన్ల వినియోగదారులను సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3.2 బిలియన్ యూజర్లను కలిగి ఉంది’ అన్నారు. -
అమెరికాలో టిక్ టాక్.. ‘ఇక డబ్బులు సంపాదించడం చాలా ఈజీ’
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ ‘టిక్ టాక్’ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో కంటెంట్ క్రియేటర్లు లబ్ధి చేకూరేలా డబ్బులు సంపాదించుకునే (మానిటైజేషన్) మార్గాన్ని మరింత సులభతరం చేసింది. అందుకు టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్పై అమెరికా ఒత్తిడే కారణమని తెలుస్తోంది. టిక్ టాక్లో కంటెంట్ క్రియేటర్లు ఏదైనా అంశం మీద వీడియోలు చేస్తుంటారు. ఫలితంగా 5వే ఫాలోవర్స్ ఉన్న టిక్ టాక్ ఛానెల్ క్రియేటర్.. తన ఛానెల్ ద్వారా ఏదైనా వస్తువును సేల్ చేసి అఫిలేట్ మార్కెటింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. తాజాగా, ఆ ఫాలోవర్ల సంఖ్యని 1000కి తగ్గించింది.అఫిలేట్ మార్కెటింగ్ అంటే?అమెజాన్, ఇతర అఫిలేట్ నెట్ వర్క్ వెబ్సైట్లలో యూజర్లకు ఏదైనా నచ్చిన ప్రొడక్ట్ను వివిధ మార్గాల్లో అంటే ఫేస్బుక్, వెబ్సైట్లు, బ్లాగ్స్, యూట్యూబ్ ఛానెల్స్లో ప్రమోషన్ చేసి వాటిని అమ్మాల్సి ఉంటుంది. అలా అమ్మితే అమెజాన్ అందుకు ప్రొడక్ట్ను బట్టి 10 నుంచి 20 శాతం వరకు కమిషన్ను అందిస్తుంది. న్యాయ పరమైన ఇబ్బందుల్లో టిక్ టాక్ చైనాకు చెందిన టిక్ టాక్ అమెరికాలో న్యాయ పరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. టిక్టాక్లో డేటా భద్రతపై అగ్రరాజ్యం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. పలు సందర్భాలలో టిక్ టాక్పై బ్యాన్ విధించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే బ్యాన్ తర్వాత ఎదురయ్యే ఆర్ధికపరమైన పర్యవసానాల గురించి ఆలోచించి వెనక్కి తగ్గింది. టిక్టాక్పై వరుస పిటిషన్లు నిషేధ చట్టం న్యాయ విభాగం టిక్టాక్పై అనుమానం వ్యక్తం చేసింది. 170 మిలియన్ల యూజర్ల డేటాను ప్రమాదంలో పడేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో టిక్టాక్లో డేటా భద్రతపై అనుమానం వ్యక్తం చేసిన అమెరికన్ టిక్ టాక్ యూజర్లు కోర్టులో వరుస పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.అమ్ముతారా? లేదంటే బ్యాన్ చేయమంటారా?ఈ సందర్భంగా టిక్ టాక్ను అమెరికన్ సంస్థకు అమ్మాలని, లేదంటే నిషేధం విధిస్తామని తెలుపుతూ హౌస్ బిల్లుపై జో బైడెన్ సంతకం చేశారు. అందుకు 270 రోజులు గడువు ఇచ్చింది. అదీ సాధ్యం కాకపోతే మరో 90 రోజుల పొడిగింపుతో టిక్ టాక్ను అమెరికన్ సంస్థకు అమ్మాలని లేదంటే దేశంలో నిషేధం ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆదేశించింది.మానిటైజేషన్ నిబంధనల్ని తగ్గించిదీంతో బైట్ డాన్స్ పై ఒత్తిడి ఎక్కువయింది. ఈ క్రమంలో మానిటైజేషన్ నిబంధనల్ని తగ్గిస్తూ టిక్ టాక్ నిర్ణయం తీసుకున్నట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బైట్ డ్యాన్స్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
ఇండియాలో డేటా సెంటర్ను ప్రారంభించనున్న ప్రముఖ సంస్థ
ఇండియాలో టిక్టాక్ వినియోగంలో ఉన్నపుడు దానికి వచ్చిన ఆదరణ అంతాఇంతా కాదు. చైనాకు చెందిన బైట్డ్యాన్స్ ఆధీనంలోని షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ను మన దేశంలో నిషేధించాక, వినియోగదార్లు ప్రత్యామ్నాయ యాప్లపై దృష్టి సారించారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా.. తమ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ను తీసుకొచ్చింది. 2020 జులైలో తొలుత భారత్లోనే వీటిని పరిచయం చేసింది. భారత్లో రీల్స్కు వస్తున్న ఆదరణను గమనించిన మెటా, ఈ డేటాను భద్రపరచేందుకు మనదేశంలోనే డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ డేటా సెంటర్లలో 10-20 మెగావాట్ల సామర్థ్యం కలిగిని చిన్న కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మెటా అవకాశాలను పరిశీలిస్తోందని తెలిసింది. ఈ డేటా కేంద్రం ఏర్పాటుకు ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టనుంది? ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది? వంటి విషయాలు కంపెనీ నిర్వహిస్తున్న అధ్యయనం తర్వాత తెలుస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు పేర్కొన్నాయి. పరిశ్రమ నిపుణుల ప్రకారం, టైర్-4 డేటా కేంద్రం మన దేశంలో ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.50-60 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ప్రతి డిమాండ్ను నెరవేర్చలేమన్న మంత్రి -
USA: అమెరికాలో ‘టిక్టాక్’ పాలిటిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికాలో టిక్టాక్ షార్ట్ వీడియో యాప్పై చర్యలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. త్వరలో టిక్టాక్పై అమెరికా ప్రతినిధుల సభ పాస్ చేయనున్న నిషేధం బిల్లుపై రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా అభ్యంతరం వ్యక్తం చేశారు. టిక్టాక్ లేకపోతే యువత నొచ్చుకుంటుందని అంతేగాక మెటాకు చెందిన ఫేస్బుక్ బలోపేతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్బుక్లో నిజాయితీ లేదని, టిక్టాక్ నిషేదం వల్ల ఫేస్బుక్ లాభపడటం తనకు ఇష్టం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ యాప్ను ప్రస్తుతం అమెరికాలో పెద్ద సంఖ్యలో యువత వాడుతోందని, వారంతా యాప్ లేకపోతే పిచ్చివాళ్లయ్యే అవకాశం ఉందన్నారు. టిక్టాక్లో మంచితో పాటు చెడు కూడా ఉందన్నారు. 2021లో క్యాపిటల్ భవనంపై దాడి సందర్భంగా ట్రంప్ పెట్టిన పోస్టులను ఫేస్బుక్తో పాటు ఇన్స్టాగ్రామ్ నుంచి మెటా డిలీట్ చేసింది. దీంతో మెటాపై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్తో పాటు రిపబ్లికన్లంతా ఫేస్బుక్ను తీవ్రంగా విమర్శిస్తుంటారు. ట్రంప్ తాజా వ్యాఖ్యల తర్వాత ఫేస్బుక్ షేర్లు స్టాక్మార్కెట్లో నష్టాలు చవిచూశాయి. అయితే 2020లో తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనాకు చెందిన టిక్టాక్తో పాటు వి చాట్ను నిషేధించడానికి ట్రంప్ ప్రయత్నించడం గమనార్హం. కోర్టులు జోక్యం చేసుకుని ఈ ప్రయత్నానికి బ్రేకులు వేశాయి. ప్రస్తుతం మళ్లీ అధ్యక్ష ఎన్నికలకు పోటీపడుతున్న వేళ ట్రంప్ టిక్టాక్ నిషేధంపై మాట మార్చడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఓపక్క యువతను ఆకట్టుకోవడంతో పాటు మరోపక్క తనకు ఇష్టంలేని ఫేస్బుక్ చెక్ పెట్టడమే ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, అమెరికాలో ప్రస్తుతం 17 కోట్ల మంది టిక్టాక్ను వాడుతున్నారు. యూఎస్ ప్రతినిధుల సభ బుధవారం(మార్చ్ 13)న టిక్టాక్పై దాదాపు నిషేధం విధించినంత పనిచేసే ఓ కీలక బిల్లును పాస్ చేయనుంది. ఈ బిల్లు పాసైన 165 రోజుల లోపు చైనాకు చెందిన బైట్డ్యాన్స్ కంపెనీ టిక్టాక్ను అమ్మేయాల్సి అమ్మేయాల్సి ఉంటుంది. లేదంటే గూగుల్, ఆపిల్ ప్లే స్టోర్లు టిక్టాక్కు వెబ్ హోస్టింగ్ సేవలు నిలిపివేస్తాయి. ఈ బిల్లు గనుక ఏకగ్రీవంగా పాసైతే దీనిపై తాను సంతకం చేస్తానని అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోపక్క తాము అమెరికన్ల డేటాను చైనాకు గతంలో ఎప్పుడూ షేర్ చేయలేదని, ఇక ముందు కూడా షేర్ చేయబోమని టిక్టాక్ యాప్ యాజమాని బైట్డ్యాన్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. యాప్పై నిషేధం అమెరికా ప్రజల రాజ్యాంగ హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని మండిపడింది. ఇదీ చదవండి.. భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర.. కారణమిదే -
ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్! ఒక్కో ఇన్స్టా పోస్టే లక్ష..!
ఇటీవల యువతరం సంపాదన ఇలా కూడా ఆర్జించొచ్చు అని చూపిస్తోంది. కొందరూ టిక్టాక్ స్టార్లుగా వచ్చి ఇన్స్టాగ్రాం సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. ఓ రేంజ్లో ఫాలోవర్స్ మెయింటైన్ చేస్తున్నారు. సంపాదన కూడా కళ్లు చెరిరేలా ఐదెంకెల్లో ఆర్జిస్తుండటం విశేషం. అలాంటి కోవకు చెందిందే ఈ బ్యూటీఖాన్.. బ్యూటీ ఖాన్ అసలు పేరు మముదా ఖాతున్. సొంతూరు కోల్కతా. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే యమ లవ్వు. డ్రీమ్డ్ అబౌట్ డాన్సర్ కావాలని. టిక్ టాక్ (మన దగ్గర నడిచినప్పుడు) స్టార్ .. ఇన్స్టా సెలబ్రిటీ అయింది. ఫ్యాషన్ బ్లాగర్, మోడల్, యాక్ట్రెస్ కూడా. షార్ట్ వీడియో కంటెంట్కి ఫేమస్. ఆమె ఇన్స్టా హ్యాండిల్కి 12.4 మిలియన్స్కి పైనే ఫాలోవర్స్ ఉన్నారు. అకార్డింగ్ టు సమ్ వెబ్సైట్స్.. ఆమె ఒక్కో ఇన్స్టా పోస్ట్కి 50 నుంచి 1 ల్యాక్ ’ చార్జ్ చేస్తుందట. ఆమె ఆమ్దనీ నెలకు అప్రాక్సిమేట్గా రెండు లక్షల వరకు ఉండొచ్చని ఆ వెబ్సైట్స్ అంచనా. బ్రాండ్ ఎండార్స్మెంట్స్, మోడలింగ్, యాక్టింగ్ .. ఆమె మెయిన్ ఇన్కమ్ సోర్సెస్. సోషల్ మీడియానా మజాకా! (చదవండి: వందేళ్ల నాటి కారు..హంసలా ఎంత వయ్యారంగా ఉందో తెలుసా!) -
Stolen children: పొత్తిళ్లలో విడిపోయి 19 ఏళ్లకు కలిశారు
కన్న తల్లి ఒడిలో పెరిగి జంటగా ఆడుకోవాల్సిన కవల అమ్మాయిలు వీరు. కానీ విధి వారితో వింత నాటకం ఆడింది. ఆస్పత్రుల్లో పుట్టిన పసికందులను దొంగలించి పిల్లల్లేని జంటలకు అమ్మేసే ముఠా బారిన పడి కన్నతల్లి ప్రేమకు దూరమయ్యారు. ఎందరో చిన్నారులను మొబైల్ఫోన్కు అతుక్కుపోయేలా చేసే టిక్టాక్ వీడియో ఒకటి వీరిద్దరినీ మళ్లీ కలిపింది. అందుకు ఏకంగా 19 సంవత్సరాల సమయం పట్టింది. అచ్చం తనలా ఉన్న అమ్మాయిని చూసి ఎవరీమె? ఎందుకు నాలాగే ఉంది? అంటూ ఒకరిని వేధించిన ప్రశ్నలు చివరకు తన కవల సోదరి చెంతకు చేర్చాయి. ఈ గాథ ఐరోపాలోని జార్జియాలో జరిగింది... ఈ కథ 2002 ఏడాదిలో జార్జియాలోని కీర్ట్స్కీ ప్రసూతి ఆస్పత్రిలో మొదలైంది. గోచా ఘకారియా దంపతులకు కవల అమ్మాయిలు పుట్టారు. వెంటనే తల్లి అజా షోనీకి తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లింది. తను చనిపోతే పసికందులను పెంచడం తన వల్ల కాదని గోచా భావించాడు. ఇదే అదనుగా అక్కడున్న పిల్లల్ని దొంగలించే ముఠా అతనికి డబ్బులు ఎరవేసి పిల్లల్ని తీసుకెళ్లిపోయింది. అచ్చం తనలా ఉండటంతో అవాక్కై.. పిల్లలను ఆ దొంగల ముఠా వేర్వేరు ప్రాంతాల్లోని వేర్వేరు కుటుంబాలకు పెద్ద మొత్తాలకు అమ్మేసింది. పెంపుడు తల్లిదండ్రులు ఆ చిన్నారులకు అమీ ఖవీటియా, అనో సర్టానియా అని పేర్లు పెట్టారు. చూస్తుండగానే పుష్కరకాలం గడిచిపోయింది. 12 వయసు ఉన్నపుడు అమీ 2014 సంవత్సరంలో ఓ రోజు టీవీలో తనకిష్టమైన ప్రోగ్రాంలో అచ్చం తనలా ఉన్న ఓ 12 ఏళ్ల అమ్మాయి డ్యాన్స్ చేయడం చూసి అవాక్కైంది. కలిపిన టిక్టాక్ అమీకి కూడా డ్యాన్స్ అంటే ప్రాణం. డ్యాన్స్ నేర్చుకుంది. ఏడేళ్ల తర్వాత అమీ ఒక టిక్టాక్ వీడియో తీసి అప్లోడ్ చేసింది. అది తెగ వైరల్ అయింది. దానిని అమీ సొంతూరుకు 320 కిలోమీటర్ల దూరంలోని టిబిలిసీ నగరంలోని కవల సోదరి అనో సర్టానియా స్నేహితురాలు చూసింది. ఆ వీడియో సర్టానియోది అనుకుని భ్రమపడింది. సర్టానియోకు షేర్ చేసి విషయం కనుక్కోమని చెప్పింది. తనలాగా ఉన్న అమీ వీడియో చూసి సర్టానియోకు అనుమానం వచ్చింది. ఈమె నాకు బంధువు అవుతుందా? అసలు ఈ టీనేజర్ ఎవరు? అంటూ తను చదువుకునే విశ్వవిద్యాలయం వాట్సాప్ గ్రూప్లో పోస్టులుపెట్టేది. ఈ గ్రూప్లో అమీకి తెల్సిన వ్యక్తి ద్వారా ఒకరి ఫోన్ నంబర్ ఒకరికి అందింది. అందజేశారు. దీంతో అమీ, అనో మొట్టమొదటిసారిగా మెసేజ్ల ద్వారా మాట్లాడుకోవడం మొదలైంది. ఎన్నెన్నో పోలికలు వేర్వేరు కుటుంబ వాతావరణాల్లో పెరిగినా ఇద్దరి అభిరుచులూ ఒకటే. డ్యాన్స్ ఇష్టం. హెయిర్ స్టైల్ ఒక్కటే. ఇద్దరికీ ఒకే జన్యు సంబంధమైన వ్యాధి ఉంది. సరి్టఫికెట్లలో పుట్టిన తేదీ కూడా చిన్న తేడాతో దాదాపు ఒకేలా చూపిస్తోంది. ఒకే వయసు ఉన్నారు. సరి్టఫికెట్లలో ఆస్పత్రి పేరు కూడా ఒక్కటే. ఇన్ని కలవడంతో తాము కవలలమేమో అని అనుమానం బలపడింది. కానీ ఇరు కుటుంబాల్లో ‘నువ్వు మా బిడ్డవే’ అని చెప్పారుగానీ కొనుక్కున్నాం అనే నిజం బయటపెట్టలేదు. వీళ్ల మొండిపట్టు చూసి నిజం చెప్పేశారు. కానీ వీళ్లు కవలలు అనే విషయం వారికి కూడా తెలీదు. ఎందుకంటే వీరికి అమ్మిన ముఠా సభ్యులు వేర్వేరు. దీంతో తమ కన్న తల్లిదండ్రులు ఎవరనేది మిస్టరీగా ఉండిపోయింది. పెంచలేక వదిలేశారని అనో ఆగ్రహంతో రగిలిపోయింది. కన్న వారిని ఎలాగైనా కనిపెట్టాలని అమీ మాత్రం పలు వెబ్సైట్లు, గ్రూప్లలో అన్వేషణ ఉధృతం చేసింది. ఇందుకోసం సొంతంగా ఫేస్బుక్ పేజీని ప్రారంభించింది. మూడో తోబుట్టువు! ఆ నోటా ఈనోట విన్న ఒక టీనేజర్.. అమీకి ఫోన్ చేసింది. తన తల్లి 2002లో ఒక మెటరి్నటీ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచి్చందని, వారు పుట్టగానే చనిపోయారని తల్లి ఓసారి తనతో చెప్పిందని అమీకి వివరించింది. వెంటనే అమీ అక్కడికి వెళ్లి ఆ టీనేజర్, ఆమె కన్నతల్లి డీఎన్ఏ టెస్ట్లు చేయించింది. అవి తమ డీఎన్ఏలతో సరిపోలాయి. అలా ఎట్టకేలకు 19 ఏళ్ల వయసులో లీపెగ్ నగరంలో కవలలు కన్నతల్లిని కలిసి తనివి తీరా కౌగిలించుకున్నారు. దాంతో ఆమెకు నోట మాట రాలేదు. కోమా నుంచి కోలుకున్నాక మీరు చనిపోయారని భర్త చెప్పాడని కన్నీరుమున్నీరైంది. ఈ మొత్తం ఉదంతం తాజాగా వెలుగు చూసింది. లక్షల శిశు విక్రయాలు ట్యాక్సీ డ్రైవర్లు మొదలు ఆస్పత్రి సిబ్బంది, అవినీతి అధికారులదాకా ఎందరో ఇలా జార్జియాలో పెద్ద వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి లక్షల మంది పసికందులను ఆస్పత్రుల్లో మాయం చేశారని అక్కడి మీడియాలో సంచలనాత్మక కథనాలు వెల్లడయ్యాయి. దీనిపై ప్రస్తుతం జార్జియా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
21 ఏళ్ల తర్వాత.. లాడెన్ లేఖ వైరల్
లండన్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం తీవ్రరూపం దాలి్చన వేళ.. ఒకప్పటి అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను మరోసారి జనం స్ఫురణకు తెచ్చుకుంటున్నారు. 2001లో అమెరికాపై అనూహ్య రీతిలో ఉగ్రదాడులు జరిపి ప్రపంచ దేశాలకు షాకిచి్చన బిన్ లాడెన్.. ఆ తర్వాత అమెరికా ప్రజలనుద్దేశించి రాసిన రెండు పేజీల లేఖ టిక్–టాక్లో వైరల్గా మారడం గమనార్హం. ఒసామా లేఖకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. పాలస్తీనాను ఆక్రమించి అణచివేతకు పాల్పడుతున్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు కూడా 9/11 దాడులకు ఓ కారణమని అందులో లాడెన్ సమరి్థంచుకున్నాడు. ‘‘పాలస్తీనా దశాబ్దాలుగా ఆక్రమణలో ఉంది. అమెరికా అధ్యక్షులెవరూ పట్టించుకోలేదు. పాలస్తీనా ఎప్పటికీ ఆక్రమణలోనే ఉండిపోదు. సంకెళ్లను తెంచుకునేందుకు ప్రయతి్నస్తాం. అమెరికా అహంకారానికి క్రైస్తవుల రక్తంతో మూల్యం చెల్లించక తప్పదు’అని లాడెన్ హెచ్చరించాడు. -
ఒకే నెలలో 40లక్షల వీడియోలు డిలీట్..కారణం అదేనా..
మనదేశంలో టిక్టాక్ను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే యురోపియన్ యూనియన్లో మాత్రం సంస్థ తన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. సెప్టెంబరులో యూరప్లో 40లక్షల వీడియోలను తొలగించినట్లు కంపెనీ అక్టోబరు 25న తెలిపింది. చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్కు వ్యతిరేకంగా కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం. యురోపియన్ యూనియన్లో తీసుకొచ్చిన కొత్త డిజిటల్ సేవల చట్టం(డీఎస్ఏ) ప్రకారం..ప్రధాన ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు ప్రతి ఆరు నెలలకోసారి పారదర్శకత నివేదికను అందించాలి. అందులో భాగంగా టిక్టాక్ ఈ సమాచారాన్ని తెలియజేసింది. ఆగస్టులో అమలులోకి వచ్చిన ఈచట్టం ద్వారా ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు, సెర్చ్ ఇంజిన్లకు భారీగా జరిమానా విధిస్తున్నారు. ఇప్పటికే అన్ని కంపెనీలకు కలిపి దాదాపు వాటి ప్రపంచ టర్నోవర్లో ఆరు శాతం వరకు జరిమానా వేసినట్లు తెలుస్తుంది. టిక్టాక్తోపాటు మరో 18 ఆన్లైన్ ప్లాట్ఫామ్ సంస్థలు యూరప్లో వాటి నిర్వహణ బాధ్యతలు కొనసాగిస్తున్నాయి. -
అడవుల్లో బతికేస్తున్న పాపులర్ టిక్టాకర్
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పెద్దమనిషి కొంతకాలంగా అడవుల్లో సంచరిస్తూ గుహలలోనే తలదాచుకుంటూ బతికేస్తున్నాడు. గుహలలో తలదాచుకోవడానికి, అడవుల్లో సురక్షితంగా తిరగడానికి అవసరమైన మెలకువలు చెబుతూ సెల్ఫీ వీడియోలను ‘టిక్టాక్’లో షేర్ చేసుకుంటున్నాడు. అమెరికాలోని కొలరాడోకు చెందిన ఈ ఆధునిక అడవి మనిషి పేరు డానీ డస్ట్. ‘టిక్టాక్’లో ఇతడికి ఏకంగా కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ‘గుహలలో తలదాచుకోవడం అంత తేలికైన పనేమీ కాదు. తలదాచుకోవాలనుకున్న గుహ సురక్షితమైనదో కాదో చూసుకోవాలి. గుహలో ఏదైనా జంతువు విసర్జకాలు ఉన్నట్లయితే, అది ఆ జంతువు సొంతం. అలాంటి గుహలో తలదాచుకోవడం ప్రాణాలకే ప్రమాదం. అలాగే గుహల్లో ఉండే సాలెగూళ్లు, తేనెపట్లులాంటివి ఏవైనా ఉన్నా జాగ్రత్తగా చూసుకోవాలి. గుహ పైభాగంలో పగుళ్లు ఉన్నాయో లేదో చూడాలి. పైభాగంలో పగుళ్లు ఉంటే, ఏ క్షణంలోనైనా పెళ్లలు విరిగి నెత్తిన పడే ప్రమాదం ఉంటుంది. అన్నీ సజావుగా ఉన్న గుహను ఎంపిక చేసుకోవడం ఒక కష్టమైతే, అందులోని రాతి నేల మీద అలాగే పడుకోలేం. అందుకని తగినంత ఎండుగడ్డిని పోగు చేసుకుని, పరుచుకుంటే పడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది’ అని చెబుతాడు డానీ. అడవుల్లో పక్షులను, జంతువులను వేటాడుతూ, వాటి మాంసంతోను, అడవిలో దొరికే పండ్లు కాయలతోనే కాలక్షేపం చేస్తూ ఇతడు తీసే వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతుండటం విశేషం. View this post on Instagram A post shared by Überleben® (@uberleben.co) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust) -
పాపులారిటీ కోసం పాకులాడింది.. ప్రాణాలు మీదకు తెచ్చుకుంది..
టొరంటో: టిక్ టాక్ ఛాలెంజ్ పేరుతో కెనడాకు చెందిన ఒకమ్మాయి రోజుకు నాలుగు లీటర్ల చొప్పున తాగి ప్రాణం మీదకు తెచ్చుకుంది. 12 రోజుల పాటు ఇలా రోజుకు 4 కంటే ఎక్కువ లీటర్లు తగ్గటంతో చివరి రోజున ఆమెకు కొంత అసౌకర్యంగా అనిపించి డాక్టరును సంప్రదించింది. డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించి శరీరంలో సోడియం స్థాయిలు బాగాతగ్గిపోయాయని తెలిపారు. మరి కొంచెముంటే ప్రాణాపాయమేనని తెలిపారు. అదోరకం వెర్రి.. సొషల్ మీడియాలో క్రేజ్ కోసం జనం ఎంతగా వెంపర్లాడుతూ ఉంటారంటే తొందరగా స్టార్లు అయిపోయి చేతికందినంత సంపాదించుకోవాలి. ఎక్కడికెళ్లినా కూడా జనం వారిని గుర్తించాలి. ఇదొక్కటే వారికున్న లక్ష్యం. ఈ క్రమంలో ఎలాంటి పిచ్చి పని చేయడానికైనా వెనకాడరు. తాజాగా కెనడాలో వైరల్ గా మారిన ఒక ఫిట్నెస్ ఛాలెంజ్ ఒకమ్మాయిని దాదాపుగా చావు అంచుల వరకు తీసుకుని వెళ్ళింది. 75 హార్డ్ ఛాలెంజ్.. కెనాడకు చెందిన మిచెల్ ఫెయిర్బర్న్ అనే టిక్టాక్ స్టార్ ఆండీ ఫ్రైసెల్లా అనే ఓ యూట్యూబర్ 2019లో ప్రారంభించిన 75హార్డ్ అనే ఫిట్నెస్ ఛాలెంజ్ ను స్వీకరించింది. ఇందులో భాగంగా ఆమె రోజుకు నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది. కనీసం 45 నిముషాల పాటు రోజుకు రెండు సార్లు వర్కౌట్లు కూడా చేయాలి. రోజుకు 10 పేజీలు చదవాలి. ఇవన్నీ చేస్తునట్టుగా ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలి. అయినా బుద్ధి మారలేదు.. పాపం ఫెయిర్బర్న్ ఈ ఛాలెంజ్ చివరి రోజు వరకు బాగానే చేసింది. 12వ రోజున మాత్రం కొంత అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే డాక్టరును సంప్రదించింది. డాక్టర్ రోజుకు కేవలం అరలీటరు నీళ్లు మాత్రమే తాగాలని సూచంచారట. ఈ విషయాన్ని స్వయంగా ఫెయిర్బర్న్ చెబుతూ.. నేను ఎలాగైనా ఈ ఛాలెంజ్ పూర్తి చేసి తీరతాను. మొదటిసారి కావడంతో కాస్త ఇబ్బంది పడ్డాను. ఎక్కువ నీళ్లు తాగడంతో రాత్రి పూత ఎక్కువగా మూత్రానికి పోవాల్సి వచ్చేది. ఇప్పుడు అరలీటరు నెల మాత్రమేతాగా మంటున్నారు కష్టమే కానీ ప్రయత్నిస్తానంది. ఇది కూడా చదవండి: ఫాతిమాగా మారిన అంజు... ఇల్లు కట్టుకోవడానికి స్థలం, డబ్బు.. -
పబ్లిక్ లో రచ్చ చేసింది జైలు పాలయ్యింది
దుబాయ్: అమెరికా టిక్ టాకర్ ఎరక్కపోయి దుబాయ్ లో ఇరుక్కుపోయింది. తన స్నేహితుడితో జాలీ ట్రిప్ కోసం యూఏఈ వెళ్లిన టియెర్రా యంగ్ అలెన్ అనుకోకుండా అక్కడ యాక్సిడెంట్ చేసింది. తర్వాత అనవసరంగా అద్దె కార్ షోరూం యజమానిపై నోరు జారి న్యూసెన్స్ చేసి జైలు పాలయ్యింది. అమెరికాకు చెందిన టిక్ టాక్ స్టార్ టియెర్రా యంగ్ అలెన్(29) యూఏఈ పర్యటనకు వచ్చి చిక్కుల్లో పడింది. దుబాయ్ లో తన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంటుకు గురి కావడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవింగ్ చేస్తున్నందుకు బాయ్ ఫ్రెండ్ ను అరెస్టు చేశారు. టిక్ టాకర్ స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు అద్దెకు కారు తీసుకున్నప్పుడు షోరూంలో ఇద్దరూ తమ గుర్తింపు కార్డులు అక్కడ వారికిచ్చారు. మరుసటి రోజున అమెరికా తిరిగి ప్రయాణమవ్వనున్న నేపథ్యంలో అలెన్ కారు షోరూంకి వెళ్లి తన ఐడెంటిటీ కార్డులు తనకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ ఆ కార్ షోరూం యజమాని కేసు తేలేంత వరకు అవి ఇవ్వడం కుదరదని చెప్పడంతో టిక్ టాకర్ రెచ్చిపోయింది. షోరూం యజమానిపై చిర్రుబుర్రులాడి గట్టి గట్టిగా అరుస్తూ గొడవ చేసింది. దీంతో దుబాయ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. Tierra Young Allen, Truck Driver TikTok Star, Is Detained in #Dubai! She is accused of ‘Screaming’ at a rental car agent. Will she get the #BrittneyGriner treatment and get her home sooner than later? 🤔 pic.twitter.com/GOIca0H58J — WOKEVIDEO (@wokevideo) July 16, 2023 ఇది కూడా చదవండి: ట్రాక్ దాటుతున్న ట్రక్కును ఢీకొట్టిన రైలు.. -
ఎంటెక్ చదివి.. టిక్టాక్తో మొదలెట్టి..
అతను ఎంటెక్ చదివాడు. ప్రయత్నిస్తే సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగమే వచ్చేది. కానీ అందరూ నడిచే దారిలో వెళ్లాలనుకోలేదు. తనకంటూ ప్రత్యేక ‘మార్గం’ ఉండాలని భావించాడు. ఆ మార్గంలో వెళ్లే క్రమంలో మొదట అందరూ హేళన చేశారు. అయినా నిరుత్సాహపడలేదు. ఎంచుకున్న రంగం ఏదైనా పట్టుదల, చిత్తశుద్ధితో కృషి చేస్తే విజయం సాధించవచ్చునని నిరూపించాడు. ఇంటిల్లిపాదీ ఆనందించే వీడియోలను సొంతంగా రూపొందిస్తూ..అందులో తానే నటిస్తూ సోషల్ మీడియా స్టార్గా ఎదిగాడు. అతనే ప్రశాంత్ అలియాస్ ప్రసూబేబీ. సాక్షి, అనంతపురం డెస్క్ : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. తమకున్న నైపుణ్యాలు ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రశాంత్ ఒకరు. ఎలాంటి సినీ నేపథ్యమూ లేకపోయినా నటనలో సత్తా చాటుతూ.. అనతికాలంలోనే సోషల్ మీడియా సూపర్ స్టార్గా ఎదిగాడు. పొడవాటి జుట్టు, గడ్డంతో స్టైలిలుగా కని్పంచే ప్రశాంత్ చక్కటి నటన, వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో అందరినీ అలరిస్తున్నాడు. ప్రశాంత్ అంటే ఎవరూ గుర్తు పట్టరు కానీ.. ‘ప్రసూబేబీ’ అంటే మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ప్రసూబేబీ ( (prashu_baby)) పేరిట ప్రశాంత్ ప్రారంభించిన యూట్యూబ్ చానల్కు ఏకంగా 8.24 మిలియన్ల సబ్స్రై్కబర్లు ఉన్నారు. సంస్థలను మినహాయిస్తే వ్యక్తిగత విభాగానికి సంబంధించి రాష్ట్రంలో హర్షసాయి తర్వాత అత్యధిక సబ్స్రై్కబర్లు ఉన్నది ఈ చానల్కే. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు వీడియోలను రెగ్యులర్గా రూపొందించి ఇందులో అప్లోడ్ చేస్తున్నా . వీడియో పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్ అకౌంటుకు కూడా 1.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల వారు, కువైట్, అమెరికా,సౌదీ తదితర దేశాల ప్రజలు సైతం ప్రశాంత్ వీడియోలను వీక్షిస్తున్నారు. ధరణి, శిశిర, ప్రసూ కాంబినేషన్లో వచ్చిన వీడియోలు సూపర్ హిట్ అయ్యాయి. ఎంటెక్ చదివేందుకు అనంతపురం వచ్చిన ప్రశాంత్ ఇక్కడి నుంచే సీరియస్ ‘యాక్టింగ్’ మొదలుపెట్టాడు. నటనపై ఆసక్తి ఉన్న తనలాంటి వారితో కలిసి వీడియోలు రూపొందిస్తున్నాడు. యాక్టింగ్ మొదలుకుని స్క్రిప్టు వరకు అన్నీ తానే చూసుకుంటాడు. ఇలా ఇప్పటివరకు 30 మందికి పైగా తనతో కలసి నటించారు. వారిలో చాలామందికి సొంత యూట్యూబ్ చానళ్లు, ఇన్స్ట్రాగామ్ అకౌంట్లు ఏర్పాటు చేయించి..వారూ తగిన ఆదాయం పొందేలా చూస్తున్నాడు. సోషల్ మీడియాలో ప్రశాంత్ పాపులారిటీని గుర్తించిన పెద్ద పెద్ద సంస్థలు సైతం అతనితో వ్యాపార ప్రకటనలు చేయిస్తున్నాయి. సినిమా ప్రమోషన్లు కూడా చేయిస్తున్నారు. ఇటీవలే దసరా, విరూపాక్ష సినిమాలకు ప్రమోషన్ చేశాడు. ఓటీటీ, సినిమా ఆఫర్లు సైతం వస్తున్నాయి. పెద్దసంస్థలతో కలసి ఇతర భాషల్లో సోషల్ మీడియా వేదికగా వినోదాత్మక వీడియోలు రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఎంటెక్ చదివి.. టిక్టాక్తో మొదలెట్టి.. ప్రశాంత్ సొంతూరు అన్నమయ్య జిల్లా మదనపల్లెకు సమీపంలోని గారబురుజు గ్రామం. తల్లిదండ్రులు సావిత్రి, నారాయణ. వీరిది వ్యవసాయ కుటుంబం. ఇద్దరు కుమారులు కాగా..ప్రశాంత్ చిన్నోడు. మదనపల్లెలోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాడు. జేఎన్టీయూ (అనంతపురం)లో ఎంటెక్ చేశాడు. ఇంజినీరింగ్ చదువుతుండగానే నటనపై ఆసక్తితో చిన్నచిన్న వీడియోలు సొంతంగా రూపొందించి ‘టిక్టాక్’లో పెట్టేవాడు. ప్రేమ, మానవత్వం, కుటుంబం ఇతివృత్తంగా వీడియోలు రూపొందించేవాడు. అవి బాగా ట్రెండింగ్కావడంతో లక్షల్లో సబ్స్రై్కబర్లు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం టిక్టాక్పై నిషేధం విధించడంతో తన దృష్టిని యూట్యూబ్పై మళ్లించాడు. ఇష్టపడి పనిచేయడం వల్లే ఈ స్థాయికి.. ఏ పనైనా ఇష్టపడి చేయాలని నేను భావిస్తా. నేను ఇలా వీడియోలు చేయడాన్ని మొదట్లో స్నేహితులే కాకుండా కుటుంబ సభ్యులు కూడా తప్పుబట్టారు. కానీ సక్సెస్ సాధించి వారితోనే అభినందనలు అందుకున్నా. నిత్య జీవితంలో జరిగే సంఘటనలు, కుటుంబంలో ఉండే సంతోషాలు, సరదాలు, సమస్యలే ఇతివృత్తంగా ఎక్కువ వీడియోలు రూపొందించా. ఇవి భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యాయి. ఇదే ఉత్సాహంతో మరింత మంచి కంటెంట్ అందివ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా. ముఖ్యంగా వెబ్ సిరీస్లపై దృష్టి పెడుతున్నా. – ప్రశాంత్ -
కొంపముంచిన టిక్టాక్ రెసిపీ.. దెబ్బకు ముఖం వాచిపోయింది!
టిక్టాక్లో నెటిజన్ల మనసు దోచేయడానికి రకరకాల వీడియోలు చేస్తుంటారు. సరికొత్త రీల్స్తో ఫేమస్ అయిపోవాలని చూస్తుంటారు. ఈ విధంగానే ట్రై చేసిన టిక్టాక్ రీల్ ఓ మహిళ కొంపముంచింది. ఓ రెసిపీ కోసం రీల్ చేసే క్రమంలో ఆమె ముఖం కాలిపోయింది. అందమైన ఆవిడ ముఖం బొబ్బలతో నిండిపోయింది. 'జీవితంలో ఎదుర్కొన్న విపరీతమైన నొప్పి' అనే క్యాప్షన్తో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆవిడ పేరు షాఫియా బషీర్(37). టిక్టాక్లో జనాలను అట్రాక్ట్ చేసేందుకు ప్రత్యేకమైన వంటకం వీడియో తీయాలనుకుంది. ఈ క్రమంలో గుడ్లను మైక్రోవేవ్లో ఉడకబెట్టింది. ఆ తర్వాత బాగా ఉడికిన గుడ్లను బయటకు తీయాలనుకుంది. అందుకు చల్లని చెంచాను మైక్రోవేవ్లో పెట్టింది. అంతే.. అందులో ఉన్న వేడి నీరు ఒక్కసారిగా ఆమె ముఖం మీద పడ్డాయి. వెంటనే చల్లని నీటిలో ముఖం పెట్టినప్పటికీ.. తీవ్ర గాయాలయ్యాయి. ముఖమంతా బొబ్బలు వచ్చాయి. ఇంకేముంది ఆ తర్వాత ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది. ఒంటరి మహిళ అయినందున చాలా ఖాళీ సమయం దొరుకుతుందని.. ఆ క్రమంలో టిక్టాక్లో వంటల వీడియోలు చేస్తుంటానని చెప్పింది. అయితే ప్రస్తుతం గాయం నుంచి కొలుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ ఘటన తన జీవితంలో విపరీతమైన నొప్పిని కలిగించిందని తెలిపింది. టిక్టాక్ వీడియోలు చేసే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చదవండి:‘ఏడాది పాటు షిప్పు ప్రయాణం’.. డబ్బు కట్టి గొల్లుమంటున్న జనం -
ఆయనకు ‘కొంటె’ భార్య కావాలి.. ఇమ్రాన్ఖాన్కు నాలుగో భార్యనవుతా..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ యూకేకు చెందిన ఓ టిక్ టాక్ స్టార్ ప్రపోజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయనకు నాలుగో భార్యనవుతానని చెప్పిన ఓ వీడియో హల్చల్ చేస్తోంది. అవిశ్వాస పరీక్షలో ఓడిపోయి పదవి నుంచి వైదొలిగిన నాటి నుంచి ఇమ్రాన్ ఖాన్ రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.. ఇలాంటి సమయంలో యూకేకు చెందిన జియా ఖాన్ అనే టిక్టాకర్ ఈ ప్రతిపాదన చేసింది. ‘‘ఆయన ముందు జెమీమాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అందమైన ఓ జర్నలిస్టు ఆయనకు రెండో భార్యగా వచ్చింది. మూడోసారి ఓ సంప్రదాయబద్ధమైన మహిళను వివాహమాడారు. ఇప్పుడు ఆయన జీవితంలో గ్లామర్ నింపాల్సిన అవసరం ఉంది. ఆయనకో కొంటె భార్య కావాలి. నేను ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాలుగో భార్యగా ఉండాలనుకుంటున్నా. ఇందుకోసం బుష్రా బీబీతో బంధాన్ని తెంచడానికైనా నేను సిద్ధమే. ఆయన వయసు 70 ఏళ్లు. అయినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన ఇమ్రాన్ ఖాన్ ’’ అంటూ ఆ వీడియోలో జియా ఖాన్ కొంటెగా చెప్పింది. ఇమ్రాన్ ఖాన్ రాజకీయంగా కేసులు, అరెస్టులతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు కొత్త అభిమాని లభించారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: అందాల పోటీల్లో భార్య ఓటమి.. కోపంతో భర్త ఏం చేశాడంటే.. -
టిక్టాక్ కార్ థెఫ్ట్ చాలెంజ్: రాజీకి వచ్చిన హ్యూందాయ్, కియా..
హ్యూందాయ్, కియా కంపెనీలకు చెందిన కొన్ని మోడళ్ల కార్లను ఎంత సులువుగా దొంగిలించవచ్చో చూపించారు కొందరు టిక్టాకర్లు. ‘టిక్టాక్ థెఫ్ట్ ఛాలెంజ్’ పేరుతో అమెరికాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. దీని తర్వాత కార్ దొంగతనం బాధితులు ఈ రెండు కార్ల కంపెనీలపై కోర్టులో 200 మిలియన్ డాలర్లకు ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించుకునేందుకు హ్యుందాయ్, కియా కంపెనీలు ఎట్టకేలకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు బాధితులతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం... దావా పరిష్కారం కోసం దక్షిణ కొరియాకు చెందిన ఈ కార్ల కంపెనీలకు 200 మిలియన్ డాలర్ల వరకు ఖర్చవుతుంది. దీంట్లో అధిక మొత్తం కార్ల దొంగతనం సంబంధిత నష్టాలను భర్తీ చేసేందుకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బాధితులతో కార్ల కంపెనీలు చేసుకున్న రాజీ ఒప్పందాన్ని ఆమోదించాలా వద్దా అనేది కోర్టు ఇష్టం. ఇదీ చదవండి: కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు హ్యూందాయ్, కియా కంపెనీల కార్లను సులభంగా దొంగిలించవచ్చని చూపించే వీడియోలు టిక్టాక్లో వ్యాప్తి చెందడంతో అమెరికాలో గత సంవత్సరం ఆయా కంపెనీలకు చెందిన కార్ల దొంగతనాలు పెరిగాయి. యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్టీఎస్ఏ) ప్రకారం.. ఛాలెంజ్తో ముడిపడి ఉన్న కారు దొంగతనాలు కనీసం 14 క్రాష్లు, ఎనిమిది మరణాలకు దారితీశాయి. దొంగతనాలపై సోషల్ మీడియాలో జరిగిన ప్రమోషన్ వల్ల అమెరికాలో ప్రస్తుతం ఉన్న సుమారు 9 మిలియన్ల హ్యుందాయ్, కియా కార్లు ప్రమాదంలో పడ్డాయని ఆయా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్హెచ్టీఎస్ఏ ప్రకారం.. హ్యుందాయ్, కియా కంపెనీలు తమ కార్లలో ఇప్పటికే యాంటీ థెఫ్ట్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశాయి. కార్ ఓనర్లకు పదివేల స్టీరింగ్ వీల్ లాక్లను అందించాయి. ఇదీ చదవండి: కారు కొన్న ఆనందం.. డ్యాన్స్ చేసిన కుటుంబం.. ఆనంద్ మహింద్రా స్పందనేంటో తెలుసా? -
టిక్టాక్పై యూకే నిషేధం
లండన్: ప్రభుత్వ ఫోన్లలో టిక్టాక్ యాప్ వినియోగంపై బ్రిటన్ నిషేధం విధించింది. చైనా మూలాలున్న ఈ సామాజిక మాధ్యమ యాప్ను భద్రతాపరమైన కారణాలతో నిషేధిస్తున్నట్లు తెలిపింది. యూకే మంత్రి ఆలివర్ డౌడెన్ గురువారం పార్లమెంట్లో ఈ విషయం ప్రకటించారు. ప్రభుత్వ డేటా, సమాచారాన్ని టిక్టాక్ వాడుకోవడం ప్రమాదకరమని ఆయన అన్నారు. టిక్టాక్పై ఇప్పటికే భారత్, అమెరికా, కెనడా, ఈయూ దేశాలు పూర్తిస్థాయిలో నిషేధం విధించిన విషయం తెలిసిందే. యాప్ వినియోగదారుల సమాచారాన్ని చైనా ప్రభుత్వంతో పంచుకున్నట్లు వస్తున్న ఆరోపణలను టిక్టాక్ ఖండిస్తోంది. -
టిక్టాక్.. 60 నిమిషాలే 18 ఏళ్లలోపు వారికి వర్తింపు
వాషింగ్టన్: టిక్టాక్ వల్ల వినియోగదారుల డేటా భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఒకవైపు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు యాప్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లలోపు యూజర్లు ఒకరోజులో కేవలం ఒక గంటపాటే యాప్ను వినియోగించేలా పరిమితి విధించినట్లు టిక్టాక్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ అధినేత కార్మాక్ కీనన్ బుధవారం ప్రకటించారు. గంట సమయం దాటిన తర్వాత వీడియోలు ఆగిపోతాయని తెలిపారు. గంట తర్వాత మళ్లీ యాప్లో వీడియోలు చూడాలంటే పాస్కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇక 13 ఏళ్లలోపు యూజర్లు పాస్కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మరో 30 నిమిషాలపాటు మాత్రమే వీడియోలు తిలకించేందుకు వీలుంటుందని, ఆ తర్వాత ఆగిపోతాయని పేర్కొన్నారు. -
టిక్.. టిక్.. టిక్.. షేరింగ్కు సమయం లేదు మిత్రమా!
మన దేశంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరించిన మొబైల్ ఫోన్ అప్లికేషన్(యాప్) టిక్టాక్. యాప్లో స్వయంగా వీడియోలు రూపొందించి, సోషల్ మీడియాలో పోస్టుచేసి, లైక్లు కొట్టేయడం, కామెంట్లు చూసుకొని మురిసిపోవడం ఒక మధురానుభూతి, ఒక జ్ఞాపకం. చైనాకు చెందిన ఈ యాప్పై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేకుండాపోయింది. ప్రపంచవ్యాప్తంగా టిక్టాక్ను నిషేధిస్తున్న దేశాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అమెరికాలో సగానికిపైగా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో యాప్ వాడకాన్ని నిషేధించారు. అమెరికా సైనిక దళాల్లో యాప్పై నిషేధం అమలవుతోంది. తాజాగా ఈ జాబితాలో కెనడా చేరింది. జనానికి నచ్చిన టిక్టాక్ను ప్రభుత్వాలే వారి నుంచి దూరం చేస్తుండడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం.. ఎందుకీ నిషేధం? ► టిక్టాక్ను నిషేధించడానికి ప్రభుత్వాలు చెబుతున్న ప్రధాన కారణం దేశ భద్రత. ► యూజర్ల డేటాతో పాటు బ్రౌజింగ్ హిస్టరీ, లొకేషన్ వంటి వివరాలు నేరుగా చైనా ప్రభుత్వానికి చేరే ప్రమాదం ఉందని వివిధ దేశాలు అనుమానిస్తున్నాయి. ► ఇతర దేశాలపై, అక్కడి ప్రభుత్వాలపై దుష్ప్రచారం చేయడానికి టిక్టాక్ యాప్ చైనా చేతిలో ఒక ఆయుధంగా మారు తుందని భావిస్తున్నాయి. ► తప్పుడు ప్రచారం సాగించి, ఎన్నికల ఫలితాలను సైతం ప్రభావితం చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ► టిక్టాక్ వల్ల యూజర్ల డేటాకు భద్రత లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే ఫోన్లలోనూ టిక్టాక్ వాడుతున్నారని, దానివల్ల జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. ► విదేశాల సమాచారం చైనా చేతుల్లోకి వెళ్తే అక్కడి కంపెనీలు దాన్ని ఒక అవకాశంగా వాడుకొని లబ్ధి పొందుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఏయే దేశాలు నిషేధించాయి? ► 2021 జనవరిలో భారత్ టిక్టాక్ను పూర్తిస్థాయిలో నిషేధించింది. డేటా ప్రైవసీ, జాతీయ భద్రత కోసమంటూ చైనాకు చెందిన ఇతర యాప్లపైనా నిషేధం విధించింది. ► ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో తాత్కాలిక నిషేధం విధించారు. నిర్ధారణ కాని, అనైతిక సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకే ఈ చర్య తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వాలు వెల్లడించాయి. ► అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్(ఈయూ)లో ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఫోన్ల నుంచి టిక్టాక్ను తొలగించాలంటూ ఉద్యోగులకు ఇటీవలే ఆదేశాలు అందాయి. ► అమెరికాలో 50కిపైగా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఎలక్ట్రానిక్ పరికరాల్లో టిక్టాక్ను బ్యాన్ చేశారు. కేవలం ప్రభుత్వ ఫోన్లలోనే కాదు, సాధారణ ప్రజలు సైతం టిక్టాక్ వాడకుండా పూర్తిగా నిషేధించాలని అమెరికాలో కొందరు పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ► అమెరికా సైనిక దళాల్లో టిక్టాక్ వాడకాన్ని ఇప్పటికే నిషేధించారు. ► తైవాన్లో ప్రభుత్వ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్ కంప్యూటర్లలో టిక్టాక్ యాప్ ఉపయోగించడాన్ని 2022 డిసెంబర్లో నిషేధించారు. టిక్టాక్ వాదనేంటి? ► తమ యాప్ వల్ల డేటా భద్రత ఉండదన్న వాదనను టిక్టాక్ యాజమాన్యం ఖండించింది. ► యాప్ కారణంగా డేటా చౌర్యం జరుగుతోందని తేల్చడానికి ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. ► యూజర్ల వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాశమే లేదని, యాప్ను నిశ్చింతగా వాడుకోవచ్చని భరోసా ఇచ్చింది. ► కొన్ని దేశాలు టిక్టాక్ను నిషేధించడం విచారకరమని పేర్కొంది. డేటా ప్రైవసీకి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించింది. ► యాప్ను నిషేధించడం యాజర్లను తప్పుదోవ పట్టించడమే అవుతుందని యాజమాన్యం ఆక్షేపించింది. ► నిషేధం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించింది. ► కొన్ని పాశ్చాత్య దేశాలు అభద్రతాభావంతో టిక్టాక్ను తొలగిస్తున్నాయని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని చైనా ప్రభుత్వం విమర్శిస్తోంది. యాప్పై నిషేధం విధించడం ఆయా దేశాల్లో వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీయడం ఖాయమని తేల్చిచెప్పింది. అసలు ఏమిటీ యాప్? చైనాకు చెందిన బైట్డ్యాన్స్ అనే కంపెనీ ‘డౌయిన్’ పేరిట 2016 సెప్టెంబర్లో యాప్ను ప్రారంభించింది. తొలుత చైనాలోనే అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది. రికార్డుస్థాయిలో డౌన్లోడ్లు జరిగాయి. దాంతో బైట్డ్యాన్స్ కంపెనీ 2017లో అంతర్జాతీయ వెర్షన్ను ప్రారంభించింది. దీనికి టిక్టాక్ అనే పేరుపెట్టింది. 2018 ఆగస్టు నుంచి యాప్ ప్రపంచమంతటా బాగా వ్యాప్తిలోకి వచ్చింది. చైనాలో ఇది డౌయిన్ పేరిటే కొనసాగుతోంది. తక్కువ నిడివితో కూడిన వీడియోల షేరింగ్ కోసం టిక్టాక్ యాప్ను రూపొందించారు. ప్రాథమికంగా లిప్ సింకింగ్, డ్యాన్సింగ్ వీడియోలను ఇతరులతో పంచుకొనే వీలుంది. 3 సెకండ్ల నుంచి 10 నిమిషాల నిడివిల వీడియోలు ఉంటాయి. యూజర్ల అభిరుచులు, ఆసక్తిని బట్టి వీడియోలు ప్రత్యక్షం కావడం ఇందులోని మరో ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా భాషల్లో టిక్టాక్ యాప్ అందుబాటులో ఉంది. -
కెనడాలోనూ టిక్టాక్పై నిషేధం
టొరంటో: చైనాకు చెందిన టిక్టాక్పై కెనడా నిషేధం విధించింది. ప్రభుత్వం జారీ చేసిన మొబైల్ పరికరాలు వేటిలోనూ దాన్ని వాడకూడదని పేర్కొంది. ప్రభుత్వోద్యోగులెవరూ దీన్ని వాడొద్దని ఆదేశించింది. ప్రైవసీకి, భద్రతకు ఈ యాప్ వల్ల చాలా రిస్కుందని కెనడా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నిర్ధారించినట్టు ట్రెజరీ బోర్డ్ ప్రెసిడెంట్ మోనా ఫోర్టియర్ తెలిపారు. ఇది ప్రారంభమేనని, మున్ముందు మరిన్ని చర్యలుంటాయని ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. డెన్మార్క్లో ప్రభుత్వ మొబైళ్లు తదితరాల్లో టిక్టాక్ను నిషేధించాలని పార్లమెంటు పేర్కొంది. అమెరికా నెల రోజుల్లోపు ప్రభుత్వ మొబైళ్లు తదితర పరికరాల్లో నుంచి టిక్టాక్ను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. -
టిక్టాక్ వీడియో దెబ్బ.. హ్యుందాయ్, కియా అబ్బా!
వాహన తయారీ సంస్థలు మునుపటి కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్తో వాహనాలను విడుదల చేస్తున్నాయి. అయితే వాహనాలను దొంగలించేవారు అంతకు మించిన టిప్స్ ఉపయోగించిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక టిక్టాక్ వీడియో హ్యుందాయ్, కియా కంపెనీల పాలిట శాపంగా మారింది. ఆ వీడియోలో కార్లను ఎలా దొంగలించాలనేది వివరించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఆ వీడియో ప్రభావంతో అమెరికాలోని కొన్ని నగరాల్లో వాహన దొంగతనాలు 30 శాతం పెరిగాయి. ఈ వీడియోలో కేవలం ఒక USB కేబుల్తో కారు ఇంజిన్ను ఎలా స్టార్ట్ చేయాలో వివరించారు. ఇంటి బయట, రోడ్డు పక్కన పార్క్ చేసిన వందలాది కార్లను ఈ వీడియో సాయంతో దొంగలు అదృశ్యం చేశారు. దీంతో రెండు కంపెనీలు అప్రమత్తమయ్యాయి. హ్యుందాయ్, కియా కంపెనీలు 2015 నుంచి 2019 మధ్య అమెరికాలో తయారైన 83 లక్షల కార్ల సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి సంకల్పించాయి. అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. 2015 - 2019 మధ్య తయారు చేయబడిన కార్లలో ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్ లేదు. దొంగలు అలాంటి కార్లను సులభంగా దొంగలిస్తున్నారు. దొంగతనాలను నివారించాడనికి తమ వాహనాలలో సెక్యూరిటీ ఏజెన్సీల సహాయంతో కంపెనీలు వీల్ లాక్, స్టీరింగ్-వీల్ లాక్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉచితంగా అందించనున్నారు. అన్ని కార్లను అప్డేట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పటికే 12 అమెరికన్ రాష్ట్రాలలో 26,000కి పైగా భద్రతా పరికరాలను అందించాయి. 2021 నుంచి తయారైన దాదాపు అన్ని కార్లు ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్తో వస్తున్నాయి. -
టిక్టాక్ సంచలన నిర్ణయం: వాళ్లందరిపైనా వేటు!
సాక్షి,ముంబై: సోషల్ మీడియా సంస్థ, ఇండియాలో బ్యాన్ అయిన టిక్టాక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియా కేంద్రంగా పనిచేస్తున్న ఉద్యోగులందరినీ తొలగించింది. భారత్ నుంచి బ్రెజిల్, దుబాయ్ మార్కెట్లకు పని చేస్తున్న వారినందరికి ఉద్వాసన పలికింది. ఫలితంగా దాదాపు 40మంది ప్రభావితంకానున్నారు. నిషేధం తరువాత భారత్లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలన్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో టిక్టాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మూడు సంవత్సరాల క్రితం నిషేధానికి గురైన టిక్టాక్ ఆఫీసులను కూడా మూసివేయనుంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, బైట్డాన్స్ యాజమాన్యంలోని టిక్టాక్ ఈ వారం 40 మందికి పింక్ స్లిప్లను అందించింది. తొలగించిన ఉద్యోగులకు తొమ్మిది నెలల జీతాన్ని చెల్లిస్తామని పేర్కొంది తమ గ్లోబల్, ప్రాంతీయ సేల్స్ టీమ్స్కు సపోర్ట్ కోసం 2020లో భారత్లో ఏర్పాటు చేసిన రిమోట్ సేల్స్ సపోర్ట్ హబ్ను మూసివేయాలని నిర్ణయించామని టిక్టాక్ ప్రతినిధి ఒ్క ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు గత ఏడాది అమెరికాలోనూ అన్ని ఫెడరల్ ప్రభుత్వ డివైస్లలో టిక్టాక్పై నిషేధాన్ని ఆమోదించింది. టిక్టాక్ వినియోగాన్ని నిరోధించే లక్ష్యంతో రూపొందించిన బిల్లుపై ఈ నెలలో ఓటింగ్ నిర్వహించాలని హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ యోచిస్తోంది. భారత్లో నిషేధంతో మార్కెట్ వాటాను కోల్పోయినప్పటికీ టిక్టాక్ ఇప్పటికీ భారత్లో కార్యాలయాన్ని కొనసాగిస్తోంది. భారత్ కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్న ఉద్యోగులు బ్రెజిల్, దుబాయ్ మార్కట్ల కోసం పనిచేస్తున్నారు.తాజాగా వీరందరికి ఉద్వాసన పలికింది. చైనా కంపెనీ బైట్డాన్స్ యాజమాన్యంలోని వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ను సరిహద్దు ఉద్రిక్తతలు, జాతీయ భద్రత కారణాలతో 2020లో కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. -
Nepal Plane Crash: వద్దన్నా! పట్టుబట్టి డ్యూటీకి వెళ్లింది..ఓ నాన్న ఆవేదన
నేపాల్ విమానా ఘటన తర్వాత పలువురు గురించి వస్తున్న ఆసక్తికర విషయాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ఆ ఘటన బాధిత కుటుంబాలకు అంత తేలిగ్గా మర్చిపోలేని అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఆ దుర్ఘటన రోజు విధులు నిర్వర్తించేందకు వెళ్లిన ఫ్లైట్ అటెండెంట్ ఓషిన్ అలే మగర్ది మరో విషాద గాథ. ఆ ఫ్లైట్ అటెండెంట్ అలే మగర్ రెండేళ్లుగా యతి ఎయిర్లైన్స్లో పనిచేస్తోంది. ఆమె ఖట్మాండ్లో తన కుటుంబంతో నివశిస్తోంది. వాస్తవానికి ఆరోజు విధులు నిర్వర్తించాల్సింది కాదు. ఇంట్లో తండ్రి మోహన్ అలే మగర ఆమెను ఆరోజు డ్యూటీ మానేయమని, సంక్రాంతి పండుగ చేసుకుందామని చెప్పారు. అయినా సరే ఆమె పట్టుపట్టి మరీ ఆ రోజు విధులకు వెళ్లింది. పైగా తాను రెండు విమానాల్లో చేయాల్సిన డ్యూటీని ముగించుకుని సంక్రాంతి రోజుకల్లా వచ్చేస్తానంటూ వెళ్లిందన ఆమె తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. కచ్చితంగా సంక్రాంతి రోజున ఇంట్లోనే ఉంటానని హామీ ఇచ్చిందంటూ విలపించారు. అంతలోనే ఈ ప్రమాదం బారిన పడి కానరాని లోకాలకు వెళ్లిపోయిందని ఆవేదనగా చెప్పారు. ఆమెకు పెళ్లై రెండేళ్లే అయ్యిందని, ఆమె భర్త యూకేలో ఉన్నట్లు తెలిపారు. ఐతే ఇప్పుడూ ఆ ఫ్టైల్ అటెండెంట్కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..నెటిజన్లు ఆ యతి ఎయిర్లైన్స్ విమానం కూలిపోడానికి కొన్ని క్షణాల ముందు రికార్డు చేసిన వీడియో అని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఇది గతేడాది సెప్టెంబర్ 11న రికార్డు చేసిన వీడియో అని, విమానం క్రాష్ జరగడానికి ముందు తీసినది కాదని ఆమె టిక్టాక్లో షేర్ చేసిన వీడియో ఆధారంగా తెలుస్తోంది. కాగా, నేపాల్లో ఆదివారం యతి ఎయిర్లైన్ ఏటీఆర్ 72 విమానం కూలి సుమారు 68 మంది దాక మృతి చెందిన సంగతి తెలిసిందే. The Air hostess in #YetiAirlinesCrash Live life to the fullest as long as you are alive because death is unexpected! Just sharing TikTok video of Air Hostess Oshin Magar who lost her life in #NepalPlaneCrash today जहां भी रहो ऐसे ही रहो! Rest in Peace !!💐#Nepal #planecrash pic.twitter.com/Bh6DBDnhnt — Deep Ahlawat 🇮🇳🎭 (@DeepAhlawt) January 15, 2023 (చదవండి: ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు) -
టిక్టాక్కు భారీ షాక్.. యాప్పై అమెరికా ప్రభుత్వం నిషేధం!
భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో టిక్ టాక్ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిషేధం దేశ మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్లలో వినియోగించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి మార్గదర్శకాల్ని విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు టిక్ వినియోగించే అవకాశం కోల్పోనున్నారు. చైనా దేశం బైట్ డ్యాన్స్ సంస్థకు చెందిన టిక్టాక్ వినియోగడంతో సెక్యూరిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయని అమెరికా ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా అమెరికా కాంగ్రెస్లో హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ (ప్రతినిధుల సభ) టిక్ టాక్ను వినియోగించకుండా నిషేధం విధిస్తూ హౌస్ చీఫ్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (సీఏఓ) చట్టసభ సభ్యులు, ఇతర సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు టిక్ టాక్ను వినియోగించేందుకు అనువుగా ఉండే అన్నీ డివైజ్లలో యాప్ను డిలీట్ చేయాలని కోరారు. ఇప్పటికే గత వారం టిక్ టాక్ యాప్ సాయంతో అమెరికన్లు, ఇతర అంతర్గత సమాచారాన్ని ట్రాక్ చేస్తుందని 19 రాష్ట్ర ప్రభుత్వాలు..గవర్నమెంట్కు చెందిన డివైజ్లలో మాత్రమే యాప్ను వినియోగించకుండా తాత్కాలికంగా బ్లాక్ చేశాయి. జో బైడెన్ సంతకంతో కొద్ది రోజుల క్రితం అమెరికా ప్రభుత్వం సెప్టెంబర్ 30, 2023 వరకు ఫెడరల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ విభాగాల నిర్వహణకోసం 1.66 ట్రిలియన్ డాలర్ల నిధుల విడుదల చేసేందుకు ఆమోదించింది. దీంతో పాటు టిక్టాక్పై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. సంబంధిత ఫైల్స్ మీద దేశాధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేస్తే.. నిషేధం వెంటనే అమల్లోకి రానుంది. అమెరికాలో యాప్ను నిషేధించాలని యాప్ వాడకుండా దేశవ్యాప్తంగా నిషేధాన్ని అమలు చేయాలని యూఎస్ చట్టసభ సభ్యులు ప్రతిపాదన తెచ్చారు. కానీ జోబైడెన్ ప్రభుత్వం కేవలం హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్, వారి శాఖలకు చెందిన ఉద్యోగులు టిక్టాక్ వినియోగంపై ఆంక్షలు విధించింది. కాగా, అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిక్ టాక్ యాజమాన్యం బైట్డ్యాన్స్ స్పందించలేదు చదవండి👉 ‘నాతో గేమ్స్ ఆడొద్దు’..!, ట్విటర్ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ వార్నింగ్! -
పండుగకు ఫ్యామిలీతో షాపింగ్ చేస్తుండగా కాల్పులు.. టిక్ టాక్ స్టార్ మృతి
వాషింగ్టన్: ప్రముఖ అమెరికా టిక్ టాక్ స్టార్ బ్రండన్ బూగీ మాంట్రెల్ తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. క్రిస్మస్ పండుగకు షాపింగ్ చేసేందుకు కుటుంబసభ్యులతో వెళ్లిన అతనికి బుల్లెట్లు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. న్యూఓర్లీన్స్లో డెసెంబర్ 23న ఈ ఘటన జరిగింది. బూగీ బీ షాపింగ్కు వెళ్లినప్పుడు కారు పార్కింగ్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరుపుకొన్నారు. అయితే కారులో కూర్చున్న బూగీకి వారి కాల్చిన తూటాలు గురితప్పి తగిలాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 43 ఏళ్ల బూగీ బీ.. టిక్ టాక్, ఇన్స్టాగ్రాంలో తన వీడియోలతో నవ్వులు పూయిస్తూ అనతికాలంలోనే పాపులర్ అయ్యారు. మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నారు. న్యూయార్క్లో నివసిస్తున్న ఆయన క్రిస్మస్ సందర్భంగా సొంత నగరం న్యూ ఓర్లీన్కు వెళ్లారు. దురదృష్టవశాత్తు తుపాకి తూటాలు తగిలి కన్నుమూశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే బూగీ బీ మృతి అనంతరం పోలీసుల తీరుపై ఆమె తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్లో తన కుమారుడే గాక చాలా మంది అమాయకులు మరణించారని, పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. న్యూ ఓర్లీన్స్ నగరంలో తరచూ తుపాకీ కాల్పుల ఘటనలు జరగుతున్నాయి. ఇక్కడి యువత దారితప్పి గన్ ఫైటింగ్కు దిగుతున్నారు. ఏ మాత్రం ప్రాణభయం లేకుండా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఇక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఫ్రెండ్స్తో అడవిలో మందు తాగుతుండగా ఈడ్చుకెళ్లిన పులి.. సగం తిని.. -
‘మీ4 టిక్ టిక్’ యాప్ లాంచ్.. టిక్ టాక్ను మరిపిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ టిక్ టాక్ ద్వారా యూత్ తమ టాలెంట్ను నిరూపించుకుంటూ ఎంతో పాపులర్ అయ్యేవారు. అయితే కొన్ని భద్రతా కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం "టిక్ టాక్" ను బ్యాన్ చేసింది. దీంతో యువత ప్రత్యామ్నాయాలను ఎంచుకున్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా "రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి "మీ 4 టిక్ టిక్" యాప్ ను ప్రముఖులు, యువత సమక్షంలో హైదరాబాద్లో ఘనంగా లాంచ్ చేసింది. ట్యాలెంటెడ్ యూత్ కు 'ME 4 టిక్ టిక్' యాప్ ఒక యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని "ME 4 Tic Tic" యాప్ ఇండియా సీఈవో డీసతీష్ రెడ్డి వెల్లడించారు. అన్ని రకాల కంటెంట్ తో అందరినీ అలరిస్తుందన్నారు. ముఖ్యంగా స్వదేశీంలో భారత ఐటీ యువత రూపొందించిన "ME 4 టిక్ టిక్" హైలీ సెక్యూర్డ్ యాప్ అనీ ఇందులో ఉండే డేటా చాలా సేఫ్ అని కంపెనీ వెల్లడించింది. ఈ యాప్ 150 దేశాలలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా అమెజాన్ భాగస్వామ్యంతో అమెజాన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఈ యాప్ ఉంటుందని, ఒక భారతీయుడిగా ఇండియాలో ఈ యాప్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాప్ రూపొందించిన టీంకు కృతజ్ఞతలు తెలిపిన పలువురు, యాప్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఇదివరకు సినిమాలో ఏ క్యారెక్టర్ కు ఎవరు సూట్ అవుతారో ఫోటో షూట్ చూసి సెలెక్ట్ చేసేవారమనీ, సోషల్ మీడియా వచ్చిన తరువాత చాలామంది దర్శక, నిర్మాతలకు ఇపుడు ఆ పని ఈజీ అయ్యిందని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ నిర్మాత సురేష్ కొండేటి వ్యాఖ్యానించారు. టిక్ టాక్కు ప్రత్యామ్నాయంగా వచ్చిన "ME4 టిక్ టిక్" యాప్ పెద్ద సక్సెస్ అవ్వాలన్నారు. -
సోనాలీ ఫోగాట్ హత్యకు రూ.10 కోట్ల డీల్!
న్యూఢిల్లీ: బీజేపీ నాయకురాలు, టిక్టాక్ స్టార్, నటి సోనాలీ ఫోగాట్(42) హత్యకు రూ.10 కోట్ల డీల్ కుదిరిందని, ఈ మేరకు తమ కుటుంబానికి ఇటీవలే రెండు లేఖలు అందాయని ఆమె బావ అమన్ పూనియా తాజాగా చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ రెండు లేఖలు వచ్చినట్లు తెలిపారు. ఒక లేఖలో రూ.10 కోట్ల డీల్ గురించి, మరో లేఖలో పలువురు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయన్నారు. లేఖల్లో కీలక సమాచార ముంది కాబట్టి వీటిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సోనాలీ ఫోగాట్ ఆగస్టు 23న గోవాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు తొలుత ప్రచారం జరిగింది. కానీ, ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు పోస్టుమార్టంలో తేలింది. విచారణ చేపట్టిన పోలీసులు సోనాలీ సహాయకులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం సీబీఐ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
టిక్టాక్ ప్రేమ.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య
సాక్షి, తిరుపతి: భర్త మరో అమ్మాయితో చనువుగా ఉన్నాడని తెలిస్తేనే తట్టుకోలేదు భార్య. అలాంటిది మరో పెళ్లి చేసుకునేందుకు అంగీకరిస్తుందా? కానీ, ఇక్కడ సీన్ రివర్స్. భర్తకు ప్రియురాలిని ఇచ్చి భార్య దగ్గరుండి పెళ్లి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో జరిగింది. టిక్టాక్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా.. వెతుక్కుంటూ వచ్చిన యువతితో తన భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేసింది. ఈ అరుదైన వివాహం గురించి తెలుసుకుందాం రండీ... డక్కిలి మండలం అంబేద్కర్ నగర్కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. టిక్టాక్లో విశాఖకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడగా.. ఇద్దరి మనసులు కలిశాయి. ఒకర్ని ఒకరు ప్రేమించుకున్నారు. కొన్నాళ్లు ఇద్దరూ చనువుగా ఉన్నారు.. ఆ తర్వాత యువతి నుంచి యువకుడు దూరమయ్యాడు. కొద్దిరోజులు తర్వాత మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నారు. ఇంతలో ప్రియుడి కోసం కొన్నాళ్లు వేచిచూసిన విశాఖ యువతి నేరుగా తిరుపతికి వచ్చింది. తన ప్రియుడికి ఇప్పటికే పెళ్లి జరిగిన విషయం తెలిసి బాధపడింది. కానీ, ఆ యువతి అంతటితో ఆగిపోలేదు.. తన ప్రేమికుడి భార్యను కలిసి మాట్లాడింది. తానూ ఇక్కడే ఉంటానని.. అందరం కలిసి ఉందామని నచ్చజెప్పింది. మొదటి భార్యకు ఏం చేయాలో పాలుపోలేదు. తొలుత అయోమయంలో పడినా.. చివరకు ముగ్గురూ కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తన భర్తకు ఆ యువతితో పెళ్లి చేయడానికి భార్య ఒప్పుకుంది. దీంతో భర్తతో కలిసి ప్రియురాలు పెళ్లి పీటలెక్కింది. భార్యే దగ్గరుండి భర్తతో ప్రియురాలికి వివాహం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇదీ చదవండి: పాఠశాలనే మద్యం గోదాం.. లిక్కర్ మాఫియా పనితో టీచర్స్ షాక్! -
ఐటీ జాబ్ పొందడమే మీ లక్ష్యమా? ఈ ఐదు తప్పులు చేయకండి!
గూగుల్లో జాబ్ సంపాదించడమే మీ లక్ష్యమా? గూగుల్తో పాటు ఇతర టెక్ కంపెనీల్లో ఐసైతం జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీ రెజ్యూమ్లో ఇలాంటి తప్పులు చేయకండి. గూగుల్ రిక్రూటర్ చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే దిగ్గజ కంపెనీల్లో జాబ్ సంపాదించడం అంత కష్టం కాదని అంటున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందామా! ►మీరు కోరుకున్న డ్రీమ్ జాబ్ పొందడంలో రెజ్యూమ్ కీరోల్ ప్లే చేస్తోంది. చాలా మంది జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి సంస్థలు రెజ్యూమ్ను కేవలం వ్యక్తిగత వివరాల్ని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని అనుకుంటారు.కానీ అందులో వాస్తవం లేదని, అభ్యర్ధి తెలివితేటలకు పరీక్ష పెడుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మీ రెజ్యూమ్ను అర్హతలకు అనుగుణంగా తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. ►ఒకవేళ మీరు గూగుల్ లేద ఇతర దిగ్గజ కంపెనీల్లొ జాబ్ కొట్టాలంటే రెజ్యూమ్లో ఈ తప్పులు చేయకూడదని గూగుల్ రిక్రూటర్ ఒకరు టిక్టాక్ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ►చికాగోకు చెందిన గూగుల్ సీనియర్ రిక్రూటర్ ఎరికా రివెరా టిక్ టాక్లో మీ రెజ్యూమ్ను ఆకర్షణీయంగా మార్చేలా పలు సూచనలు చేశారు.ఆ వీడియోను 2మిలియన్ల మంది యూజర్లు వీక్షించగా..ఆ వీడియోలో ఎరికా..తాను ఇప్పటి వరకు వేలాది వెబ్ సైట్లను స్క్రీనింగ్ చేసినట్లు చెప్పారు. అభ్యర్ధులు వారి రెజ్యూమ్లో అసందర్భమైన డేటాను పొందుపరిచినట్లు గుర్తించినట్లు తెలిపారు. అలా సందర్భం లేని ఇన్ఫర్మేషన్ రెజ్యూమ్లో ఉండకూడదన్నారు. ►రెజ్యూమ్లో అభ్యర్ధులు పూర్తి అడ్రస్ను చేర్చాల్సిన పనిలేదని చెప్పారు. నగరం, లేదా రాష్ట్రాన్ని మాత్రమే ప్రస్తావిస్తే సరిపోతుందని సలహా ఇచ్చారు. ►సీవీలో చేర్చగూడని మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. కానీ ఆ విషయం మొత్తంలో సీవీలో ప్రస్తావించకూడదు. మీరు ఏ సంస్థకి ఇంటర్వ్యూకి, ఏ రోల్ జాబ్ ఇంటర్వ్యూకి వెళుతున్నారో..ఆరోల్కు అనుగుణంగా రెజ్యూమ్ను తయారు చేసుకోవాలని సూచించారు. ►రెజ్యూమ్లో మీరు గతంలో పనిచేసిన సంస్థ గురించి ప్రస్తావిస్తూ..ఆ సంస్థలో సాధించిన విజయాల గురించి ఒక టీం చేసిన విధంగా చెప్పాలి. అంతే తప్పా అన్నీ నేనే చేశాను అని మాత్రం ప్రస్తావించకూడదు. ►రెజ్యూమ్లో సంబంధం లేకుండా రెఫరెన్స్ నేమ్స్, వారి వివరాల్ని పొందుపరుస్తుంటారు.అలాంటి విషయాలు అవసరం లేదని ఎరికా టిక్ టాక్ వీడియోలో చెప్పారు.రిక్రూటర్లకు అవసరం అయితే మిమ్మల్ని అడుగుతారని, అంతే తప్పా మీరే స్వయంగా చెప్పకూడదని అన్నారు. -
వైరల్: ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని.. ఏకంగా 70 కిలోలు తగ్గి
బాగా లావుగా ఉన్నాడని ఓ వ్యక్తిని అతని గర్ల్ఫ్రెండ్ వదిలేసి వెళ్లింది. ప్రియురాలు బ్రేకప్ చేప్పడంతో చాలా కుంగిపోయాడు. అయితే ఆమెకు తన మాటలతో కాకుండా చర్యలతో తగిన సమాధానం చెప్పాడు. ఉబకాయం నుంచి కండల వీరుడిగా తయారయ్యాడు. ఏకంగా 70 కిలోలు బరువు తగ్గి వావ్ అనిపించాడు. స్ఠూలకాయం నుంచి ఫిట్గా మారిన అతడు చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు. తన వెయిట్ లాస్ జర్నీని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆన్లైన్ స్టార్గా మారాడు. అధిక బరువుతో బాధపడుతున్న పువి అనే యువకుడిని అదే కారణంతో అతడి ప్రియురాలు విడిచిపెట్టింది. దీంతో తన శరీరాకృతిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీన్ని చాలెంజ్గా స్వీకరించాడు. అనుకున్నట్లుగానే జిమ్కు వెళ్లి వర్కౌట్ చేయడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా అతని శరీరంలో మార్పును చూడటం ప్రారంభించాడు. ప్రియురాలు బ్రేకప్ చెప్పిన 139 కిలోల బరువు ఉన్న పువి.. 18 నెలలు కఠిన వ్యాయామం చేసి బరువు తగ్గాడు. ఎంతలా తగ్గాడంటే 70 కిలోల కొవ్వును కరిగించి 74 కిలోలకు చేరాడు. చదవండి: Miss Universe: చారిత్రక మార్పు! ఇకపై వాళ్లు కూడా పాల్గొనవచ్చు! అయితే.. View this post on Instagram A post shared by 🅿️uvi (gram_du_insta) (@npuvi96) గతంలో ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ నుంచి నుంచి ఇప్పుడు స్మాల్ సైజ్కు మారిపోయాడు. టిక్టాక్ యూజర్ పువి తన వర్కవుట్ వీడియోలను తరచూ షేర్ చేస్తుండే వాడు. దీంతో అతడి ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. కండలు తీరిన దేహంతో పువి ట్రాన్స్ఫర్మేషన్.. పలువురిలో స్పూర్తి నింపుతోంది. అతడి కృషి, పట్టుదలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by 🅿️uvi (gram_du_insta) (@npuvi96) View this post on Instagram A post shared by Bodybuilding.com (@bodybuildingcom) -
వీఎల్సీ మీడియా ప్లేయర్పై నిషేధం, వెబ్సైట్, డౌన్లోడ్ లింక్ బ్లాక్
ముంబై: పబ్జీ మొబైల్, టిక్టాక్, కామ్స్కానర్ సహా వందలాది చైనీస్ యాప్లను బ్లాక్ చేసిన కేంద్రం తాజాగా ప్రముఖ మీడియా ప్లేయర్ సాఫ్ట్వేర్, వీడియో స్ట్రీమింగ్ సర్వర్ వీఎల్సీ మీడియా ప్లేయర్ను కూడా బ్యాన్ చేసింది. ఇండియాలో వీఎల్సీ మీడియా ప్లేయర్ వెబ్సైట్, డౌన్లోడ్ లింక్ను కూడా బ్లాక్ చేసింది. మీడియా వెబ్సైట్ను ఓపెన్ చేయగానే ఐటీ చట్టం కింద నిషేధించిన సందేశం కనిపిస్తోంది. అంటే ఇకపై దేశంలో ఎవరూ ఏ పని కోసం ప్లాట్ఫారమ్ను యాక్సెస్ చేయలేరన్నమాట. ఇటీవల బీజీఎంఐ అనే పబ్జీ మొబైల్ ఇండియన్ వెర్షన్ను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. తాజా నివేదికల ప్రకారం IT చట్టం, 2000 ప్రకారం వీడియోలాన్ ప్రాజెక్ట్ వీఎల్సీ మీడియా ప్లేయర్కు చెక్ చెప్పింది కేంద్రం. అయితే చైనా-మద్దతు గల హ్యాకింగ్ గ్రూప్ సికాడా సైబర్ దాడులకు ప్లాట్ఫారమ్ అయినందున VLC మీడియా ప్లేయర్ దేశంలో బ్లాక్ చేసినట్టు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. దీర్ఘకాలంగా సైబర్ దాడులు, హానికరమైన మాల్వేర్ లోడ్ కోసం సికాడా వీఎల్సీ మీడియా ప్లేయర్ని ఉపయోగిస్తోందని కొన్ని నెలల క్రితం భద్రతా నిపుణులు కనుగొన్నారు. VideoLAN ప్రాజెక్ట్ ద్వారా తయారైన వీఎల్సీ ప్లేయర్ భారతదేశంలో దాదాపు రెండు నెలల క్రితం కేంద్రం బ్లాక్ చేసింది. (Kia Seltos:కియా మరోసారి అదరగొట్టింది,సెల్టోస్ కొత్త రికార్డు) అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు కంపెనీ నుంచి,ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ గగన్దీప్ సప్రా అనే ట్విటర్ యూజర్లలో ఒకరు వీఎల్సీ వెబ్సైట్ స్క్రీన్షాట్ను ట్వీట్ చేసారు, "ఐటి యాక్ట్, 2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్డర్ ప్రకారం వెబ్సైట్ బ్లాక్ చేయబడింది" అని చూపిస్తుంది. ప్యారిస్కు చెందిన వీడియోలాన్ సంస్థ వీఎల్సీ మీడియాని అభివృద్ధి చేసింది. (Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే!) Anyone know why @NICMeity has banned VLC Downloads in India? @internetfreedom pic.twitter.com/lQubbyK0Yi — Gagandeep Sapra (@TheBigGeek) August 12, 2022 #blocked Videolan project’s website “https://t.co/rPDNPH4QeB” cannot be accessed due to an order issued by @GoI_MeitY. It is inaccessible for all the major ISPs in India including #ACT, #Airtel and V!. #WebsiteBlocking pic.twitter.com/LBKgycuTUo — sflc.in (@SFLCin) June 2, 2022 -
ఆనంద్ మహింద్ర మనసు దోచిన 'కప్పు': ఫోటో వైరల్
ప్రముఖ పారిశ్రామికవేత్త సోషల్ మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటూ తరుచుగా మంచి మంచి వైరల్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోల నుంచి మంచి మంచి సందేశాలను కూడా ఇస్తుంటారు కూడా. అదే తరహాలో ఒక వైరల్ ఫోటో సోషల్ మాధ్యమంలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఆ ఫోటో ఆనంద్ మహింద్ర మనసును దోచింది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే...ఒక తెల్లటి కప్పు పై టిక్టాక్ గేమ్ ఒకటి ఉంది. అదేలా ఉందంటే... ఆ కాఫీ కప్పుపై 'థింక్ అవుట్ బాక్స్' అని ఉండి కింద గేమ్ అనుసంధానించి ఉంది. అది బాక్స్ అనే పదంలోని ఎక్స్తో అనుసంధానమయ్యి బాక్స్ నుంచి బయటపడే మార్గం చూపుతుంది. ఇది ఒక మంచి చక్కని సందేశాన్ని ఇచ్చిందంటూ... ఆనంద్ మహింద్ర ఆ కప్పును తెగ మెచ్చకుంటూ ఆ విషయాన్ని వివరించారు. ఈ మేరకు ఆయన ఆ సందేశం వివరిస్తూ...ఇది ఒక రకంగా మనం మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేస్తోంది. నిజానికి మనం సమస్య లోనే ఉండిపోయి కాకుండా బయటగా ఉండి ఎలా బయటపడాలో అన్వేషించాలి అనే ఒక చక్కని సందేశాన్ని ఇస్తోంది. గెలిచే మార్గాలను అన్వేషించడం తోపాటు సమస్య నుంచి బయటపడే పరిష్కార మార్గాలు గురించి తెలియజేస్తోంది. అన్నారు. అంతేకాదు ఇది అద్భుతమైన కప్పు, వెంటనే తాను ఆ కప్పును తెచ్చుకుంటానంటూ ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా ఆయనతో ఏకభవిస్తూ ఔను ఇది మంచి సందేశాన్ని ఇచ్చింది. ఎలా తెలివిగా సమస్యలు పరిష్కరించుకోవాలో తెలియజేస్తోంది అంటూ ట్వీట్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. I’m going to get this mug. Clever. The solution to a problem often lies by joining the dots with something OUTSIDE your own ecosystem… pic.twitter.com/SedGrDN8B9 — anand mahindra (@anandmahindra) August 10, 2022 (చదవండి: Viral Video: ఆహా! కోటు వేసుకోవడం ఎంత కష్టమో... బైడెన్ చూస్తే తెలుస్తుంది) -
విడాకుల గురించి టిక్టాక్లో చెప్పిందని..హత్య చేసిన మాజీ భర్త!
ఇటీల ఏం జరిగిన ప్రతి విషయాన్ని సోషల్ మాధ్యమ్యంలో షేర్ చేయడం ఒక అలవాటైపోయింది జనాలకు. ఇవి ఒక్కోసారి వారిని ఇబ్బందులకు గురి చేస్తాయనే స్ప్రుహ కూడా ఉండటం లేదు. అదీగాక వ్యూస్, ఫాలోవర్స్ మాయలో ఏ చేస్తున్నారో కూడా తెలియడం లేదు. వ్యక్తిగత విషయాలు గురించి చెప్పేటప్పుడూ కాస్త జాగ్రత్త అవసరం. ఎందుకంటే మీతో ఉండే వ్యక్తులకు అలా చెప్పడం నచ్చుతుందో లేదో తెలియదు. అందువల్ల లేనిపోని సమస్యలు కూడా వస్తాయి. అచ్చం అలానే ఇక్కడొక మహిళ సామాజిక మాధ్యమంలో తన వ్యక్తిగత విషయాలను చెప్పి.. విగత జీవిగా మారింది. వివరాల్లోకెళ్తే...పాకిస్తానీ అమెరికన్ మహిళ సానియా ఖాన్ తన వ్యక్తిగత విషయానికి సంబంధించి వివాహం ఎందుకు విఫలమయ్యిందో, అందుకు దారితీసిని విషయాల గురించి సోషల్ మాధ్యమంలో షేర్ చేసింది. పైగా విడాకుల తీసుకున్న మహిళగా తనకు ఎదురైన చేదు అనుభవాలను కూడా వివరించింది. పైగా ఆమె మాజీ భర్త కుటుంబం నుంచి తనకు ఎదురైన కూడా పంచుకుంది. అంతే ఇది నచ్చిన ఆమె మాజీ భర్త ఆమెను చంపేందుకు రెడీ అయిపోయాడు. వాస్తవానికి సానియా ఖాన్ తన మాజీ భర్త రహెల్ అహ్మద్ ఇద్దరు ఐదేళ్లు డేటింగ్ చేసి గతేడాది 2021లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారు ఇద్దరు చికాగోలో కొన్నాళ్లు కలిసి ఉన్నారు. ఏమైందో ఇద్దరిమధ్య విభేదాలు తలెత్తి కొద్దిరోజుల్లోనే విడిపోయారు. దీంతో ఆమె టేనస్సీకి వెళ్లిపోదాం అనుకుంది. ఐతే ఆమె టిక్టాక్, ఇన్స్ట్రాగ్రాంలో మంచి యాక్టివిగ్ ఉంటుంది. తనకు ఆనందం కలిగినా, బాధ కలిగినా ఆ విషయాలను సోషల్ మీడియాలోని నెటిజన్లతో షేర్ చేసుకోవడం అలవాటే. అలానే ఆమె టేనస్సీకి బయలుదేరే సమయంలో సోషల్ మీడియాలో ఈ విషయాలన్ని వివరిస్తూ...పోస్ట్లు పెట్టింది. పైగా తనలాంటి వాళ్ల కోసం పాటుపడతానని, సమాజం నుంచి, బంధువుల నుంచి ఎలాంటి అవమానాన్నైనా తట్టుకుంటానంటూ చెప్పుకొచ్చింది. అంతే ఇది తెలుసుకున్న జార్జియాలో ఉన్న ఆమె మాజీ భర్త చికాగోలో ఉన్న తన వద్దకు వచ్చి తుపాకితో ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఐతే అహ్మద్ తల్లిదండ్రలు తమ కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషాధ ఘటన వెలుగు చూసింది. ఏదీ ఏమైన కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది. (చదవండి: అమానుష ఘటన: గర్భిణిని కింద పడేసి, కాళ్లతో తన్ని...) -
మళ్లీ భారత్లోకి రీ ఎంట్రీ కోసం ఆరాటం, టిక్టాక్ సరికొత్త వ్యూహం!
టిక్టాక్ యూజర్లకు శుభవార్త. దేశ భద్రత దృష్ట్యా భారత కేంద్ర ప్రభుత్వం జున్ 2020లో టిక్టాక్పై బ్యాన్ విధించింది. ఇప్పుడా ఆ యాప్ తిరిగి భారత్లో తన కార్యకలాపాల్ని కొనసాగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టిక్టాక్ పరిచయం అక్కర్లేని పేరు. చైనాకి చెందిన బైట్ డ్యాన్స్ సంస్థ తయారు చేసిన ఈ యాప్ ప్రపంచ దేశాల్లో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. దీంతో భారత్లో చైనా వస్తువులు,యాప్స్పై నిషేధించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతూ వచ్చింది. దీంతో కేంద్రం దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్ట్యా మొత్తం 59 యాప్లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. వాటిలో టిక్టాక్ యాప్ కూడా ఉంది. అయితే భారత్లో టిక్ టాక్కు ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు బైట్ డ్యాన్స్ సంస్థ దేశీయ సంస్థలతో పలు మార్లు చర్చులు జరిపింది. ఆ ప్రయత్నాల్ని విఫలమయ్యాయి. ఈ తరుణంలో బైట్ డ్యాన్స్ సంస్థ భారత్లో టిక్టాక్ యాప్ను అందుబాటులోకి తెచ్చేందుకు ముంబైకి చెందిన గేమింగ్ సంస్థ స్కైస్పోర్ట్స్తో, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హీరా నందిని గ్రూప్కు చెందిన పేరెంట్ సంస్థ యోటా ఇన్ ఫ్రాస్టక్చర్తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమతో బైట్డ్యాన్స్ సంప్రదింపులు జరుపుతుందన్నారు. ఆ చర్చలు జరుగుతున్నాయని..త్వరలో టిక్టాక్ను వినియోగంలోకి తెస్తామని స్కై స్పోర్ట్స్ సీఈవో శివ నంది తెలిపారు. దీంతో పాటు బీజీఎంఐ సైతం గేమింగ్ ప్రియులు వినియోగించే అవకాశం త్వరలో రానుందని ఇన్స్ట్రాగ్రామ్ స్టోరీస్లో వెల్లడించారు. భారత్లో బీజీఎంఐపై బ్యాన్ విధించడంపై శివ నంది స్పందించారు. బీజీఎంఐను నిషేధించాలని కేంద్రం అనుకోకుండా నిర్ణయం తీసుకోలేదని, ఇందుకోసం సుమారు 5నెలల సమయం తీసుకుందన్నారు. కేంద్రం నిర్ణయంపై బీజీఎంఐ మాతృ సంస్థ క్రాఫ్టన్కు నోటీసులు అందించినట్లు చెప్పారు. టిక్టాక్తో పాటు బీజీఎంఐని వినియోగించే అవకాశం త్వరలో రానుంది. కేంద్రం బీజీఎంపై శాశ్వతంగా బ్యాన్ చేయలేదని.. తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త!
షార్ట్ వీడియో ఫ్లాట్ ఫామ్ టిక్ టాక్ పోటీగా వచ్చిన ఇన్స్టాగ్రామ్ యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. తాజాగా డ్యూయల్ ఫీచర్ను యూజర్లకు పరిచయం చేసింది. ఇన్స్టాగ్రామ్ డ్యూయెల్ ఫీచర్ని ప్రకటించింది. దీంతో యూజర్ ఒకే సమయంలో ఫోన్ ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాలను ఉపయోగించి ‘రీల్స్’ను రికార్డ్ చేయవచ్చు.‘డ్యూయల్ ఫీచర్’ని ఇలా ఉపయోగించాలి... ♦ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి. ♦ స్క్రీన్ టాప్రైట్లో ఉన్న ప్లస్ ఐకాన్ నొక్కాలి. ♦ ‘రీల్’ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ♦ లెఫ్ట్సైడ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ♦ డ్యూయల్ లేబుల్తో ఉన్న కెమెరా ఐకాన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ♦ ‘రికార్డ్’ ఐకాన్ నొక్కాలి. రికార్డింగ్ తరువాత ఎఫెక్ట్స్, మ్యూజిక్ యాడ్ చేయాలి. -
టిక్టాక్ పోటీగా ఫేస్బుక్.. సరికొత్త ఫీచర్తో
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్.. తన కాంపిటీటర్ టిక్ టాక్కు చెక్ పెట్టేలా కొత్త కొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తుంది. ఇప్పటికే టిక్ టాక్ తరహాలో షార్ట్ వీడియోలు వీక్షించడంతో పాటు ఇన్స్టాగ్రాం పోస్ట్లు సైతం ఫేస్బుక్లో కన్వర్ట్ అయ్యేలా డిజైన్ చేసింది. అయితే తాజాగా ఫేస్బుక్ సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. 'ఫీడ్'అనే పేరుతో ఫేస్బుక్ కొత్త ఫీచర్ను ఎనేబుల్ చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూజర్లు కోరిన విధంగా మోస్ట్ రిక్వెస్టెడ్ ఫీచర్ 'ఫీడ్' ఫీచర్ను డెవలప్ చేశాం. ఈ ఫీచర్ సాయంతో ఫ్రెండ్స్, గ్రూప్స్, పేజెస్లో అప్డేట్ అయ్యే లేటెస్ట్ పోస్ట్లను వీక్షించవచ్చు. స్నేహితులు ఏం పోస్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు అది నెరవేరబోతుందని అన్నారు. త్వరలో డెస్క్ టాప్ ప్రస్తుతం ఫీడ్ ఫీచర్ స్మార్ట్ ఫోన్లలో వీక్షించ వచ్చని పేస్బుక్ తన పోస్ట్లో తెలిపింది. మరికొన్ని వారాల్లో డెస్క్ టాప్ వెర్షన్లో సైతం ఈ ఫీచర్ సాయంతో లేటెస్ట్ పోస్ట్లను చూడొచ్చని ఫేస్బుక్ పేర్కొంది. యూజర్లకు మరింత ఆసక్తిగా యూజర్లకు లేటెస్ట్ సోషల్ మీడియా కంటెంట్ను అందించాలనే లక్ష్యంతో గత కొన్నేళ్లుగా అల్గారిథమ్ను అభివృద్ధి చేస్తుంది. తాజా ఎనేబుల్ చేసిన కొత్త ఫీచర్ సైతం అందులో భాగమేనని ఫేస్బుక్ తెలిపింది. తద్వారా యూజర్లు రీల్స్ క్రియేట్ చేయడం, వారి కనెక్షన్లు ఫీడ్లో ఎలాంటి పోస్ట్లు ఉన్నాయో చూడొచ్చు. కొత్త యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందని ఫేస్బుక్ భావిస్తోంది. -
దిక్కుమాలిన టిక్టాక్ బ్లాకౌట్ ఛాలెంజ్! ఏడుగురు చిన్నారులు బలి
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచ వ్యాప్తంగా తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది చైనాకు చెందిన షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్టాక్. కొద్ది రోజుల్లోనే మిలియన్ల మంది దానిని వినియోగించటం ప్రారంభించారు. అయితే.. దానికి ఎక్కువగా యువకులు, చిన్నారులు బానిసలవుతున్నారు. అందులోని ఛాలెంజ్లను అనుసరించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. టిక్టాక్ తీసుకొచ్చిన 'బ్లాకౌట్ ఛాలెంజ్' కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారంతా 15 ఏళ్ల వయసులోపు వారే కావటం గమనార్హం. ఏమిటీ బ్లాకౌట్ ఛాలెంజ్? యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చె టిక్టాక్.. బ్లాకౌట్ ఛాలెంజ్ను తీసుకొచ్చింది. ఈ ఛాలెంజ్.. ఆక్సిజన్ అందకుండా చేసుకుని అపస్మారక స్థితికి చేరుకునేలా ప్రోత్సహిస్తుంది. బెల్టులు, చిన్న చిన్న బ్యాగులకు కట్టే దారాలతో తమను తాము ఊపిరి ఆడకుండా చేసుకోవాలి. బ్లాకౌట్ ఛాలెంజ్ ద్వారా తమ పిల్లలు ఊపిరాడకుండా చేసుకుని చనిపోయినట్లు టిక్టాక్పై పలువురు తల్లిదండ్రులు కేసులు పెట్టినట్లు ది వెర్జ్ న్యూస్ గురువారం వెల్లడించింది. ఇటీవలే శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన లాలాని వాల్టన్(8), అరియాని అరోయో(9)ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. గతంలో 2021, జనవరిలో ఇటలీలో పదేళ్ల చిన్నారి, మార్చిలో అమెరికాలోని కొలొరాడోలో 12 ఏళ్ల బాలుడు, జూన్లో ఆస్ట్రేలియాలో 14 ఏళ్ల బాలుడు, జులైలో ఓక్లాహోమాలో 12 ఏళ్ల చిన్నారి, డిసెంబర్లో పెన్సిల్వేనియాలో 10 ఏళ్ల బాలిక మృతి చెందారు. టిక్టాక్ ప్రమాదకరమైన ఛాలెంజ్లతో చిన్నారులను ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించారు పెన్సిల్వేనియా చిన్నారి నైలాహ్ అండర్సన్ తల్లి తవైన అండర్సన్. తన మొదటి పేజీలోనే ఈ ఛాలెంజ్ను ఉంచటం వల్ల పిల్లలు ఎక్కువగా చూస్తున్నారని ఆరోపించారు. వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నాం.. టిక్టాక్ బ్లాకౌట్ ఛాలెంజ్ వల్ల చిన్నారులు చనిపోతున్నట్లు కేసులు నమోదవుతున్న క్రమంలో సంస్థ ప్రతినిధి సమాధానమిచ్చారు. వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రమాదకర కంటెంట్ కనిపిస్తే వెంటనే తొలగిస్తామని తెలిపారు. చిన్నారులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. చదవండి: మాల్ పార్కింగ్లో శవమై కనిపించిన టిక్టాక్ స్టార్ -
వర్క్ కంప్లీట్ చేయకపోతే..మార్క్ జుకర్ బర్గ్ కత్తితో ఏం చేస్తాడో తెలుసా!
మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారారు.ఫేస్బుక్ సంస్థ ప్రారంభ దశలో ఉన్న ఉద్యోగుల్లో ఒకరైన నోహ్ కాగన్.. వర్క్ విషయంలో జుకర్ బర్గ్ తీరు గురించి మాట్లాడిన వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఉద్యోగుల పట్ల చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారని, అలా జుకర్ బర్గ్ ఎందుకు చేస్తున్నారో తెలిసేది కాదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మెటా కార్యాలయంలో జపాన్కు చెందిన పురాతన కత్తిని(కటానా) మార్క్ జుకర్ బర్గ్ ఉపయోగించేవారు. ఫేస్బుక్లో కోడింగ్, లేదంటే ఇతర వర్క్లు నచ్చకపోతే కటానా కత్తిని ఊపుతు తిరిగేవారంటూ టిక్ టాక్ వీడియోలో తెలిపాడు. జుకర్బర్గ్ కత్తి గురించి టిక్టాక్లో వీడియోలో కాగన్.."అతను గొప్ప ఇన్నోవేటర్. షెడ్యూల్ ప్రకారం వర్క్ కంప్లీట్ కాకపోతే జుకర్ బర్గ్ కటానా కత్తితో ఆఫీస్ అంతా తిరుగుతూ నేను చెప్పిన పని టైంకు పూర్తి చేయకపోతే మీ ముఖంపై కొడతాను. లేదంటే ఈ భారీ ఖడ్గంతో నిన్ను(ఉద్యోగులను ఉద్దేశిస్తూ)నరికివేస్తానంటూ' నవ్వులు పూయించేవారని అన్నాడు. ఈ రోజు వరకు, అతని వద్ద ఆ కత్తి ఎందుకు ఉందో నాకు తెలియదు." వర్క్లో ఎంత ఒత్తిడి ఎదురైనా చాలా ప్రశాంతంగా, కూల్గా ఉండేవారు. కానీ వర్క్ పూర్తి చేసే విషయంలో ఆ కత్తిని ఉపయోగిస్తారంటూ కాగన్ పలు ఆసక్తికర విషయాల్ని నెటిజన్లతో పంచుకున్నాడు. ఇదో చెత్త..మళ్లీ చేయి ప్రస్తుతం సాఫ్ట్ వేర్ డీల్స్ సంస్థ యాప్సుమో సీఈఓగా ఉన్న కాగన్ ఫేస్బుక్లో పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు.కంపెనీకి సేవలందించిన 10 నెలలకే జుకర్ బర్గ్ తనని ఫేస్బుక్ నుండి తొలగించినట్లు తెలిపారు. 60వేల డాలర్ల జీతంతో పాటు కంపెనీలో 0.1 శాతం షేర్ను కోల్పోయినట్లు చెప్పాడు. సందర్భం ఎలా ఉన్నా జుకర్ బర్గ్ హ్యాండిల్ చేయగలడు. కానీ ఓసారి జుకర్ బర్గ్ తన సహనాన్ని కోల్పోయాడు. ఫేస్బుక్లో కొత్త ఫీచర్ను ఎనేబుల్ చేయాలని అనుకున్నాడు. అదే ఫీచర్పై పనిచేస్తున్న ఇంజనీర్ క్రిస్ట్ను గమనించాడు. ఫీచర్పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గ్లాస్తో వాటర్ విసిరేసి "ఇదో చెత్త..మళ్లీ చేయి"అంటూ జుకర్బర్గ్ అరుస్తూ వెళ్ళిపోయాడని కాగన్ తెలిపాడు. కాగా, 2005లో ఫేస్బుక్లో చేరిన కాగన్ జుకర్బర్గ్ కత్తి గురించి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. 2014లో కాగన్ రాసిన బుక్లో "హౌ ఐ లాస్ట్ 170 మిలియన్ డాలర్స్: మై టైమ్ యాజ్ #30 ఎట్ ఫేస్బుక్" ఈవెంట్లో సైతం జుకర్ బర్గ్ వాడే కత్తి గురించి ప్రస్తావించాడు. -
మాల్ పార్కింగ్లో శవమై కనిపించిన టిక్టాక్ స్టార్
లాస్ ఏంజెల్స్: అమెరికన్ టిక్టాక్ స్టార్ కూపర్ నోరిగ(19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం(జూన్ 9న) లాస్ ఏంజిల్స్లోని మాల్లో పార్కింగ్ లైన్లో శవమై కనిపించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా అతడు మృతి చెందడానికి కొన్ని గంటల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో బెడ్పై సేద తీరుతున్న కూపర్ 'యుక్త వయసులోనే చనిపోతామేమో అని ఎవరు ఆలోచిస్తున్నారు?' అని ఫ్యాన్స్ను ప్రశ్నించాడు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటలకే అతడు నిర్జీవంగా కనిపించడం గమనార్హం. కొంతకాలంగా కూపర్ మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 5న టిక్టాక్లో అతడు ఓ వీడియో షేర్ చేస్తూ.. 'మీ సాదకబాధకాలను నాతో చెప్పుకోండి. ఎందుకంటే మానసిక ఒత్తిడి మనల్ని ఎంతగా బాధిస్తుందనేది నాకు తెలుసు, మీరు ఒంటరి కాదు.. మీకు నేనున్నాను' అని చెప్పుకొచ్చాడు. ఇక కూపర్కు టిక్టాక్లో 1.77 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఫన్నీ స్కేట్ బోర్డింగ్ వీడియోలతో పాటు ఫ్యాషన్ వీడియోలను సైతం టిక్టాక్లో అప్లోడ్ చేసి ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేసేవాడు కూపర్. చదవండి: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య, ఎమోషనలైన ఉపాసన నా సినిమా ఫ్లాప్ అయినా కూడా రానా బాగుందనేవాడు -
స్పెషల్ కోర్స్, యూనివర్సిటీలో టిక్ టాక్ పాఠాలు!
ట్రెండ్ మారింది. సాధారణంగా ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత జాబ్, లేదంటే బిజినెస్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించాలనే విషయాల గురించి ఆలోచిస్తుంటాం. కానీ నేటి తరం యువత అలా కాదు. కాలేజీలో ఉండగానే ఎలాంటి బిజినెస్ చేయాలి.ఎంత సంపాదిస్తే ఫ్యూచర్ బాగుంటుందనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకు తగ్గట్లు అమెరికాకు చెందిన డ్యూక్ యూనివర్సిటీ ఆఫ్ డర్హామ్ విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా టిక్ టాక్ కోర్స్ను ప్రారంభించింది. ఇందులో ప్రముఖంగా టిక్ టాక్ను ఉపయోగించి దాని ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలనే విషయాల గురించి విద్యార్ధులకు క్లాస్లు చెబుతున్నారు యూనివర్సిటీ ప్రొఫెసర్లు. ఈ క్లాసుల్లో టిక్టాక్ వీడియోలు ఎలా తీయాలి? వాటిని ఎలా ప్రమోట్ చేసుకోవాలి.ఎలా ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. పర్సనల్ బ్రాండ్ను ప్రమోట్ చేసుకొని ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించవచ్చో' అని టిక్ టాక్ కోర్స్ను అందుబాటులోకి తెచ్చిన ప్రొఫెసర్ ఆరోన్ డినిన్ క్లుప్తంగా వివరిస్తున్నారు. అంతేకాదండోయ్ కోర్స్ నేర్చుకునే సమయంలో ప్రొఫెసర్ క్లాసులు వింటున్న విద్యార్ధులు టిక్ టాక్ వీడియోలు చేసి వాటికి వచ్చే వ్యూస్, బ్రాండ్ ప్రమోషన్లతో నెలకు రూ.4లక్షలకు పైగా సంపాదింస్తున్నట్లు ఆరోన్ డినిన్ చెబుతున్నారు. -
పిచ్చిదానివా? నీ వీడియో కోసం అడవిని తగలబెడతావా?
టిక్టాక్ మాయలో పడి జనాలు వ్యూస్ కోసం లైక్స్ కోసం ఏదైనా చేయడానికి దిగజారిపోయారు. మన దేశంలో టిక్టాక్ను ఎప్పుడో బ్యాన్ చేశారు కానీ విదేశాల్లో మాత్రం ఇంకా ఈ యాప్ రన్ అవుతూనే ఉంది. కొందరు మంచిపనులతో, మరికొందరు పిచ్చిపనులతో సెలబ్రిటీలుగా మారుతున్నారు. అయితే తాజాగా పాకిస్తాన్ సోషల్ మీడియా స్టార్ హ్యుమైరా అస్గర్ షేర్ చేసిన టిక్టాక్ వీడియోపై యావత్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందరూ ఫైర్ అయ్యేంతలా ఆమె ఏం చేసిందంటారా? హ్యుమైరా తగలబడుతున్న చెట్ల ముందు అందంగా తయారై సుకుమారంగా నడుచుకుంటూ వెళ్లింది. 'నేనెక్కడ అడుగుపెడితే అక్కడ ఫైరే..' అన్న క్యాప్షన్తో ఈ వీడియోను టిక్టాక్లో షేర్ చేయగా అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'పిచ్చిదానివా? నీ వీడియో కోసం అడవిని తగలబెడతావా? నీపై కేసు పెట్టాలి' అని పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హ్యుమైరా స్పందిస్తూ తాను చెట్లకు ఎటువంటి హాని తలపెట్టలేదని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ ఆవేశం చల్లారని నెటిజన్లు 'ఒకవేళ నువ్వు నిప్పు పెట్టకపోయినా అక్కడ తగలబడుతుంటే వీడియోలు తీసేబదులు నీళ్లు పోసి చల్లార్పవచ్చు కదా' అని మండిపడుతున్నారు. కాగా హ్యుమైరా అస్గర్కు టిక్టాక్లో 11 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. This tiktoker from Pakistan has set fire to the forest for 15 sec video. Government should make sure that culprits are punished and the tiktoker along with the brand should be penalised. #Pakistan #TikTok pic.twitter.com/76ad77ULdJ — Discover Pakistan 🇵🇰 | پاکستان (@PakistanNature) May 17, 2022 చదవండి 👇 ప్రేమలో పడ్డ బ్యూటీ, ఖరీదైన గిఫ్ట్తో ప్రియుడి సర్ప్రైజ్ బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే, అసలైన పోటీ ఆ ఇద్దరి మధ్యే! -
ఓరి మీ దుంపదెగ..అంతరిక్షంలోనూ టిక్ టాక్ వీడియోలు!
టిక్టాక్ ప్రపంచ దేశాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ భూమ్మీదే కాదండోయ్...అంతరిక్షంలోనూ ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇటలీకి చెందిన 45ఏళ్ల యురేపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఆస్ట్రోనాట్ సమంత క్రిస్టోఫోరెట్టి టిక్టాక్ వీడియోలతో సందడి చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న అంతరిక్షంలో ఉన్న ఈఎస్ఏకి చెందిన ఆర్బిటింగ్ ల్యాబ్కు చేరుకున్నారు. 6నెలల పాటు అక్కడ ఉండనున్నారు. అనంతరం భూమ్మీదకు చేరుకోనున్నారు. Back on the International @Space_Station (and TikTok) pic.twitter.com/oCgJSdWKcu — Samantha Cristoforetti (@AstroSamantha) May 6, 2022 అయితే ఈ నేపథ్యంలో ఈఎస్ఏ నుంచి 88 సెకన్ల టిక్ టాక్ వీడియో చేశారు. ఈ వీడియోలో స్పేస్ఎక్స్ఎస్ క్రూ-4 మెషిన్లో భాగంగా టూ 'జీరో - జీ ఇండికేటర్స్' తో పాటు ఎట్టా అనే మంకీ బొమ్మ గురించి వీడియోలో పేర్కొన్నారు. సమంతా తీసిన టిక్ టాక్ వీడియోను 2లక్షల మందికి పైగా వీక్షించగా..8వేల లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన టిక్టాక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చదవండి👉ఆడుతూ..పాడుతూ కోట్లు సంపాదిస్తుంది..ఎలా అంటే? -
యూట్యూబ్కు భారీ షాక్..! పడిపోతున్న యూజర్లు!
గత కొన్ని నెలలుగా టెక్ మార్కెట్ ఇన్వెస్టర్లను రెండు అంశాలు తీవ్రంగా ఆందోళన గురిచేస్తున్నాయి. ఐఫోన్ ద్వారా ఫేస్బుక్లో అడ్వటైజింగ్ చేసేందుకు వీలు లేకుండా బ్యాన్ విధించడం..రెండోది యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్లు..టిక్ టాక్ వైపు మొగ్గు చూపడంతో గూగుల్ పేటెంట్ కంపెనీ యూట్యూబ్కు వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. భారత్ మినహాయిస్తే మిగిలిన దేశాల్లో అందుబాటులో ఉన్న మరో వీడియో ఫ్లాట్ ఫామ్ టిక్ టాక్ను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఇటీవల విడుదలైన క్యూ1 ఫలితాల్లో గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ లాభాలు తగ్గినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 26న ఈ ఒక్కరోజే గూగుల్ షేర్లు 3శాతం పడిపోయాయి. ఉక్రెయిన్ - రష్యా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాపారాల్లో మందగమనం ఏర్పడింది. ఫలితంగా పెట్టుబడి దారులు యూట్యూబ్లో తమ ప్రొడక్ట్లను అడ్వటైజ్మెంట్ చేయడం తగ్గించారు. గతేడాది యాపిల్ సంస్థ యాపిల్ సంస్థ థర్డ్ పార్టీ యాడ్స్పై నిషేదం విధించింది. ఈ నిషేదం ఫేస్బుక్ తో పాటు ఆ సంస్థకు పేటెంట్ కంపెనీగా ఉన్న ఇన్స్ట్రాగ్రామ్, స్నాప్ చాట్లపై పడింది. ఇక గూగుల్ ఆ థర్డ్ పార్టీ యాడ్స్ పై ఆధారపపడకపోయినా.. ఆ ప్రభావం గూగుల్ పేటెంట్ కంపెనీ యూట్యూబ్పై పడింది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగి యూట్యూబ్ ఎగ్జిటీవ్ మీటింగ్లో యూట్యూబ్కు వచ్చే యాడ్స్ తగ్గినట్లు తేలింది. ఫలితంగా ఆల్ఫాబెట్ క్యూ1 వార్షిక ఫలితాల్లో 14శాతం మాత్రం వృద్ధి సాధించి..6.87 బిలియన్ డాలర్ల ఆదాయం గడించింది. కానీ గతేడాది క్యూ1లో అల్ఫాబెట్ 48శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. సైనోవస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో సీనియర్ పోర్ట్ఫోలియో మేనేజర్ డాన్ మోర్గాన్ మాట్లాడుతూ, "యూట్యూబ్ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుంది. రాబోయే రోజుల్లో ఆశాజనమైన ఫలితాల్ని సాధింస్తుందని అంచనా వేశారు. అయితే యూట్యూబ్కు వచ్చే ఆదాయం పడిపోవడానికి ఉక్రెయిన్పై చేస్తున్న రష్యా దాడి పరోక్ష కారణమని గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్. ఐరోపా అంతటా రాజకీయ అనిశ్చితి నెలకొందని, వ్యాపారంపై అడ్వటైజ్మెంట్ రూపంలో చేసే ఖర్చు తగ్గిందన్నారు. చదవండి👉యూజర్లకు ఇన్స్టాగ్రామ్ భారీ షాక్! మరి నెక్ట్స్ ఏంటీ?..ఆన్లైన్లో డబ్బులు సంపాదించడమే -
ఇప్పటి వరకు ట్రిలియనీర్లు లేరు.. ఒక వేళ అయితే అది కచ్చితంగా అతడే!
యాభై ఏళ్ల క్రితం మిలియనీర్ అంటే మహాగొప్ప. ఇప్పుడు బిలియనీర్లు కూడా వందల సంఖ్యలో వచ్చేశారు. కానీ ఇప్పటి వరకు వ్యక్తిగత ఆస్తుల్లో ట్రిలియనీర్ అయిన వ్యక్తి లేరు. కానీ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ను పరిశీలిస్తే అతి త్వరలో ఓ వ్యక్తి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఉందని తిపాల్టీ అప్రూవ్ సంస్థ తేల్చి చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో నంబర్ వన్ కుబేరిగా ఎలన్ మస్క్ కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ పత్రిక అంచనాల ప్రకారం ఆయన సంపద 260 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయన తర్వాతి స్థానంలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బేజోస్ 190 బిలియన్ డాలర్లతో ఉన్నాడు. మొదటి రెండు స్థానాల మధ్య సుమారు 70 బిలియన్ డాలర్ల వత్యాసం ఉంది. జెఫ్ బేజోస్కి అందనంత ఎత్తులో ఉండటమే కాదు లాభాలు అందిపుచ్చుకోవడంలోనూ ఎలన్ మస్క్ దూకుడుగా ఉన్నారు. 2017 నుంచి ప్రతీ ఏడు ఎలన్ మస్క్ సంపద వృద్ధి 127 శాతంగా ఉంది. పైగా టెస్లా కార్లకు తోడు స్పేస్ఎక్స్ సంస్థ నుంచి కూడా అతి త్వరలోనే లాభాలు అందుకోనున్నాడు ఎలన్ మస్క్. ఈ రెండు సంస్థలు కనుకు అంచనాలకు తగ్గట్టుగా లాభాలు అందిస్తే 2024 నాటికి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా రికార్డుల్లోకి ఎక్కుతాడు ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ తర్వాత ప్రపంచ కుబేరుడు అయ్యే ఛాన్స్ ఉన్న వ్యక్తిగా ఝాంగ్ యామింగ్ ఉన్నారు. టిక్టాక్ అండతో ఆయన వేగంగా దూసుకువస్తున్నారు. ప్రస్తుతం టిక్టాక్ సాధిస్తున్న వృద్ధి ఇదే తీరుగా కొనసాగితే 2026 కల్లా ఝాంగ్యామింగ్ రెండో ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఉందని అంచనా. ట్రిలియనీర్ అయ్యే నాటికి ఝాంగ్ యామింగ్ వయస్సు కేవలం 42 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న జెఫ్ బేజోస్ ట్రిలియనీర్ అయ్యేందుకు 2030 వరకు వేచి ఉండక తప్పదంటున్నాయి నివేదికలు. ఈ కామర్స్ రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీ జెఫ్ బేజోస్ సంపదకు కోత పెడుతుండటమే ఇందుకు కారణం. అయితే ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం తారాస్థాయిలో కొనసాగుతోంది. దీని ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటే ప్రస్తుత అంచనాలు తారుమారు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. -
అందరి నోట అతని పేరే...టిక్టాక్లో స్టార్గా కూడా అతనే!
You Are A Star On TikTok: ఉక్రెయిన్ పై రష్యా గత మూడు వారాలకు పైగా భీకరమైన పోరు సలుపుతూనే ఉంది. మరోవైపు అంతర్జాతీయ న్యాయస్థానం యుద్ధం ఆపాలంటూ జారీ చేసిన ఆదేశాలను సైతం దిక్కరించి ప్రపంచ దేశాల చేత యుద్ధ నేరస్తుడిగా ముద్ర వేయించుకున్నాడు వ్లాదిమిర్ పుతిన్. అయితే ఈ యుద్ధం పుతిన్కి చెడ్డపేరు తెస్తే వ్లాదిమిర్ జెలెన్స్కీని హీరో చేసింది. అయితే నిరవధికంగా సాగుతున్న బీకర యుద్ధంలో రష్యా దళాలు వైమానిక దాడులతో ఉక్రెయిన్ని దారుణంగా నాశనం చేస్తున్న తీరు ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టించింది. ఈ తరుణంలో అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షుడుని మా దేశం వచ్చేయండి విమానం పంపిస్తాం అని గొప్ప ఆఫర్ ఇచ్చినప్పటికీ తిరస్కరించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు జెలెన్ స్కీ. అంతేగాక మా దేశాన్ని రష్యా దురాక్రమణ నుంచి కాపాడుకునేందుకు ఇక్కడే ఉండి పోరాడుతాను మాకు యుద్ధట్యాంకులు, మిలటరీ సాయం అందించండి చాలు అని అడిగారు. అంతేగాదు యుద్ధం వేళ తాను సైతం సైనికుడిగా మారి కథనరంగంలోకి అడుగుపెట్టి దేశాన్ని ముందుండి నడిపించాడు. దీంతో జెలెన్స్కీ పేరు ప్రపంచదేశాల్లో మారుమ్రోగిపోయింది. ఎంతలా అంటే అతని పేరుని బ్రాండ్నేమ్గా వాడుకుని బిజినెస్ చేసుకునేంతగా ఫేమస్ అయిపోయాడు. సోషల్ మాధ్యమాలు సైతం అతన్ని పొగడ్తలతో ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో రష్యా దాడిలో గాయపడి ఆసుపత్రిలో చిక్కిత్స పొందుతున్న టీనేజర్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు పలకరించారు. ఆ టీనేజర్ రాజధాని కైవ్ సమీపంలోని వోర్జెల్ పట్టణం నుంచి బయలుదేరుతున్నప్పుడు రష్యా దాడిలో గాయపడింది. కాత్య వ్లాసెంకోగా గుర్తించబడిన టీనేజర్ ఉక్రెయిన్ అధ్యక్షుడిని చూసి ఒక్కసారిగా ఆనందపడిపోతూ..." టిక్టిక్లో అంతా మీ గురించే మాట్లాడుతున్నారు. మీకే మద్దతిస్తున్నారు." అని జెలన్ స్కీతో సంతోషంగా చెబుతుంది. దీంతో జెలన్స్కీ చిరునవ్వుతో అయితే మేము ఇప్పుడూ టిక్టాక్ని ఆక్రమించామా అని అడిగారు. దీంతో ఆమె ఔను అంతా నీ గురించి మాట్లాడతారు అని బదులిచ్చింది. జెలన్ స్కీ ఆమెకు పూల బోకేని కూడా బహురించారు. అయితే రష్యన్ బలగాలు జరుపుతున్న దాడి నుంచి కాత్య తన 8 ఏళ్ల తమ్ముడుని కాపాడేందుకు అడ్డుగా నుంచోవడంతో ఆమె తీవ్రగాయలపాలైంది. ఆమె తండ్రి ఆమెను చేతులపై ఆసుపత్రికి తరలించాడు. ఈమేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పలకరించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Zelensky surprises victims in the hospital. He shook the hands of those injured bad one young girl told him he was very popular on TikTok #UkraineRussiaWar #UkraineUnderAttack #UkraineWar #Ukraine #RussiaUkraineCrisis pic.twitter.com/09LYoiLP9r — Chilly Chills (@WeeliyumF) March 18, 2022 (చదవండి: ఎవరినీ లెక్కచేయని పుతిన్.. బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు.. రష్యా అభ్యంతరం) -
రష్యా చట్టానికి కౌంటర్.. నెట్ఫ్లిక్స్, టిక్టాక్ బంద్
పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఆర్థికంగా కుదేలు అవుతున్న రష్యాపై ఇంకా దెబ్బలు పడుతూనే ఉన్నాయి. తాజాగా నెట్ఫ్లిక్స్, టిక్టాక్లు రష్యాలో పూర్తిగా తమ తమ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించాయి. ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో రష్యాతో మా బంధం తెంపేసుకుంటున్నాం. ఆంక్షల్లో భాగంగానే ఈ నిర్ణయం. రష్యా తెచ్చిన ఫేక్ చట్టాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం అంటూ ఆదివారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది నెట్ఫ్లిక్స్. రష్యాలో నెట్ఫ్లిక్స్కు పది లక్షలకు పైగా యూజర్లు ఉన్నారు. కొత్త యూజర్లకు అనుమతులు ఉండబోవన్న నెట్ఫ్లిక్స్.. ఆల్రెడీ ఉన్న యూజర్ల సంగతి ఏంటన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఇక టిక్టాక్ రష్యాలో లైవ్ స్ట్రీమింగ్, ఇతర సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది టిక్టాక్. ఉక్రెయిన్ ఆక్రమణ సందర్భంలో ఫేక్ వార్తల కట్టడి పేరిట బలవంతపు చట్టం, కఠిన శిక్షలు తీసుకొచ్చింది రష్యా. దీనికి నిరసనగానే టిక్టాక్ ఈ నిర్ణయం తీసుకుంది. -
టిక్టాక్ వీడియోలు చేస్తూ చదువుకు ఫుల్స్టాప్ :నటి
పెద్ద పెద్ద సినిమాల్లో నటించినా రాని గుర్తింపును కేవలం పది సెకన్ల వీడియోలో నటించి సాధించిన సోషల్ మీడియా స్టార్స్ ఎందరో! అలాంటి ఓ టిక్టాక్ స్టారే మోక్షిత రాఘవ్.. ఇప్పుడు వెబ్స్టార్గా దూసుకుపోతోంది.. ♦ పుట్టింది ఢిల్లీలో.. పెరిగింది ముంబైలో. ♦ చదువు పూర్తిచేసి, ఓ మంచి ఉద్యోగం సాధించి, స్థిరపడాలనుకున్న ఆమెను మార్చేసింది.. చైనీస్ యాప్ టిక్టాక్. ♦ మోక్షిత చేసే టిక్టాక్ వీడియోల వ్యూస్, లైకుల సంఖ్య టాప్స్పీడ్లో పరుగెత్తుతుండటంతో చదువుకు ఫుల్స్టాప్ పడింది. ♦ పూర్తిగా చదువు మానేసి, నటిగా మారాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు మందలించినా..మేన తను మాత్రం ఆ జోరు కొనసాగించి టిక్టాక్ స్టార్గా ఎదిగింది. ♦ పలు అందాల పోటీల్లో పాల్గొని మోడల్గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘రూబరూ ఫేస్ ఆఫ్ బ్యూటీ ఇంటర్నేషనల్ 2016’, ‘మిస్ ముంబై 2019’ పోటీల్లో విజేతగా నిలిచింది. ♦ ప్రతిభ ఉంటే అవకాశాలకేం కొదవ అన్నట్లు.. పదిసెకన్ల వీడియోలతోనే ఎన్నో బుల్లితెర అవకాశాలను కొట్టేసింది. మరెన్నో యూట్యూబ్ షార్ట్ మూవీల్లో నటించి మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్తో పాపులర్ అయింది. ♦ ప్రస్తుతం ‘అతిథి ఇన్ హౌస్’, ‘ప్రభా కి డైరీ సీజన్ 2’, ‘కాంట్రాక్ట్ కిల్లర్’ సిరీస్లతో అలరిస్తోంది. అందరూ కొత్తదనం కోరుకుంటున్నారు. అదే మాలాంటి సోషల్మీడియా స్టార్స్కు వరంగా మారింది. నటిగా ఎదగాలంటే ఫ్లాట్ఫాం కంటే పోషించే పాత్ర ముఖ్యమని నేను నమ్ముతా. – మోక్షిత రాఘవ్ -
చెలరేగిపోదాం! టిక్ టాక్ను తలదన్నేలా..ఫేస్బుక్తో డబ్బులు సంపాదించండిలా?!
యూజర్లకు ఫేస్బుక్ (మెటా) బంపరాఫర్ ప్రకటించింది. ఫేస్బుక్ ద్వారా 35వేల డాలర్ల సంపాదించే అవకాశాన్ని క్రియేటర్లకు కల్పిస్తున్నట్లు తెలిపింది. మనదేశంలో టిక్ టాక్ బ్యాన్ తర్వాత్ షార్ట్ వీడియోలు జోరు ఊపందుకుంది. 2020 జూన్ నెలలో కేంద్రం టిక్ టాక్ ను బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు టిక్ టాక్ ను తలదన్నేలా ఫేస్బుక్ రీల్స్ను అందుబాటులోకి తెచ్చింది. తొలిసారి గతేడాది యూఎస్లో రీల్స్ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆ సదుపాయాన్ని 150 దేశాల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు సోషల్ నెట్ వర్క్ దిగ్గజం తన బ్లాగ్ పోస్ట్లో తెలిపింది. రీల్స్ చేయండి..డబ్బులు సంపాదించండి. కోవిడ్ కారణంగా క్రియేటర్లను ఆదుకునేలా ఫేస్బుక్లో డబ్బులు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల టిక్ టాక్ క్రియేటర్లు ఫేస్బుక్ రీల్స్లో మనీ ఎర్నింగ్స్ పై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఫేస్బుక్ ప్రతినిధులు ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ వ్యూస్, లైక్స్తో పాటు ఇతర అంశాల్ని పరిగణలోకి తీసుకొని అర్హులైన క్రియేటర్లు నెలకు 35వేల డాలర్ల వరకు చెల్లించేందుకు రీల్స్ ప్లే బోనస్ ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, దీంతో పాటు క్రియేటర్లు డబ్బులు సంపాదించేందుకు ఇతర అవకాశాల్ని క్రియేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. -
పాపం టిక్టాక్ స్టార్.. పెదాల సర్జరీకని వెళ్తే కథ అడ్డం తిరిగింది!
హరీమ్ షా.. ఈమె ఒక టిక్టాక్ స్టార్.. తన పెదాల ఆకృతిని మార్చుకోవడానికి లండన్ వెళ్లింది. కానీ సర్జరీ సగంలోనే వెనుదిరిగింది. దీంతో ఇప్పుడామె పెదాలు ఉబ్బిపోయి వంకరగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పాకిస్తాన్కు చెందిన టిక్టాక్ స్టార్ హరీమ్ షా.. లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని భావించింది. ఇందుకోసం ఆమె యూకేకు వెళ్లింది. ఈ విషయాన్ని తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. పెద్ద మొత్తంలో నోట్ల కట్టలను ముందు పెట్టుకుని వీటి సాయంతో సర్జరీ చేయించుకోబోతున్నానని వీడియో షేర్ చేసింది. అన్నట్లుగానే యూకేలో డాక్టర్ను కలిసిన ఆమె తన పెదవికి ఫిల్లర్ ట్రీట్మెంట్ ప్రారంభించింది. ఇంతలో ఒక ఫోన్ కాల్ రాగా, పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన బ్యాంక్ ఖాతాలు స్థంభింపజేసిందని సమాచారం అందింది. ఈ సర్జరీ ఖరీదైనది కావడంతో దాన్ని మధ్యలోనే వదిలేసినట్లు ఆమె వెల్లడించింది. కాగా హరీమ్ షా పెద్ద మొత్తంలో నగదు తీసుకుని పాకిస్తాన్ నుంచి యూకేకు ప్రయాణించినందునే ఆమెపై మనీలాండరింగ్ విచారణ జరుపుతున్నట్లు ఎఫ్ఐఏ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ వెబ్సైట్ ప్రకారం.. ప్రయాణికులు పాకిస్తాన్కు ఏ కరెన్సీ అయినా, ఎంతైనా తీసుకురావచ్చు. అలాగే ఎలాంటి షరతులు లేకుండా పదివేల డాలర్ల వరకు విదేశీ కరెన్సీని సైతం ఇతర దేశాలకు తీసుకెళ్లవచ్చు. కానీ అంతకు మించి భారీ మొత్తాన్ని తీసుకెళ్లాలంటే మాత్రం అనుమతి పొందడం తప్పనిసరి. View this post on Instagram A post shared by Hareem Bilal shah (@hareem.shah_official_account) -
Anand Mahindra : ఆహా ! ఏం ఎక్స్ప్రెషన్స్.. చూస్తుంటే డ్యాన్స్ చేయాలని ఉంది
ఇంటర్నెట్తో ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. సోషల్ మీడియా వచ్చాక సాంస్కృతిక సామరస్యం పెరిగిపోయింది. భారతీయ కళలు, సినిమాలకి అంతర్జాతీయంగా అభిమానులు ఏర్పడుతున్నారు. అలా బాలీవుడ్ పాటలకు టిక్టాక్ వీడియోస్ చేసే ఓ ఆఫ్రికన్ జంట మన ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్నారు. బాలీవుడ్ పాటలకు టిక్టాక్ వీడియోలు చేసే ఈ ఆఫ్రికన్ జంటకి ఇప్పటికే ఎంతో మంది భారతీయులు ఫిదా అయ్యారు. వీళ్లు ఎప్పుడు వీడియోస్ చేస్తుంటారా అని ఎదురు చూస్తుంటారు కూడా. కాగా వీళ్లు చేసిన వీడియోస్లో బాగా పాపులర్ అయిన వాటిలో షేర్షా మూవీలో సాంగ్ ఒకటి. షేర్షా మూవీలో ఓ సావ్రే సాంగ్ టిక్టాక్ వీడియోను ఆనంద్ మహీంద్రా చూశారు. అంతే ఒక్కసారిగా వాళ్ల పెర్ఫార్మెన్స్కి ఫ్యాన్ అయ్యారు. తనకు డ్యాన్స్ చేయాలనిపిస్తుందన్నారు. వాళ్ల ప్రతిభను చూసి తనకు ఆత్మానందం కలిగిందన్నారు ఆనంద్ మహీంద్రా. I’m jumping on the bandwagon and joining their huge and growing fan club. Their expressions & spirit lifts my spirits. https://t.co/vuDN2aNmfX — anand mahindra (@anandmahindra) December 24, 2021 చదవండి:పేద కమ్మరికి బొలెరో ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా! ప్రతిగా ఏం కోరాడంటే.. -
టిక్టాక్ సంచలన నిర్ణయం..! వైరల్ వీడియోస్ నేరుగా యూజర్ల వద్దకు..!
ప్రముఖ షార్ట్ వీడియో ప్లాట్ఫాం టిక్టాక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీ సేవలను అమెరికాలో ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టిక్టాక్లో వైరలైన ఫుడ్ వీడియోస్లోని ఆహారాన్ని యూజర్లకు డెలివరీ చేసే అవకాశాలపై ప్రణాళికలు రచిస్తోన్నట్లు 9To5Mac నివేదించింది. ఫుడ్ డెలివరీ సేవతో వైరల్ ఫుడ్ వీడియోలను మరో స్థాయికి తీసుకెళ్లే విధంగా కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ ఫుడ్ను టిక్టాక్ కిచెన్ పేరిట అమెరికాలోని ఆయా ప్రాంతాల్లో ఫుడ్ డెలివరీ చేయనుంది. వర్చువల్ డైనింగ్ కాన్సెప్ట్లతో భాగస్వామ్యమై టిక్టాక్ కిచెన్ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 2022లో ప్రారంభం..! టిక్టాక్ కిచెన్ సేవలను అమెరికాలో 2022లో ప్రారంభించనుంది. అమెరికాలోని దాదాపు 300 ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభంకానున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి 1,000 కంటే ఎక్కువ ప్రాంతాల్లో సేవలందించేందుకు కంపెనీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వైరల్ ఫుడ్ వీడియోస్ మెనూగా..! టిక్టాక్లో వైరలైన ఫుడ్ వీడియోస్ మెనును కస్టమర్లకు అందుబాటులో ఉంచనుంది. ఇప్పటివరకు టిక్టాక్లో వైరల్ అయిన బేక్డ్ ఫెటా పాస్తా, స్మాష్ బర్గర్, కార్న్ రిబ్స్ , పాస్తా చిప్స్ వంటి వంటకాలను కస్టమర్లు ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ కల్పించనుంది. కాగా ఒక నివేదిక ప్రకారం ఈ డిషెస్ టిక్టాక్ కిచెన్ మెనూలో శాశ్వతంగా ఉంటాయా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. వైరలైన ఫుడ్ డిషెస్కు ఆయా క్రియేటర్లకు క్రెడిట్ను టిక్టాక్ అందజేయనుంది. చదవండి: రూ.10 వేల కంటే తక్కువ ధర..! హాట్కేకుల్లా అమ్ముడైన 30 లక్షల స్మార్ట్ఫోన్స్ ..! -
గర్భవతి స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్.. ఎందుకంటే..!
మహిళకు తల్లి కావడం ఓ పెద్ద వరం అంటారు. ప్రెగ్నెన్సీతో స్త్రీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. అయినప్పటికీ తల్లి అయిన ప్రతి స్త్రీ తన గర్భధారణను ఆనందిస్తుంది. కానీ అందరు స్త్రీలు అదృష్టవంతులు కాదు. ప్రపంచంలోని చాలా మంది మహిళలు తమ గర్భధారణ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక తాజాగా ఓ 33 ఏళ్ల మహిళ చికిత్స కోసం డాక్టర్ వద్దకు వచ్చింది. వైద్యులు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా ఆ మహిళ గర్భవతి అని నిర్ధారించారు. అయితే ఆ అల్ట్రాసౌండ్ రిపోర్టు వైద్యులతో పాటు మహిళను కూడా ఆశ్చర్యపరిచింది. విషయం ఏంటంటే ఆ మహిళ గర్భవతి అయినప్పటికీ శిశువు ఆమె గర్భాశయంలో కాకుండా కాలేయంలో పెరగడాన్ని వైద్యులు గమనించారు. సదరు మహిళ కాలేయంలో ఎక్టోపిక్ గర్భం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఫెలోపియన్ ట్యూబ్లలో గుడ్డు తప్పు దిశలో ప్రయాణించడం ప్రారంభించినప్పుడు ఎక్టోపిక్ గర్భం సంభవిస్తుంది. దీని కారణంగా గర్భం సరిగ్గా జరగదు. ఇది కడుపులో చాలాసార్లు కనిపిస్తుంది, కానీ మొదటిసారిగా ఇది కాలేయంలో కనిపించింది. అది గమనించిన వైద్యులు వెంటనే ఆ మహిళకు శస్త్ర చికిత్స చేయగా తన ప్రాణం రక్షించబడింది. కానీ పిండం మాత్రం అప్పటికే కాలేయంలో చనిపోయింది. అటువంటి పరిస్థితిలో వైద్యులు కాలేయం నుండి చనిపోయిన పిండాన్ని బయటకు తీశారు. కెనడియన్ శిశు వైద్యుడు డాక్టర్ మైఖేల్ తన టిక్టాక్ ఖాతాలో వీడియో ద్వారా ఈ విషయం గురించి సమాచారం ఇచ్చారు. ఇక ఇలాంటి సంఘటనే 2012లో ఓ మహిళ కాలేయంలో 18 వారాల పిండం కనిపించింది. దీంతో తనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే చికిత్స సమయంలో సదరు మహిళ తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించింది. -
‘డిసెంబర్ 25న ప్రపంచానికి భారీ షాక్.. మారనున్న జీవితాలు’
Self Proclaimed Time Traveller on Dec 25 The World Will Change: నిజంగానే మనిషికి కాలంలోకి ప్రయాణించగల శక్తి వస్తే.. మన జీవితాలు ఎలా ఉండేవో కదా. ఇన్ని మరణాలు, యుద్ధాలు, కన్నీళ్లు ఇవేవి ఉండేవి కావేమో. లేదంటే ఇంతకంటే రాక్షసంగా ఉండేవారమేమో. ఏది ఏమైనా కాలంలోకి ప్రయాణిస్తే.. అనే ఊహ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమాలన్ని సూపర్ హిట్టయ్యాయి. రీల్ మీద ఓకే కానీ.. వాస్తవంగా కాలంలోకి ప్రయాణించడం అనేది అసాధ్యం అని అందరికి తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో టైమ్ ట్రావెలర్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఓ టిక్టాక్ యూజర్.. తాను 2027 నుంచి వచ్చానని భూమ్మీద తానే చివరి వ్యక్తిని అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇతడి జాబితాలోకి మరో వ్యక్తి వచ్చి చేరాడు. ఇతడైతే ఏకంగా త్వరలోనే భూమి మీద నమ్మశక్యం కానీ మార్పులు చోటు చేసుంటాయని తెలిపాడు. ఆ వివరాలు.. (చదవండి: ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్కు స్ఫూర్తి ఎవరో తెలుసా?) 5ఎంటీటీ అనే ఈ టిక్టాక్ అకౌంట్కు 1.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో కొనన్ని రోజుల క్రితం ఈ యూజర్ తన టిక్టాక్ అకౌంట్లో నమ్మశక్యం కానీ విషయాలు పోస్ట్ చేశాడు. ‘‘డిసెంబర్ 20న ఎనిమిది మంది మనుషులకు సూర్యుని తరంగాల ద్వారా సూపర్ పవర్స్ వస్తాయి. ఇక డిసెంబర్ 25న ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురు చేసే సంఘటన చోటు చేసుకోనుంది. ఇది మానవాళి జీవితాలను శాశ్వతంగా మారుస్తుంది’’ అన్నాడు. అంతేకాక ‘‘ఈ రెండు రోజులను భవిష్యత్ తరాలు వందల ఏళ్ల పాటు గుర్తుంచుకుంటాయి. మానవ జీవితాలు ఎలా మారాయో చర్చించుకుంటాయి. ఈ రెండు రోజుల నాడు చోటు చేసుకోబోయే సంఘటనల తర్వాత.. నేను నిజమైన టైమ్ ట్రావేలర్ని అని జనాలు నమ్ముతారు’’ అని తెలిపాడు. (చదవండి: ఆడుతూ..పాడుతూ కోట్లు సంపాదిస్తుంది..ఎలా అంటే?) అంతేకాక 2027 నాటికి స్వీడన్, నార్వే, యూకే, ఫిన్లాండ్ దేశాలు కలిసి అతి పెద్ద పవర్హౌస్ను నిర్మిస్తాయని.. మిగతా చిన్న దేశాలు దీనిలో చేరాలని ఆశిస్తాయని చెప్పుకొచ్చాడు. ఇక 2024లో 35 వేల ఏళ్ల క్రితం నాటి బంకర్ ఒకటి వెలుగు చూస్తుది. అర్జెంటినాలో ఈ బంకర్ని గుర్తిస్తారు. దీనిలో అనేక రహస్యాలు ఉంటాయి. పురాతన కాలం నాటివి, సాంకేతకతకు సంబంధించిన రహస్యాలు ఆ బంకర్లో ఉంటాయి. చదవండి: ‘2027 నుంచి వచ్చాను.. భూమ్మీద నేనే చివరి వ్యక్తిని’ -
ఆడుతూ..పాడుతూ కోట్లు సంపాదిస్తుంది..ఎలా అంటే?
డబ్బులు సంపాదించేందుకు కష్టపడుతున్నారా? అయితే కష్టపడొద్దు. ఇష్టపడండి. ఇష్టపడితే మీరు అనుకున్న విధంగా డబ్బులు సంపాదించవచ్చని చెబుతోంది ఓ యువతి. అంతేకాదు స్వతంత్రంగా డబ్బులు సంపాదించేందుకు ఎంఎన్సీ ఉద్యోగానికి రిజైన్ చేసింది. ఆడుతూ పాడుతూ కోట్లు సంపాదిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎక్స్ఎల్ వస్తే కోట్లు సంపాదించవచ్చని మీకు తెలుసా? ది ఎక్స్ప్రెస్ ప్రకారం 27 ఏళ్ల కాట్ నార్టన్ (@miss.excel) మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ను ఆన్లైన్లో నేర్పిస్తుంది. ఇందుకోసం ఏడాది క్రితం జాబ్కు రిజైన్ చేసి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం ప్రారంభించింది. సీన్ కట్ చేస్తే ఏడాది తిరిగే సరికల్లా ఆమె నెలవారీ సంపాదన ఎంతో తెలుసా? అక్షరాల కోటి రూపాయలకు పై మాటే. అందరిలా కాట్ నార్టన్ కు ఎవరిమీద ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతకాలని, డబ్బులు సంపాదించాలని అనుకుంది. అనుకున్నట్లుగా గతేడాది నవంబర్లో యూట్యూబ్ తోపాటు ఇతర సోషల్ మీడియా నెట్ వర్క్లలో ఆన్లైన్ టుట్యూరియల్ను ప్రారంభించింది. యూజర్లు అట్రాక్ట్ అయ్యే విధంగా వివిధ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోలు చేసింది. పనిలో పనిగా అదే ఎక్స్ఎల్ టిప్స్ను ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ వీడియోలు అప్లోడ్ చేసింది. పెయిడ్ కోర్స్లను ప్రారంభించింది. అలా సరదాగా ప్రారంభమైన ట్యుటోరియల్ వీడియోలతో భారీ ఎత్తున సంపాదిస్తుంది. సుమారు నెలకు కోటిరూపాలయకు పైగా సంపాదిస్తున్నట్లు ది ఎక్స్ ప్రెస్ తన కథనంలో పేర్కొంది. చదవండి:ఇకపై వాట్సాప్ నుంచి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే? -
టిక్టాక్ పిచ్చి.. డాక్టర్ వికృత చేష్టలు.. ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి..
ఇటీవల కాలంలో జనాలు సామాజకి మాధ్యమాలకు ఎలా బానిసవుతున్నారో మనం చూస్తునే ఉన్నాం. అంతేందుకు ఆ వ్యసనం కారణంగా ఎలా జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారో కూడా చూస్తున్నాం. అచ్చం అలానే ఇక్కడోక ప్రముఖ డాక్టర్ సామాజకి మాధ్యమాలకు బానిసై తన చక్కటి కెరియర్ను ఎలా పాడుచేసుకున్నాడో చూడండి. (చదవండి: జపాన్లో తొలి ఒమిక్రాన్ కేసు..!!) అసలు విషయంలోకెళ్లితే...టిక్టాక్ వ్యసనం ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ డేనియల్ అరోనోవ్ కెరియర్ను దెబ్బతీసింది. అరోనోవ్కి టిక్టాక్లో 13 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే అతనికి ఎంత టిక్టాక్ పిచ్చి ఉందో తెలుస్తోంది. అయితే అతను టిక్టాక్ పిచ్చితో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన ఆపరేషన్లు అన్నింటిని టిక్టాక్లో పోస్ట్ చేసేవాడు. అంతేకాద ఆపరేషన్లు అన్నింటిని అసంపూర్తిగా చేసేవాడు. దీంతో పలువురు రోగుల నుంచి అరోనోవ్ పై ఫిర్యాదుల రావడం ప్రారంభమైంది. పైగా అరోనోవా వికృత వ్యసనం ఎంతకు దారితీసింది అంటు రోగుల ఆరోగ్యంతో ఆడుకునేంత దారుణానికి దిగజారింది. ఈ మేరకు పలువురు రోగులు అతను శస్త్ర చికిత్సను మధ్యలోనే ఆపేస్తాడని, పైగా ఒకటి చేయబోయి మరోకటి చేస్తాడంటూ బాధితుల ఆవేదనగా ఫిర్యాదులు చేయడంతో ఆస్ట్రేలియన్ హెల్త్ ప్రాక్టీషనర్ రెగ్యులేషన్ ఏజెన్సీ (ఏహెచ్పీఆర్ఏ) అతను ఎలాంటి శస్త్రచికిత్సా విధానాలను నిర్వహించకుండా నిషేధించింది. (చదవండి: బాప్రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!) -
యూజర్లకు రూ.683 కోట్లను చెల్లించనున్న టిక్టాక్..! ఎందుకంటే...?
TikTok May Owe You Money From Its $92 Million Data Privacy Settlement: చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ అమెరికన్ యూజర్లకు సుమారు రూ. 683 కోట్లను చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 1 వరకు టిక్టాక్లో నమోదైన యూజర్లకు ఈ మొత్తాన్ని చెల్లించనుంది. క్లాస్ యాక్షన్ సెటిల్మెంట్లో భాగంగా టిక్టాక్ యూజర్లకు రూ. 683 కోట్లను పొందడానికి అర్హులు. అందులో భాగంగా టిక్టాక్ ఇప్పటికే అర్హత కల్గిన 89 మిలియన్ల అమెరికన్ యూజర్లకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ను పంపినట్లు తెలుస్తోంది. చదవండి: ప్రపంచంలో అత్యంత పొడవైన కారును చూశారా..! ఎందుకంటే..! యూఎస్ యూజర్ల నుంచి వ్యక్తిగత డేటాను వారి అనుమతి లేకుండా టిక్టాక్ సేకరించిందనే దావాలు నిరూపితమయ్యాయి. అంతేకాకుండా బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ప్రైవసీ చట్టాన్ని టిక్టాక్ పూర్తిగా ఉల్లంఘించిందని తెలుస్తోంది. క్లాస్ యాక్షన్ వేసిన దావాపై టిక్టాక్ ఖండిస్తూనే...అమెరికాలోని యూజర్లకు 92 మిలియన్ డాలర్లను చెల్లించడానికి టిక్టాక్ అంగీకరించడం గమనార్హం. అర్హత కల్గిన టిక్టాక్ యూజర్లు తమ మాస్టర్కార్డ్ , పే పాల్, వెన్మో ద్వారా చెల్లింపులను క్లెయిమ్ చేసుకోవచ్చునని టిక్టాక్ పేర్కొంది. అర్హత ఉన్న ప్రతి వ్యక్తి క్లెయిమ్ చేస్తే...సుమారు 5 డాలర్ల నుంచి 0.89 డాలర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: షాకిచ్చిన ఫోక్స్వ్యాగన్! సైలెంట్గా ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత? -
ఇంటర్వ్యూలకు రెజ్యూమ్లు అవసరం లేదు, టిక్టాక్ తరహాలో వీడియోలు చాలు
కాలం మారింది గురూ. ఇకపై పేజీలకు పేజీలు రెజ్యూమ్లు చేతపట్టుకొని కంపెనీల చుట్టూ తిరిగే అభ్యర్థులు ఒకవైపు. నియామకాల్లో ఎంపికైన అభ్యర్థుల వ్యక్తిగత సమాచారం, సర్టిఫికెట్స్ ధ్రువీకరణ కోసం కంపెనీలు మరోవైపు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా టిక్ టాక్ తరహాలో వీడియోలు చేసి..ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వొచ్చు. సబీర్ భాటియా- జాక్ స్మిత్లు 1996లో తొలిసారి ఫ్రీ వెబ్ ఆధారిత ఇమెయిల్ సర్వీస్ 'హాట్మెయిల్'ని బిల్డ్ చేశారు. ఏడాది వ్యవధిలోనే హాట్ మెయిల్ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. కాల క్రమేణా ఆ హాట్ మెయిల్ కాస్తా విండోస్ లైవ్ హాట్ మెయిల్, ఔట్లుక్ గా యుజర్లకు పరిచయం అయ్యింది. ఇప్పుడు హాట్ మెయిల్ సృష్టికర్త సబీర్ భాటియా షోరీల్ను అనే సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం బీటా వెర్షన్లో ఉన్నా ఈ యాప్ ..త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ షోరీల్ యాప్.. టిక్ టాక్ తరహాలో ఉండే సోషల్ మీడియా యాప్. టిక్ టాక్ను ఎంటర్ టైన్మెంట్ కోసం వినియోగిస్తే.. షో రీల్ను ఉద్యోగాలు దక్కించుకునేందుకు ఉపయోగపడుతుంది. షో రీల్ ఎలా పని చేస్తుంది..? మీరు ఏదైనా సంస్థలో జరిగే ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వాలంటే టిక్ టాక్ తరహాలో షార్ట్ వీడియోని తయారు చేయాలి. ఆ వీడియో సైతం క్యూ అండ్ ఏ (question and answer) తరహాలో ఉండాలి. మీరు ఏ జాబ్ రోల్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో అందుకు సంబంధించిన ప్రశ్నలు షో రోల్ యాప్లో ముందుగా ఉంటాయి. ఆ యాప్లో లాగిన్ అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే కంపెనీని సెలక్ట్ చేసుకోవాలి. సెలక్ట్ చేసుకుంటే సదరు సంస్థ మీ జాబ్ ప్రొఫైల్కు తగ్గట్లు ప్రశ్నల్ని సిద్ధం చేస్తుంది. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా వీడియో ఫార్మాట్లో ఉంటుంది. ఆ వీడియోలన్నీ రికార్డ్ అవుతాయి. అలా రికార్డ్ చేసిన వీడియోలు.. టిక్ టాక్ వీడియోల్ని ఎలా స్వైప్ చేసి చూస్తామో..అలాగే వేరే వాళ్లు ఇంటర్వ్యూకు అటెండ్ అయిన వీడియోల్ని వీక్షించవచ్చు. మీరు ఈ వీడియోలను మీరు పని చేయాలనుకుంటున్న కంపెనీలతో అటాచ్ చేయొచ్చు. మీ షోరీల్ వీడియోకు నేరుగా లింక్ చేసి మీ రెజ్యూమ్కి క్యూఆర్ కోడ్ను యాడ్ చేయవచ్చు. షోరీల్లో సంస్థలు అభ్యర్థుల్ని ఎలా ఎంపిక చేసుకుంటాయ్? షోరీల్ లో అటు సంస్థలు, ఇటు జాబ్ కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్ధుల ప్రొఫైల్స్ ఉంటాయి. షోరీల్ లో జాబ్ కేటగిరి ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా మీకు ఎలాంటి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నారో..అందుకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. కంపెనీలు నేరుగా ఆ విభాగంలో ప్రశ్నలను పోస్ట్ చేస్తాయి. మీరు ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వీడియోలతో ఇంటర్వ్యూ సాధ్యమేనా? షో రోల్ సంస్థ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించడమే ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ ఫౌండర్ సబీర్ భాటియా తెలిపారు. వీడియో రెజ్యూమ్ల ద్వారా ఇంటర్వ్యూ ప్రాసెస్ వేగవంతం అవుతుందన్నారు. అయితే వీడియో ఇంటర్వ్యూల తీరుతెన్నుపై అనేక అనుమానాలు వ్యక్తమవ్వడంపై సబీర్ మాట్లాడుతూ..అభ్యర్ధుల ఎంపిక విషయం పక్షపాతం ఉండే అవకాశం ఉందని, అందుకే అభ్యర్ధులు వారి ముఖాన్ని చూపించాల్సిన అవసరం లేదన్నారు. అవతార్ ఆకారాల్ని క్రియేట్ చేస్తామని చెప్పారు. కేవలం ఆడియో రికార్డింగ్ చేయొచ్చని తెలిపారు. చదవండి: టీసీఎస్ రూల్స్ మార్చేసింది.. అవి ఏంటంటే? -
జిమ్లో అసభ్య ప్రవర్తన... టిక్టాక్లోషేర్ చేయడంతో పరార్!!
కొన్ని సంఘటనలు చూస్తే ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ ఇంకా మహిళలు పనులను స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఇబ్బందిపడకుండా చేసుకునే అవకాశం మాత్రం ఎప్పటికీ కుదరదేమో అనిపిస్తుంది. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ ఒకటి జరిగింది. (చదవండి: యూకే లివర్పూల్ నగంలో కారు బ్లాస్ట్... ఒకరు మృతి) సాధారణంగా జిమ్ సెంటర్లలో అందరూ ఒకేసారి తమ వర్క్ అవుట్లను చేసుకుంటుంటారు. అదేవిధంగా ఇక్కడొక మహిళ అలానే తాను తన వర్కవుట్లు కొనసాగిస్తుండగా ఒక సీనియర్ సిటిజన్ తనను తదేకంగా చూస్తుంటాడు. దీంతో ఆమె అసౌకర్యంగా ఫీలై ఆమె తన భర్తను తన పక్కన నిలబడమని చెబుతుంది. అయితే ఆమె భర్త తన పక్కన నిలబడి ఉన్నప్పటికీ సదరు వ్యక్తి మళ్లీ అలానే చూస్తుంటాడు. దీంతో ఆమె తన ఫోన్ కెమెరా ఆన్ చేసి ఆ ఘటనను చిత్రికరించి టిక్టాక్లో పోస్ట్ చేస్తుంది. పైగా ఆ విషయాన్ని అతనికి చెప్పడంతో సదరు వ్యక్తి అక్కడ్నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. అంతేకాదు ఆ విషయాన్ని గమనిస్తున్న జిమ్ ట్రైనర్ ఆమె చేసిన పనికి ప్రశంసిస్తాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆమె చేసిన పనికి ప్రశంసలు వర్షం కురిపించడమే కాక మంచి పనిచేశారంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: మెక్డొనాల్డ్స్ ‘టాయిలెట్’ వివాదం) -
‘2027 నుంచి వచ్చాను.. భూమ్మీద నేనే చివరి వ్యక్తిని’
Tiktok Time Traveler 2027: టైమ్ ట్రావెలింగ్ గురించి ఇప్పటికే చాలా కథలు, కథనాలు వెలువడ్డాయి. ఇక టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు టైమ్ ట్రావెలింగ్ మీద ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. నిజంగా కాలంలోకి ప్రయాణించగలిగితే.. మన జీవితాలు ఎలా ఉండేవో కదా. ఇప్పటికైతే.. కాలంలోకి ప్రయాణించడం అనేది సినిమాల్లో తప్ప వాస్తవంగా ఎక్కడా చోటు చేసుకోలేదు. భవిష్యత్తులో చెప్పలేం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే తాజాగా టిక్టాక్లో ఈ టైమ్ట్రావెలింగ్ ట్రెండ్ నడుస్తోంది. ఓ టిక్టాక్ యూజర్ తాను టైం ట్రావెలర్ని అని.. 2027 నుంచి ప్రస్తుత కాలానికి వచ్చానని.. భూమ్మీద తాను మాత్రమే మిగిలి ఉన్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నెటిజనులు ప్రశ్నలతో సదరు యూజర్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఆ వివరాలు.. (చదవండి: ఇప్పట్లో ప్రపంచం అంతం కాదు.. ఇదిగో ప్రూఫ్లు) టిక్టాక్ యూజర్ యూనికోసోబ్రెవివియంట్ సోమవారం 21 సెకన్ల నిడివి గల వీడియోని తన టిక్టాక్ అకౌంట్తో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాడు. దీనిలో ఎత్తైన బిల్డింగ్లు, పార్క్ చేసి ఉన్న కార్లు తప్ప మనుషులు కనిపించలేదు. ఇక యూజర్ కనిపించకుండా కేవలం మాటలు మాత్రమే వినిపిస్తాయి. దీనిలో అతడు ‘‘నా పేరు జేవియర్.. నేను 2027 నుంచి ప్రస్తుత కాలానికి వచ్చాను. ఈ భూమ్మీద మిగిలి ఉన్న ఏకైక మనిషిని నేనే’’ అనడం వీడియోలో వినిపిస్తుంది. (చదవండి: ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్కు స్ఫూర్తి ఎవరో తెలుసా?) ఈ వీడియో తెగ వైరలయ్యింది. ఇప్పటివరకు దీని 2.2 మిలియన్ల మందికి పైగా చూశారు. ఇక దీనిపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రోడ్డు మీద ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. కచ్చితంగా ఇది లాక్డౌన్లో తీసిన వీడియోనే. ఇంట్లో కూర్చుని పిచ్చెక్కి ఇలాంటి వీడియోలు తీశాడేమో.. ఈ ప్రపంచంలో నువ్వే చివరి వ్యక్తివి అయితే ట్రాఫిక్ లైట్లు ఎలా కనిపిస్తున్నాయి’’ అంటూ ప్రశ్నించసాగారు. (చదవండి: టిక్టాక్తో చిత్ర విచిత్రంగా కన్ను కొట్టేస్తున్నారు) -
చేతి సైగతో మృగాడి చెర నుంచి తప్పించుకుంది...
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ మైనర్ బాలిక కొన్ని రోజుల క్రితం కిడ్నాప్కు గురైంది. నిందితుడు బాలికను తనతో పాటు తీసుకెళ్తుండగా కారు ఓ చోట ట్రాఫిక్లో ఆగింది. అతడి చెర నుంచి బయటపడాలని భావించిన బాలిక తన చేతులతో పదే పదే ఒక సైగ చేయసాగింది. ఆమె చేతి సైగను గమనించి, అర్థం చేసుకున్న కొందరు విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన అధికారులు మైనర్ని కాపాడి.. నిందితుడిని అరెస్ట్ చేశారు. నోరు విప్పకుండా.. అరవకుండా.. కేవలం ఓ సైగ ద్వారా సదరు బాలిక తన జీవితాన్ని కాపాడుకుంది. ఆ వివరాలు.. నార్త్ కరోలినాకు చెందిన ఓ మైనర్ బాలిక కొన్ని రోజుల క్రితం తన బంధువు అయిన నిందితుడితో కలిసి బయటకు వెళ్లింది. నమ్మి వెంట వచ్చిన బాలికను కిడ్నాప్ చేశాడు నిందితుడి. బయటకు వెళ్లిన కుమార్తె రోజులు గడిచినా ఇంటికి రాకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. బాధితురాలి అసభ్య ఫోటోలతో ఆమెను బెదిరించసాగాడు కిడ్నాపర్. ఈ క్రమంలో ఓ రోజు నిందితుడు సదరు బాలికను తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు. (చదవండి: 18 రోజుల పాటు గాలింపు.. ఆ పాపను చూసి ఏడ్చిన అధికారులు) ఓ చోట కారు ట్రాఫిక్లో ఆగింది. అతడి చెర నుంచి తప్పించుకోవాలని భావిస్తున్న బాలిక.. చుట్టూ ఉన్న వ్యక్తులకు తన పరిస్థితిని వివరించడం కోసం చేతితో ప్రత్యేక సైగ చేయసాగింది. బొటనవేలిని ముడిచి.. మిగతా వెళ్లను ఎత్తి.. ఆ తర్వాత వాటిని బొటన వేలు మీదుగా బిగించి చూపించే ఆ సైగకు తాను గృహహింస బాధితురాలినని.. సాయం చేయాల్సిందిగా అర్థం. ఈ సైగ టిక్టాక్లో చాలా ట్రెండ్ అవ్వడంతో ఆమె సైగలు గమనించిన కొందరు విషయాన్ని పోలీసులకు తెలిపారు. (చదవండి: చిన్నారిని కిడ్నాప్ చేయించిన మేనమామ) వారు నిందితుడి కారును వెంబండించి.. బాలికను కాపాడారు. నిందితుడి మొబైల్ని స్వాధీనం చేసుకుని చూడగా.. దానిలో బాలిక అసభ్య ఫోటోలు ఉన్నాయి. వాటన్నింటిని తొలగించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: కాబూల్లో భారతీయుని అపహరణ ! -
TikTokers: కరీనా స్టెప్పులు దించేశారు.. వీడియో వైరల్
Singapore Tiktok Users Recreating Popular Song Bole Chudiyan Video: కభీ ఖుషీ కభీ గమ్ హింది సినిమాలోని పాటలు ఒక్కడో ఒకచోట వినబడుతునే ఉంటాయి! ‘బోలే చుడియన్’ పాట అయితే వివాహవేడుకలు, పార్టీల్లో మారుమోగుతునే ఉంటుంది! తాజాగా సింగాపూర్కు చెందిన ఓ టిక్టాక్ బృందం ‘బోలే చుడియన్’ పాటకు డ్యాన్స్ చేశారు. ఒరిజినల్ పాటలో హీరో, హీరోయిన్లు చేసినట్లుగానే తమ నృత్యంతో అచ్చం దించేశారు. అయితే ప్రస్తుతం వారు చేసిన ఈ పాట డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒరిజినల్ పాటలోని కొరియోగ్రఫీకి తగినవిధంగా పాటలోని మొత్తం స్టెప్పులన్నీ అంతే గ్రేస్తో చేశారు. పాటలోని హావభావాలను కూడా హీరోహీరోయిన్లకు తగ్గకుండ పాలికించారు. ఈ పాటలో కరీనా కపూర్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్, కాజోల్ స్టెప్పులు వేస్తారు. ఓ నెటిజన్ ఈ వీడియోను తన ట్విటర్లో ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల మంది వీక్షించారు. ‘బ్రిలియంట్ కొరియోగ్రఫీ, అద్భుతంగా చేశారు’.. ‘కరీనా కపూర్ను అనుకరిస్తూ డ్యాన్స్ భళే చేశాడు’అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గతంలో జూనియర్ ఎన్టీర్ ఆశోక్ చిత్రంలోని ‘గోలా గోలా రంగోలా’ అనే పాటకు ఓ జపాన్ జంట డ్యాన్స్ చేసి వైరల్ అయిన విషయం తెలిసిందే. Tik Tok, a gift that keeps on giving. pic.twitter.com/4XPQaJBbRl — christopher koulumbus (@shivillex) November 5, 2021 -
టిక్టాక్ భార్గవ్కు మళ్లీ రిమాండ్
సాక్షి, విశాఖపట్నం: టిక్టాక్ (ఫన్ బకెట్) భార్గవ్కు మళ్లీ రిమాండ్ విధించారు. ఈ నెల 11 వరకు రిమాండ్ విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. ఆరు నెలల క్రితం పెందుర్తి వేపగుంట సింహపురికాలనీకి చెందిన 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడని టిక్టాక్ భార్గవ్ను దిశ పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్ విధించారు. అయితే ఆయన నిబంధనలతో కూడిన బెయిల్పై విడుదలయ్యాడు. అయితే మళ్లీ సోషల్ మీడియాలో కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ పోస్టుల పెట్టడం, అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దిశ పోలీసులు నిందితుడ్ని తిరిగి అరెస్ట్చేసి న్యాయస్థానంలో శుక్రవారం హాజరుపరిచారు. నింధితుడికి ఈనెల 11వరకు రిమాండ్ విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం కేజీహెచ్లో వైద్యలు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు దిశ పోలీస్స్టేషన్ ఏసీపీ ప్రేమ్కాజల్ వెల్లడించారు. చదవండి: (మద్యం కోసం మర్డర్లు.. 17 రోజుల వ్యవధిలో మూడు హత్యలు..) -
హీరోయిన్గా మారిన టిక్టాక్ స్టార్
‘‘అందరూ కొత్తవాళ్లు తీసిన ‘తీరం’ సినిమా బాగా వచ్చింది. ప్రశాంత్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్. మా సినిమా హిట్ అవుతుంది’’ అని నిర్మాత యం. శ్రీనివాసులు అన్నారు. శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు హీరోలుగా, క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరోయిన్లుగా అనిల్ ఇనమడుగు దర్శకత్వం వహించిన చిత్రం ‘తీరం’. యం. శ్రీనివాసులు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో హీరో, దర్శకుడు అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ– ‘‘యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘తీరం’. అందరం దమ్మున్న సినిమా చేశాం’’ అన్నారు. ‘‘మంచి పాత్ర చేశా’’ అన్నారు శ్రావణ్ వైజిటి. View this post on Instagram A post shared by 🦋 Kristen Ravali 🦋 (@kristenravali.official) View this post on Instagram A post shared by 🦋 Kristen Ravali 🦋 (@kristenravali.official) -
అదిరిపోతున్న యువ యాంకర్ గ్లామర్ షో
-
ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ డేటా లీక్..కిమ్ కర్దాషియన్ తో పాటు
లక్షల సంఖ్యలో ఇన్ స్ట్రాగ్రామ్, టిక్టాక్ యూజర్లు ప్రమాదంలో పడనున్నారు. ఈ రెండు సోషల్ నెట్ వర్క్లలో 'ఎలాస్టిక్ సెర్చ్' అనే అన్ సెక్యూర్డ్ సర్వర్ ఉన్నట్లు సేప్టీ డిటెక్టివ్స్ సంస్థ తెలిపింది. ఈ సర్వర్ ద్వారా 2.6 మిలియన్ల యూజర్లకు చెందిన 3.6 జీబీ డేటా లీకైంది. తద్వరా 2 మిలియన్లకు పైగా సోషల్ మీడియా యూజర్లపై ప్రభావం పడనుందని అంచనా వేసింది. ఇక డేటా లీకైన యూజర్లలో ఆలిసియా కీస్ ఆరియానా గ్రాండే, రియాలిటీ టీవీషోలతో, హాట్ మోడలింగ్తో గ్లోబల్ వైడ్గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కిమ్ కర్దాషియన్తో పాటు పలువురు ఫుడ్ బ్లాగర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లు ఉన్నట్లు సేప్టీ డిటెక్టివ్ తన రిపోర్ట్లో పేర్కొంది. జులై 5న గుర్తించింది సోషల్ మీడియా అనలిటిక్స్ సైట్ IGBlade.com సోషల్ మీడియా సైట్స్లో ఇన్స్టాగ్రామ్, టిక్టాక్కు సంబంధించి ఫాలోవర్స్ గ్రోత్, ఎంగేజ్మెంట్, అకౌంట్ పర్మామెన్స్ గురించి తెలుసుకునేందుకు కొన్ని టూల్స్ను వినియోగిస్తుంది. ఆ టూల్స్ వినియోగం కోసం ఐజీబ్లేడ్.కామ్ రక్షణలేని సర్వర్లను వినియోగిస్తుందని, అలా చేయడం వల్ల సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్న యూజర్ల డేటా లీక్ అవుతుందనే విషయాన్ని ఈ ఏడాది జులై5 న సేప్టీ డిటెక్టివ్ సంస్థ గుర్తించింది. ఆ డేటాలో ఏముంది ఇక ఈ అన్వాంటెడ్ సర్వర్ల కారణంగా లీకైనా సోషల్ మీడియా యూజర్లకు చెందిన బయోడేటా తోపాటు అడ్రస్, కాంటాక్ట్ నెంబర్లు, ప్రొఫైల్ పిక్చర్స్కు సంబంధించిన లింకులన్నీ ఈ లీకైన రికార్డుల్లో ఉన్నట్లు సేప్టీ డిటెక్టివ్ నిపుణలు వెల్లడించారు. ఇలా డేటా లీక్ అవ్వడం తొలిసారి కాదని 2020 ఆగస్ట్ నెలలో కంపేరిటచ్ అనే సంస్థ ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, యూట్యూబ్ యూజర్లు 235 మిలియన్ల మందికి పైగా డేటా లీకైనట్లు గుర్తించింది. చదవండి: ఫేస్బుక్ సంచలన నిర్ణయం.. పేరు మార్పు! -
టిక్టాక్తో చిత్ర విచిత్రంగా కన్ను కొట్టేస్తున్నారు
టిక్ టాక్ ప్రపంచ దేశాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ ఆకర్షణే భారత్ మినహా మిగిలిన దేశాలకు చెందిన పిల్లల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా టిక్ టాక్ వినియోగంతో అనారోగ్యానికి గురై పిల్లలు ఆస్పత్రి పాలవుతున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ను విడుదల చేసింది. భారత కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్పై నిషేదం విధించింది. కానీ మిగిలిన దేశాల్లో ఆ యాప్ వినియోగంలో ఉండడం, ఆ యాప్ను ఉపయోగించి పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. టిక్ టాక్ వినియోగిస్తున్న వారిలో 'టూరెట్ సిండ్రోమ్' అనే సమస్య ఉత్పన్నమవుతున్నట్లు తేలింది. ముఖ్యంగా పిల్లల నాడీ వ్యవస్థపై ప్రభావం, చిత్ర విచిత్రంగా కన్ను కొట్టడం, ఎక్స్ ప్రెషన్స్, సౌండ్స్ చేయడం లాంటి రుగ్మతలు ఎక్కువయ్యాయి. ఇటీవల జర్మనీకి చెందిన పలు ఆస్పత్రులకు ఈ తరహా సమస్యలతో బాధపడే యువతీ యువకులు ట్రీట్మెంట్ కోసం వస్తున్నారని వాల్స్ట్రీట్ తన రిపోర్ట్లో పేర్కొంది. జాతీయ, అంతర్జాతీయ పలు మెడికల్ రిపోర్ట్ల ప్రకారం..లాక్ డౌన్కు ముందు టిక్ టాక్ వినియోగించడం వల్ల అనారోగ్యానికి గురై ట్రీట్మెంట్ కోసం నెలకు ఒకరు లేదా ఇద్దరు వచ్చే వాళ్లు. కానీ ఇప్పుడు వారి సంఖ్య 10 మంది నుంచి 20 మందికి పెరిగినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. టూరెట్ సిండ్రోమ్కు ట్రీట్మెంట్ చేయడంలో 25 ఏళ్ల అనుభవం ఉన్న జర్మనీలోని హనోవర్కు చెందిన డాక్టర్ కిర్స్టెన్ ముల్లర్ మాట్లాడుతూ..''టీనేజర్స్,యువతీ యువకులు ఎక్కువ మంది టిక్టాక్ను వినియోగిస్తున్నారు. వారిలో టూరెట్ సిండ్రోమ్ వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలు ఎక్కువైనట్లు తెలిపారు. ఈ రుగ్మత ఎక్కువగా అబ్బాయిల్ని ప్రభావితం చేస్తుంది. అనారోగ్య సమస్యలు యవ్వనంలో ఉన్నప్పుడు మొదలవుతాయి. తరువాత కాలక్రమేణా అభివృద్ధి చెందుతాయని"అన్నారు.అయితే మరికొంత మంది డాక్టర్లు టీనేజర్స్ ఎదురవుతున్న సమస్య టూరెట్ సిండ్రోమ్ కాదని అంటున్నారు. ఫంక్షనల్ మూవ్మెంట్ డిజార్డర్ అని చెబుతున్నారు. అదిగమించడం ఎలా టిక్ టాక్ వల్ల ఎదురయ్యే సమస్యలకు ట్రీట్మెంట్ చేయవచ్చని తెలుస్తోంది. పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒకవేళ వారు వీడియోలు చేస్తుంటే ఏ తరహా వీడియోలు చూస్తున్నారో తల్లిదండ్రులు గుర్తించాలని అంటున్నారు. ప్రతిరోజు అదే పనిగా టిక్టాక్ వీడియోలు చేస్తుంటే తల్లిదండ్రులు వైద్య నిపుణుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. చదవండి: Apple Fired Janneke Parrish: లీకుల పేరుతో ఉద్యోగులపై ఆపిల్ వేటు -
రేసిజం ఎఫెక్ట్..వరల్డ్ ఫేమస్ టిక్ టాకర్కు షాక్
వరల్డ్ వైడ్గా 115 మిలియన్ల మంది టిక్ టాక్ ఫాలోవర్స్తో సెకండ్ మోస్ట్ పాపులర్ క్రియేటర్గా ఉన్న 21 ఏళ్ల ఖాబీ లేమ్ వివాదంలో చిక్కుకున్నారు. ఫేస్బుక్, టెస్లా వంటి దిగ్గజ సంస్థలే జాత్యహంకార వ్యాఖ్యల వివాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ తరుణంలో ఖాబీలేమ్ సే టూ నో రేసిజం అంటూ చేసిన పోస్ట్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిక్కుల్లో వరల్డ్ ఫేమస్ క్రియేటర్ ఖాబీ లేమ్ ఆఫ్రికన్ కంట్రీస్లోని సెనెగలీస్లో పుట్టాడు. పెరిగింది మాత్రం ఇటలీలోని చివాస్సో. చదువుతోంది గ్రాడ్యుయేషన్. ఏడాది క్రితం వరకు ఇతను ఒక మామూలు వ్యక్తి. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఖాబీలేమ్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు. మాట్లాడకుండా చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్తో టిక్టాక్ వీడియోలు చేసేవాడు. ఆ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. దీంతో దశ తిరిగి అనతి కాలంలోనే 115 మిలియన్ల మంది ఫాలోవర్స్ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఫాలోవర్స్తో పాటు స్పాన్సర్ల రూపంలో ఇబ్బడి ముబ్బడి డబ్బు వచ్చి పడుతుంది. ఇప్పుడు ఇటలీలో ఉంటూ టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ భారీగా అర్జిస్తున్నాడు. అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్లో ఆయన చేసిన పోస్ట్పై మండిపడుతున్నారు. సే టూ నో రేసిజం పేరుతో చేసిన ఇన్స్టా గ్రామ్ పోస్ట్ వివాదంలో చిక్కుకుంది. దెబ్బకు ఫాలోవర్స్ ఖాబీలేమ్ను అన్ ఫ్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే తాను రేసిజంపై పోస్ట్ చేసినందుకేనని పోస్ట్లో పేర్కొన్నాడు. చదవండి: సుఖం కోసం కష్టమెందుకు?: టిక్టాకర్ ఖబి -
నా కెరియర్లో విచిత్రమైన ఒప్పందం : సత్య నాదేళ్ల
వాషింగ్టన్: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓగా పనిచేసిన సత్య నాదెళ్ల ఆ కంపెనీ చైర్మన్గా కూడా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నో వైవిధ్య భరితమైన నిర్ణయాలతో సంస్థను లాభాల దిశగా నడిపించిన నాదేళ్ల తన కెరియర్లో టిక్టాక్ ఒప్పందం విచిత్రమైన ఒప్పందం నేనుఇప్పటికీ దాని మీదే పనిచేస్తున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ గతేడాది సోషల్ మీడియా యూప్ టిక్టాక్ని స్వాధీనం చేసుకునే ఒప్పందం విఫలమైన నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. (చదవండి: వలలో పడ్డ భారీ షార్క్.. పాత రికార్డులన్నీ బ్రేక్) ఈ మేరకు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో టిక్టాక్ మాతృక సంస్థ బైట్ డ్యాన్స్ను వినియోగదారుల డేటా భద్రత దృష్ట్య యూఎస్ వర్షన్ నుంచి తొలగించమన్న సంగతిని గుర్తు చేశారు. దీంతో గతేడాది ఆగస్టు 2020లో ట్రంప్ ప్రభుత్వంతో కుదుర్చకున్న ఒప్పందం కాస్త ఆయన పదవీచ్యుతుడు కావడంతోనే రద్దు అయ్యిపోయిందని అన్నారు . అంతేకాదు చైనాకు చెందిన టిక్టాక్, విచాట్లను నిషేధిస్తూ గతంలో దేశాధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులను ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్లో కోడ్ సమావేశంలో సత్యనాదెళ్ల మాట్లాడుతూ.... "మైకోసాఫ్ట్ సెక్యూరిటీ, పిల్లల భద్రత, క్లౌడ్ నౌపుణ్యాలను టిక్టాక్ యాప్లోకి తీసుకురావడం కోసం ఎదురుచూస్తున్నాం. తాను చాలా మంది నుంచి చాలా విషయాలు నేర్చకున్నాను గానీ టిక్టాక్ విషయంలో ఇలా జరగడం నేను జీర్ణించుకోలేక పోతున్నాను. టిక్ టాక్ జోలికి మేము వెళ్లలేదు అదే మా వద్దకు వచ్చింది. తాము అభివృద్ధి చేసిన చైల్డ్ భద్రతకు సంబంధించిన ఎక్స్బాక్స్ వీడియో గేమింగ్ టూల్స్, బిజినెస్ సోషల్ నెట్వర్క్ లింక్డ్ ఇన్ వంటి ఆత్యాధునిక టెక్నాలజీ సేవల పట్ల టిక్టాక్ మాతృక సంస్థ బైట్డ్యాన్స్ సీఈవో జాంగ్ యిమింగ్ని కూడా ఆకర్షితులయ్యారని చెప్పారు. ఆ ఒప్పందం విషయంలో జో బెడెన్ ప్రభుత్వ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా చెప్పలేను. అయితే జోబైడెన్ ప్రభుత్వం ఆ యాప్లు అమెరికా జాతీయ భద్రతకు విసిరే సవాళ్లపై స్వయంగా సమీక్ష చేస్తున్నట్లు మాత్రమే తెలిపింది. అంతేకాదు క్రిప్టోకరెన్సీ నిబంధనల విషయంలో ప్రభుత్వ నిర్ణయానికీ మద్దతిస్తున్నాం. ప్రస్తుతం నేను చేస్తున్నదాంతో సంతోషంగా ఉన్నా" అని పేర్కొన్నారు. (చదవండి: బూస్టర్ డోస్ తీసుకున్న బైడెన్) -
బాయ్ఫ్రెండ్తో వెళ్లి.. నరహత్యకు గురైంది
వాషింగ్టన్: గత కొన్ని రోజులుగా టిక్టాక్లో ట్రెండిగ్గా మారిన గబ్బి పెటిటో అదృశ్యం కేసును అమెరికా ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) అధికారులు చేధించారు. బాయ్ఫ్రెండ్ చేతిలో ఆమె నరహత్యకు గురైనట్లు వెల్లడించారు. ఫ్లోరిడాకు చెందిన 22 ఏళ్ల యువతి గబ్బి పెటిటో తన బాయ్ఫ్రెండ్తో కలిసి రోడ్ ట్రిప్కు వెళ్లి.. కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎఫ్బీఐ అధికారులు వ్యోమింగ్ సరిహద్దులో లభించిన మానవ అవశేషాలు గబ్బి పెటిటోవి గుర్తించారు. ఫ్లోరిడాకు చెందిన గబ్బి పెటిటో ఈ ఏడాది ఆగస్టులో తన బాయ్ఫ్రెండ్తో కలిసి వ్యోమింగ్లోని గ్రాండ్ టెటాన్ నేషనల్ పార్క్కు వెళ్లింది. ఆ తర్వాత సెప్టెంబర్ 1 గబ్బి పెటిటో బాయ్ఫ్రెండ్ బ్రియాన్ లాండ్రి మాత్రం ఒంటరిగా ఫ్లోరిడాలోని తన ఇంటికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియ లేదు. (చదవండి: గుండెలు పగిలేలా రోదనలు.. ఇక సజీవ సమాధిగా మిగిలేనా?) గబ్బి గురించి ఆమె బాయ్ఫ్రెండ్ లాండ్రీని ఎంతలా ప్రశ్నించినా.. అతడు సమాధానం చెప్పలేదు. లాండ్రీ సెప్టెంబర్ 1న ఇంటికి తిరిగి రాగా, ఆ తర్వాత పది రోజులకు పెటిటో తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పెటిటో అదృశ్యంపై లాండ్రీ మాట్లాడటానికి నిరాకరించాడు. ఈ క్రమంలో పోలీసులు గబ్బి పెటిటో ఆచూకీ గురించి ఎవరికైనా.. ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలపాలని లాండ్రీ తోపాటూ, ప్రజలను కూడా విజ్ఞప్తి చేశారు. (చదవండి: పెళ్లైన 2 రోజులకే భర్త మాజీ భార్యకు కిడ్నీ దానం) ఈ క్రమంలో వ్యోమింగ్ సరిహద్దులో లభించిన మానవ అవశేషాలు పెటిటోకు సరిపోయాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న లాండ్రీ గురించి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. గబ్బి పెటిటో హత్యకు గల కారణాలు తెలియాలంటే లాండ్రీ పట్టుబడాలి. గబ్బి పెటిటో అదృశ్యం అయిన నాటి నుంచి ఈ వార్త మీడియాలో ప్రముఖంగా ప్రసారం అయ్యింది. టిక్టాక్లో గబ్బి పెటిటో అనే హ్యాష్ట్యాగ్తో క్యాంపెయిన్ నడుస్తోంది. ఇప్పటివరకు దీనికి 650 మిలియన్ వ్యూస్ వచ్చాయి. చదవండి: ఒక్క ఆలూ చిప్.. ధర ఏకంగా రూ.14 లక్షలు -
గోకవరంలో ఘరానా మోసం
-
East Godavari: టిక్టాక్ దంపతుల ఘరానా మోసం.. 44 లక్షలు వసూలు
తూర్పు గోదావరి: తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో టిక్టాక్తో ఫెమస్ అయిన ఘరానా దంపతుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాగా, నిందితులు గోకవరానికి చెందిన గౌరిశంకర్ అనే వ్యక్తి కుమార్తెను విదేశాలకు ఉన్నత చదువుల కోసం పంపిస్తామని చెప్పి మామిడాల శ్రీధర్, చెరుకుమిల్లి గాయత్రీలు 44 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ఏవో మాయమాటలు చెబుతూ మాటమార్చారు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరారు. దీంతో కేటుగాళ్లు ఇద్దరు తమ సెల్ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. కాగా, బాధితులు ఇద్దరు నిందితులపై గోకవరం పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హజరుపర్చినట్లు తెలిపారు. కోర్టు నిందితులకు 15 రోజులపాటు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: భర్తకు నిప్పంటించి.. బండతో బాదిన భార్య.. కారణం ఏంటంటే.. -
విమానంలో సిగరెట్ తాగిన యువతి.. ప్రయాణికులు షాక్
సాక్షి, తల్లహస్సీ: బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడాన్ని నిషేధిస్తూ ఇప్పటికే అనేక దేశాలు కఠిన చట్టాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకొవడంతో పాటు జరిమానా కూడా విధిస్తారు. అయితే, కొంత మంది వ్యక్తులు అప్పుడప్పుడు బస్సుల్లో లేదా రైళ్లల్లో సిగరెట్ తాగిన సంఘటనలు తరచుగా వార్తలలో వస్తుంటాయి. సిగరెట్ తాగటం వలన.. వారికే కాకుండా తోటి ప్రయాణికుల ప్రాణాలకు కూడా పెద్ద ముప్పు సంభవించే అవకాశం ఉంటుంది. కాగా, ఒక యువతి ఏకంగా విమానంలోనే సిగరెట్ తాగి తోటి ప్రయాణికులను షాకింగ్కు గురిచేసింది. ఈ సంఘటన ఫ్లోరిడాలోని స్పిరిట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో గత మంగళవారం చోటుచేసుకుంది. ఒక తోటి ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి టిక్టాక్లో పోస్ట్ చేయగా ఇది వైరల్గా మారింది. ఫోర్ట్లాడర్డేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పిరిట్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం టేక్ఆఫ్ అయ్యింది. రన్వే మీద వెళ్లడానికి మరికొంత సమయం ఉంది. ఈ క్రమంలో ఒక యువతి సిగరెట్ను తీసి తాగడం ప్రారంభించింది. దీంతో తోటి ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు. అయితే, ఆమెతో పాటు ప్రయాణిస్తున్న.. మజ్దలావి అనే వ్యక్తి దీన్ని రికార్డు చేశాడు. అంతటితో ఆగకుండా విమాన సెక్యురిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే యువతి దగ్గరకు చేరుకుని ఆమెను కిందికి దిగిపోవాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. కాగా, యూఎస్లో 1988లోనే బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ తాగడాన్ని నిషేదించారు. చదవండి: Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్ వీడియో.. -
ఒక్క ఆలూ చిప్.. ధర ఏకంగా రూ.14 లక్షలు
వెబ్డెస్క్: అదృష్టం ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో ఊహించడం కష్టం. కొందరు ఎంత కష్టపడ్డా తగిన ఫలితం లభించక బాధపడతారు.. కానీ కొందరి జీవితంలో జరిగే సంఘటనలు చూస్తే.. చాలా ఆశ్చర్యం వేస్తుంది. సరదాకి చేసే పనులు కూడా వారికి బాగా కలసివస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబేయే వార్త కూడా ఈ కోవకు చెందినదే. తినే చిప్స్లో ఒకటి కాస్త వింతగా ఉండటంతో దాన్ని దాచుకోవాలని నిర్ణయించుకుంది ఓ బాలిక. ఆ తర్వాత దాన్ని వీడియో తీసి టిక్టాక్లో అప్లోడ్ చేయడంతో చాలామంది దాన్ని వేలం వేయమని సూచించారు. వేలంలో ఆ చిన్న ఆలూ చిప్ ఏకంగా 14 లక్షల రూపాయల ధర పలికింది. నమ్మశక్యంగా లేని ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్కి చెందిన 13 ఏళ్ల బాలిక రైలీ స్టువార్ట్కు బంగాళాదుంప చిప్స్ తినడం అంటే ఇష్టం. అందులోనూ ప్రముఖ బ్రాండ్ డోరిటోస్ ఆలూ చిప్స్ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో ఓసారి రైలీ డోరిటోస్ చిప్స్ ప్యాకెట్ తీసుకువచ్చింది. దానిలో ఆమెకు ఓ చిత్రమైన చిప్ ముక్క కనిపించింది. అది మిగతా చిప్స్ ముక్కల్లా కాకుండా... సమోసాలాగా ఉబ్బినట్లు ఉంది. వెరైటీగా ఉండటంతో రైలీ దాన్ని దాచుకోవాలని భావించింది. ఈ క్రమంలో ఆ చిప్ ముక్కను వీడియో తీసి... టిక్టాక్లో ఉబ్బిన స్నాక్ పేరుతో అప్లోడ్ చేసింది. సమోసాలా భిన్నంగా ఉన్న ఈ ఆలూ చిప్ వీడియో తెగ వైరలయ్యింది. ఆ తర్వాత ఇది కాస్త ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా షేర్ అయ్యింది. ఇక టిక్టాక్లో దీనికి మిలియన్ల వ్యూస్ వచ్చాయి. విభిన్నంగా ఉన్న ఈ చిప్ని కొనేందుకు నెటిజనులు ఆసక్తి కనపర్చడంతో.. రిలే దాన్ని వేలం వేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో దాన్ని ఈబే సైట్లో లిస్ట్ చేసింది. చిప్ ఖరీదు ఒక్క డాలర్ కంటే తక్కువ కోట్ చేసింది. అయితే ఆశ్చర్యంగా గంటల వ్యవధిలోనే దాని విలువ 2 వేల డాలర్లకు చేరింది. ఆ చిప్ ముక్కకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది భారీగా డబ్బులిచ్చి కొనేందుకు ముందుకొచ్చారు. ఇలా వేలం కొనసాగుతూ ఉండగా... డోరిటోస్ కంపెనీకి ఈ విషయం తెలిసింది. ఆశ్చర్యపోయిన కంపెనీ... బిడ్డింగ్లో పాల్గొని అందరికంటే చాలా ఎక్కువగా 20,100 డాలర్లు(14,90,251 రూపాయలు) ఇచ్చేందుకు ముందుకొచ్చింది. విషయం తెలిసి రిలే కుటుంబం సంతోషంతో ఉబితబ్బయ్యింది. ఇక ఏదో సరదాకు చేసిన పనికి ఇంత భారీ ఎత్తున డబ్బు వస్తుందని అస్సలు ఊహించలేదు అంటూ సంతోషంతో గంతులు వేస్తుంది రిలే. ఎందుకు అంత ధరంటే.. ఒక చిన్న ఆలూ చిప్ ముక్కను రూ.14 లక్షలు పెట్టి కొనేందుకు డోరిటోస్ ముందుకు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనిపై కంపెనీ వివరణ ఇచ్చింది. "మరెవరైనా అయితే... ఆ ముక్కను కూడా తినేవారేమో... కానీ ఆ బాలిక క్రియేటివ్గా ఆలోచించింది. దాన్ని కూడా వ్యాపార కోణంలో చూసింది. దానితో బిజినెస్ చేసింది. ఆమె ధైర్యం మాకు నచ్చింది. ఆమెలో ఓ వ్యాపారవేత్తను మేం చూశాం. పైగా ఆమె కుటుంబం మా చిప్స్కి అభిమానులు. అందుకే ఇలా చేశాం" అని తెలిపింది. This 13-year-old was paid $20,000 by Doritos after finding a perfectly puffy chip 😱 pic.twitter.com/mFRfWVr5F0 — NowThis (@nowthisnews) August 20, 2021 -
అలా నటిద్దామనుకున్న టిక్టాకర్ పాట్లు చూడాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం కవితలు రాసినంత, పాటలు పాడుకున్నంత ఈజీకాదు. మహిళల జీవితంలో అదొక ఉద్విగ్న సందర్భమే అయినా, ఆ నవమోసాలు పడే అవస్తలు సవాళ్లు, ప్రసవ వేదన, తదనంతర బాధలు అన్నీఇన్నీ కావు. అందుకే ‘‘రైలు పట్టా మీద నాణెం విస్తరించిన బాధ’’ అంటూ ప్రముఖ కవయిత్రి కొండేపూడి నిర్మల ‘లేబర్రూం’ అనే కవితలో వర్ణిస్తారు. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అయితే దీన్ని స్వయంగా అనుభవిద్దామనుకున్న ఒక యువకుడికి ఎదురైన చేదు అనుభవం ఇపుడు వైరల్గా మారింది. అంతేకాదు పలువురిని ఆలోచింప చేస్తోంది. గర్భిణీలు పడే మానసిక, శారీరక కష్టాలను, స్వతహాగా అనుభవించాలనుకున్నాడు మెయిట్లాండ్ పాపులర్ టిక్టాకర్ హాన్లీ. ప్రెగ్నెంట్ లేడీగా కనిపించేలా పొట్టపై భారీ వాటర్ మిలన్ను, అలాగే ఛాతీ వద్ద కూడా రెండు చిన్న వాటర్ మిలన్లన అమర్చుకున్నాడు. అలా మొత్తం నిండు గర్భిణీలా తన అవతారాన్ని మార్చుకున్నాడు. ఇక్కడవరకు బాగానే ఉంది. కానీ ఆ తరువాతే అబ్బాయిగారికి అసలు కష్టాలు మొదలయ్యాయి. వేషం అయితే వేసుకున్నాడు కానీ, అంత బరువుతో లేచి తిరగడం మాత్రం అతని వల్ల కాలేదు. కనీసం మంచం మీద నుంచి కాలు కిందపెట్టలేకపోయాడు. నిజమైన గర్భధారణను అనుకరించడం అసాధ్యమైనప్పటికీ, ఒక ప్రయోగం చేయాలనుకున్నా... అదంత పెద్ద కష్టమేమీ కాదనుకున్నాను కానీ మంచం నుండి లేవడానికి చాలా కష్టపడ్డానని హాన్లీ చెప్పాడు. ఈ ఘటనకు సంధించిన వీడియో వైరల్గా మారింది. చదవండి: Afghanistan: తీవ్ర పరిణామాలు, అమెరికాకు తాలిబన్ల వార్నింగ్! ‘తొమ్మిది నెలలు బిడ్డను మోయడం, జన్మనివ్వడం అషామాషీ కాదు.. ఫన్నీ అసలే కాదు. ఇదే వాస్తవం.. కావాలంటే మీరూ ట్రై చేయండి’ అంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. గర్భధారణ, ప్రసవం సవాళ్లను తేలిగ్గా కొట్టిపారేశే వాళ్లకి ఇదొక గుణపాఠం అని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ వీడియో కోటి 70 లక్షలకు పైగా వ్యూస్ సాధించడం విశేషం. చదవండి: చర్చకు దారి తీసిన ఆనంద్ మహీంద్ర వైరల్ వీడియో -
జిమ్లో ‘దెయ్యం’.. కాలు పట్టుకుని మరీ లాక్కెళ్లింది
దెయ్యాలు ఉన్నాయా.. లేవా.. అనే విషయం మీద ఎప్పటికి చర్చలు నడుస్తూనే ఉంటాయి. చాలా మంది దెయ్యాలున్నాయని విశ్వసిస్తే.. కొందరు మాత్రం అదంతా ఉట్టిదే అని కొట్టిపారేస్తారు. ఇక ఇంటర్నెట్లో దెయ్యాలకు సంబంధించిన వీడియోలు కోకొల్లలు. అయితే వీటిలో చాలా మటుకు ఫేక్ వీడియోలే అని మనం గుర్తించగలం. కానీ కొన్ని వీడియోలుంటాయి.. ఎంతటి ధైర్యవంతులైనా సరే.. వాటిని చూస్తే.. దడుసుకోవాల్సిందే. ఈ తరహాకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎక్సర్సైజ్ చేసుకుందామని జిమ్కు వచ్చిన వ్యక్తిని ‘దెయ్యం’ పరుగులు పెట్టించింది. కాలు పట్లుకుమని లాక్కెళ్లింది. ఆ వివరాలు.. టిక్టాక్ యూజర్ @carlosruizoficial పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 12 మిలియన్లకు పైగా వ్యూస్తో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిలో జిమ్కు వెళ్లిన ఓ వ్యక్తిని అదృశ్య శక్తి ఫ్లోర్ అంతటా లాగుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఎక్సర్సైజ్ కోసం ఓ వ్యక్తి జిమ్కు వెళ్లాడు. ఆ సమయంలో జిమ్లో అతనొక్కడే ఉన్నాడు. ఇక అతడు వామప్ చేసుకుంటూ ఉండగా.. అతడి వెనక ఉన్న కొన్ని జిమ్ పరికరాలు వాటంతట అవే కదులుంతుంటాయి. మొదట ఆ వ్యక్తి దాన్ని పెద్దగా పట్టించుకోడు. ఆ తర్వాత మరి కొన్ని పరికరాలు అలానే అసాధారణ రీతిలో కదలడం మొదలవుతుంది. వీటన్నింటిని గమనించిన సదరు వ్యక్తి అక్కడ ఏదో అదృశ్య శక్తి ఉందని భావించి... బయటకు వెళ్లాలని అనుకుంటాడు. ఇక తనతో పాటు తీసుకువచ్చిన వస్తువులు తీసుకుని బయటకు వెళ్తుండగా.. సడెన్గా కిందపడతాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి అతడి కాలు గాల్లోకి లేస్తుంది. ఆ తర్వాత ఎవరో అతడి కాలు పట్టి జిమ్ ఫ్లోర్ మీద కొంత దూరం ఈడ్చుకెళ్లినట్లు కనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరు కనిపించరు. వదిలేయగానే.. ఆ వ్యక్తి కాలుకు పని చెప్పి.. అక్కడ నుంచి బయటకు పరిగెత్తాడు. ఈ వీడియోపై నెటిజనులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కావాలనే ఇలాంటి స్టంట్లు చేశారు.. అక్కడ దెయ్యం లేదు పాడు లేదు అంటుండగా.. మరి కొందరు దెయ్యం కూడా జిమ్ చేద్దామని వచ్చి ఉంటుంది.. అతడు అక్కడే ఉండటం దానికి నచ్చలేదేమో.. అందుకు ఇలా బయటకు గెంటేసింది అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
పాక్లో దారుణం: మహిళా టిక్టాకర్పై 300 మంది దాడి!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా టిక్టాకర్పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్ట్14 పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఓ టిక్టాకర్ తన ఆరుగురు స్నేహితులతో కలిసి లాహోర్లోని మినార్-ఇ-పాకిస్తాన్ వద్ద టిక్టాక్ వీడియోను చిత్రీకరించాలనుకున్నారు. ఆ సమయంలో సుమారు 300మంది ఆమెను చుట్టిముట్టి దాడికి పాల్పడ్డారు. ఆమెను గాల్లోకి ఎగరేస్తూ దుస్తులు చించడానికి యత్నించారు. ఆమె చుట్టూ చేరిన వందలాది మంది నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఎంతకు సాధ్యం కాలేదు. ఈ పరిస్థితిని గమనించిన సెక్యూరిటీ గార్డు మినార్-ఇ-పాకిస్తాన్ గేటు తెరవటంతో అక్కడి నుంచి తన స్నేహితులతో ఆమె బయటపడింది. బలవంతంగా ఆమె చేతి ఉన్న ఉంగరం, చెవి రింగులు, తన స్నేహితుల వద్ద ఉన్న మోబైల్ ఫోన్, ఐడీ కార్డు, రూ.15 వేలను లాక్కున్నారు. ఈ ఘటనపై సదరు టిక్టాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. This is one of the many videos that are being shared on WhatsApp groups showing how men were groping her and touching her. Look at the number of people in this video!! All she wanted to do was celebrate Independence Day at minar e Pakistan. Is that a crime? pic.twitter.com/9LPaWAo4wQ — Nida Abbas (@OutOnAbudget) August 16, 2021 -
వెనుకబడ్డ ఫేస్బుక్..దూసుకెళ్లిన టిక్టాక్..!
షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ సరికొత్త రికార్డును నమోదుచేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేసిన యాప్గా టిక్టాక్ నిలిచింది. అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన సోషల్మీడియా ప్లాట్ఫాంగా నిలిచిన ఫేస్బుక్ను వెనక్కినెట్టింది. 2020 సంవత్సరంలో అత్యధిక యూజర్లు డౌన్లోడ్ చేసిన యాప్గా టిక్టాక్ నిలిచినట్లు ప్రముఖ బిజినెస్ జర్నల్ నిక్కీ ఏషియా వెల్లడించింది. భారత్ లాంటి దేశాల్లో నిషేధానికి గురైన కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లు డౌన్లోడ్ చేసిన యాప్గా టిక్టాక్ నిలవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా టిక్టాక్ తన మార్కెట్ను విస్తరించుకుంటూ వెళ్లడంతో ఈ ఘనతను సాధించినట్లుగా నిక్కీ ఏషియా వెల్లడించింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా యాప్స్ డౌన్లోడ్లో టిక్టాక్ నాలుగో స్థానంలో నిలిచింది. అత్యధిక యూజర్లు డౌన్లోడ్ చేసిన యాప్స్లో ఫేస్బుక్ కు చెందిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మెసేంజర్ యాప్లు టాప్ 10 లో కొనసాగుతున్నాయి. కాగా టిక్టాక్ను తిరిగి భారత మార్కెట్లలోకి త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టిక్టాక్ భారత మార్కెట్లలోకి ఎంట్రీ ఇస్తే టిక్టాక్ యాప్ డౌన్లోడ్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిక్కీ ఏషియా పేర్కొంది. -
టిక్టాక్ స్టార్ల మధ్య రచ్చ.. లైంగికంగా వేధించి.. ఆపై
ముంబై: ఇద్దరు మైనర్ టిక్టాక్ స్టార్ల మధ్య గొడవ లైంగిక వేధింపులకు దారితీసింది. నాతో కలిసి ఉండకపోతే.. నీ వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ సదరు టిక్టాక్ స్టార్.. మైనర్ బాలికను వేధించాడు. ప్రస్తుతం ఈ ఘటన మహరాష్ట్రాలో సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు..ముంబైలోని 16 ఏళ్ల యువకుడు టిక్ టాక్ వీడియోలను చేస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి 17 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరు కలిసి టిక్టాక్ వీడియోలు చేస్తుండేవారు. కాగా, 2020 లో టిక్టాక్ బాన్కాక ముందు నుంచే వీరిద్దరు కలసి పనిచేసేవారు. వీరిద్దరికి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో, వీరిద్దరు కలిసి అనేక వీడియోలను చేశారు. కొంత కాలం వీరి స్నేహం బాగానే సాగింది. ఆ తర్వాత.. వీరిమధ్య కొన్ని మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో గతవారం.. 17 ఏళ్ల యువతి, తాను సొంతంగా వేరే బిజినెస్ చేయాలనుకుంటున్నట్లు యువకుడికి తెలియజేసింది. దీంతో, ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తనతోనే కలిసి ఉండాలని కోరాడు. అయినా ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అతను, యువతిని ప్రతిరోజు మానసికంగా హింసించేవాడు. ఆమె వ్యక్తిగత వీడియోలు తన దగ్గర ఉన్నాయని వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు కూడా దిగాడు. దీంతొ ఆమె.. అతని వేధింపులకు విసిగి పోయింది. ఒకరోజు రాత్రి యువకుడు.. యువతి ఇంటికి తన మిత్రులతో కలిసి వెళ్లి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆమెను విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ అనుకోని సంఘటనతో భయపడిపోయిన ఆ యువతి తన తల్లిదండ్రులతో జరిగిన విషయాన్ని తెలియజేసింది. దీంతో వారు, ముంబైలోని పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ యువకుడు, అతని మిత్రులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టం నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
ఫస్ట్డేట్ రోజే విషాదం: టిక్టాక్ స్టార్ కాల్చివేత
కాలిఫోర్నియా: అమెరికాలోని కరోనా థియేటర్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన టిక్టాక్ స్టార్ ఆంథోనీ బరాజాస్ (19) తుది శ్వాస విడిచాడు. గతం వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆంథోనీ మెదడులోని తీవ్ర గాయాల కారణంగా చనిపోయినట్టు కాలిఫోర్నియా పోలీసులు ప్రకటించారు. గత నెల 26 న దక్షిణ కాలిఫోర్నియాలోని కరోనా థియేటర్లో హారర్ మూవీ "ది ఫరెవర్ పర్జ్" ప్రదర్శిస్తున్న సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సినిమా ముగిసిన తర్వాత, ఆడిటోరియం శుభ్రం చేస్తున్నథియేటర్ ఉద్యోగులు రక్తపు మడుగులో పడిఉన్న ఇద్దరు బాధితులను గుర్తించారని రివర్సైడ్ కౌంటీ ప్రాసిక్యూటర్ మైక్ హెస్ట్రిన్ ఒక ప్రకటనలో తెలిపారు. చాలా సమీపంనుంచి ఇద్దర్నీ తలపై గురిపెట్టి మరీ కాల్చిన ఈ ఘటనలో ఆంథోనీ ఫ్రెండ్ రైలీ గుడ్రిచ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన ఆంథోనీని ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్పై చికిత్స అందించారు. కానీ ఫలితం లేకపోవడంతో వైద్యులు లైఫ్ సపోర్టు తొలగించారు. దీంతో అతను సోమవారం తుదిశ్వాస విడిచినట్టు కాలిఫోర్నియా అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా అతని కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇది అనాలోచిత చర్యగా ప్రకటించారు. ఈ ఘటనలో నిందితుడు జోసెఫ్ జిమెనెజ్ (20)ను అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. రైలీ గుడ్రిచ్ (ఫైల్ ఫోటో) చెరగని చిరునవ్వు, దయగల హృదయం ఆంథోనీ సొంతం.తన గురించి తెలిసిన వారందరికీ అతడొక గిప్ట్..ఆయనలేని లోటు తీరనిది అంటూ ఆంథోనీ కుటుంబం నివాళులర్పించింది. అటు ఆంథోనీ అకాల మరణంపై స్నేహితులు తీవ్ర విచారం చేశారు. ఫస్ట్ డేట్లోనే ప్రాణాలు కోల్పోయిన ఆంథోనీ, రైలీని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు ఆంథోనీ బరాజాస్ అవయవాలను దానం చేయన్నారని అతని స్నేహితుడు మాలిక్ ఎర్నెస్ట్ ట్విట్ర్లో తెలిపారు. కాగా ఆంథోనికి టిక్టాక్లో దాదాపు 10 లక్షల మంది, ఇన్స్టాలో 50 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. హైస్కూల్ స్థాయిలో అద్భుతమైన సాకర్ ప్లేయర్గా పాపులర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆంథోని లైఫ్ సపోర్ట్లో ఉన్నప్పుడు వైద్య ఖర్చుల నిమిత్తం ‘గోఫండ్మీ’ ద్వారా 80వేల డాలర్లకు పైగా విరాళాలు రావడం గమనార్హం. నిందితుడు నజోసెఫ్ జిమెనెజ్(ఫైల్ ఫోటో) -
Tokyo Olympics: రూల్స్ సవరణ.. రెచ్చిపోతున్న అథ్లెట్లు
టోక్యో: కరోనా కట్టడితో అథ్లెట్లకు ఊపిరి ఆడని పరిస్థితి. ఒలింపిక్స్ విలేజ్లో ఆహ్లాదంగా గడపలేని పరిస్థితులు, కఠిన నిబంధనలు, ఆల్కహాల్- సెక్స్కి దూరం కావడం వెరసి టోక్యో ఒలింపిక్స్లో పాల్గొంటున్న ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు కొంతలో కొంత ఊరట ఇచ్చింది ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ. సోషల్ మీడియా కఠిన నిబంధనల్ని ఎత్తేయడంతో అథ్లెట్లంతా ఒక్కసారిగా రెచ్చిపోతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సోషల్ మీడియా రూల్స్ను సవరించింది. దీంతో టిక్టాక్ లాంటి వీడియో జనరేట్ కంటెంట్ యాప్లలో రెచ్చిపోతున్నారు అథ్లెట్లు. ఖాళీ టైం దొరికితే చాలు.. వాళ్లరూమ్లలో షార్ట్ వీడియోలు తీసుకుంటూ పండుగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరికి ఈ-పాపులారిటీ దక్కుతుండడం విశేషం. ఐరిష్ జిమ్నాస్ట్ రైస్ మెక్క్లెనాగన్ ‘యాంటీ-సెక్స్’ బెడ్ పుకార్లను బద్ధలు కొట్టిన వీడియోతో మొదలైన సందడిని వందల మంది అథ్లెట్లు కొనసాగిస్తూ వస్తున్నారు. అమెరికన్ రగ్బీ ప్లేయర్ ఇలోనా మహెర్ తన టీంతో కలిసి, వాలీబాల్ ప్లేయర్ ఎరిక్ షోజీ, ఐరిష్ ట్రాక్ స్టార్ లియోన్ రెయిడ్.. ఈ జాబితాలో ముందున్నారు. అథ్లెట్లకు కేటాయించిన రూమ్ల్లో వాళ్ల చేస్తున్న సందడి మామూలుగా ఉండడం లేదు. “Anti-sex” beds at the Olympics pic.twitter.com/2jnFm6mKcB — Rhys Mcclenaghan (@McClenaghanRhys) July 18, 2021 I drop about 3 tiktoks a day from here in the village. Follow me for a good laugh. pic.twitter.com/VzxDKhJZ5r — Raven HULK Saunders (@GiveMe1Shot) July 27, 2021 టఫ్ ఐవోసీ రూల్స్ ఐవోసీలోని ఇంతకు ముందు రూల్స్ ప్రకారం.. అథ్లెట్లతో పాటు కోచ్లు, అధికారులు ఎవరైనా కూడా ఫొటోలు మాత్రమే పోస్ట్ చేయాలి. కాంపిటీషన్ వెన్యూ నుంచి కూడా పోస్టులు పెట్టొచ్చు. కానీ, ఆడియో-వీడియో కంటెంట్ మాత్రం పోస్ట్ చేయడానికి వీల్లేదు. అలాగే నాన్-ఒలిపింక్ స్పాన్సర్స్కు సంబంధించిన పోస్ట్లు కూడా చేయకూడదు. అలా చేస్తే ఫైన్తో పాటు బ్యాన్కు కూడా అవకాశం ఉందని హెచ్చరికలు ఉండేవి. అయితే 2018 వింటర్ ఒలింపిక్స్ టైంలో అథ్లెట్లు.. ఆడియెన్స్తో ఇంటెరాక్ట్ అవుతూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసే అవకాశం కల్పించింది. అంతేకాదు వ్లోగర్స్ వీడియోలు తీసుకోవచ్చని పేర్కొంది. అయితే అదే ఒలింపిక్స్లో ఐస్ డ్యాన్సింగ్ అక్కాచెల్లెలు మయియా-అలెక్స్ షిబుటానీ ఒలింపిక్స్ వ్లోగ్ కక్రియేట్ చేయగా.. గంటలో దానిని యూట్యూబ్ కాపీరైట్స్ పాలసీ ఉల్లంఘనల పేరిట తొలగించేసింది. అప్పటి నుంచి కొన్ని పరిమితులతో వీడియోలకు అవకాశం ఇచ్చింది. ఇక కరోనా టైంలో ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉండడంతో అథ్లెట్లు వాళ్ల అనుభవాల్ని సన్నిహితులతో పంచుకోవచ్చని పేర్కొంది. అది కూడా నాన్-కమర్షియల్ అయితేనే. -
డ్యాన్సింగ్ సెన్సేషన్ ఈ బామ్మ.. 2 కోట్ల వ్యూస్
-
డ్యాన్సింగ్ సెన్సేషన్ ఈ బామ్మ.. 2 కోట్ల వ్యూస్
ఖాట్మండు: లేడిపిల్లలా చెంగుచెంగున నడుస్తూ.. నెమలిలా నాట్యం చేస్తోంది కృష్ణకుమారి తివారి. నాట్యం చేస్తుంటే అందరి కళ్లు ఆమె పైనే. కాళ్లకు ఘల్లుఘల్లుమనే గజ్జలు కట్టుకుని, నాట్యంతో హావభావాలు పలికిస్తోన్న అమ్మాయి కదా! అందరూ ఆసక్తిగా చూస్తారులే! అనుకుంటే మీరు పొరబడినట్లే. డెబ్భైఎనిమిదేళ్ల వయసులో మైమరిపించే స్టెప్పులతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది కృష్ణకుమారి బామ్మ. నేపాల్లోని గోర్కా జిల్లాకు చెందిన కృష్ణకుమారి తివారికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో ఇంట్లో వాళ్లు డ్యాన్స్ను ప్రోత్సహించేవారు కాదు. సంప్రదాయ కుటుంబాలలోని ఆడపిల్లలు డాన్సులంటూ తిరిగితే సమాజం నుంచి వెలేస్తారేమోనని భయపడే రోజుల్లో ఆమె బాల్యం గడిచింది. దీంతో తనకి ఎంతో ఇష్టమైన నాట్యం తీరని కలగానే మిగిలిపోయింది. పెళ్లీ, పిల్లలు, వారి బాధ్యతలు అన్నీ తీరడం, ఇప్పుడు తీరిక దొరకడం చిన్నప్పటి కట్టుబాట్లు ప్రస్తుతం లేకపోవడంతో ఒంట్లోని ఓపికను కూడగట్టుకుని పదహారేళ్ల పడచు పిల్లలా డ్యాన్స్ చేస్తూ తన చిరకాల కోరికను తీర్చుకుంటోంది. కృష్ణకుమారి డ్యాన్స్ చేస్తోన్న వీడియోలు ఆమె కుటుంబ సభ్యులు టిక్టాక్లో అప్లోడ్ చేయడంతో ఇప్పుడవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె డ్యాన్సింగ్ వీడియోలలో ఒకదానికి దాదాపు రెండుకోట్ల వ్యూస్, 65 వేల కామెంట్లు వచ్చాయి. కృష్ణకుమారి డ్యాన్స్ గురించి తెలిసిన వారంతా ఆ చుట్టుపక్కల జరిగే పెళ్లిళ్లు, పార్టీలకు ఆహ్వానిస్తూ ఆమె డ్యాన్స్ను మరింత ప్రోత్సహిస్తున్నారు. ‘‘అప్పటి సమాజంలో ఉన్న నిబంధనలను అనుసరించి డ్యాన్స్ చేయాలన్న ఆకాంక్షను నాలోనే అణచి వేసుకున్నాను. అయితే ఇప్పుడు నాకేం జరుగుతుందే తెలియడం లేదు. ఎప్పుడూ డ్యాన్స్ చేస్తూనే ఉంటున్నాను. ఎవరూ నన్ను ఆపడంలేదు, నా పిల్లలు కూడా చాలా సంతోషిస్తున్నారు. నా డ్యాన్స్ వీడియోలకు చాలా మంది అభిమానం చూపిస్తుంటే మరింత డ్యాన్స్ చేయాలనిపిస్తోంది. డ్యాన్స్ చేస్తూ చనిపోవాలని ఉంది’’ అని చెప్పారు కృష్ణకుమారి సంతోషంతో నీళ్లు నిండిన కన్నులతో. -
టిక్టాక్ స్టార్ దుర్మరణం, షాక్లో ఫ్యాన్స్: వైరల్ వీడియో
బీజింగ్: లైవ్ స్ట్రీమ్ వీడియో షూట్ చేస్తూ చైనీస్ టిక్టాక్ స్టార్ జియావో క్యుమీ (23) దుర్మరణం పాలైన ఘటన షాక్కు గురిచేసింది. టిక్టాక్ వీడియో రికార్డ్ చేస్తూ 160 అడుగుల నుంచి కింద పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రొఫెషనల్ క్రేన్ ఆపరేటర్గా పనిచేసే జియావో ఆ క్రేన్ నుండే పలు వీడియోలు తీస్తూ ఉండేది. ఇలా అనేక వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ స్టార్గా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే సహోద్యోగులంతా ఇంటికి వెళ్లి పోయిన తరువాత క్రేన్ క్యాబిన్లో కూర్చుని వీడియో తీసుకోవడానికి ప్రయత్నించింది జియావో. కానీ ఇంతలోనే అదుపు తప్పి కింద పడిపోయింది. ఫోన్ చేతిలో పట్టుకుని కింద పడిపోతున్న దృశ్యాలు వీడియోలో అస్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. టిక్టాక్ చైనీస్ వెర్షన్ డౌయిన్ ప్లాట్ఫాంలో లక్షమంది మందికి పైగా ఫాలోవర్లో జియావో క్యుమీ చైనాలో అత్యంత ప్రజాదరణ పొందారు. ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఈమె డ్యాన్స్ వీడియోలు కూడా భారీ క్రేజ్ను సొంతం చేసుకున్నాయి. దీంతో జియావో ఆకస్మిక మరణం అభిమానులను తీవ్ర విషాదంలోకి ముంచింది. కాగా ఇటీవల హాంగ్కాంగ్కు చెందిన డేర్డెవిల్ ఇన్ఫ్లూయెన్సర్ సోఫియా చుంగ్ జలపాతం సమీపంలో ఇన్స్టాగ్రామ్ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. -
ప్రపంచ జనాభాను మించి... యూట్యూబ్ వరల్డ్ రికార్డ్ !
ప్రపంచంలో అత్యధికమంది డౌన్లోడ్ చేసుకున్న యాప్గా యూట్యూబ్ రికార్డు సృష్టించింది. టెక్నాలజీ ప్రపంచంలో మిగిలిన యాప్లను వెనక్కి నెట్టి ఇప్పుడప్పుడే ఎవ్వరీ అందనంత ఎత్తులో నిల్చుంది. 1000 కోట్లు ప్రస్తుతం ప్రపంచ జనాభా 790 కోట్లు, అయితే ఇప్పటి వరకు యూ ట్యూబ్ ఏకంగా వెయ్యి కోట్లసార్లు డౌన్లోడ్ అయ్యింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ప్లే స్టోర్లో ప్రస్తుతానికి 20.89 లక్షల యాప్లు ఉన్నాయి. వీటన్నింటీని వెనక్కి నెట్టి ప్రథమ స్థానంలో యూట్యూబ్ నిలిచింది. ఈ ఏడాది ఆండ్రాయిడ్ ఫ్లాట్ఫామ్పై కొత్తగా 300 కోట్ల యాక్టివేషన్లు వచ్చాయి. దీంతో యూట్యూబ్ వరల్డ్ రికార్డు సాధించగలిగింది. ఏకంగా ప్రపంచ జనాభాను మించి యూట్యూబ్ యాప్ వెయ్యి కోట్ల సార్లు డౌన్లోడ్ అయ్యింది. తర్వాత స్థానం ప్లే స్టోర్కి సంబంధించి యూట్యూబ్ తర్వాత స్థానంలో 700 కోట్ల డౌన్లోడ్లలతో ఫేస్బుక్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వాట్సప్ 600 కోట్లు, ఫేస్బుక్ మెసేంజర్ 500 కోట్లు, ఇన్స్టాగ్రామ్ 300 కోట్ల సార్లు ఆండ్రాయిడ్ యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. టిక్టాక్ సైతం ఇక సంచలనాలకు కేంద్ర బిందువైన టిక్టాక్ 200 కోట్లు, సబ్వే సర్ఫర్ వంద కోట్లకు పైగా డౌన్లోడ్లు సాధించాయి. ఫేస్బుక్ లైట్, మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ యాప్లు రెండు వందల కోట్ల దగ్గరగా డౌన్లోడ్ అయ్యాయి. -
వైద్యశాస్త్రంలో వింత: ఓ యువతికి కుడి వైపున గుండె
Right Side Heart Girl: గుండె ఎటు వైపు ఉందని చిన్నపిల్లాడిని అడిగిన ఎడమ వైపు.. లేదా లెఫ్ట్ సైడ్ అని సమాధానం ఇస్తారు. అయితే ఇప్పుడు ఆ సమాధానం మారేలా ఉంది. ఎందుకంటే ఓ యువతికి ఎడమ వైపున కాకుండా కుడి వైపు గుండె ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయమైనా ఇది వాస్తవం. తాజాగా చేసుకున్న పరీక్షల్లో ఈ విషయం తెలియడంతో ఆ యువతి షాక్కు గురయ్యింది. ఆమె చేసుకున్న పరీక్షల్లో గుండె కుడి వైపున ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అమెరికాలోని చికాగో నగరానికి చెందిన 19 ఏళ్ల యువతి క్లారీ మక్ విపరీతమైన దగ్గుతో బాధపడుతోంది. రెండు నెలల నుంచి దగ్గు వస్తుండడంతో పరీక్షించుకోవాలని ఆస్పత్రికి వెళ్లింది. రాత్రిపూట విధులు నిర్వహిస్తుండడంతో జలుబు, దగ్గు సాధారణంగా భావించినట్లు క్లారీ తెలిపింది. జూన్లో ఆస్పత్రికి వెళ్లి మందులు వేయించుకున్నా తగ్గలేదు. ఎంతకీ దగ్గు తగ్గకపోవడంతో ఊపిరితిత్తుల సమస్య ఉండవచ్చని వైద్యులు భావించారు. తదుపరి వైద్యం కోసం ఎక్స్ రే చేయించుకోవాలని చెప్పారు. ఎక్స్ రే చేసుకున్న అనంతరం రిపోర్ట్ను పరిశీలించిన వైద్యులు షాక్కు గురయ్యారు. వైద్యులు వచ్చి ‘నీకు గుండె కుడి వైపున ఉంది’ అని చెప్పడంతో తాను గందరగోళానికి గురయ్యానని.. షాక్లో ఉన్నట్లు క్లెయిర్ మక్ తెలిపారు. నాకేమన్నా అవుతుందని వైద్యులను అడిగితే ఎలాంటి సమస్య లేదని వైద్యులు చెప్పినట్లు తెలిపింది. గుండె కుడి వైపు ఉండడాన్ని వైద్య పరిభాషలో ‘డెక్స్ట్రోకార్డియా’ అని అంటారు. ఈ వివరాలన్నీ క్లెయిర్ మక్ టిక్టాక్లో ఓ వీడియో రూపొందించి విడుదల చేసింది. ఆమె వీడియోను లక్షల్లో చూశారు. 4,33,00 మంది కామెంట్లు చేశారు. దేవుడి దయతో బాగున్నానని ఆ వీడియోలో తెలిపింది. -
టిక్టాక్ యూజర్లకు శుభవార్త..! సరికొత్తగా..
భారత్-చైనా మధ్య భీకర పరిస్థితులు నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన సుమారు 59 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే. అందులో పబ్జీ, టిక్టాక్ వంటి యాప్లు ఉండడం గమనార్హం. భారత్లో ఉన్న యూజర్ల నుంచి వచ్చే భారీ ఆదాయాన్ని వదులుకోకుండా ఉండేందుకు ఇప్పటికే క్రాఫ్టన్ గేమ్స్ పబ్జీను తిరిగి బీజీఎమ్ఐ రూపంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మరో యాప్ టిక్టాక్ తిరిగి భారత్లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టిక్టాక్ మాతృక సంస్థ బైట్డాన్స్ భారత్లోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. తాజాగా బైట్డాన్స్ టిక్టాక్ స్థానంలో..TickTockను రిలీజ్ చేయనుంది. బైట్డాన్స్ TickTock పేరుతో కొత్త ట్రేడ్మార్క్ అప్లికేషన్ను జూలై 7 న దాఖలు చేసినట్లు తెలుస్తోంది. టిక్టాక్ మాతృ సంస్థ బైట్డాన్స్ ఈ నెల ప్రారంభంలో టిక్టాక్ కోసం కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ కమిషన్కు కొత్త ట్రేడ్మార్క్ను దాఖలు చేసినట్లు టిప్స్టర్ ముకుల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇప్పటివరకు సంస్థ ఈ విషయంపై అధికారికంగా ధృవీకరించలేదు. దేశ భద్రతా విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు చైనీస్ యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే. టిక్టాక్ నిషేధంతో స్నాప్ చాట్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ పేరిట షార్ట్ వీడియోలను యూజర్లకు అందుబాటులో తెచ్చాయి. భారత్లో టిక్టాక్పై పూర్తి నిషేధం ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తుల్లో ప్రాచుర్యాన్ని పొందింది. ప్రపంచవ్యాప్తంగా టిక్టాక్ యాప్ను సుమారు మూడు బిలియన్లకు పైగా యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. -
అందమైన అమ్మాయి.. పాపం ఇలా ఘోరంగా బలైంది
అందం కోసం ఇంట్లోనే రకరకాల ప్రయత్నాలు-ప్రయోగాలు చేస్తుంటారు కొందరు. అలాగే ఫ్యాషనెబుల్గా కనిపించాలనే తాపత్రయంతో ఓ టీనేజర్ చేసిన పని.. ప్రాణాల్నే బలిగొంది. విషాదకరమైన ఈ ఉదంతం ఇప్పుడు బ్రెజిల్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బ్రసీలియా: మినాస్ గెరాయిస్ స్టేట్లో ఎంగెన్హెయిర్ కాల్దాస్లో ఉంటోంది పదిహేనేళ్ల వయసున్న ఇసాబెల్లా ఎదువార్దా దె సౌసా. ఈ స్కూల్ చిన్నారి తన అందానికి మరింత మెరుగులు దిద్దాలనే ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా కంటి భాగానికి రింగ్ కుట్టించుకోవాలనుకుంది. అయితే అమ్మతో సహా ఇంట్లో వాళ్లెవరూ ఆమెకు సహకరించలేదు. దీంతో స్నేహితురాలిని ఇంటికి పిలిపించుకుని ఆమె సాయంతో కంటికి పోగు కుట్టించుకుంది. మూడు రోజుల తర్వాత ఇసాబెల్లా ముఖంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఇన్ఫెక్షన్ కావడంతో ముఖం ఉబ్బిపోయి.. కళ్లు పూర్తిగా మూసుకుపోయి ఇబ్బంది పెట్టాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఇన్ఫెక్షన్ తిరగబడడంతో ప్రాణాల మీదకు వచ్చింది. వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న తరుణంలో నాలుగుసార్లు గుండెపోటుకు గురైంది ఆ అమ్మాయి. చివరకు శుక్రవారం ఆ టీనేజర్ కన్నుమూసింది. పిచ్చి ఛాలెంజ్లు వద్దు ఈమధ్య టిక్టాక్లో పిచ్చి ఛాలెంజ్లు కొన్ని వైరల్ అవుతున్నాయి. ముఖం నిండా రింగులు కుట్టించుకునే ఛాలెంజ్లు వైరల్ అవుతున్నాయి. వాటి వల్ల నరాలు దెబ్బతినడంతో పాటు ఇన్ఫెక్షన్లు, చివరికి హెచ్ఐవీ కూడా సోకొచ్చని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఇక కంటికి రింగు కుట్టించుకున్న తర్వాత ఇజాబెల్లా చూపును కోల్పోయి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. ‘ఒక అందమైన అమ్మాయి. నాకు అత్యంత ఇష్టమైన ఇసాబెల్లా.. ఇలా నరకం అనుభవించి చనిపోవడం బాధాకరంగా ఉంది. అందుకే తల్లిదండ్రులు చెప్పేది వినండి. పెద్దలు ఏం చెప్పినా మన మంచికే అని గుర్తించండి’ అని ఆమె దగ్గరి బంధువు ఒకరు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
అనూహ్య నిర్ణయం.. భారత్లోకి టిక్టాక్ రీఎంట్రీ?
వీడియో కంటెంట్ యాప్ టిక్టాక్ మళ్లీ మనదేశంలో అడుగుపెట్టబోతోందా? టిక్టాక్ మాతృక సంస్థ బైట్డ్యాన్స్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో అవుననే సంకేతాలు అందుతున్నాయి. అయితే వేరే పేరుతో.. వేరే కంపెనీ నిర్వహణలో ఇది మన దగ్గరకు మళ్లీ చేరనున్నట్లు సమాచారం. టిక్టాక్ మాతృ సంస్థ బైట్డ్యాన్స్ ఊహించని నిర్ణయం తీసుకుంది. యాప్కు సంబంధించిన ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో పాటు అల్గారిథంను కూడా అమ్మేందుకు సిద్ధపడింది. అమ్మకపు ఆఫర్ ప్రకటించిన దేశాల్లో భారత్ పేరును సైతం చేర్చింది. ఆసక్తి ఉన్న కంపెనీలు తమ టెక్నాలజీని కొనుగొలు చేయాలని పిలుపు ఇచ్చింది. ఈ మేరకు బైట్ఫ్లస్ డివిజన్ అమ్మకం వ్యవహారాలను చూసుకుంటుందని పేర్కొంది. కొనేది ఎవరు? టిక్టాక్ సక్సెస్లో అల్గారిథమ్ కీ రోల్ పోషించింది. అలాంటి దానిని అమ్మకానికి బైట్డ్యాన్స్ ఉంచడం విశేషం. అమెరికా నుంచి ఫ్యాషన్ యాప్ గోట్, సింగపూర్కు చెందిన ట్రావెట్ బుకింగ్ వెబ్సైట్ వీగో, ఇండొనేషియాకు చెందిన ఆన్లైన్ స్టార్టప్ కంపెనీ చిలిబెలీ కంపెనీలు బైట్డ్యాన్స్ ప్రత్యేక విభాగంతో కొనుగోలు ఒప్పందాన్ని చేసేసుకున్నాయి.ఇక భారత్ నుంచి వీడియో కంటెంట్తో అలరిస్తున్న ఓ యాప్ తో పాటు షార్ట్ న్యూస్లు అందించే ఒక యాప్ కంపెనీ, ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్, ఓ ఫుడ్ అవుట్లెట్, ఆన్లైన్లో సరుకులు రవాణా చేసే ఓ యాప్.. ఇలా పన్నెండు కంపెనీలు పోటీపడుతున్నట్లు సమాచారం. అయితే బైట్డ్యాన్స్ చైనాకు చెందిన కంపెనీ కావడంతో భారత్లో టిక్టాక్పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాప్ తీరుతెన్నులపై, భద్రతపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేంద్రం.. మరో రూపంలో దానిని అనుమతి ఇస్తుందా?. తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే. ఒకవేళ అనుమతి దొరికితే మాత్రం.. ఇదివరకులా ఫీచర్లతో అలరించడం ఖాయం. -
టిక్ టాక్ స్టార్కు జైలు శిక్ష.. కాపాడమంటూ వేడుకోలు
టిక్ టాక్ స్టార్ హనీన్ హోసం'కు ఈజిప్టు కోర్ట్ 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మానవ అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష ఖరారు కావడంతో తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. కోర్టు నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ శిక్ష నుంచి తనని కాపాడాలంటూ ప్రెసిడెంట్ అబ్ధుల్ను వేడుకుంది. ‘‘ప్రెసిడెంట్ సాబ్ మీ కూతురు ఏ పాపం చేసింది. చచ్చిపోతుంది. చచ్చిపోతున్న మీ కూతుర్ని మీరే కాపాడాలి. దయ చూపించండి. నేను జైలుకెళితే నా తల్లి గుండె ఆగి చచ్చిపోతుంది. నావైపు తప్పు లేదు కాబట్టే మాట్లాడుతున్నాను కేసును పునఃవిచారణ చేసి తనకు న్యాయం చేయాలని వీడియోలో కన్నీటి పర్యంతరమైంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే హనీన్కు కోర్ట్ జైలు శిక్ష విధించడంతో ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రెసిడెంట్ అబ్ధుల్ తన కోరికను మన్నించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా,ఈజిప్ట్ దేశాల్లో సోషల్ మీడియాపై కఠిన ఆంక్షలు ఉంటాయి. దేశ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకాడవు. అందుకే హనీన్ హోసంను ఆ దేశ ప్రభుత్వం ఈ శిక్ష విధించిందనే వాదానలు వినిపిస్తున్నాయి. చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ డేటా చైనా సర్వర్లలోకి! -
వైరల్ వీడియో: యువతి తిక్కపని.. కుర్చీలో ఇరుక్కుపోయి..
-
టిక్టాక్: యువతి తిక్కపని.. కుర్చీలో ఇరుక్కుపోయి..
వాషింగ్టన్ : టిక్టాక్ ఇండియాలో బ్యాన్ అయినా దాని హవా చాలా దేశాల్లో కొనసాగుతూనే ఉంది. తమ ప్రతిభను ప్రదర్శించాలనే తపనతో జనాలు ఇబ్బందుల పాలవుతూనే ఉన్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ యువతి టిక్టాక్ వీడియో చేసే సరదాతో ఇబ్బందుల్లో పడింది. కుర్చీలో ఇరుక్కుపోయి నానా తంటాలు పడింది. వివరాలు.. అమెరికాలోని మిచిగాన్కు చెందిన సిడ్నీ జో అనే యువతి కొద్దిరోజుల క్రితం కుర్చీలోకి దూరి టిక్టాక్ వీడియో చేయటం ప్రారంభించింది. వీడియో అయిపోయిన తర్వాత కుర్చీలోంచి బయటకు రావాలని చూసింది. అయితే కుర్చీ నడుము దగ్గర గట్టిగా అతుక్కుపోయింది. కుర్చీలోంచి బయటకు రావటానికి చాలా ప్రయత్నించింది. అయితే ఆమె వల్ల కాలేదు. దీంతో రెస్క్యూ టీమ్కు ఫోన్ చేసింది. రంగంలోకి దిగిన వారు కుర్చీని కట్ చేసి ఆమెను బయటకు లాగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. చదవండి : వైరల్: బురదలో ఏనుగు సరదా! -
మైనర్ ను గర్భవతిని చేసిన మరో టిక్టాక్ స్టార్
గతంలో టిక్టాక్ యాప్ ద్వారా ఎంతోమంది సామాన్య ప్రజానీకం కూడా ఫేమస్ అయ్యారు. ఒకదశలో ప్రపంచ వ్యాప్తంగా టిక్టాక్ పిచ్చిలో జనాలు మునిగిపోయారు అంటే మనం అర్ధం చేసుకోవచ్చు దానికి ఎంత క్రేజ్ ఉంది అనేది. అయితే గత ఏడాది దేశ భద్రత కారణాల రీత్యా కేంద్రం మన దేశంలో చైనాకు చెందిన అనేక యాప్ లను బ్యాన్ చేసింది. అందులో ఇది ఒకటి. దీంతో కోట్ల మంది ఔత్సాహికులు డీలా పడిపోయారు. అయితే టిక్టాక్ తో చాలా మంది ఫేమస్ కావడమే కాకుండా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టారు. అయితే, టిక్టాక్ ద్వారా వచ్చిన ఫేమస్ అడ్డుపెట్టుకొని కొద్దీ మంది చెడు పనులు కూడా చేస్తున్నారు. తాజాగా కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి, గర్భం దాల్చిన కేసులో ఒక టిక్టాక్ స్టార్ ను పోలీసులు అరెస్టు చేశారు. 19 ఏళ్ల అంబిలి అకా విఘ్నేష్ కృష్ణను అరెస్టు చేసి పోక్సో(లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విగ్నేష్ కృష్ణకు గత ఏడాది 17 ఏళ్ల ఓ బాలికతో సోషల్ మీడియా ద్వారా అతనికి పరిచయం ఏర్పడింది. అలా వారి పరిచయం కాస్త స్నేహంగా మారింది. అప్పుడప్పుడు వారు బయట కలుసకునేవారు. అలా ఓరోజు బాలిక తనను కలవడానికి వచ్చిన సమయంలో విగ్నేష్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయ మాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడు. బాలిక గర్భవతి కావడంతో ఆమె తల్లిదండ్రులు అతనిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే అతను పరారీ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. విఘ్నేష్ కృష్ణ విదేశాలకు వెళ్లడానికి పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసులు ప్లాన్ లో భాగంగా పాస్ పోర్ట్ సిద్దంగా ఉందని అతని కుటుంబ సభ్యులకు చెప్పారు. తన తండ్రి త్రిస్సూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లి పాస్పోర్ట్ విషయం గురించి విఘ్నేష్ కృష్ణకు తెలియజేశాడు. అతని తండ్రిని అనుసరిస్తున్న పోలీసులు విఘ్నేష్ కృష్ణను పట్టుకున్నారు. విచారణ తరువాత అతన్ని అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లోనూ ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసిన సంగతి తెలిసిందే. టిక్టాక్ ఫేమ్ ఫన్ బకెట్ భార్గవ్ 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశాడు. ఆమెను చెల్లి అని సంబోధిస్తూనే అతను ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. చదవండి: హైదరాబాద్: ముగ్గురు మహిళల అదృశ్యం కలకలం -
అమెరికాలో టిక్టాక్ నిషేధంపై నిర్ణయం వాయిదా
వాషింగ్టన్: చైనాకు చెందిన టిక్టాక్, విచాట్లను నిషేధిస్తూ గతంలో దేశాధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులను ప్రస్తుత జో బైడెన్ ప్రభుత్వం పక్కనపెట్టింది. ఆయా యాప్లు అమెరికా జాతీయ భద్రతకు విసిరే సవాళ్లపై స్వయంగా సమీక్ష చేసిన తరువాత నిర్ణయం తీసుకోనున్నట్లు వైట్హౌస్ అధికారులు బుధవారం వెల్లడించారు. చైనా రూపొందించిన, చైనా నియంత్రణలో ఉన్న, చైనా మిలటరీ, నిఘా వర్గాలతో సంబంధం ఉన్న యాప్ల పనితీరును పరిశీలించాలని, ముఖ్యంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే యాప్లను సమగ్రంగా పరీక్షించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అమెరికన్ల వ్యక్తిగత, ఆరోగ్య, జన్యు సమాచార భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్త తీసుకోనున్నట్లు తెలిపారు. -
పడేయకుండా.. ల్యాప్టాప్కు అంత్యక్రియలు
ఇన్నాళ్లు తాను వినియోగించిన ల్యాప్టాప్ ఇక పనికి రాకుండా పోయింది. దాంతో విడదీయరాని బంధం ఏర్పడింది. దీంతో ఆ ల్యాప్టాప్కు అంత్యక్రియలు చేయాలని ఓ యువకుడు ప్రయత్నాలు చేశాడు. అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు వెళ్లగా అక్కడి సిబ్బంది వింతగా చూశారు. అనంతరం అతడి విజ్ఞప్తికి ససేమిరా అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి సంబంధించిన వీడియో మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. టిక్టాక్ స్టార్ జెన్ అకా@కింగ్జెన్ తన ల్యాప్టాప్ను తీస్కోని శ్మశాన వాటిక (ఫ్యూనరల్ హోం)కు వెళ్లాడు. అక్కడ ఉన్న రిసెప్షనిస్టును కలిసి ‘అంత్యక్రియలు చేయాలి’ అని అడగా ‘మృతదేహం ఎక్కడ? అని ఆమె అడిగింది. ‘ఇక్కడే ఉంది. అది నా ల్యాప్టాపే’ అని ఆ యువకుడు తన ల్యాప్టాప్ను చూపించాడు. అది చూసి ఆమె నోరెళ్లబెట్టింది. ‘ఓ మీ ల్యాప్టాప్ చచ్చిపోయిందా?’ అని రిసెప్షనిస్టు అడిగింది. అవును! మీరేమైనా ఏర్పాట్లు (అంత్యక్రియలు) చేయగలరా? అని అడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియో టిక్టాక్లో తెగ వ్యూస్ వచ్చేశాయి. ఏకగా 2 మిలియన్ల మందికి పైగా చూశారు. గ్యాడ్జెట్స్తో మనకు ఉన్న ప్రేమను.. అనుబంధం చూపించేందుకు ఈ వీడియో రూపొందించినట్లు టిక్టాక్ స్టార్ జెన్ తెలిపాడు. కరక్టే కదా! మన శరీరంలో గ్యాడ్జెట్లు ఒక అవయంగా మారాయి. అవి లేనిది మనకు పనులు జరగవు. ఇది తెలిపేందుకు అతడు ఈ వీడియో చేశాడు. ఈ వీడియోకు విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. అయితే అతడు ఏ దేశస్తుడో వివరాలు తెలియరాలేదు. -
అరుదైన ప్రయోగం.. స్పేస్లోకి టిక్టాక్ స్టార్
కాలిఫోర్నియా: అమెరికన్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ అరుదైన ప్రయోగానికి రెడీ అయ్యింది. ఫ్లోరిడాకు చెందిన కెల్లీ గెరార్డియా అనే ఫేమస్ టిక్టాక్ స్టార్ను స్పేస్లోకి పంపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే రకరకాల పరీక్షల కోసమే ఈ స్పేస్ ఆపరేషన్ నిర్వహించబోతున్నట్లు వర్జిన్ గెలాక్టిక్ వెల్లడించింది. కొత్త హెల్త్కేర్ టెక్నాలజీని ఆమెపై ప్రయోగించడం ద్వారా వాటి సానుకూలతపై ఓ స్పష్టతకు వస్తామని ఒక ప్రకటనలో వర్జిన్ గెలాక్టిక్ పేర్కొంది. కాగా, గెరార్డియాకు టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లో బాగానే ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆమె బయోఆస్ట్రోనాటిక్స్ రీసెర్చర్ కావడం విశేషం. ఈ విషయాన్ని వర్జిన్ గెలాక్టిక్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 32 ఏళ్ల కెల్లీ.. పాపులర్ సైన్స్ కమ్యూనికేటర్ అని తెలిపింది. ఇక స్పేస్షిప్లో గాల్లో తేలియాడుతూనే కెల్లీ, ఆరోగ్యపరమైన ప్రతీ ప్రయోగంలో పాలుపంచుకోబోతున్నట్లు తెలిపింది. అయితే ఆమె ప్రాణాలకు వచ్చే హాని ఏం ఉండదని వర్జిన్ గెలాక్టిక్ పేర్కొంది. ఇక ఈ స్పేస్క్రాఫ్ట్ ప్రయోగం ద్వారా బయోమానిటరింగ్(లాంఛ్, వెయిట్లెస్నెస్, రీ ఎంట్రీ) కెపాసిటీని పరీక్షించబోతున్నట్లు సమాచారం. తద్వారా రాబోయే రోజుల్లో మానవ సహిత వర్జిన్ గెలాక్టిక్ స్పేస్షిప్ ప్రయోగాల సాధ్యాసాధ్యాలపై మరో అడుగు ముందుకు వేయనుంది. ఇక ఈ ప్రయోగంపై గెరార్డియా స్పందిస్తూ.. ‘తన ప్రయత్నం మరికొందరు యువ రీసెర్చర్లను ముందుకు తీసుకొస్తుందని’ ఆశాభావం వ్యక్తం చేసింది. బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్, అమెరికా రిటైర్డ్ ఏరోస్పేస్ ఇంజినీర్ బర్ట్ రూటన్ కలిసి స్థాపించిన వర్జిన్ గెలాక్టిక్.. వచ్చే ఏడాది నుంచి కమర్షియల్ సబ్-ఆర్బిటల్ ఫ్లైట్స్ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలో ఏడాదికి 400 ట్రిప్పులను లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఈ కంపెనీ తరపున ఇటీవలె రాకెట్ తరహా విమానం వీఎంఎన్ ఈవ్ ద్వారా ఇద్దరు పైలైట్లు స్పేస్లోకి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక వర్జిన్ గెలాక్టిక్ నుంచి స్పేస్లోకి వెళ్లేందుకు సెలబ్రిటీలతో సహా 600 మంది ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకోవడం విశేషం. -
కరెంట్ షాక్తో చేతులు పోయాయి. భర్త వదిలేశాడు. కానీ..
‘‘జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే జీవితమంటే ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడమే. మామూలు వాళ్లైనా సరే.. వైకల్యం ఉన్న వాళ్లైనా సరే ఏదో ఒకటి సాధించాలని అందరికీ ఉంటుంది. అలాంటప్పుడు ముందుకెళ్లకుండా.. వెనక్కి తిరిగి చూడడం ఎందుకు? నా విషయంలో నేను చేస్తున్న పని ఎంతో ఆనందాన్ని ఇస్తోంది’’ అంటూ ముసిముసి నవ్వులతో చెబుతోంది టిక్టాకర్ మేఘనా గిమిరే. కరెంట్ షాక్తో రెండు చేతులు పొగొట్టుకున్న ఈమెలోని ఆత్మవిశ్వాసం.. అన్నీ ఉన్నా సాధించడానికి బద్ధకించేవాళ్లకు ఒక మంచి పాఠం. వెబ్డెస్క్: నేపాల్కు చెందిన మేఘనా గిమిరే. కొన్నేళ్ల క్రితం ప్రేమించిన వ్యక్తిని పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన పది నెలల తర్వాత ఓరోజు ఆమె ఘోర ప్రమాదానికి గురైంది. చేతికి ఇనుప గాజులు వేసుకోవడం, దగ్గర్లో ఉన్న హైటెన్షన్ వైరను పొరపాటున తాకడంతో ఆమె కరెంట్ షాక్కు గురైంది. చేతులు పూర్తిగా దెబ్బతినడంతో డాక్టర్లు సర్జరీ చేసి వాటిని తీసేశారు. అందమైన భార్య వికలాంగురాలు అయ్యేసరికి సహించలేక ఆ భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మేఘన ఇబ్బందుల్ని ఎదుర్కొంది. నడిపించిన తల్లి ప్రేమ భర్త వదిలేసినా.. కన్నపేగు మమకారం మేఘనను అక్కున చేర్చుకుంది. పుట్టింటికి తీసుకొచ్చింది. తినబెట్టడం, బట్టలు మార్చడం, స్నానం అన్నీ తల్లే దగ్గరుండి చేసింది. కొన్నాళ్లకు తనంతట తానుగా పనులు చేసుకోవడం ప్రారంభించింది గిమిరే. క్రమంగా కాళ్ల సాయంతో పనులు చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు సరదాగా మొబైల్ను కాళ్లను ఆపరేట్ చేస్తూ.. తన పాత టిక్టాక్ అకౌంట్ను చూసింది. సెల్ఫ్ వీడియోలతో టిక్టాక్లో వీడియోలు అప్లోడ్ చేసింది. ఆ వీడియోల్లో ఆమె ఆత్మవిశ్వాసానికి లక్షల మంది ఫిదా అయ్యారు. తక్కువ టైంలోనే మేఘన టిక్టాక్కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం టిక్టాక్లో ఆమెకు ఇరవై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇండియాలో టిక్టాక్ బ్యాన్ కాకముందు మన దగ్గరి నుంచి కూడా ఆమె వీడియోలకు మంచి స్పందనే దక్కేది. #Nepal #Tiktoker #Meghana pic.twitter.com/0VPf705VRK — ashwik (@ursashwik) June 3, 2021 అభిమానుల అండ సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ బాగా పెరిగింది. అయితే రాను రాను ఆ అభిమానులే.. ఆమె పట్ల దాతలుగా మారారు. వాళ్లు అందించిన డబ్బు సాయంతోనే ఆమె అమెరికా వెళ్లగలిగింది. అక్కడి డాక్టర్ల పర్యవేక్షణలో ప్రోస్తటిక్ చేతుల్ని అందుకుంది. కానీ, అవి ఆమెకు తాత్కాలిక ఊరట మాత్రమే అందించాయి. అయినప్పటికీ తనకు ఇప్పటిదాకా అందిన సాయం మరువలేనిదని చెబుతోంది మేఘన. చిరునవ్వుతో ఆమె చేసే సరదా వీడియోలే కాదు.. సందేశాలతో ఆమె మాట్లాడే మాటలు ఆకట్టుకునేలా ఉంటాయి. చదవండి: మీమ్స్లో కనిపించే ఇతగాడి గురించి తెలుసా? -
షాకింగ్: కొత్త ఇంట్లోకి వెళ్లిన 14 గంటల్లోనే అగ్ని ప్రమాదం
చనిపోయేలోపు సొంతంగా ఇంటిని నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు. ఇక ఎంతో కష్టపడి.. తమ అభిరుచికి అనుగుణంగా నిర్మించుకున్న కలల సౌధంలో ప్రవేశించిన తర్వాత కలిగే సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఇక్కడ మనం చెప్పుకోబోయే మహిళ కూడా అలానే సంతోషించింది. రూపాయి రూపాయి కూడబెట్టి.. ఓ అపార్ట్మెంట్లో ప్లాట్ తీసుకుంది. నూతన ఇంటిలోకి మారింది. అయితే ఆ సంతోషం కనీసం ఒక్క రోజు కూడా నిలవలేదు. ఇష్టంగా కొనుకున్న కొత్త ఇంటిలో ప్రవేశించిన 14 గంటల వ్యవధిలోనే అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనతో సదరు మహిళ నిరాశకు గురయ్యింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజనులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. టిక్టాక్ యూజర్ ఎస్వై సిడాక్స్ తన అకౌంట్లో ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. దీనిలో ఫర్నిచర్తో అలంకరించిన డ్రాయింగ్ రూమ్ కనిపిస్తుంది. ‘లెట్స్ స్టే హోమ్’ అనే కోటేషన్ ఉన్న ప్రకాశవంతమైన నియాన్ పింక్ గుర్తు గోడపై వేలాడుతూ ఉంటుంది. మరొక ఫోటోలో ఆమె పెంపుడు కుక్క తన మంచం మీద పడుకున్నట్లు ఉంటుంది. ఇవి రెండు ప్రమాదం జరగడానికి ముందు తీసిన ఫోటోలు. ఆమె అపార్ట్మెంట్లోకి మారిన పద్నాలుగు గంటల తరువాత, నియాన్ గుర్తులో మంటలు చెలరేగాయి. నిప్పు రవ్వలు మంచం మీద పడటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దీని వల్ల మంచం కాలిపోవడమే కాక.. కొత్త ఇంటి గోడ మీద పెద్ద రంధ్రం ఏర్పడింది. అంతేకాక స్ప్రింక్లర్ వ్యవస్థ దెబ్బ తినడంతో ఆమె ఇల్లంతా నీటితో నిండిపోవడం వీడియోలో చూడవచ్చు. చదవండి: రెండు కిలోమీటర్ల మేర రాజుకున్న అగ్గి View this post on Instagram A post shared by Fail Salad (@failsalad) -
‘‘నీ డ్రెస్ చాలా చిన్నగా ఉంది.. ఈ టీ షర్ట్ తీసుకో’’
వాషింగ్టన్: ఆడవాళ్ల మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే చాలు వెంటనే అందరి దృష్టి వారి వస్త్రధారణ మీదకు వెళ్తుంది. సందు దొరికితే చాలు మహిళల దుస్తులు, నడక, నడత గురించి అనర్గళంగా ఉపన్యసించే వారు మన సమాజంలో కోకొల్లలు. అప్పుడప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ వ్యక్తులు కూడా వచ్చి చేరుతుంటారు. కంపెనీలు కూడా ఇలాంటి విషయాల్లో అనుచితంగా ప్రవర్తించి.. ఆపై లెంపలు వేసుకుంటాయి. తాజాగా ప్రసిద్ధ సంస్థ డిస్నీ వరల్డ్ ఈ జాబితాలో చేరింది. పార్క్కి వచ్చిన ఓ మహిళ డ్రెస్ చాలా చిన్నగా.. అసభ్యంగా ఉందని.. ఎక్స్పోజింగ్ ఎక్కువ అయిందని భావించిన కంపెనీ ఆమెను లోపలికి అనుమతించలేదు. అంతేకాక తన గిఫ్ట్ షాప్ నుంచి ఆమెకు ఓ టీషర్ట్ని ఉచితంగా ఇచ్చి.. తన పెద్ద మనసుతో పాటు.. మహిళలు కనిపిస్తే చాలు మా చూపులు వారి శరీర భాగాల మీదనే ఉంటాయనే తన వక్రబుద్ధిని పరోక్షంగా ప్రకటించింది. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి మహిళ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. అమండ డిమియో అనే టిక్టాక్ యూజర్కు సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఆమెకు 8 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె డిస్నీ పార్క్కు వెళ్లింది. ఆ సమయంలో ఆమె చాలా చిన్నగా ఉన్న క్రాప్టాప్ ధరించింది. అమండ డ్రెస్ అసభ్యంగా, అశ్లీలంగా ఉందని భావించిన పార్క్ యాజమాన్యం ఆమెను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమెకు ఓ టికెట్ని ఇచ్చింది. దాని మీద పక్కనే ఉన్న తమ గిఫ్ట్ షాప్ నుంచి ఆమెకు ఉచితంగా ఓ టీ షర్ట్ పొందవచ్చని రాసి ఉంది. పార్క్ యాజమాన్యం తీరు పట్ల తీవ్ర అసంతృప్తికి గురైన అమండ ఏం మాట్లాడకుండా గిఫ్ట్ షాప్కి వెళ్లి.. టీషర్ట్ తీసుకుని ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత తనకు ఎదురైన ఈ అనుభవం గురించి వివరిస్తూ ఓ వీడియో తీసి టిక్టాక్లో పోస్ట్ చేసింది. ‘‘హాయ్ ఫ్రెండ్స్ డిస్నీ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. మీరు ఎక్స్పోజ్ చేసేలా చిన్న దుస్తులు ధరించి మ్యాజిక్ కింగ్డమ్లోకి ప్రవేశిస్తే.. వారు మీకు ఒక టికెట్ ఇస్తారు. దాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న గిఫ్ట్ షాప్లో ఇస్తే.. మీకు 75 డాలర్లు విలువ చేసే టీ షర్ట్ ఫ్రీగా ఇస్తారు’’ అని వీడియో తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరవలవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోని 5 మిలియన్ల మంది వీక్షించారు. చాలా మంది ఈ ట్రిక్ని ఉపయోగించుకున్నట్లు కామెంట్స్ చేశారు. చదవండి: భారత్లో మిస్టరీ రాయి.. ఏలియన్స్ పనేనా? వైరల్ స్టోరీ: లైఫ్ ఈజ్ వెరీ ఈజీ -
వైరల్ స్టోరీ: లైఫ్ ఈజ్ వెరీ ఈజీ
ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మనిషి.. పరిష్కారం కోసం షార్ట్కట్ను ఆశ్రయిస్తాడు. కానీ, ఆ షార్ట్కట్ కోసం ప్రయత్నించే క్రమంలోనే ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది!. అలా కష్టపడేవాళ్లను చూసి జాలిపడే కుర్రాడే ఖబి లామె. ఫేస్బుక్లో ఎక్కడో ఒక దగ్గర మీమ్గా, కామెంట్ సెక్షన్లో ఫొటోగా కనిపించి నవ్వులు పూయించే ఖబి.. ఇప్పుడు ఇంటర్నెట్ సెలబ్రిటీగా వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ఖబి లామె.. పాపులర్ టిక్టాకర్. ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా తన చేష్టలతోనే నవ్వించే వ్యక్తి. ఇటలీకి చెందిన ఈ 21 ఏళ్ల కుర్రాడి దృష్టిలో లైఫ్ హ్యాక్స్ అంటే పనికిరాని విషయం. రోజూవారీ పనుల్లో అవాంతరాలు ఎదురైనప్పుడు టిప్స్ లాగా లైఫ్ హ్యాక్స్(మన దగ్గర జుగాద్) పనికొస్తాయంటారు. అయితే వాటివల్ల తాత్కాలిక ఉపశనమే ఉంటుందని, అవి అనవసరమైనవని అతని ఉద్దేశం. సుఖం కోసం కష్టపడడం ఎందుకు? మామూలు ప్రయత్నాలు ఉంటాయి కదా అంటాడతను. View this post on Instagram A post shared by Khaby Lame (@khaby00) కారులో టీషర్ట్ ఇరుక్కుపోతే దానిని కత్తెరతో కట్ చేయాలని వ్యూయర్స్కి సలహా ఇచ్చే లైఫ్ హ్యాకర్స్.. సింపుల్గా డోర్ తీస్కోమని చెప్పొచ్చు కదా అని అతని స్టైల్లో అడుగుతున్నాడు ఖబి. టిక్టాక్లోనే కాదు.. అది బ్యాన్ ఉన్న మనలాంటి దేశంలో అభిమానులకు నవ్వులు పంచేందుకు ఇన్స్టాగ్రామ్లోనూ వీడియోలు అప్లోడ్ చేస్తుంటాడు ఖబి. View this post on Instagram A post shared by Khaby Lame (@khaby00) ఖబీ పుట్టి వెస్ట్ ఆఫ్రికాలోని సెనెగల్లో. పెరిగింది మాత్రం ఇటలీలోని చివాస్సో. చదువుతోంది గ్రాడ్యుయేషన్. వీడియో గేమర్గా సంపాదిస్తున్నాడు కూడా. ఏడాది క్రితం వరకు ఇతను ఒక మామూలు వ్యక్తి. లాక్డౌన్తో టిక్టాక్లో అడుగుపెట్టాడు. ఇప్పుడు ఇతను ఒక ఈ-సెలబ్రిటీ. టిక్టాక్లో ఐదున్నర కోట్లకు పైనే ఫాలోవర్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Khaby Lame (@khaby00) ఇక ఇన్స్టాగ్రామ్లో కోటి 70 లక్షలకుపైనే ఫాలోయింగ్ ఉంది. వీడియోలో అతని హావభావాలే అతన్ని వైరల్ సెలబ్రిటీని చేశాయి. బెస్ట్ ఫ్రెండ్ జైరా నక్కీతో ఖబి రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఖబి మంచి మనసున్నోడు కూడా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సంపాదించే దాంట్లో సగం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు అతను. View this post on Instagram A post shared by Khaby Lame (@khaby00) -
16 గంటల పాటు స్నానం:. బాత్రూంలో నిద్రపోయావా ఏంటి?
మాములుగా స్నానం చేయడానికి ఎంత టైం తీసుకుంటారు. మహా అయితే 5, 10నిమిషాలు.. కాస్త అతిశుభ్రత పాటించేవారైతే ఓ అరగంట. అంతకు మించి ఎక్కువసేపు ఎవరు బాత్రూంలో ఉండరు. అలా కాకుండా ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసిన వారి గురించి ఎప్పుడైనా విన్నారా.. అన్నేసి గంటలు నీటిలో నానితే ఏమవుతుందో తెలుసా.. లేదా. అయితే ఈ వార్త చదవండి.. టిక్టాక్ యూజర్ అయిన ఓ మహిళ ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసిందట. ఫలితంగా ఆమె కాళ్లు, చేతుల మీద చర్మం ముడుచుకుపోయింది. రక్తం పీల్చేసినట్లుగా పాలిపోయాయి. దాంతో బయపడిన సదరు మహిళ.. ‘‘యాక్సిడెంటల్గా 16 గంటల పాటు స్నానం చేశాను. ఫలితంగా నా కాళ్లు, చేతులు ఇలా మారిపోయాయి. వీటిని పూర్వ స్థితిలోకి తీసుకు రావాలంటే ఏం చేయాలి.. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి’’ అంటూ ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు, పోస్ట్ చూసిన వారిలో ఎక్కువ మంది అడిగిన ప్రశ్న ఒక్కటే. 16 గంటల పాటు స్నానం చేశావా.. ఎలా సాధ్యమయ్యింది.. అసలు అన్ని గంటలు బాత్రూంలో ఎలా గడిపావ్.. కొంపతీసి.. స్నానం చేయడం మర్చిపోయి నిద్రపోయావా ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సదరు మహిళ నుంచి ఎలాంటి సమాధానం లేదు. మరికొందరు మాత్రం తమకు తెలిసిన చిట్కాలు చెప్తుండగా.. కొందరు త్వరగా హాస్పిటల్కు వెళ్లు అని సూచిస్తున్నారు. చదవండి: బాత్టబ్లో ఐఫోన్ చార్జింగ్.. షాకింగ్ -
Mia Khalifa: టిక్టాక్ నిషేధంపై హాట్ భామ ఫైర్
ఇస్లామాబాద్: రెండుసార్లు తన టిక్టాక్ ఖాతాను నిషేధించడంపై శృంగార తార మియా ఖలీఫా ఫైరయ్యింది. తన ఖాతాలను నిలిపేయడంపై మండిపడింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై మండిపడుతూ ట్వీట్లు చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం గతంలో ఒకసారి మియా ఖలీఫా టిక్టాక్ అకౌంట్ను నిలిపివేయగా తాజాగా ఏప్రిల్లో మళ్లీ నిషేధించింది. దీంతో ఈ హాట్ భామకు కోపమొచ్చింది. అనైతికంగా.. అకారణంగా టిక్టాక్ అకౌంట్ నిలిపివేసిందని వాపోయింది. ‘నా టిక్టాక్ అకౌంట్ పాకిస్తాన్ బ్లాక్ చేసింది. ఇప్పటి నుంచి నా టిక్టాక్ వీడియోలు ట్విటర్లో పోస్తుంటా. పాకిస్తాన్ అభిమానులు చూసేయచ్చు’ అంటూ ట్వీట్ చేసింది. అయితే ఆమె అకౌంట్పై నిషేధం విధిస్తూ పాకిస్తాన్ టెలీ కమ్యూనికేషన్ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదని తెలుస్తోంది. ఎందుకు ఆమె ఖాతాపై నిషేధం విధించారో తెలియడం లేదు. మియా ఖలీఫాకు టిక్టాక్లో భారీగా ఫాలోవర్లు ఉన్నారు. 22.2 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, 270 మిలియన్ల లైక్లు ఉన్నాయి. Shoutout to Pakistan for banning my tiktok account from the country. I’ll be re-posting all my tiktoks on Twitter from now on for my Pakistani fans who want to circumvent fascism 💕 — Mia K. (@miakhalifa) May 22, 2021 -
YouTube Shorts: చేస్తున్నారా.. అయితే..
టిక్..టాక్ దూరమైన తరువాత ఇప్పుడు యూత్ ‘యూట్యూబ్ షార్ట్స్’ వీడియోలపై మనసు పారేసుకుంది. జస్ట్ 60 సెకండ్లలో ‘ఆహా ఏమి క్రియేటివిటీ!’ అనిపిస్తే... మనసు నిండే ప్రశంసలే కాదు, పర్స్ నిండే డబ్బు కూడా మీ సొంతమవుతుంది..... డబ్బు ఉన్న దగ్గరికి మనం వెళతాం. కానీ క్రియేటివిటీ ఉన్న దగ్గరికి డబ్బు వెళుతుంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేయకపోవచ్చుగానీ, పర్స్ బరువును పెంచుతుంది. భరోసా ఇస్తుంది! వరల్డ్ బిగ్గెస్ట్ ఆన్లైన్ వీడియో ప్లాట్ఫామ్ యూట్యూబ్ మన దినచర్యల్లో ఒకటి. మన రచ్చబండ కూడా. కాస్తో కూస్తో క్రియేటివిటీ ఉన్న యువతరానికి ఇదొక సువర్ణవేదిక అయింది. ఎందరికో ఎన్నో అవకాశాలు వచ్చాయి. సినిమా తీయడం గొప్ప. అంత పెద్ద సినిమాను నవలగా రాయడం గొప్ప. అంత పెద్ద నవలను కథగా రాయడం గొప్ప. అంత పెద్ద కథను మూడు ముక్కల్లో మినీ కవితగా రాయడం గొప్ప. మాధ్యమం మారుతున్నప్పుడు అచ్చులో అయితే ‘స్థలపరిధి’కి, దృశ్యాల్లో అయితే ‘కాలపరిధి’కి ప్రాధాన్యత ఏర్పడుతుంది. మెరుపు వేగంతో చానల్స్, వీడియోలు మార్చేస్తున్న ఈ కాలంలో ప్రేక్షక మహానుభావుల మనసును క్షణాల్లో దోచేయాలి. ‘అరే ఇదేదో బాగుందే’ అని అక్కడే ఆగిపోవాలి. అదే ‘క్లుప్తత’ గొప్పతనం. అందుకే టిక్.. టాక్ పొట్టి వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. టిక్..టాక్ను అచ్చంగా అనుకరిస్తూ కొన్ని బోల్తా పడ్డాయి. కొన్ని ఫరవాలేదనిపించుకున్నాయి. ‘యూట్యూబ్ షార్ట్స్’కు మాత్రం మంచి స్పందన మొదలైంది. ఈ స్పందనను మరోస్థాయికి తీసుకెళ్లడానికి తాజాగా ‘షార్ట్స్ ఫండ్’ ప్రకటించింది యూట్యూబ్. దీని ద్వారా గుర్తింపు పొందిన కంటెంట్ క్రియేటర్లకు ప్రతినెలా సొమ్ము చెల్లించే అవకాశం ఏర్పడుతుంది. టిక్.. టాక్ గత సంవత్సరం ‘క్రియేటర్స్ ఫండ్’ పేరుతో రెండు వందల మిలియన్ డాలర్లను కేటాయించింది. అదే బాటలో యూట్యూబ్ కూడా కంటెంట్ క్రియేటర్ల కోసం వంద మిలియన్ డాలర్లు (2021–2022) కేటాయించింది. ఇప్పుడు టిక్... టాక్ లేదు కాబట్టి చాలామంది క్రియేటర్లు యూట్యూబ్ షార్ట్స్ వైపు మొగ్గు చూపారు. ‘ఈ జనరేషన్ క్రియేటర్స్, ఆర్టిస్ట్ల క్రియేటివిటీని బిజినెస్గా మలచడంలో యూట్యుబ్ సహాయపడుతుంది. మా ప్రయాణంలో షార్ట్ఫండ్స్ అనేది తొలి అడుగు మాత్రమే’ అంటున్నారు యూట్యూబ్ షార్ట్స్ డైరెక్టర్ ఎమీ సింగర్. ఎప్పుడు మొదలవుతుంది? ఎంత సొమ్ము ఇస్తారు..? మొదలైన విషయాలను ఇంకా ప్రకటించనప్పటికీ బహుమతికి అర్హమైన షార్ట్స్ వీడియోల గురించి వస్తే... ప్రేక్షకులను మెప్పించే కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కు లోబడి ఉండాలి. బెస్ట్ ఆఫ్ లక్ మరి! మీ కోసం... కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించడానికి యూట్యూబ్ సాంకేతిక సహాకారం అందిస్తోంది. కొన్ని టూల్స్... ∙మ్యూజిక్ అండ్ సౌండ్: వీడియోకు ఒక పాట లేదా ఆడియో యాడ్ చేయవచ్చు ∙స్పీడ్: రికార్డింగ్ స్లోడౌన్ చేయడం ∙టైమర్: ఎక్కువ, తక్కువ సమయం తీసుకోకుండా నిర్ణీత సమయంలో ఆటోమెటిక్గా రికార్డింగ్ ఆగిపోవడం ∙యాడ్ క్లిప్స్ ఫ్రమ్ ఫోన్ గ్యాలరీ ∙బేసిక్ ఫిల్టర్లు -
TikTok: నేను మరీ అంత సోషల్ కాదు.. సీఈఓగా ఉండలేను
బీజింగ్: చైనీస్ ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్టాక్ మాతృ సంస్థ బైట్డాన్స్ సహ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను సంస్థకు సీఈఓగా ఉండబోనని గురువారం వెల్లడించారు. కంపెనీ మరో కో- ఫౌండర్ రూబో లియాంగ్ తన స్థానంలో బాధ్యతలు చేపడతారని, అధికార మార్పిడి సాఫీగా సాగేందుకు ఆరు నెలల పాటు రూబోతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఈ మేరకు.. ‘‘ఆదర్శవంతమైన మేనేజర్గా ఉండే నైపుణ్యాలు నాలో కొరవడ్డాయి అన్నది నిజం. నాకైతే మార్కెట్ విధానాల మీద, ఆర్గనైజేషనల్ ఎనాలసిస్ మీద ఆసక్తి. నిజానికి మనుషులను మేనేజ్ చేయడం కంటే ఈ అంశాల మీద దృష్టి సారిస్తే మంచిదని భావిస్తాను. ఎందుకంటే నేను మరీ అంత కలివిడిగా ఉండే వ్యక్తి(సోషల్)ని కాదు. నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడానికి ఆన్లైన్లో ఉండటం, పుస్తకాలు చదవడం, పాటలు వినడం చేస్తూ ఉంటా. రూబో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరు నెలల పాటు తనతో కలిసి పనిచేస్తా’’ అని ఉద్యోగులను ఉద్దేశించి రాసిన మెమోలో జాంగ్ యిమింగ్ పేర్కొన్నారు. కాగా రూబో లియాంగ్ ఇంతకుముందు బైట్డాన్స్ హ్యూమన్ రీసోర్సెస్(మానవ వనరుల విభాగం)హెడ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2012లో ప్రారంభమైన బైట్డాన్స్ చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్లోనూ హవా చూపింది. ముఖ్యంగా షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి చేరువైన ఈ సంస్థ అనతికాలంలోనే లాభాలను ఆర్జించింది. అయితే, జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా, భారత్ వంటి దేశాలు టిక్టాక్పై నిషేధం విధించడంతో భారీగా నష్టపోయిన ఈ కంపెనీ, పూర్వవైభవం పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చదవండి: టీనేజ్ సంచలనం.. టిక్ టాక్ ఎటాక్ -
కొంప ముంచిన బ్యూటీ టిప్.. కంటి చూపు కోల్పోయిన టిక్టాక్ స్టార్
చాలా మంది అమ్మాయిలు అందంగా కపించడం కోసం మార్కెట్లో కనిపించే వివిధ ఫేస్ క్రీములను వాడుతుంటారు. ముఖ్యంగా యాడ్స్, సోషల్ మీడియాలో వచ్చే బ్యూటీ టిప్స్ని ఫాలో అవుతుంటారు. నిపుణుల సలహాలను తీసుకోకుండా దొరికిన క్రీములన్నింటిని ముఖాలపై ప్రయోగిస్తుంటారు. దీని వల్ల ఉన్న అందంతో పాటు కంటి చూపు కూడా కోల్పేయే ప్రమాదం ఉంది. అందుకే ఫేస్ క్రీముల విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈ అమ్మాయి పరిస్థితే మీ అందరికి వచ్చే అవకాశం ఉంది. టిక్ టాక్ స్టార్, ఆస్ట్రేలియా బిగ్ బ్రదర్ కంటెస్టెంట్ అయిన టిల్లీ విట్ ఫెల్డ్ అనే యువతి.. ఓ వీడియో చూసి అప్లై చేసుకున్న బ్యూటీ టిప్... ఆమెను ఆస్పత్రిపాలు చేసింది. బిగ్ బ్రదర్ షోలో ఆమె... తన ఫేసుకు బ్లూ క్లే ఫేస్ మాస్క్ ధరించింది. అలా ఎందుకు ధరించావని నెటిజన్లు అడిగారు. దాంతో అసలేం జరిగిందో ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. టీవీ షోలు, ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ కోసం నిరంతరం మేకప్ వేసుకునే టిల్లీ.. రెండు నెలల కిందట టిక్ టాక్ లో ఓ అక్యుపంక్చర్ బ్యూటీ టిప్ వీడియో చూసింది. అది నచ్చడంతో అదే తహాలో ప్రయత్నించింది. అయితే అది ఆమెకు రియాక్షన్ ఇచ్చింది. ముఖం మాడిపోయి, మచ్చలు వచ్చేశాయి. కురుపులు వచ్చేశాయి. మొత్తం తేడా కొట్టింది. దమైన ఫేస్ కాస్తా… అందవికారంగా మారింది. అంతేకాదు ఆమె కంటి చూపు కూడా తాత్కాలికంగా కోల్పోయింది. ఈ ఘటన తర్వాత ఆమె ఆస్పత్రి పాలైంది. ఎవరూ తనలాగా హోమ్ మ్యాక్స్ చేసుకొవద్దని, సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు చూసి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది. నిపుణుల సలహాతో మేకప్ క్రీములు వాడాలని ఆమె సూచించింది. View this post on Instagram A post shared by T I L L Y 🍒 (@tillywhitfeld) -
19 ఏళ్లకే సెలబ్రిటీ, నెలకు రూ.6 లక్షల సంపాదన!
ఏయ్ బంటీ నీ సబ్బు స్లోనా ఏంటీ? అంటూ లైఫ్బాయ్ యాడ్లో ఎంతో చక్కగా నటించిన అనాటి చిన్నారి.. కట్ చేస్తే నేటి సోషల్ మీడియా సంచలన సూపర్ స్టార్గా ఎదిగింది. యాడ్లు, సీరియళ్లు, సినిమాల్లో నటిస్తూ.. మరోపక్క సోషల్ మీడియాలో ఫ్యాషన్, లైఫ్స్టై్టల్, మేకప్ ట్యుటోరియల్స్ వీడియోలు పోస్టుచేస్తూ, ఒకప్పటి టిక్టాక్ క్వీన్గానూ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో దాదాపు రెండు కోట్లమంది ఫాలోవర్స్తో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది అవనీత్ కౌర్. పంజాబ్ రాష్ట్రం జలంధర్లోని మధ్యతరగతి కుటుంబంలో.. అమన్దీప్ నంద్ర, సోనియా నంద్ర దంపతులకు 2001 అక్టోబర్ 13న అవ్నీత్ జన్మించింది. అవ్నీత్కు జయ్జీత్ సింగ్ అనే అన్నయ్య ఉన్నాడు. తండ్రి ఓ కంపెనీలో పనిచేస్తుండగా తల్లి గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జలంధర్లో పాఠశాల విద్యనభ్యసించిన అవనీత్ తరువాత ముంబైకు మారింది. ప్రస్తుతం ముంబైలోని ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ 74 శాతం మార్కులతో పాసయ్యింది. ఒకపక్క చదువును కొనసాగిస్తూనే, కెరీర్లో నిలదొక్కుకుంటూ లక్షల్లో సంపాదిస్తోంది అవ్నీత్. డ్యాన్స్ రియాల్టి షోలు.. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ షో ద్వారా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అవ్నీత్ అరంగేట్రం చేసింది. తన డ్యాన్స్ స్టెప్పులతో డ్యాన్స్ షోలో టాప్ త్రీ కంటెస్టెంట్స్లో ఒకటిగా ఉండేది. అంతేగాక ‘డ్యాన్స్ కే సూపర్స్టార్స్’లో కూడా పాల్గొంది. ఈ షోలో ఎంతో పాపులర్ అయిన ‘జలక్ దిఖలాజా’పాటకు డ్యాన్స్ చేసిన ఐదుగురు కంటెస్టెంట్స్లో అవ్నీత్ కూడా ఒకటి. మేరీ మా టీవి సీరియల్ ద్వారా తొలిసారి టీవీ తెరకు పరిచయమైంది. క్రమంగా సీరియల్స్ చేస్తూ.. జీ5 వెబ్సిరీస్ ‘బబ్బర్ కా తబ్బార్’ వంటి వాటిలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘‘అల్లాద్దిన్ నామ్ తో సునా హోగా’’ సీరియల్లో ప్రిన్సెస్గా నటించి ఎంతోమంది అభిమానాన్ని చూరగొంది. టీవీ షోలతో వచ్చిన గుర్తింపుతో మర్దాని సినిమాలో మీరా క్యారెక్టర్ను ఎంతో చక్కగా పోషించింది. తరువాత వచ్చిన మర్దాని–2 లో కూడా అవనీత్ నటించడం విశేషం. ఈ రెండు సినిమాల్లో అవ్నీత్ నటనకు అనేక ప్రశంసలు వచ్చాయి. తరువాత రొమాంటిక్ కామెడీ సినిమా ఖరీబ్ ఖరీబ్లో నటించింది. సింగర్గానూ.. అవ్నీత్ ఒకపక్క డ్యాన్సర్గానూ మరోపక్క మంచి నటిగా రాణిస్తూ చక్కటి గాయనిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే చాలా మ్యూజిక్ ఆల్బమ్స్ను విడుదలచేసింది. అవనీత్కు మ్యూజిక్ పరంగా మంచి పేరు తెచ్చిన వాటిలో కాలీ మేరీ ఘాడీ, తార్సే యే నైనా, యారి, పహాదాన్, మేరే నైనా, అటాచ్మెంట్, తేరి నాజర్, మెయిన్ ఫిర్ నైనాలు బాగా ఫేమస్ అయిన వాటిలో ఉన్నాయి. హిందీ, పంజాబీ భాషల్లో తన గానంతో అలరిస్తోంది. సంపాదన, ఫాలోవర్స్ లక్షల్లోనే.. ఒకపక్క నటన, మరోపక్క సింగింగ్తో రోజంతా తీరికలేకుండా ఉండే అవనీత్ తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఫ్యాషన్, లైఫ్స్టైల్, మేకప్ ట్యూటోరియల్, డ్యాన్స్ వీడియోలను పోస్టు చేసి యూట్యూబ్, టిక్టాక్ ఇన్స్టాగ్రామ్లలో లక్షలమంది ఫాలోవర్స్ అభిమానం సంపాదించింది. రోజూ తన అప్డేటెడ్ వీడియోలతో ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది. ప్రస్తుతం అవనీత్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ దాదాపు రెండు కోట్లమంది ఉన్నారు. ఇండియాలో టిక్టాక్ బ్యాన్ చేయకముందు వరకు అవనీత్ అకౌంట్ను ఫాలో అయ్యేవారి సంఖ్య కోటీ ఎనభై ఆరు లక్షలుగా ఉండేది. అప్పట్లో టిక్టాక్ క్వీన్గానూ అలరించింది. అవ్నీత్ ఎప్పటికప్పుడు తన అందచందాలతోనూ, డ్యాన్స్స్కిల్స్తో తన అభిమానులను అలరిస్తూ సోషల్ మీడియాలో పెద్ద స్టార్గా ట్రెండ్ అవుతోంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ ఏడాదికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. 19 ఏళ్లకే సెలబ్రెటి హోదాను పొందడం ఒక ఎల్తైతే.. నెలకు ఆరులక్షల రూపాయలకు పైగా గడిస్తూ ఏడాదికి కోటి రూపాయల టర్నోవర్ను కలిగి ఉండడం విశేషం. -
టీనేజ్ సంచలనం.. టిక్ టాక్ ఎటాక్
పదిహేడేళ్ల మలేసియా విద్యార్థిని హస్నీజా టిక్ టాక్ చేసిన వీడియో ఇప్పుడు ఆ దేశాన్ని కుదిపివేస్తోంది! స్కూల్ తరగతి గదిలో లైంగిక విజ్ఞానాన్ని బోధించే పురుష ఉపాధ్యాయుడొకరు ‘రేప్’ను ఒక జోక్లా చెప్పడం నచ్చని హస్నీజా ఆ విషయాన్ని టిక్టాక్ చేసి అప్లోడ్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయి, విద్యాశాఖ ఆ ఉపాధ్యాయుడిపై విచారణకు ఆదేశించింది. రేప్ను హాస్యం చేయడంపై అక్కడి ‘ఆల్ ఉమెన్స్ యాక్షన్ సొసైటీ’ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ ‘కుదుపు’ అక్కడితో ఆగిపోలేదు. ఇప్పట్లో ఆగిపోయేలానూ లేదు. ‘‘స్కూల్లో నిన్న నాకు ఎదురైన అనుభవం ఇది! ప్లీజ్, తరగతి గదుల్ని మాకు సురక్షితమైన ప్రదేశంగా మార్చేందుకు సహాయం చేయండి’’.. అని టిక్ టాక్లో వీడియోలో విజ్ఞప్తి చేస్తున్నప్పుడు హస్నీజా ఆవేదన చూడాల్సిందే. ఏమిటి ఆమెకు ఎదురైన అనుభవం? రేప్ మీద వాళ్ల క్లాస్ టీచర్ జోక్ చేశాడు! ఆరోజు ఆయన బోధిస్తున్నది లైంగిక విజ్ఞాన శాస్త్రంలోని శారీరక ధర్మాల అధ్యాయం. ఇక అది మగపిల్లలు, ఆడపిల్లలు కలిసి కూర్చొనే తరగతి గది. పాఠం చెబుతూ మధ్యలో జోక్స్ వేసి నవ్విస్తున్నాడు ఆయన. ఆ నవ్వించడంలో రేప్ను కూడా జోక్ చేసేశాడు. మగపిల్లలు నవ్వారు. ఆడపిల్లలు నవ్వలేదు. వయసొస్తోంది కదా, జోక్ లోని అంతరార్థం గ్రహించి తలలు వంచుకున్నారు. ఒక సామాజిక సమస్యపై ఆయన అలా హాస్యం ఆడటం హస్నీజాకు నచ్చలేదు. ఆయన అలా ఎందుకు అనకూడదో, అంటే ఆడపిల్లలకు ఎంత హాని జరుగుతుందో చెబుతూ టిక్ టాక్ని అప్లోడ్ చేసింది. కొన్ని గంటల్లోనే ఆ వీడియోను పదిలక్షల 40 వేల మంది చూశారు. ఆ స్పందన చూసి హస్నీజా వెంటనే ‘మేక్ స్కూల్ ఎ సేఫర్ ప్లేస్’ అనే హ్యాష్ ట్యాగ్ని క్రియేట్ చేసింది. మరుక్షణమే అది ట్రెండింగ్లోకి వచ్చింది. టీవీల్లో సెక్స్ ఎడ్యుకేషన్పై డిబేట్లు మొదలయ్యాయి. స్త్రీ ద్వేషం, లైంగిక వేధింపులు, ౖలñ ంగిక హింస.. ఆలోచనాపరుల హాట్ టాపిక్ అయ్యాయి. టాపిక్ హాట్ అని కాదు. ఆగ్రహావేశాల చర్చలు, ప్రసంగాలు మొదలయ్యాయి. మహిళా సంఘాల్లో కదలిక రావడంతో ప్రభుత్వం ఆ టీచర్పై విచారణకు ఆదేశించింది. అయితే హస్నీజా పరిస్థితి ఎలా అయిందో చూడండి. ∙∙ స్కూల్లో హస్నీజా సీనియర్ విద్యార్థి ఆమెను దగ్గరికి పిలిచి, ‘‘రేప్ చేస్తాను జాగ్రత్త’’ అని బెదిరించాడు. టీచర్ మీద టిక్ టాక్ చేసినందుకే అతడికి అంత కోపం! ‘‘లేదు, అమ్మాయిలే కాదు, అబ్బాయిలకూ స్కూల్లో రక్షణ ఉండాలి. రేప్ కల్చర్ని జోక్ చేయడం వల్ల ఇద్దరికీ ప్రమాదమేనని నేను చెప్పదలచుకున్నాను’’ అని హస్నీజా వివరణ ఇస్తుంటే టీచర్లు, స్టూడెంట్స్ వినిపించుకోవడం లేదు. ‘‘స్కూల్కి నువ్వు వేసుకొచ్చే బట్టలు ఎలా ఉంటాయో తెలుసా!’’ అని కొందరు ఆమె వస్త్రధారణ మీద పడ్డారు. హెడ్మాస్టర్ ఆమెను పిలిపించి, ‘‘ఏంటమ్మా... ఇది! నాకు చెప్పొచ్చు కదా. ఇప్పుడు చూడు. మన స్కూల్కి ఎంత చెడ్డ పేరో!’’ అని మందలించారు. హస్నీజా ఇవేవీ ఊహించలేదు. అలాగని తను చేసిన పని తొందరపాటేమోనన్న భావనా లేదు. తను సరైన పనే చేశానని ఆమె బలంగా నమ్ముతోంది. అలా చెయ్యకపోతేనే తప్పు అయి ఉండేదని కూడా అంటోంది. హస్నీజాను ఎవరు ఏమన్నా, ఆమె తల్లిదండ్రులు మాత్రం మద్దతుగా ఉన్నారు. ‘‘తన జీవితం, తన అభిప్రాయాలు’’ అని అండగా నిలబడ్డారు. ‘‘ఈరోజు నా కూతురు ప్రశ్నించింది కనుక రేపు నా మిగతా కూతుళ్లకు ఇలాంటి అనుభవం ఎదురవదు’’ అని హస్నీజా తల్లి నోర్షానిజా అంటున్నారు. ఆమెకు మొత్తం ఐదుగురు సంతానం. హస్నీజా పెద్దమ్మాయి. హస్నీజా టిక్ టాక్ ను ఆధారంగా చేసుకుని మలేషియా మహిళా సంక్షేమ శాఖ.. రేప్ జోకులు, ఆడవాళ్లపై కామెంట్లు, బాడీ–షేమింగ్ల మీద గట్టి చర్యలు తీసుకోవాలని హోమ్ శాఖకు సిఫారసు చేసింది. హస్నీజా మలేషియాలోని కౌలా సెలంగార్ స్కూల్లో చదువుతోంది. సామాజిక సమస్యలపై బొమ్మలు గీస్తుంటుంది. సమాజంలో మార్పును కోరుకుంటూ టిక్టాక్లు చేస్తుంటుంది. అమ్మానాన్నతో హస్నీజా -
షాకింగ్: తెలిసిన వాడని ఫోటో పంపితే.. దాన్ని మార్ఫ్ చేసి
టెక్నాలజీ పెరిగాక ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఫోటోల విషయంలో. సోషల్ మీడియాలో మహిళల ఫోటో కనిపిస్తే చాలు.. మృగాళ్లు వాటితో ఆడవారిని ఓ రేంజ్లో టార్చర్ చేస్తారు. అందుకే సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే ఓ మహిళ తెలిసిన వాడే కదా అని.. ఓ వ్యక్తి అడగటంతో అతడికి తన సెల్ఫీ పంపంది. దాన్ని అతడు మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో చూసి సదరు మహిళ తీవ్రంగా షాక్ అయ్యింది. ఎందుకంటే ఎంతో అందంగా ఉన్న తనను సదరు వ్యక్తి చాలా అందవిహీనంగా మార్చి.. ఆ ఫోటోని పబ్లిష్ చేశాడు. ఈ క్రమంలో సదరు మహిళ ఆమె పంపిన ఫోటో.. అతడు మార్ఫ్ చేసిన ఫోటోలను వీడియోలో షేర్ చేసింది. ప్రసుత్తం అది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు... టిక్టాక్ యూజర్ అయిన సదరు మహిళ చూడ్డానికి చాలా అందంగా, స్టైల్గా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె హెయిర్ డ్రస్సర్ ఒక రోజు ఆమెకు కాల్ చేసి.. సదరు మహిళ సెల్ఫీ ఫోటో ఒకటి అతడికి సెండ్ చేయమని కోరాడు. తెలిసిన వాడే కావడంతో ఆమె తన సెల్ఫీని అతడికి పంపింది. ఆ తర్వాత అతడు ఆమె ఫోటోని ఎడిట్ చేసి తన సోషల్ మీడియా పేజ్లో అప్లోడ్ చేశాడు. ఈ ఫోటో చూసి ఆ మహిళ షాక్కు గురయ్యింది. ఏంటి నేను ఇలా ఉంటానా అనుకోని భయపడింది. ఎందుకంటే సదరు హెయిర్ డ్రెస్సర్ ఎంతో అందంగా ఉన్న మహిళ ఫేస్ను దారుణంగా ఎడిట్ చేశాడు. స్కిన్ కలర్ నల్లగా.. ముఖం కూడా ఉబ్బిపోయినట్లుగా మార్చాడు. ఈ క్రమంలో సదరు మహిళ రెండు ఫోటోలను చూపిస్తూ ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇప్పటికే 1.2మిలియన్లకు పైగా జనాలు దీన్ని వీక్షించారు. ఇక వీడియో చూసిన వారంతా ‘‘నీ హెయిర్ డ్రెస్సర్కి ఏమైనా పిచ్చా ఏంటి.. అందంగా ఉన్న నిన్ను ఇలా మార్చాడు’’.. ‘‘సహాజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. అతడు చేసిన పని ఏమాత్రం బాగాలేదు.. నువ్వు మరో హెయిర్ డ్రెస్సర్ని చూసుకో’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ఇకపై ఇలాంటివి పోస్ట్.. షేర్ చేసినా నేరమే -
అత్యాచారం జరిగితే అది అమ్మాయి తప్పు కాదు : చిన్మయి
ఎలాంటి విషయాన్నైనా ఓపెన్గా మాట్లాడే డేరింగ్ పర్సనాలిటీ గాయని చిన్మయిది. లైంగిక వేధింపులపై ప్రజలను చైతన్య పరుస్తూరామె. తాజాగా టిక్టాక్ స్టార్ ఫన్ భార్గవ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఫన్ టిక్టాక్ వీడియోల పేరుతో 14 ఏళ్ల మైనర్ బాలికను లోబర్చుకొని, భార్గవ్ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పీస్లోఅతడిపై కేసు నమోదైంది. భార్గవ్ ఉదంతంపై చిన్మయి స్పందిస్తూ.. ఇలాంటివి జరిగినప్పుడు కూడా.. అమ్మాయిదే తప్పు అని లేవనెత్తే సొసైటీలో మనం ఉన్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. భార్గవ్ కేసుకు సంబంధించి ఓ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ను వివరిస్తూ.. 'తల్లి అతి గారాభం చేయడం,ఎక్కడికి వెళతుందో గమనించకపోడం, అమ్మాయికి పూర్తి స్వేచ్చ ఇవ్వడంతో టిక్ టాక్ భార్గవ్తో ఆమె మరింత చనువుగా ఉండటం చేసేది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల ఓ మైనర్ బాలిక కామాంధడి చేతిలో బలికావాల్సి వచ్చింది. దీనికి తోడు బాలిక తండ్రి దూరంగా ఉండటం వల్ల మంచి చెప్పేవారు ఎవరూ లేకుండా పోయారు' అంటూ రాసిన వార్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అత్యాచారం జరిగితే అది అమ్మాయి తప్పు కాదని, దానికి అమ్మాయిని బాధ్యురాల్ని చేయడం కరెక్ట్ కాదని ఘాటుగా బదులిచ్చింది. టిక్టాక్, రీల్స్చేయడంతో తప్పు లేదు : చిన్మయి ఇక భార్గవ్ లాంటి మనుషులు ఎంతో మంది మన సమాజంలో ఉన్నారని, అయితే అతడు సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో ఈ ఉదంతం బయటకు వచ్చిందని తెలిపింది. భార్గవ్ను ఉద్దేశిస్తూ..భార్గవ్ స్త్రీ లోలుడు అని అతడి మాజీ గర్ల్ ఫ్రెండ్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన క్లిప్పింగ్ను తాను కూడా చూశానని, ఇలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి వాళ్లు చాలా స్మార్ట్గా, కన్నింగ్గా అమ్మాయిని లోబర్చుకుంటారని, ఇందుకు వాళ్ల పేరెంట్స్తోనూ మంచిగా మాటలు కలుపుతారని తెలిపింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో అమ్మాయిలకు అకౌంట్ ఉండటం, వేరే వాళ్లతో రీల్స్, టిక్టాక్ చేయడంలో తప్పు లేదని, అయితే మనం ఎవరితో ఫ్రెండిప్ చేస్తున్నాం అనే అంశంపై చాలా ఆచితూచి వ్యవహరించాలని, మనం ఎవరితో మాట్లాడుతున్నాం అన్న వివరాలను తల్లిదండడ్రులకు చెప్పడం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) చదవండి : భార్గవ్ స్త్రీ లోలుడు, బ్లాక్మెయిల్ చేసేవాడు.. అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ -
బూతులు మాట్లాడను, ఎక్స్పోజింగ్ చేయను: ఖత్తర్ పాప
టిక్టాక్ యాప్.. అప్పట్లో దీని హవా మామూలుగా ఉండేది కాదు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపు అందరూ ఇదే యాప్ వాడేవారు. అలా చాలామంది ఫేమస్ అయ్యారు కూడా. అందులో కత్తర్ పాప అలియాస్ షాలిని బుజ్జి ఒకరు. కానీ అందరిదీ ఒక రూటైతే ఈమెది మాత్రం సెపరేట్ రూట్. ఓ వైపు అమాయకంగా మాట్లాడుతూనే మరో పక్క బండబూతులు తిట్టేది. దీంతో కొందరు ఆమెను కావాలని రెచ్చగొట్టి పచ్చిబూతులు మాట్లాడేలా చేసేవారు. అలా ఆ వీడియోలను పని గట్టుకుని మరీ వైరల్ చేశారు. తర్వాత ఆమె కూడా ఇలా తిట్టడం వల్ల ఫేమస్ అవుతుండటంతో దాన్నే కంటిన్యూ చేసింది. అయితే తనను కావాలనే ఇలా చేశారని చెప్తున్న షాలిని.. ఇకపై బూతులు మాట్లాడనని చెప్తోంది. తనకు సినిమా ఛాన్స్ వచ్చిందని ఎగిరి గంతేస్తోంది. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియో ఒకటి వైరల్గా మారింది. "ఆంధ్రా పాప లేదు, కత్తర్ పాప లేదు, తొక్క పాప లేదు.. నా పేరు షాలినీ బుజ్జి. నాకు సినిమాలో అవకాశం వచ్చింది. అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేశాను. రెండు ఐటమ్ సాంగ్స్ కూడా ఇచ్చారు. ఈ సినిమా వల్ల మంచి పేరు కూడా వస్తుందట. నేను చాలా మారిపోతాను ఫ్రెండ్స్.. ఇక నుంచి బూతులు తిట్టను, ఎక్స్పోజింగ్ వీడియోలు చేయను. నేనేంటో మీ అందరికీ చూపిస్తాను. నన్నెవరు తిట్టుకున్నా, కుళ్లుకుని చచ్చిపోయినా పట్టించుకోవద్దని చెప్తున్నారు దర్శకనిర్మాతలు. నేను చాలా అదృష్టవంతురాలిని" అంటూ చెప్పుకొచ్చింది. పనిలో పనిగా తాను నటించబోయే సినిమాలో డైలాగ్ కూడా చెప్పింది షాలిని. 'నా హైటూ వెయిటూ చూసి ముందుకు రాకు.. నన్ను కాటేస్తే..' అంటూ మధ్యలోనే డైలాగ్ ఆపి మిగతాది సినిమాలో చూడండి అని తెగ సిగ్గుపడిపోయింది. ఇంతకీ ఆమె చేస్తుంది ఏం సినిమా? ఎవరితో? ఎప్పుడు? డైరెక్ట్ ఎవరు? అన్న వివరాలు ఏవీ చెప్పలేదు. మరి ఈ షాలినికి నిజంగానే సినిమా ఛాన్స్ వచ్చిందా? అనేది త్వరలోనే తెలుస్తుందేమో చూడాలి. చదవండి: ఆహాలో హౌస్ఫుల్.. ఈ నెలలో రిలీజయ్యే సినిమాలివే -
అశ్లీల నృత్యం.. అందాల కిరీటం వెనక్కి
పోర్టు మోర్స్బే: దేశంలో కానీ, సమాజంలో కానీ ఏదైనా విశిష్ట పురస్కారం, అవార్డు వంటివి పొందిన వ్యక్తులు తమ ప్రవర్తన పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజానికి ఆదర్శంగా నిలవాలి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదు నా ఇష్టం వచ్చినట్లే ఉంటాను అంటే ఈ అందాల సుందరికి పట్టిన గతే పడుతుంది. అందాల పోటీలో కిరీటం సాధించిన ఓ మహిళ అశ్లీల నృత్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలయ్యింది. దాంతో నెటిజనులు సదరు మహిళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అసలు నీలాంటి దానికి ఇంతటి గౌరవం ఎలా లభించింది’’ అంటూ విమర్శించారు. ‘‘ఆ కిరీటం ధరించడానికి నీవు అనర్హురాలివి’’ అని ట్రోల్ చేశారు. ఈ దుమారం కాస్త పెద్దది కావడంతో షో నిర్వహకులు ఆమె వద్ద నుంచి కిరీటం వెనక్కి తీసుకున్నారు. ఆ వివరాలు.. లూసి మైనో అనే మహిళ(25) 2019లో మిస్ పాపువా న్యూగినియాగా ఎన్నికైంది. ఈ క్రమంలో ఆమె కొద్ది రోజుల క్రితం తన టిక్టాక్ అకౌంట్లో ఓ డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది. చాలా అశ్లీలంగా ఉన్న ఈ వీడియో పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. దాంతో మిస్ పసిఫిక్ ఐస్ల్యాండ్స్ పీజంట్ పీఎన్జీ కమిటీ లూసి మైనోకు ప్రదానం చేసిన కిరీటాన్ని వెనక్కి తీసుకుంది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘‘మా ప్రధాన ఉద్దేశం మహిళా సాధికారిత. మా వేదికది చాలా ప్రత్యేకమైన శైలి. సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ విలువలు ద్వారా మా దేశం, ఇక్కడి ప్రజల గురించి మిగతా లోకానికి తెలియజేస్తాం. ఇక మేం నిర్వహించే అందాల పోటీల ద్వారా స్వీయ విలువ, సమగ్రత, సామాజిక సేవ, విద్య వంటి అంశాలను ప్రచారం చేస్తాం’’ అని తెలిపారు. ‘‘ఇంత విలువైన అవార్డు సొంతం చేసుకున్న లూసి మైనో ఇలాంటి అశ్లీల డ్యాన్స్ వీడియోని షేర్ చేయడం మమ్మల్ని షాక్కు గురి చేసింది. రోల్మోడల్గా నిలవాల్సిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదు. అందుకే ఆమెకు ప్రధానం చేసిన కిరీటాన్ని వెనక్కి తీసుకున్నాం’’ అని తెలిపారు. ఇదే పని ఓ మగాడు చేస్తే మేం నవ్వుకునే వాళ్లం. కానీ లూసీ మైనో ఇలా చేయడం మమ్మల్ని నిరాశకు గురి చేసింది అన్నారు. చదవండి: షాకింగ్: అందాల పోటీ విజేతకు వేదిక మీదే ఘోర అవమానం -
వైరల్: ‘‘త్వరలో యుగాంతం.. ఇదే నిదర్శనం’’
వాషింగ్టన్: నాలుగు కంటే ఎక్కువ కాళ్లతో జన్మించిన జంతువులు, వేప చెట్టు నుంచి పాలు, కల్లు వంటి పదార్థాలు కారడం వంటి అసాధారణ దృశ్యాలు ఏవైనా మన చూట్టు కనిపిస్తే చాలు వెంటనే వినిపించే మాట యుగాంతం రాబోతుంది. ఇలాంటి వింతలు జరిగితే యుగాంతం తప్పదని.. దీని గురించి ఫలానా గ్రంథంలో చెప్పారని.. ఫలానా వ్యకి చెప్పారని ప్రచారం మొదలు పెడతారు. ఇప్పుడు యుగాంతం గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే తాజాగా ఓ వింత జంతువు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. దీన్ని చూసిన వారంతా.. యుగాంతం రాబోతుంది అంటున్నారు. ఇంతకు ఆ జంతువు ఏంటి.. ఎక్కడ కనిపించింది వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవండి. రెండు రోజుల క్రితం టెక్సాస్కు చెందని ఓ టిక్టాక్ యూజర్ ఎలుకను పోలిన ఓ వింత జంతువుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అప్పటి నుంచి ఇది తెగ వైరలవుతుంది. ఇక వీడియోలో ఉన్న జీవి చూడ్డానికి ఎలుకలా ఉంది. దీనికి మూడు కళ్లు ఉన్నాయి. రెండు కళ్లు ఉండాల్సిన స్థానంలో ఉండగా.. వాటికి పైన మూడో కన్ను ఉన్నట్లు కనిపిస్తోంది. దాంతో ఈ జీవిని చూసిన వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ‘‘అమ్మో యుగాంతం రాబోతుంది.. అందుకే ఇలాంటి మూడు కళ్ల వింత జీవి కనిపించింది’’ అంటూ కామెంట్ చేశారు. కొందరు ధైర్యవంతులు మాత్రం దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. ‘‘అది కన్ను కాదు.. అక్కడ వెంట్రుకలు రాలిపోవడం వల్ల చర్మం అలా మూడో కన్నుగా కనిపిస్తుంది’’ అని స్పష్టం చేశారు. మరి కొందరు ఇది హైబ్రీడ్ జాతికి చెందిన ఎలుక లేదా ఉడుత అయ్యి ఉంటుందని తెలిపారు. ఓ యూజర్ ఈ జంతువును మెలనిస్టిక్ బూడిద ఉడుత అని.. ఇది ఉత్తర అమెరికా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది అని తెలిపాడు. ఇక దాని మూడో కన్నుకు సంబంధించిన రహాస్యాన్ని కూడా వెల్లడించాడు సదరు యూజర్. సాధారణంగా పిల్లలకు జన్మనిచ్చే సమయంలో ఈ జీవి గూడు నిర్మించుకోవడం కోసం తన చర్మం నుంచి వెంట్రుకలని తీసుకుంటాయి. తర్వాత అది మళ్లీ తిరిగి పెరుగుతుంది అని తెలిపాడు. చదవండి: ఓ వైపు కాలిపోతున్నా.. మరోవైపు ఆపరేషన్ -
ముంబై హైకోర్టులో టిక్టాక్ మాతృసంస్థకు ఎదురుదెబ్బ
ముంబై: పన్ను ఎగవేత కేసులో టిక్టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్కు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జీతాలు చెల్లించడానికి తన బ్యాంకు ఖాతాలను అన్బ్లాక్ చేయాలని కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు బైట్డ్యాన్స్ విన్నపాన్ని పట్టించుకుపోగా 11 మిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. మార్చి మధ్యలో సిటీబ్యాంక్, హెచ్ఎస్బీసీలోని రెండు బైట్డాన్స్ ఇండియా బ్యాంక్ ఖాతాలను భారత బైట్డాన్స్ యూనిట్, సింగపూర్లోని దాని మాతృ సంస్థ టిక్టాక్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఆన్లైన్ ప్రకటనల వ్యవహారాల్లో కొన్ని పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు బైట్డ్యాన్స్ ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. వెంటనే ఈ ఉత్తర్వులు రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలనీ కోర్టును ఆశ్రయించింది. బైట్డాన్స్ ప్రభుత్వానికి 80 కోట్లు(11 మిలియన్ డాలర్లు) బాకీ ఉందని ప్రభుత్వ న్యాయవాది చెప్పిన తర్వాత, ముంబయి హైకోర్టు ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలనీ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. బైట్ డాన్స్ నాలుగు బ్లాక్ బ్యాంక్ ఖాతాలలో కేవలం 10 మిలియన్ల డాలర్ల నిధులు మాత్రమే ఉన్నట్లు కంపెనీ కోర్టుకు తెలిపింది. ఫెడరల్ టాక్స్ అథారిటీ తరఫు న్యాయవాది జితేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ఎగవేసిన పన్ను చెల్లించేవరకు బైట్ డాన్స్ 10 మిలియన్ల డాలర్లను ఫ్రీజ్ చేయాలనీ కోర్టును కోరారు. చివరికి ఈ మొత్తాన్ని ప్రభుత్వ బ్యాంకుకు తరలించే వరకు ఖాతాలు స్తంభింపజేయబడ్డాయి. భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణ తర్వాత గత ఏడాది ప్రముఖ వీడియో యాప్ టిక్టాక్ను నిషేదించిన సంగతి తెలిసిందే. చదవండి: చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే! -
భారత్లో బైట్డ్యాన్స్కు మరో షాక్!
న్యూఢిల్లీ: భారత్లో నిషేదించిన టిక్టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్కు మరో షాక్ తగిలింది. పన్ను ఎగవేత ఆరోపణల కారణంగా భారతదేశంలో బైట్డ్యాన్స్ బ్యాంకు ఖాతాలను ప్రభుత్వ అధికారులు స్తంభింపజేశారు. బైట్డ్యాన్స్ మాత్రం ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. వెంటనే ఈ ఉత్తర్వులు రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలనీ కోర్టును ఆశ్రయించింది. గత ఏడాది భారతదేశం, చైనా మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణ తర్వాత భద్రతా కారణాల రీత్యా కేంద్రం టిక్టాక్ను నిషేదించింది. ప్రముఖ వీడియో యాప్ టిక్టాక్ను భారత్లో నిషేధించిన తర్వాత జనవరిలో బైట్డాన్స్ భారత ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించింది. అయితే, చైనా యాప్స్ విషయంలో భారతదేశం తీసుకున్న చర్యను చైనా పదేపదే విమర్శిస్తూ.. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. బైట్డాన్స్లో ఇప్పటికీ సుమారు 1,300 మంది భారతీయ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది విదేశీ కార్యకలాపాలకు సేవలు అందిస్తున్నారు. మార్చి మధ్యలో సిటీబ్యాంక్, హెచ్ఎస్బీసీలోని రెండు బైట్డాన్స్ ఇండియా బ్యాంక్ ఖాతాలను భారత బైట్డాన్స్ యూనిట్, సింగపూర్లోని దాని మాతృ సంస్థ టిక్టాక్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఆన్లైన్ ప్రకటనల వ్యవహారాల్లో కొన్ని పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు బైట్డ్యాన్స్ ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశించారు. చదవండి: వామ్మో! బ్యాంక్లకు ఇన్ని రోజులు సెలువులా? నేడు చివరి తేదీ: పాన్-ఆధార్ లింకు స్టేటస్ చెక్ చేసుకోండిలా! -
అద్దాలు తుడవటానికి వెళ్లి... రూ.12 లక్షలు
వాషింగ్టన్: మనిషి కష్టాన్ని చూసి సానుభూతి చూపించే వాళ్లు చాలామంది ఉంటారు. కానీ ధైర్యంగా ముందుకు వచ్చి సాయం చేసేవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. అమెరికాలోని కనెక్టికట్లో మైక్ అనే వ్యక్తి తల దాచుకోవడానికి కూడా నిలువ నీడ లేని దుస్థితిలో ఉన్నాడు. 46 ఏళ్ల వయసున్న ఇతగాడు ఓ రోజు ఫిలిప్ వ్యూ అనే వ్లోగర్ కారు అద్దాలు తుడవడానికి వెళ్లాడు. అయితే అతడు అందుకు ససేమీరా అనడంతో చేసేదేం లేక బయట ఒంటరిగా దీనంగా కూర్చుండిపోయాడు. ఇది చూసిన ఫిలిప్ అతడి మీద జాలిపడి కారులోకి పిలిచి తినడానికి సాండ్విచ్ ఇచ్చాడు. నెమ్మదిగా మాటలు కలుపుతూ అతడి పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. అతడు ఎంతో కష్టకాలంలో ఉన్నాడని అర్థమైన ఫిలిప్ వారు మాట్లాడుకున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. జీవితంలో ఎదుర్కొంటున్న కష్టనష్టాలను అతడి మాటల్లోనే తెలుసుకున్న నెటిజన్లు ఆయనకు ఎలాగైనా సాయం చేయాలనుకున్నారు. అలా ఎంతోమంది మైక్కోసం వేలాది డాలర్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో వీరి కోసం ఫిలిప్ 'గో ఫండ్ మీ' పేజ్ ఏర్పాటు చేయగా కేవలం రెండు రోజుల్లోనే 10 వేల డాలర్లు పోగయ్యాయి. తాజాగా ఈ అమౌంట్ 17 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ.12 లక్షలు)కు చేరింది. దీన్నంతటినీ ఫిలిప్ తక్కువ కాలంలోనే తనకు మంచి ఫ్రెండ్ అయిన మైక్కు అందజేసి ఆశ్చర్యపరిచాడు. ఆ డబ్బంతా ఇక నీ సొంతమని చెప్పడంతో క్షణకాలం పాటు నమ్మలేకపోయిన మైక్ ఆ వెంటనే కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. కాగా చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయిన మైక్ కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించాడట. ఏమైందో ఏమోకానీ తర్వాత తన కుటుంబానికి కూడా దూరమై ఒంటరిగా జీవిస్తున్నాడు. ఉండటానికి ఇల్లు కూడా లేని అతడి రియల్ లైఫ్ స్టోరీ విన్న నెటిజన్లు పెద్ద మనసుతో 12 లక్షల రూపాయలు ఇవ్వడంతో మైక్ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో టిక్టాక్లోనూ వైరల్గా మారింది. చదవండి: వైరల్: అగ్ని పర్వతం పక్కనే వాలీబాల్ ఆట ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. భారీ పార్శిల్ -
మహిళకు మరిచిపోలేని షాకిచ్చిన ఒంటె
-
వైరల్: ఆహారం అనుకుందో.. కోపమొచ్చిందో
జంతువులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మంచిగా ఉంటే ఓకే.. కానీ అతి చేసి వాటికి చిరాకు తెప్పిస్తే.. మనకు మూడుతుంది. జన్మలో మర్చిపోలేని పాఠం చెప్తాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తనతో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించిన మహిళకు దిమ్మ తిరిగే షాకిచ్చింది ఒంటె. టిక్టాక్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ యువతి ఒంటెతో సెల్ఫీ దిగేందుకు దాని దగ్గరకు వెళ్తుంది. ఫోటో తీసుకుంటుండగా ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఇలా ఫోటోలు తీయడం ఆ ఒంటెకు నచ్చలేదో.. లేక బాగా ఆకలిగా ఉందో ఏమో తెలియదో కానీ సదరు యువతి జుట్టును కొంచెం కొరుక్కుని తినడం ప్రారంభించింది ఒంటె. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చదవండి: తృటిలో తప్పించుకున్న శ్రియ.. లేదంటే! -
టిక్టాక్స్టార్కు ఊహించని షాక్: తృటిలో తప్పిన ప్రాణాపాయం
టిక్టిక్ స్టార్, మహిళా టూరిస్ట్ ఊహించని పరిణామంతో ఒక్కసారిగా వణికిపోయింది. అందంగా ఉందికదా అని ఒక సముద్ర జీవిని చేతుల్లోకి తీసుకొని మురిసిపోయింది. బుజ్జి..బుజ్జిగా భలే ఉంది అనుకుంటూ సరదాగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ తరువాత విషయం తెలిసి షాక్ అయింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవినా ఇంతసేపు తాను పట్టుకున్నదీ అని గజగజ వణికిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. వివరాల్లోకి వెళితే...కైలిన్ మేరీ అనే మహిళ బాలీ దీవులకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడి బీచ్లో గోధుమరంగు శరీరం, గుండ్రటి మచ్చలతో అందంగా కనిపించిన చిన్న అక్టోపస్ను అబ్బురంగా తన అరచేతితో పట్టుకుంది. ఆ ఫోటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తరవాత ఆసక్తికొద్దీ దీనిపై ఆన్లైన్లో సెర్చ్ చేసింది. అప్పుడు అర్థమైంది అమెకు అసలు సంగతి. సముద్రంలో ప్రాణాంతక జంతువులలో ఒకటిగా పరిగణించే నీలిరంగు అక్టోపస్ అని. చూడ్డానికి చాలా చిన్నదిగా కనిపించినా, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి అని తెలుసుకొని నివ్వెరపోయింది. ఈ భయానక సంఘటనపై తన తండ్రికి ఫోన్ చేసి భావోద్వేగానికి లోనైంది. ఈ విషయాలను ఆమె నెటిజనులతో పంచుకున్నారు. దీంతో వారుకూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. అదృష్టవంతులు..మీకు ఎలాంటి ప్రమాదం జరగనందుకు సంతోషం వ్యక్తం చేశారు. నీలిరంగు చుక్కల ఆక్టోపస్ : కేవలం 12 నుండి 20 సెం.మీటర్ల పరిమాణంతో చిన్నగా ఉన్నప్పటికీ ఇది చాలా విషపూరితమైన సముద్ర జీవి. ఈ నీలిరంగు చుక్కల ఆక్టోపస్లు మానవులకు ఎంత ప్రమాదకర మైనవంటే 26 మందిని నిమిషాల్లో అంతం చేసేంత విషాన్ని కలిగి ఉంటాయి. ఇది కాటు వేసినపుడు ఎలాంటి నొప్పి తెలియదట. విష ప్రభావంతో శ్వాసకోస ఇబ్బంది, పక్షవాతం లాంటి లక్షణాలతో బాధితులు విల విల్లాడుతున్నపుడు తప్ప విషయం అర్థం కాదట. అంతేకాదు దీని విషయానికి ఇంతవరకూ విరుగుడు కూడా అందుబాటులో లేదట. -
టిక్టాక్ స్టార్ దీపికా పిల్లి అదిరే స్టిల్స్
-
గుడిలో ‘సారంగదారియా’.. టిక్టాక్ స్టార్ డ్యాన్స్పై ట్రోలింగ్
సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది తమ టాలెంట్ని ప్రపంచానికి చూపిస్తున్నారు. లైకులు, షేర్లు, కామెంట్లు పెట్టి టాలెంట్ని ఉన్నవారిని ఎంకరేజ్ చేయడంతో పాటు సెలబ్రిటీని చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా టిక్టాక్ యాప్ ద్వారా చాలా మంది తమలో దాగిఉన్న నటనను, డాన్స్ను ప్రపంచానికి తెలియజేశారు. భారత్లో ఈ యాప్ బ్యాన్ కావడంతో యూట్యూబ్, ఇన్స్ట్రాగ్రామ్ వైపుకు మళ్లీ.. తమ ప్రతిభతో అభిమానుల మన్ననలు పొందుతున్నారు. అయితే టాలెంట్ని ఎంకరేజ్ చేసే ఈ అభిమానులే.. తేడా వస్తే ట్రోల్స్తో విరుచుకుపడతారు. ఈ విషయం సినీప్రముఖులకు బాగా తెలుసు. అందుకే కొంచెం పేరున్న సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉంటారు. తాజాగా ఓ టిక్టాక్ స్టార్కు కూడా ఇదే ఎదురైంది. తన డాన్స్తో లక్షలాధి అభిమానులను సంపాదించుకున్న దీపికా పిల్లి అనే టిక్టాక్ స్టార్.. అదే డాన్స్ వల్ల తాజాగా ట్రోలింగ్కి గురైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్స్టోరీ’ సినిమా నుంచి సారంగదారియా అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చాలామంది ఈ పాటకు తమదైన స్లైల్లో స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీపికా పిల్లి కూడా ఇలా డ్యాన్స్ చేసి తన ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఆ పాటకు ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసినప్పటికీ.. నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. దానికి కారణం ఆమె డాన్స్ చేసింది గుడిలో.ఇలాంటి పాటకు గుడిలో డ్యాన్స్ చేయడం ఏంటని కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే చాలామంది నెటిజన్లు మాత్రం దీపికా డ్యాన్స్ను మెచ్చుకుంటున్నారు. సాయిపల్లవి కంటే అద్భుతంగా చేసిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ డ్యాన్సింగ్ అంటు కామెంట్లు పెడుతున్నారు.దీపికా ప్రస్తుతం ఓ టీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ షోకు యాంకర్ గా చేస్తుంది. View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) -
బాత్రూంలో చల్లటి గాలి.. అద్దం జరిపి చూసి అవాక్కయ్యింది
-
అద్దం వెనక ఏకంగా అపార్ట్మెంటే కట్టేశారు..!
వాషింగ్టన్: అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో.. భూమి లోపల, కప్బోర్టుల వెనక రహస్య గదులు ఉండే సన్నివేశాలను చాలానే చూశాం. కానీ అద్దం వెనక ఏకంగా ఓ అపార్ట్మెంట్ బయటపడిన సంఘటన గురించి ఎప్పుడైనా విన్నారా.. కనీసం చూశారా.. లేదా ఇది చదవండి. ఇలాంటి సంఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. న్యూయార్క్కు చెందిన టిక్టాక్ యూజర్ సమంతా హార్ట్సో అనే మహిళ తన బాత్రూమ్ అద్దం వెనక ఏకంగా ఓ అపార్ట్మెంట్ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె టిక్టాక్లో షేర్ చేశారు. దీన్ని ఇప్పటికే 7 మిలియన్ల మంది చూశారు. ఈ సందర్భంగా సమంతా మాట్లాడుతూ.. ‘‘గత కొద్ది రోజులుగా నా బాత్రూమ్లోకి చల్లటి గాలి వీస్తుంది. అక్కడ కిటికీ, వేరే కూలింగ్ పరికరాలు ఏం లేవు. ఎంత బలమైన గాలి అంటే అది నా జుట్టును వెనక్కి నెడుతుంది. ఈ గాలి ఎక్కడి నుంచి వీస్తుందా అని వెతకడం ప్రారంభించాను. ఈ క్రమంలో బాత్రూమ్ సింక్కు అతికించిన అద్దం వెనక నుంచి ఈ గాలి వస్తుందని అర్థం అయ్యింది. దాంతో అద్దం జరిపి చూశాను. అక్కడ పెద్ద రంధ్రం కనిపించింది. అసులు నా బాత్రూమ్ వెనక ఏం ఉందో తెలుసుకోవాలని భావించాను’’ అన్నారు. బాత్రూమ్ వెనక ఏం ఉందో తెలుసుకోవడం కోసం అక్కడకు వెళ్లాలని భావించింది సమంతా. ఈ క్రమంలో ఫేస్మాస్క్ పెట్టుకుని.. చేతికి గ్లౌవుజులు ధరించి బయలు దేరడానికి సిద్ధమయ్యింది. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తం చర్యగా ఓ సుత్తిని కూడా తనతో పాటు తీసుకెళ్లింది. ఆ తర్వాత బాత్రూమ్ వెనక తనకు కనిపించిన పెద్ద రంధ్రం గుండా లోపలికి ప్రవేశించింది. మొదట అదేదో సీక్రెట్ రూమ్గా భావించిన సమంతా ఆ తర్వాత అక్కడ మొత్తం అపార్ట్మెంట్ని చూసి షాకయ్యింది. అపార్ట్మెంట్ చూసి ఆశ్యర్యంతో గట్టిగా కేకలు వేశారు సమంతా. ఇక ఆ అపార్ట్మెంట్ అంతా చెత్త బ్యాగులు.. వాడేసిన వాటర్ బాటిళ్లు ఉన్నాయి. ఈ సందర్భంగా సమంతా మాట్లాడుతూ.. ‘‘లోపలికి అడుగుపెట్టిన నేను అక్కడ ఎవరైనా ఉంటారని భావించాను. కానీ అద్దం వెనక ఏకంగా అపార్ట్మెంట్ ఉండటం నిజంగా వింతే’’ అన్నారు. చదవండి: టిక్టాక్ ఛాలెంజ్లో అపశ్రుతి.. బాలిక మృతి వైరల్: తనను తానే పెళ్లి చేసుకున్న యువతి -
పోలీస్స్టేషన్లో షణ్ముఖ్ రచ్చరచ్చ
సాక్షి, బంజారాహిల్స్: మద్యం మత్తులో కారు నడుపుతూ మూడు వాహనాలను ఢీకొట్టడమే కాకుండా ఒకరు గాయాలపాలైన ఘటనలో టిక్టాక్ స్టార్ షణ్ముక్ జశ్వంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి 41(ఏ) నోటీసు జారీ చేశారు. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నెం.52లోని ఉడ్స్ అపార్ట్మెంట్స్ నుంచి తన కారులో మద్యం మత్తులో ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. ఓ స్కూటరిస్ట్కు కూడా గాయాలయ్యాయి. స్థానికులు షణ్ముక్ కారును అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. కారు దెబ్బతిన్న విజయ్ ఫిర్యాదు మేరకు అతడిపై ఐపీసీ సెక్షన్ 337, 279 కింద కేసు నమోదు చేశారు. ఇటీవలే సాఫ్ట్వేర్ డెవలపర్ పేరుతో ఓ వెబ్సిరీస్లో నటించిన అతడు యూట్యూబ్ స్టార్గా గుర్తింపు పొందాడు. పోలీస్స్టేషన్లో కూడా షణ్ముఖ్ రచ్చరచ్చ చేశాడు. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తన ఒక్కో ఎపిసోడ్కు కోటి వ్యూస్ ఉంటాయి తెలుసా అంటూ దబాయించాడు. రెండు గంటల పాటు పోలీసులను ఇబ్బందులకు గురి చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ కారుతో బీభత్సం.. బిగ్బాస్ 5 : మొదటి కంటెస్టెంట్ పేరు ఖరారు! -
టిక్టాక్లో.. కాస్ట్లీ మిస్టేక్!
ఏపీ సెంట్రల్ డెస్క్: అమెరికాకు చెందిన టెస్సికా బ్రౌన్ టిక్టాక్ షోతో ఒక్కసారిగా పాపులర్ అయింది. అయితే అదేదో గొప్ప పనిచేసి కాదు. ఓ పిచ్చిపని చేసి. లూసియానాకు చెందిన ఈ నలభై ఏళ్ల టీచరమ్మ టిక్టాక్లో వివిధ రకాల కార్యక్రమాలతో అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతింత కళ్లతో.. ఒత్తైన జుట్టుతో ఉండే టెస్సికా మేకప్ వేసుకుని అందంగా కనబడతూ ఉంటుంది. ఆమెను వేలాది మంది ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఓ రోజు తన జుట్టుపైనే ఓ ప్రయోగం చేసి అభిమానులను మెప్పించాలని ప్రయత్నించింది. జుట్టును అందంగా తీర్చిదిద్దుకోవడానికి చిట్కా అంటూ.. వీడియో మొదలెట్టింది. జట్టును ఇలా వేసుకోండి అంటూ ఓ బంక జిగురును తలకు పాముకుంది. అందరికీ సలహా ఇచ్చి వీడియో ముగించింది. ఇక ఆ జిగురును వదిలించుకోవడానికి తలంటు మొదలెట్టింది. ఆ జిగురు ఎంతకీ పోకపోయేసరికి ఆమెకు ఏమి చేయాలో పాలుపోలేదు. షాంపూతో పలుమార్లు తలంటింది. అయినా జిగురు వదల్లేదు. ఏవేవో ప్రయోగాలు చేసింది. ప్చ్.. జిగురు పోవడం మాట దేవుడెరుగు. మరింత బిగుసుకుపోయింది. లబోదిబో మంటూ మళ్లీ టిక్టాక్లోకి వచ్చింది. ఈ జిగురును ఎలా వదుల్చుకోవాలో సలహా ఇవ్వండి అంటూ తన అభిమానులను ప్రాధేయపడింది. విమర్శలు.. సూచనలు.. ఆ జిగురు మామూలుది కాదు. హెవీ డ్యూటీ గొరిల్లా గ్లూ అది. స్ప్రే రూపంలో ఉండే ఈ జిగురును సిరామిక్, రాళ్లు, లోహాలను అతికించడానికి వాడతారు. టెస్సికా వీడియోను చూసిన టిక్టాక్ అభిమానులు ఇంక ఆడుకోవడం మొదలెట్టారు. ఆమెకు గొరిల్లా గ్లూ గర్ల్ అని పేరు పెట్టారు. ఆమె చేసిన పనిపై కొంతమంది విమర్శల వర్షం కురిపించారు. మరి కొందరు జాలి పడి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. అన్ని ప్రయత్నాలు చేసే సరికి ఆమెకు తలపై దురదతో పాటు చిన్న చిన్న కురుపులు మొదలయ్యాయి. అలాగే తలపోటు ఎక్కువైంది. ఎన్ని చేసినా తలనంటిన జిగురు వదలక పోవడంతో చేసేది లేక ఆస్పత్రిని ఆశ్రయించింది. అక్కడ ప్లాస్టిక్ సర్జన్ చూసి ఈ జిగురును వదిలించాలంటే సుమారు తొమ్మిది లక్షల రూపాయలు (12000 డాలర్లు) ఖర్చు అవుతుందని తేల్చారు. మరో దారిలేక టెస్సికా ఆపరేషన్ చేయించుకుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ఇదో బ్యాడ్, బ్యాడ్, బ్యాడ్ ఐడియా అంటూ వాపోయింది. ఆ కంపెనీ ఏమందంటే.. మా కంపెనీ జిగురును తలకు రాసుకున్న టెస్సికాకు ఇలా జరగడం బాధాకరం. ఆమె వీడియో మా దృష్టికి వచ్చింది. ఆమె ఆస్పత్రిలో చేరి ట్రీట్మెంట్ చేయించుకుందని వీడియోలో చూశాం. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అంటూ సింపుల్గా చెప్పేసింది. అయితే టెస్సికాకు ఆమె తల్లి, నలుగురు అక్కచెల్లెళ్లు అండగా నిలిచారు. ఆమెకు సంఘీభావంగా వాళ్లు జట్టు కత్తిరించుకున్నారు. ఓ పిచ్చి పని నుంచి బయటపడ్డాను. ఇప్పుడు కోలుకుంటున్నాను అని టెస్సికా చెప్పింది. -
కొత్త టిక్టాక్ ఛాలెంజ్: తోలు పీకేసుకుంటున్నారు!
సోషల్ మీడియా మరో ప్రమాదకరమైన ఛాలెంజ్కు శ్రీకారం చుట్టింది. టిక్టాక్లో ‘ఫుట్ పీలింగ్’ అనే కొత్త ఛాలెంజ్ మొదలైంది. ప్రపంచం నలుమూలల ఉన్న నెటిజన్లు ప్రస్తుతం ఈ కొత్త ఛాలెంజ్పై మొగ్గుచూపుతున్నారు. వీడియోలు తీసి టిక్టాక్లో పోస్టు చేస్తున్నారు. తమ కాళ్లకు ఫుట్ పీలింగ్ మాస్కును అంటించుకుని, అరికాళ్ల తోలును పీకేసుకుంటున్నారు. పని గట్టుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు. అనవసరంగా అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. ( ‘హమారీ పావ్రీ’ నయా ట్రెండ్ వైరల్ ) ఇంతకీ ఛాలెంజ్ ఏంటంటే? ఫుట్ పీలింగ్ మాస్క్ జెల్ను రెండు అరికాళ్లకు పట్టించుకోవాలి. బాగా ఆరిన తర్వాత జెల్ అరికాళ్లకు గట్టిగా అతుక్కుపోయి పైన చర్మంలాగా ఏర్పడుతుంది. పైన చర్మంలాగా ఉన్న దాన్ని పీకేసుకోవాలి. అయితే ఈ ఛాలెంజ్ మనం అనుకున్నంత వీజీ ఏమీ కాదు! ఎక్కవ సేపు గనుక చర్మంపై దాన్ని ఉంచుకుంటే అలర్జీల బారిన పడి కాళ్లకు పుండ్లు లేచే అవకాశం ఉంది. జెల్ చర్మాన్ని గట్టిగా అతుక్కంటే కాలి చర్మం కూడా ఊడి వస్తుంది. -
టిక్టాక్ తో ఇన్స్టాగ్రామ్కు కొత్త చిక్కులు
గత ఏడాది జూన్ 29న పొరుగు దేశం చైనాతో ఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం టిక్టాక్ ను దేశంలో నిషేదించిన సంగతి మనకు తెలిసిందే. అప్పటి నుంచి టిక్టాక్ కు ప్రత్యామ్నాయంగా చాలా యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. కానీ, తక్కువ సంఖ్యలో మాత్రమే యాప్ లు ప్రజాధారణ పొందాయి. వాటిలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ కొత్తగా తీసుకొచ్చిన "రీల్స్" చాలా ఫేమస్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్కు ఒక టిక్టాక్ తో పెద్ద తలనొప్పి ఎదురైంది. గతంలో టిక్టాక్ యూజర్లు రూపొందించిన వీడియోలు ప్రస్తుతం రీల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. దీనితో చాలా మంది టిక్టాక్ వినియోగదారులు తమ పాత వీడియోలను తిరిగి రీల్స్లో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలపై టిక్టాక్ వాటర్ మార్క్ ఉండటంతో ఎక్కువ కంటెంట్ కాపీ పేస్ట్ అవుతుందని ఇన్స్టాగ్రామ్ ఆలోచిస్తుంది. ఇకపై టిక్టాక్ యాప్లో రూపొందించిన వీడియోలను ‘రీల్స్‘లో అప్లోడ్ చేయకుండా ఉండటానికి కొత్త సాంకేతికతను రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఈ సాంకేతిక సహాయంతో కాపీ కంటెంట్ ను పోస్టు చేయలేరని సంస్థ ప్రతినిధులు తెలిపారు. చదవండి: బిగ్ బ్యాటరీతో విడుదలైన గెలాక్సీ ఎఫ్ 62 ‘ఆపిల్ డే సేల్’లో ఐఫోన్లపై భారీ తగ్గింపు -
వాట్సాప్ను వెనక్కి నెట్టేసిన టెలిగ్రాం
2021లో వాట్సాప్కు ఏ విదంగాను కలిసి రావడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకువచ్చి చిక్కుల్లో పడింది. ఆప్పటి నుంచి ఎన్ని కొత్త ప్రయత్నాలు చేసిన యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది. దీని ప్రధాన ప్రత్యర్థులైన టెలిగ్రాం, సిగ్నల్ యాప్ లు మాత్రం దూసుకెళ్తున్నాయి. 2021 జనవరిలో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన నాన్-గేమింగ్ యాప్స్లో టెలిగ్రాం అన్నిటికంటే ముందంజలో ఉంది. ఈ విషయాన్నీ సెన్సార్ టవర్ అనే డేటా సంస్థ వెల్లడించింది. టెలిగ్రాంను ఎక్కువ శాతం డౌన్లోడ్ చేసిన వారిలో 24 శాతం మంది భారతీయులు ఉన్నారు. ఈ మెసేజింగ్ యాప్ ను గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 6.3కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిలో భారతదేశం నుంచే 1.5 కోట్ల మంది టెలిగ్రామ్ ను డౌన్లోడ్ చేశారు. టెలిగ్రాంను 2020 జనవరిలో డౌన్లోడ్ చేసుకున్న దానికంటే 3.8 రెట్లు ఎక్కువగా ఈసారి డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్లలో ఆకస్మిక పెరుగుదల ప్రధాన కారణం వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ నిబంధనలు అనే చెప్పుకోవాలి. వాట్సాప్ కొత్త విధానాలు వినియోగదారులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. దింతో చాలా మంది టెలిగ్రామ్కు మారారు. 2వ స్థానంలో టిక్టాక్ ఇక డౌన్లోడ్ పరంగా టిక్టాక్ రెండవ స్థానంలో ఉండగా తర్వాత స్థానాలలో సిగ్నల్, ఫేస్బుక్ ఉన్నాయి. వాట్సాప్ మునుపటితో పీలిస్తే జనవరిలో మూడవ స్థానం నుంచి ఐదవ స్థానానికి పడిపోయింది. "టాప్ యాప్స్ వరల్డ్ వైడ్ ఫర్ జనవరి 2021 బై డౌన్లోడ్స్" అనే శీర్షికతో ప్రచురించిన కథనంలో సెన్సార్ టవర్ ఈ విషయాన్ని తెలిపింది. టెలిగ్రాం డౌన్లోడ్లలో 24 శాతంతో భారత్ ప్రథమ స్థానంలో ఉండగా, 10 శాతం డౌన్లోడ్లతో ఇండోనేషియా రెండవ స్థానంలో ఉంది. మనదేశంలో టిక్టాక్ ను బ్యాన్ చేసినప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా డౌన్లోడ్ సంఖ్య 6.2కోట్లకు చేరుకుంది. దీనిలో 17 శాతం చైనా నుంచి కాగా 10శాతం మంది అమెరికా నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. చదవండి: లీకైన వన్ప్లస్ 9ప్రో ఫోటోలు గెలాక్సీ ఎఫ్62 లాంచ్ తేదీ వచ్చేసింది! -
దుర్గారావుతో జగపతి బాబు చిందులు
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా రాణించిన జగపతి బాబు.. ఆ తర్వాత ఆయనలోని మరో యాంగిల్ బయటపెడుతూ విలన్ గా మారారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘లెజండ్’ లో జగపతి బాబు విలన్ గా నటించి మెప్పించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తండ్రిగా, మామగా మెప్పిస్తున్నారు. ఇక రీల్ లైఫ్ని పక్కనపెడితే.. రియల్ లైఫ్లో జగపతి బాబు చాలా సైలెంట్. సినిమా వేడుకల్లో కూడా ఎక్కువగా మాట్లాడడు. అసలు సినిమా వేడుకలకు హాజరు కావడమే చాలా అరుదు. అలాంటిది ఓ సాధారణ టిక్టాక్ స్టార్ అడిగితే స్టేజ్ మీదికి రావడమే కాదు.. అతని కోరికను కాదనకుండా అతనితో కలిపి స్టెప్పులు వేశారు. ఆ టిక్టాక్ స్టార్ ఎవరో కాదు దుర్గారావు. జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం‘ఎఫ్.సి.యు.కె’ (ఫాదర్ చిట్టి ఉమ్మా కార్తీక్). ఈ మూవీ ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ వేడుకకి సోషల్ మీడియా సెలబ్రిటీలను ఆహ్వానించి వారితో పాటలను విడుదల చేయించారు. దీంట్లో భాగంగా ‘అనుకున్నది అవ్వదురా.. కానీ అయ్యేది తెలవదురా’ అనే సాంగ్ను టిక్ టాక్ దుర్గారావు, అతని భార్య చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ.. తాను జగపతి బాబు అభిమానిని అని.. ఆయనతో కలిసి ఒక్క స్టెప్ వేయాలని ఉందని కోరాడు. దీంతో జగపతి బాబు స్టేజ్ మీదికి వచ్చి.. దుర్గారావుతో కలిసి స్టెప్పులేసి అలరించాడు. తన కోరికను మన్నించి స్టేజ్ మీదకు వచ్చి డ్యాన్స్ చేసిన జగపతి బాబుకి దుర్గారావు ధన్యవాదాలు తెలిపాడు. కాగా, టిక్టాక్ ద్వారా బాగా ఫేమస్ అయిన వారిలో దుర్గారావు ఒకడు. టిక్టాక్లో తన భార్యతో కలిసి ఇతడు చేసిన డ్యాన్సులు వైరల్గా మారాయి. ముఖ్యంగా అందులో నక్కిలీసు గొలుపు పాటకు ఆ ఇద్దరు వేసిన స్టెప్పులైతే ఎంత ఫేమస్ అయ్యాయో చెప్పక్కర్లేదు. -
ఎమీ హాకిన్స్.. మరో గంగవ్వ
టాలెంటును ప్రదర్శించడానికి వయసు అడ్డురాదని చెబుతున్నారు 110 ఏళ్ల ఎమీ హాకిన్స్. ఒకే ఒక్కపాటతో ఈ బామ్మగారు ఓవర్ నైట్ స్టార్గా ఎదిగారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో బాగా పాపులర్ అయిన ‘‘ఇట్స్ ఏ లాంగ్ వే టు టిప్పరరే’’ అనే పాటను ఎమీ పాడింది. దానిని ఆమె మనవరాలు సోషల్ మీడియా ప్లాట్ఫాం టిక్టాక్లో అప్లోడ్ చేయడంతో ఎమీ హాకిన్స్ పేరు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అంతేగాకుండా ఈ వీడియో సాంగ్ను లక్షమందికి పైగా చూశారు. వేల్స్నగరానికి చెందిన ఎమీ ఒకప్పుడు డ్యాన్స్ ట్రూప్లో నర్తకిగా పనిచేసేవారు. అయితే ఇన్నేళ్లలో రాని గుర్తింపు తాజాగా ఆమె పాడిన ఒక పాటకు వచ్చింది. గత వారంలో ఆమె 110 వ ఏటలోకి అడుగుపెట్టగా, ఆ సెలెబ్రేషన్స్లో భాగంగా ఎమీ లాంగ్ వేటు పాట పాడింది. దాన్ని టిక్టాక్లో షేర్ చేయగా అత్యధిక వ్యూస్తో దూసుకుపోతోంది. వరల్డ్వార్–1 ముగిసే సమయానికి ఎమీకి ఏడేళ్లు. 1911 కార్డిఫ్లో ఎమీ జన్మించినప్పటికీ తన చిన్నతనం మొత్తం న్యూపోర్ట్లో గడిపారు. ఎమీకి ఐదుగురు సోదరులతోపాటు ఒక సోదరి కూడా ఉన్నారు. ఆమె తన 14వ ఏట డ్యాన్సర్గా గుర్తింపు తెచ్చుకోగా, ఒక నృత్య బృందంతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. (చదవండి: విషాదాన్ని మిగిల్చిన కొరియన్ దేవకన్య) 1937లో సైన్ రైటర్ జార్జ్ హాకిన్స్ను వివాహం చేసుకుని చాలా కాలం పాటు న్యూపోర్ట్లో నివసించారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఎమీ హాకిన్స్ ఫైర్ వాచర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె దక్షిణ వేల్స్లోని మోన్మౌత్షైర్లోని తన నివాసంలో నాలుగు తరాల వారసులతో కలిసి జీవిస్తున్నారు. బామ్మ పాటను టిక్టాక్లో షేర్ చేయాలన్న నిర్ణయం ఇంతటి సంతోషాన్ని ఇస్తుందనుకోలేదు. బామ్మకు సోషల్ మీడియా అంటే ఏంటో పెద్దగా తెలీదు. కానీ ఆమె ఒకపాటతో సింగింగ్ సెన్సేషన్గా నిలవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఆమెకు దక్కిన సూపర్ బర్త్డే గిఫ్ట్గా భావిస్తున్నామని మనవరాలు ఫ్రీమన్ చెప్పుకొచ్చింది’’. -
వెండితెరపై చెన్నూరు చిన్నది..!
సాక్షి, చెన్నూర్: చిన్ననాటి నుంచి ఆమెకు నాటకాలు, డ్రామాలు అంటే మక్కువ. ఆ మక్కువే నేడు సినిమాలో చాన్స్ దక్కించింది. చదువుకునే సమయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహంలో వెబ్సీరిస్లోకి అడుగుపెట్టింది. “వరంగల్ వందన’ వెబ్సీరిస్లో తన నటనకు మంచి మార్కులు దక్కించుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్లో నంబర్వన్ స్థానంలోకి చేరింది. ఇటీవల సినిమాలో సైతం చాన్స్ దక్కించుకుంది. ఫలితంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణం నుంచి వెండితెరపై మెరవనున్న తొలి మహిళగా సుష్మగోపాల్ నిలవనుంది. సినీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డితో సుష్మగోపాల్ చెన్నూర్కు చెందిన సుష్మ... చెన్నూర్కు చెందిన ప్రైవేట్ వైద్యుడు తిప్పార్తి వేణుగోపాల్, శ్రీకళ దంపతుల కుమార్తె సుష్మగోపాల్. చెన్నూర్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంది. 2019న హైదరాబాద్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుండగా.. వరంగల్ వందన వెబ్సీరిస్లో చాన్స్ దక్కింది. రచయిత ప్రజా ప్రభాకర్, డైరెక్టర్ శృతి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వెబ్ సీరిస్లో నటించింది. ఇప్పటివరకు 80కి పైగా వెబ్ సీరిస్లో నటించిన సుష్మగోపాల్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ట్రెండింగ్లో నంబర్వన్ స్థానానికి చేరుకుంది. ఓవైపు వెబ్సీరిస్లో నటిస్తూనే ఇంటర్ పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్లో డిగ్రీ చేస్తూ మరోవైపు వెబ్ సీరిస్ల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం సినిమాలో నటించే చాన్స్ రావడంతో సుష్మగోపాల్తో పాటు ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో .. సినీ రంగ ప్రవేశం వెబ్సిరీస్లో రాణిస్తున్న సుష్మగోపాల్కు ఒక్కసారిగా వెండితెరపై నటించే అవకాశం వచ్చింది. సినీ నటుడు అలీ, నరేశ్ నటిస్తున్న అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాను శ్రీపురం కిరణ్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతోంది. సినిమాలో ప్రధాన పాత్రధారి చెల్లె పాత్రలో సుష్మ నటిస్తోంది. 10 లక్షల చేరువలో వెబ్సీరిస్ వరంగల్ వందన వెబ్సీరిస్ ఏడాదికి లక్ష మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది. దీంతో వరంగల్ కలెక్టర్ పాటిల్ ప్రశాంత్జీవన్ వెబ్ సిరీస్ బృందాన్ని అభినందించి మెమోంటో అందజేశారు. ప్రస్తుతం వరంగల్ వందన యూట్యూబ్ వెబ్ సిరీస్కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో 10లక్షల సబ్ స్క్రైబర్కు చేరువలో ఉంది. సుష్మగోపాల్ ఇన్స్టాగ్రామ్లో 50వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. చదువుతో పాటు... చదువుకునేందుకు హైదరాబాద్కు వెళ్లాను. మా అన్నయ్య విష్ణు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంటర్ చదువుతూనే వెబ్సిరీస్లో నటించాను. మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఓ సినిమాలో చాన్స్ వచ్చింది. రానున్న రోజుల్లో మంచి పేరు తీసుకువచ్చే పాత్ర చేస్తా. మంచి నటిగా పేరు సంపాదించాలనేదే నా లక్ష్యం. – తిప్పార్తి సుష్మగోపాల్, సినీనటి, చెన్నూర్ -
టిక్టాక్ శాశ్వతంగా బంద్
న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ అయిన టిక్టాక్ను భారత్ శాశ్వతంగా నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్టాక్ను ప్రమోట్ చేస్తున్న చైనా కంపెనీ బైట్డ్యాన్స్.. భారత్లో తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2,000 పైచిలుకు ఉద్యోగులను తీసివేయనుంది. ఈ ఉద్యోగులకు మూడు నెలల వేతనంతోపాటు కంపెనీలో పనిచేసిన కాలాన్నిబట్టి మరో నెల పారితోషికం ఇవ్వనున్నారు. టిక్టాక్ గ్లోబల్ ఇంటెరిమ్ హెడ్ వనెస్సా పప్పాస్, గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ బ్లేక్ చండ్లీ సంయుక్తంగా భారత్లోని ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్స్లో ఈ విషయాలను వెల్లడించారు. -
విషాదాన్ని మిగిల్చిన కొరియన్ దేవకన్య
జీవితం వినోదం కాదనిపిస్తుంది.. వినోద రంగంలో ఉన్నవాళ్లు ఆత్మహత్యలకు తెగించినప్పుడు! స్క్రీన్ మీద నటించినవాళ్లు నిజ జీవితంలో నటించలేకపోతున్నారా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఎంటర్టైనర్లుగా వెలిగిపోతున్నవాళ్లు బయటి జీవితంలో నిలదొక్కుకోలేక చీకటిలోకి పారిపోతున్నారా? జీవితం స్మార్ట్ అయ్యాక భూగోళమంతా ఇప్పుడు యువలోకమే. కానీ యూత్ ఎందుకని యమలోకం వైపు వెర్రిగా చూస్తోంది. శనివారం సౌత్ కొరియాలో ‘సాంగ్’ అనే యువ నటి చనిపోయింది. శనివారమే మనవైపు నెల్లూరులో రఫీ షేక్ అనే యువ టిక్టాక్ సెన్సేషన్ చనిపోయాడు. ఆదివారం కన్నడ బిగ్బాస్ ఫేమ్ జయశ్రీ విగతజీవిగా కనిపించారు. పంచినన్నాళ్లు వినోదాన్ని పంచి, అకస్మాత్తుగా వీళ్లెందుకని విషాదాన్నీ మిగిల్చి వెళుతున్నారు. గ్లామర్ ఫీల్డ్లో కొత్త టాలెంట్ని, కొత్తగా చూపిస్తున్న టాలెంట్ని నిలబడనివ్వని శక్తులు చాలానే ఉంటాయి. అవి గొంతు పట్టుకుంటాయి. ఊపిరి ఆడకుండా చేస్తాయి. మనిషి జీవితం అంటేనే భయం కలిగేలా, తిరిగి అమ్మ కడుపులోకే పారిపోవాలన్నంతగా భయపెడతాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వెంటాడతాయి. చివరికి మరణం అంచుల వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి నెట్టేస్తాయి. పైకొస్తున్న అమ్మాయిలకు లైంగిక వేధింపులు ఉంటాయి. అబ్బాయిలకు అవమానాలు ఉంటాయి. పోటీ, ప్రేమ, డబ్బు.. ఈ రంగంలో ప్రథమ శత్రువులు. క్రియేటివిటీ ఉన్న చోట ఆ స్థాయిలోనే రూమర్లూ క్రియేట్ అవుతుంటాయి. ట్రోలింగ్లు జరుగుతుంటాయి. తట్టుకుని నిలబడలేనప్పుడు డిప్రెషన్లోకి వెళ్లిపోతారు. డిప్రెషన్ మనిషికి చేయిపట్టుకుని తీసుకెళ్లే ఒకే ఒక చోటు.. మరణం! చదవండి: (వేధింపులకు తాళలేక టిక్టాక్ స్టార్ ఆత్మహత్య) దక్షిణ కొరియా యువనటి సాంగ్ యూ–జంగ్ నెల్లూరులో రఫీ షేక్, కర్ణాటకలో జయశ్రీల వేర్వేరు మరణాలలో కారణాలపై విచారణ జరుగుతోంది. సియోల్లో 26 ఏళ్ల కొరియన్ నటి సాంగ్ (పూర్తి పేరు సాంగ్ యూ–జంగ్) ‘ఆత్మహత్య’ కు కారణం మాత్రం ‘అన్నోన్’గానే మిగిలిపోయింది. కూతురే పోయాక కారణాలను ఏం చేసుకోను అని ఆమె తల్లిదండ్రులు నిర్లిప్తంగా ఉండిపోయారు. నిర్లిప్తంగానే సోమవారం కూతురి అంత్యక్రియలు జరిపించారు. సాంగ్కి ‘సబ్లైమ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ’లో జాబ్. అవును జాబ్! కళ ఉన్నవారికి అవకాశాలు ఇప్పించే సంస్థలు ప్రత్యేకంగా ఉంటాయి. నిర్మాతలు, నిర్వాహకులు ఎవరైనా వచ్చి సాంగ్ని వాళ్ల ‘షో’ కి, లేదా సినిమాకు ఒప్పించాలంటే సాంగ్ ఒప్పుకుంటే సరిపోదు. ఆమె పని చేస్తున్న సంస్థ ఒప్పుకోవాలి. అప్పుడప్పుడే పైకొస్తున్న యువ ఆర్టిస్టులంతా ఇంతే. పెద్ద స్టార్లు అయ్యాక గాని, తమ సంతకాన్ని తామే పెట్టే హక్కుకు సొంతదారులు కాలేరు. సాంగ్ తన హక్కును దక్కించుకునేందుకు చేసే ప్రయత్నంలోనే తనకు తెలీకుండా తను చావుదారిలోకి వెళ్లిపోయిందా?! సాంగ్ నిన్న మొన్నటి అమ్మాయి. 2019లో, ఇరవై నాలుగేళ్లు వయసులో నటిగా ఆమె తొలిసారి ‘డియర్ మై నేమ్’ అనే వెబ్ సీరీస్తో కొరియన్లకు అభిమాన నటి అయింది. అందులో ఆమె ఆర్కిటెక్చర్ విద్యార్థిని. అసలే అందగత్తె. పిక్సీ కట్తో (కురచ జుట్టు) మరింత క్యూట్గా కనిపిస్తుంది. ఆ తర్వాత సినిమా ఆఫర్లు రాబోతుండగా కరోనా వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఈ వార్త.. సాంగ్ ఆత్మహత్య! చదవండి: (డిప్రెషన్తో బిగ్బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్య!) వెబ్ సిరీస్లో వాస్తు శాస్త్ర విద్యార్థినిగా నటించిన సాంగ్ నిజ జీవితంలో తన కెరీర్ను నిర్మించుకోలేక టూల్స్ అన్నీ ఎక్కడివక్కడ వదిలేసి వెళ్లిపోయినట్లుంది! వేధింపుల వెబ్ నుంచి ఆమె బయటపడలేక మృత్యువుతో స్నేహం చేసిందా! వయసులో ఉన్న పిల్లలకు, పేరొస్తున్న పిల్లలకు వేధింపులు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. అయినవాళ్లే కాదు, అపరిచితులైనా సరే.. ‘హు..’ అని ముఖం తిప్పేసుకుని వెళ్లినా చాలు వీళ్లు తట్టుకోలేరు. ఎవరికీ చెప్పుకోలేరు. ఒంటరితనం ప్రాణసఖి అవుతుంది. ఇక ఆ ఎవరూలేనితనం ఎటు తీసుకెళితే అటు... అంతిమ యానం. పందొమ్మిదేళ్లకే సాంగ్ ఎస్టీ లాండర్ స్కిన్ కేర్ ఉత్పత్తులకు మోడలింగ్ ఇచ్చింది. ఆ తర్వాత బాస్కిన్–రాబిన్స్ ఐస్ క్రీమ్కు. ఎవరబ్బా ఈ పిల్ల అని ఆ దేశ ప్రజలు ముచ్చటగా చూశారు. అందం కాదు ఇంకా ఏదో ఉంది సాంగ్లో. చలాకీదనం? చురుకుదనం? అవెలాగూ ఉన్నాయి. ఆ కళ్లు.. ఆ ముక్కు.. ఆ పెదవులు.. ప్రతిదీ ఎక్స్ప్రెసివ్. మూర్తీభవించిన మహాభినయం కూడా సాంగ్ చూపుకు సాగిలపడవలసిందే. అంత సమ్మోహనం. మాంత్రికత. మనసును నెమ్మది పరిచే శ్రావ్యగీతిక మానవజన్మ ఎత్తితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సాంగ్. కొన్ని మ్యూజిక్ వీడియోల్లో, గోల్డెన్ రెయిన్బో, మేక్ యువర్ విష్, స్కూల్ 2017 అనే టీవీ సీరీస్లో నటించింది సాంగ్. నటనలోకి రాకపోయి ఉంటే కొరియన్ పాప్ మహరాణిగా తలపై ఆమె కిరీటాన్నీ ఏ చెలికత్తెలో సరిచేస్తూ ఉండేవారు. మనిషే లేకుండా పోయింది. సాంగ్ లేకపోవడం వల్ల ఆమె తల్లిదండ్రులతో పాటు మరొకరికీ తీరని లోటు! ఆమె ఎందరో వికలాంగులకు సహాయం చేస్తుంటుంది. వారంతా ఇప్పుడు మరోసారి అంగవైకల్యం పొందినట్లయింది. ‘వామ్ అకంపనిమెంట్’ అని దక్షిణ కొరియాలో ఒకపెద్ద సేవాసంస్థ ఉంది. ఆ సంస్థకు రాయబారిగా ఉండేది సాంగ్. ఇక ఇప్పుడు ఎవరి చేత రాయబారం పంపి ఈ దేవకన్యను స్వర్గం నుంచి వెనక్కు తెప్పించుకోవాలి.. కొరియాలో ఆమె వల్ల ఇప్పటి వరకు ఎంటర్టైన్ అవుతున్నవారు, ఆమె సహాయాలు పొందుతున్నవారు?! -
టిక్టాక్ ఉద్యోగుల తొలగింపు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ యాప్ టిక్టాక్ ఇండియాలో తమ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడింది. యాప్పై భారత ప్రభుత్వం శాశ్వత నిషేధం విధించిన నేపథ్యంలో టిక్టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్.. తమ ఉద్యోగులకు బుధవారం ఓ మెమో జారీ చేసింది. "యాప్పై నిషేధం కొంతకాలానికే పరిమితమవుతుందని తాము భావించామని, కానీ అలా జరగలేదని" ఆ సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నది. యాప్ ఇక్కడ పని చేయకుండా అందరు ఉద్యోగులను కొనసాగిస్తూ ఉండలేము అని పేర్కొంది. ఇండియాలో భవిష్యత్ లో తిరిగి రావడానికి ప్రయత్నిస్తామని బైట్డ్యాన్స్ ఆ మెమోలో పేర్కొన్నది. (చదవండి: రివ్యూ: ఫౌజీ గేమ్ ఎలా ఉందంటే?) నిషేదానికి ముందు టిక్టాక్ కు భారతదేశం అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్. ఇండియాలోనే 200 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టీవ్ యూజర్లను సంపాదించింది. చైనా, భారత్ దేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత నేపథ్యంలో చైనాకు చెందిన 267పైగా యాప్లను గత ఏడాది వివిధ దశలలో నిషేదించింది. ఇందులో టిక్టాక్ కూడా ఉంది. గోప్యత, జాతీయ భద్రతా రక్షణ కారణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఈ యాప్లను నిషేధించినట్లు కేంద్రం పేర్కొంది. -
చైనా యాప్లకు మరో భారీ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: చైనా యాప్లపై కేంద్రం తాజాగా మరో కొరడా ఝళిపించింది. భారతదేశంలో టిక్టాక్, ఇతర 58 చైనా యాప్లపై శాశ్వత నిషేధం విధించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతేడాది జూన్లో వీటిపై భారత ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించగా.. ఇప్పుడు వాటిని శాశ్వత నిషేధం దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. భారతీయ వినియోగదారులడేటాను అక్రమంగా సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయన్న ఆరోపణలపై ఆయా సంస్థల వివరణను కోరింది కేంద్రం. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గత వారమే నోటీసులు జారీ చేసింది. అయితే వాటి వివరణతో సంతృప్తి చెందని ప్రభుత్వ 59 యాప్లను శాశ్వతంగా నిషేధించాలని నిర్ణయించింది. గత ఆరు నెలల్లో ప్రభుత్వం 208 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే. గోప్యత, జాతీయ భద్రతా రక్షణకు అనుగుణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఈ యాప్లను నిషేధించింది. -
వేధింపులకు తాళలేక టిక్టాక్ స్టార్ ఆత్మహత్య
నెల్లూరు: టిక్టాక్లో స్టార్గా ఉన్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఓ అమ్మాయి విషయంలో జరిగిన సంఘటనలే అతడి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా రంగనాయకుపేటకు చెందిన షేక్ రఫీ టిక్టాక్ స్టార్గా గుర్తింపు పొందాడు. రోజూ టిక్టాక్లో వీడియోలు అప్లోడ్ చేసి నెటిజన్లు.. ఫాలోవర్లను ఆకట్టుకునేవాడు. అయితే అతడి స్నేహితుడితో జరిగిన వివాదంలో మనస్ఫార్థానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల్లూరులో కెమెరామెన్గా పని చేస్తున్న రఫీ టిక్టాక్ వీడియోలు కూడా చేస్తూండేవాడు. అయితే అతడి స్నేహితుడు ముస్తఫా ప్రేయసి రఫీతో చనువుగా ఉండేది. రఫీతో ప్రేమగా ఉండటం.. సన్నిహితంగా ఉండటంతో తట్టుకోలేకపోయాడు. ఈ విషయమై ముస్తాఫా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రఫీపై దాడి చేయించాడు. ప్రణాళిక ప్రకారం స్నేహితులతో రఫీపై దాడి చేయించాడు. తీవ్ర గాయాల పాలైన రఫీని తండ్రి రియాజ్ ఆస్పత్రిలో చేర్పించాడు. అనంతరం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంలో రఫీపై వేధింపులు తీవ్రమయ్యాయి. ఈ సమయంలో ఆ వేధింపులు తట్టుకోలేక జనవరి 22వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడిన రఫీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయమై తండ్రి రియాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వేధింపుల కారణంగా తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. దీనిక కారణమైన ముస్తాఫాపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
టిక్టాక్ ఛాలెంజ్లో అపశ్రుతి.. బాలిక మృతి
సిసిలీ: ఫన్నీ వీడియోలు.. పాటలు.. డ్యాన్స్లతో ఆకట్టుకున్న చైనా యాప్ టిక్టాక్ ఓ బాలిక మృతికి కారణమైంది. టిక్టాక్లో ఓ వీడియో చేస్తున్న ప్రయత్నంలో ఆ బాలిక మృతి చెందడంతో ఇటలీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. యాప్లో వచ్చిన ఓ సాహస కృత్యాన్ని చేయడానికి ప్రయత్నించడమే పదేళ్ల బాలిక చేసిన పాపం. ఈ ఘటనతో ఆ యాప్పై ఇటలీ ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సిసిలీలోని ఓ పదేళ్ల బాలిక టిక్టాక్ వినియోగిస్తోంది. అయితే ‘బ్లాకౌట్ చాలెంజ్’ అనే హ్యాష్ట్యాగ్తో ట్రెండీ అవుతున్న వీడియోను చేయడానికి బాలిక ప్రయత్నించింది. అందులో భాగంగా ప్రయత్నం చేస్తూ ఫోన్లో రికార్డింగ్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా మెడకు బెల్ట్ బిగుసుకుపోయి ఆ బాలిక బాలిక్ బాత్రూమ్లో పడిపోయింది. అస్వస్థతకు గురయిన పడి ఉన్న బాలికను చూసి కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఆక్సిజన్ అందక గుండె కండరాలు స్తంభించడంతో బ్రెయిన్ డెడ్కు గురై ఆ బాలిక కన్నుమూసింది. అయితే ఆ తల్లిదండ్రులు బాలిక అవయవాలను దానం చేయడం విశేషం. (చదవండి: 2020లో భారీ లాభాన్ని ఆర్జించిన టిక్టాక్) ఈ ఘటనపై ఇటలీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. టిక్టాక్ వినియోగంపై తీవ్ర ఆంక్షలు విధించింది. ముఖ్యంగా 13ఏళ్లలోపు బాలబాలికలు ఉపయోగించరాదని నిబంధనలు విధించింది. మైనర్ల రక్షణకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. టిక్టాక్ వినియోగించాలంటే తప్పనిసరిగా 13 ఏళ్లు దాటి ఉండాలని స్పష్టం చేసింది. దీనిపై గత డిసెంబర్లోనే నిబంధనలు రూపొందించగా అవి అమలుకాకపోవడంతో ఇటలీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా స్పందించకుంటే టిక్టాక్ యాప్ నిషేధానికి కూడా సిద్ధమైంది. భారత్లో గతేడాది జూన్ 29వ తేదీన టిక్టాక్ను నిషేధించిన విషయం తెలిసిందే. (చదవండి: మోడల్ క్రేజ్.. ఫాలో అవుతోన్న బైడెన్) -
టిక్టాక్ గురించి ఒక క్రేజీ అప్డేట్
చైనీస్ షార్ట్-వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ 2020లో 540 మిలియన్ డాలర్ల లాభంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత లాభదాయకమైన యాప్ గా నిలిచింది. భారతదేశంలో నిషేధించబడినా, యునైటెడ్ స్టేట్స్లో న్యాయ పోరాటం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా.. సుమారు 400 కోట్ల లాభాన్ని ఆర్జించింది. యూత్ ఎక్కువగా మాట్లాడే డేటింగ్ యాప్ టిండర్ 513 మిలియన్ల డాలర్ల లాభం పొంది రెండవ అత్యంత లాభదాయక యాప్ గా నిలిచింది. యాప్ అనలిటిక్స్ సంస్థ అప్టోపియా విడుదల చేసిన డేటా ప్రకారం.. 478 మిలియన్ డాలర్ల లాభంతో యూట్యూబ్ మూడవ అత్యంత లాభదాయక యాప్ గా, తరువాత డిస్నీ 314 మిలియన్ డాలర్ల లాభంతో, టెన్సెంట్ వీడియో 300 మిలియన్ డాలర్ల లాభంతో తర్వాత స్థానాలలో నిలిచాయి. నెట్ఫ్లిక్స్ యాప్ 209 మిలియన్ల డాలర్ల లాభంతో 10వ స్థానంలో ఉంది.(చదవండి: వన్ప్లస్ బ్యాండ్ వచ్చేసింది!) చైనా నుండి వచ్చిన డేటా మినహా అన్ని ఐఓఎస్, గూగుల్ ప్లే డేటాతో కలిపి ప్రకటించినట్లు యాప్ అనలిటిక్స్ సంస్థ అప్టోపియా ఒక ప్రకటనలో పేర్కొంది. యాప్ అనలిటిక్స్ సంస్థ ప్రకారం.. టిక్టాక్ 2020 ఏడాదిలో 800 మిలియన్లకు పైగా డౌన్లోడ్లతో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన యాప్ గా నిలిచింది. దీని తర్వాత వాట్సాప్ 600 మిలియన్లు, ఫేస్బుక్ 500 మిలియన్లకు పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ 500 మిలియన్లకు పైగా డౌన్లోడ్లతో నాల్గవ స్థానంలో ఉంది. అలాగే జూమ్ 400 మిలియన్లకు పైగా డౌన్లోడ్లతో ఐదవ స్థానంలో ఉంది. 2020, జూన్ 29న టిక్టాక్ తో సహా 59 చైనీస్ అనువర్తనాలను భారత హోం మంత్రిత్వ శాఖ నిషేదించిన సంగతి మనకు తెలిసిందే.