హైదరాబాద్: స్వైన్ఫ్లూ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి మండల పరిధిలో శనివారం ఒకే కుటుంబంలో ముగ్గురికి స్వైన్ప్లూ సోకింది. కొండాపూర్కు చెందిన ఓ వ్యక్తికి స్వైన్ప్లూ రావడంతో అదే కుటుంబంలోని ఇద్దరు వయోవృద్ధులకు కూడా లక్షణాలు ఉండటంతో ఆసుపత్రిలో చేరారని, స్వైన్ప్లూ అని తేలాల్సి ఉందని శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గంగాభవాని తెలిపారు. అదేవిధంగా మాదాపూర్లో 2, గచ్చిబౌలిలో ఒక కేసు నమోదైందని వెల్లడించారు. అదే విధంగా నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు 20స్వైన్ఫ్లూ అనుమానిత కేసుల్లో 10 మందికి పాజిటివ్గా తేలింది. ఇందులో ముగ్గురు మృత్యువాత పడగా.. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రాజు అనే వ్యక్తితోపాటు అతని కుమారుడు నాలుగేళ్ల బాలుడు, లక్ష్మి అనే యువతి, గాంధీ ఆసుపత్రిలో పర్వీన్ అనే యువతి చికిత్స పొందుతున్నారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం చిన్నాయిగూడేనికి చెందిన బాలుడికి స్వైన్ఫ్లూ సోకింది. ఇద్దరు మాత్రం గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మృతుల్లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన వెంకటగురుప్రసాద్, నల్లగొండ పట్టణానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన రమేష్, శోభారాణి ఉన్నారు.
తగ్గని స్వైన్ఫ్లూ తీవ్రత
Published Sun, Feb 8 2015 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM
Advertisement
Related news by tags
-
ఆస్పత్రిలో చేరడం మొదటిసారి.. భయంతో వణికిపోయా: జాన్వీ కపూర్
దేవర భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఉలజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో యువ దౌత్యవేత్త అధికారి పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. అయితే ఇటీవల ఫుడ్ పాయిజన్ కావడంతో ఆస్పత్రిలో చేరింది. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయింది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో అనారోగ్యానికి గురి కావడంపై నోరు విప్పింది. ఫుడ్ పాయిజన్తో చాలా భయానికి గురైనట్లు వెల్లడించింది. పని కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.జాన్వీ కపూర్ మాట్లాడుతూ..'నేను ఆస్పత్రిలో చేరడం ఇదే మొదటిసారి. మూవీ ప్రమోషన్లు, షూటింగ్లతో బాగా అలసిపోయా. ఒక ఈవెంట్ కోసం చెన్నైకి వెళ్లా. అక్కడ విమానాశ్రయంలో ఫుడ్ తీసుకున్నా. మొదట కడుపులో నొప్పిగా అనిపించింది. ఆ తర్వాత చాలా నీరసం వచ్చేసింది. దీంతో భయంతో వణికిపోయా. హైదరాబాద్కు వచ్చేందుకు ఫ్లైట్ ఎక్కేముందు పక్షవాతం వచ్చిందా అన్న ఫీలింగ్ కలిగింది. సాయం లేకుండా వాష్రూమ్కు కూడా వెళ్లలేకపోయానని' తెలిపింది.'కానీ ఆస్పత్రిలో చేరాక వైద్య పరీక్షలు చేశారు. రిపోర్డులు చూసిన డాక్టర్లు సైతం భయపడ్డారు. లివర్ బాగా ఇబ్బందికి గురైనట్లు పరీక్షల్లో తేలింది. దీంతో మూడు, నాలుగు రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆరోగ్య పరిస్థితి చాలా భయానకంగా ఉంది. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు మళ్లీ డ్యాన్స్ చేయగలనో, లేదో అని భయపడ్డా. ప్రస్తుతం మళ్లీ వర్క్లో బిజీ అవుతున్నా' అని తెలిపింది. అయితే ఇప్పుడంతా బాగానే ఉందని వెల్లడించింది. కాగా.. జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం ఉలజ్ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జైలర్ తర్వాత మరో ఐటమ్ సాంగ్లో తమన్నా..!
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది జైలర్ మూవీలో ఐటమ్ సాంగ్తో అలరించిన భామ.. ఇటీవల ఎక్కువగా ఐటమ్ సాంగ్స్తోనే మెప్పిస్తోంది. తాజాగా స్త్రీ-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్లో మెరిసింది. ఈ మూవీ నుంచి ఆజ్ కీ రాత్ అనే ఐటమ్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో తమన్నా భాటియా తన అందం, డ్యాన్స్తో అభిమానులను కట్టిపడేసింది. కాగా.. ఈ చిత్రంలో ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటిస్తున్నారు. ఈ మూవీని హారర్-కామెడీ చిత్రంగా తెరకెక్కిచారు. ఈ మూవీకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించగా.. దినేశ్ విజన్, జ్యోతి దేశ్పాండే నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో పంకడ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
మన్నారా మతిపోయే గ్లామర్ ట్రీట్.. చీరకట్టులో రకుల్
బికినీ అందాలతో హీట్ పెంచేలా లక్ష్మీ రాయ్హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సోనాక్షి సిన్హాకుందనపు బొమ్మలా మెరిసిపోతున్న ఐశ్వర్య లక్ష్మిడస్కీ లుక్లో బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి మదివాడచీరకట్టులో చాలా సింపుల్గా రకుల్ ప్రీత్ సింగ్ఎర్ర గులాబీ అంత అందంగా హీరోయిన్ తాప్సీపుట్టినరోజు సెలబ్రేషన్స్లో 'బలగం' బ్యూటీహీరోయిన్ మన్నారా చోప్రా గ్లామర్ ట్రీట్ View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Mannara Chopra (@memannara) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
లేడీ పోలీస్ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
'కలర్ ఫోటో' సినిమా హీరోయిన్ చాందిని చౌదరి లేటెస్ట్ మూవీ 'యేవమ్'. లేడీ ఓరియెంటెడ్ కథతో తీసిన ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలో చాందిని పోలీస్గా నటించింది. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ 'యేవమ్' సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: Kill Movie Review: 'కిల్' సినిమా రివ్యూ)షార్ట్ ఫిల్మ్స్ హీరోయిన్ గా నటిగా మారిన చాందిని చౌదరి.. కొన్నాళ్ల పాటు సైడ్ క్యారెక్టర్స్ చేసింది. 'కలర్ ఫోటో' వల్ల ఈమెకు గుర్తింపు దక్కింది. దీని తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. వారాల వ్యవధిలో ఈమె నటించిన యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి మూవీస్ థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో 'యేవమ్' చిత్రాన్ని తాజాగా ఆహా ఓటీటీలో జూలై 25 నుంచి అంటే గురువారం మధ్యాహ్నం నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.'యేవమ్' కథ విషయానికొస్తే.. వికారాబాద్ పోలీస్ స్టేషన్లో సౌమ్య (చాందిని చౌదరి)కి ప్రొబేషనరీ ఎస్సైగా పోస్టింగ్ వస్తుంది. అదే స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సైతో ప్రేమలో పడుతుంది. మరోవైపు అదే స్టేషన్ ఫరిదిలో యుగంధర్ అనే వ్యక్తి, హీరోల పేర్లు చెప్పి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తుంటాడు. ఇతడి వల్ల ఓ అమ్మాయి హత్యకు గురవుతుంది. సౌమ్యకి యాక్సిడెంట్ అవుతుంది. చివరకు ఏమైంది? పోలీసులు యుగంధర్ని పట్టుకున్నారా లేదా అనేదే పాయింట్.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ) -
ఒలింపిక్ ఆరంభ వేడుకలకు మెగా ఫ్యామిలీ.. చిరంజీవి పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా త్రిష కనిపించనుంది. ఈ సినిమాను సోషియో ఫ్యాంటసీ అడ్వెంచెరస్గా తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. కాగా.. విశ్వంభర సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.అయితే ప్రస్తుతం షూటింగ్ లేకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు బయలుదేరి వెళ్లారు. తన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి లండన్లో విహరిస్తున్నారు. ఓ పార్క్లో తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ఒలింపిక్స్ ఆరంభ ఈవెంట్ కోసం పారిస్కు వెళ్తున్నట్లు తెలిపారు. రేపటిలోగా అక్కడికి చేరుకుంటామని వెల్లడించారు. తాజాగా లండన్లోని హైడ్ పార్క్లో కుటుంబంతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈనెల 26 నుంచి పారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. Relishing a serene moment with family and the grand little one Klin Kaara at Hyde Park London, en route our journey to Paris tomorrow! Summer Olympics 24 Inaugural Event Beckons :) pic.twitter.com/bFa31zBh3a— Chiranjeevi Konidela (@KChiruTweets) July 24, 2024
Related News by category
-
‘తల్లీ నిర్మల’.. ఖర్గే మాటలతో రాజ్యసభలో నవ్వులు
న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం(జులై 24) బడ్జెట్పై చర్చ సందర్భంగా నవ్వులు పూశాయి. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ను ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ‘మాతాజీ’ అని సంబోధించారు.వెంటనే చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ జోక్యం చేసుకుని ఆమె మీకు కూతురులాంటిది అని ఖర్గేను ఉద్దేశించి అన్నారు. దీంతో సభ్యులంతా ఒక్కసారిగా విరగబడినవ్వారు. కేంద్ర బడ్జెట్లో ఈసారి కేవలం బిహార్, ఏపీల ప్లేట్లలోనే జిలేబి, పకోడి వడ్డించారని, మిగతా రాష్ట్రాల ప్లేట్లన్నీ ఖాళీగానే ఉన్నాయని ఖర్గే అన్నారు. ఇంతలో ఆర్థిక మంత్రి నిర్మల మాట్లాడతారని చైర్మన్ ఖర్గేతో అన్నారు. మాతాజీ నిర్మల మాట్లాడడంలో మంచి నేర్పరి..నేను మాట్లాడడం అయిన తర్వాత ఆమెను మాట్లాడమనండి అని ఖర్గే చైర్మన్ను కోరారు. దీనికి స్పందించిన చైర్మన్ ఆమె మీకు కూతురులాంటిది అనడంతో సభలో నవ్వులు పూశాయి. -
పాపులారిటీ కోసం పాకులాట.. ‘స్పైడర్ మ్యాన్’ అరెస్ట్
సోషల్ మీడియాలో తొందరగా పాపులరిటీ సంపాదించేందుకు కొందరు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటారు. చేయకూడని పనులు చేసి చిక్కుల్లో పడుతున్నారు. రకరకాల రీల్స్ చేస్తూజనాల చేత తిట్లు తింటున్నారు. ప్రమాదకర స్టంట్లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటివి మానుకోవాలని అధికారులు చెబుతున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు.తాజాగా ఓ వ్యక్తి తన ప్రమాదకర స్టంట్తో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి కటకటాల పాలయ్యాడు. పట్టుమని 20 ఏళ్లు కూడా నిండని ఆదిత్య అనే వ్యక్తి మరో యువకుడితో కలిసి ఢిల్లీ రోడ్డుపై డేంజరస్ స్టంట్లు చేశాడు. ద్వారక ప్రాంతంలో గౌరవ్ సింగ్ (19) డ్రైవింగ్ చేస్తుండగా.. స్పైడర్ మ్యాన్ వేషం ధరించిన ఆదిత్య కారు బానెట్పై నిలబడి ప్రమాదకర స్టంట్లు వేశాడు.దీనిని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో అనేక మంది ఫిర్యాదు చేశారు. చివరికి సమాచారం అందుకున్న ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.. యువకులపై చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఇద్దరినీ కస్టడీలోకి తీసుకున్నారు. Delhi | On receiving a complaint on social media about a car seen on Dwarka roads with a person dressed as Spiderman on its bonnet, the Delhi Traffic Police took action. The person in the Spiderman costume was identified as Aditya (20) residing in Najafgarh. The driver of the… pic.twitter.com/UtMqwYqcuK— ANI (@ANI) July 24, 2024ప్రమాదకర డ్రైవింగ్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడం, సీటు బెల్టు ధరించకపోవడం వంటి చర్యలకు పాల్పడినందుకు జైలు శిక్షతో పాటు రూ. 26 వేల జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఆదిత్య గతంలోనూ స్పైడర్ మ్యాన్ దుస్తుల్లో ప్రమాదకర స్టంట్లకు పాల్పడి కటకటాల పాలైనట్లు తెలుస్తోంది. -
కేంద్రంపై రైతులకు విశ్వాసం లేనట్లుంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అపనమ్మక(విశ్వాసంలేని) పరిస్థితులున్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం కేంద్రం కొన్ని చర్యలు చేపట్టాలని కోర్టు అభిప్రాయపడింది. రాజధాని ఢిల్లీ, హర్యానాకు సరిహద్దుగా ఉన్న శంభూ ప్రాంతంలో రైతుల ఆందోళన సమయంలో బారికేడ్లు తొలగించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం(జులై 24) ఈ వ్యాఖ్యలు చేసింది.రైతుల సమస్యలను తీర్చేందుకు కేంద్రప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని సూచించింది. అసలు రైతులు ఢిల్లీకి ఎందుకు రావాలనుకుంటారని ప్రశ్నించింది. మీపై వారికి విశ్వాసం లోపించినట్లు కన్పిస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు, ప్రభుత్వం మధ్య విశ్వాసం కలిగించే అంపైర్లాంటి వ్యక్తి కావాలని కోర్టు పేర్కొంది. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ప్రతిపాదించింది.దీనిపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని, అప్పటిదాకా శంభూ సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని కోరింది. సరిహద్దులోని బారికేడ్లను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. కాగా, రైతుల ఉద్యమం సందర్భంగా హర్యానాలోని అంబాలాకు సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను వారంలోగా తొలగించాలని ఇటీవల పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
‘నీట్’రద్దుపై మరో రాష్ట్రం కీలక నిర్ణయం
కోల్కతా: నీట్ పరీక్షను రద్దు చేయబోమని, పేపర్ లీకేజీకి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం తీర్పిచ్చింది. ఆ తీర్పు పరిణామల అనంతరం నీట్ పరీక్ష కోసం రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్రాల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.తాజాగా, తమిళనాడు బాటలో పశ్చిమ బెంగాల్ చేరింది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మెడికల్ కాలేజీలో తమ విద్యార్థులను చేర్చుకోకుండా రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, నీట్ అమలుకు ముందు మాదిరిగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు మాట్లాడుతూ..తాము అఖిల భారత పరీక్షలకు (నీట్) ఎప్పుడూ అనుకూలంగా లేమని, అయితే అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఒప్పించారని అన్నారు.#Breaking | West Bengal govt passes anti-NEET Resolution after the 'No Re-Test' Verdict of SC The anti-NEET resolution was passed after two days of discussion...: @pooja_news shares more details with @Swatij14 #NEETExam pic.twitter.com/R7vT0ATkv9— TIMES NOW (@TimesNow) July 24, 2024 నీట్లాంటి పరీక్షల నిర్వహణ బాధ్యతను కేంద్రం తీసుకునే సమయంలో మేం వ్యతిరేకించాం. నీట్ పరీక్షలను కేంద్రం నిర్వహించకూడదని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ చెప్పారని ఆయన అన్నారు. అయినప్పటికీ నీట్ లాంటి పరీక్షలను కేంద్రమే నిర్వహిస్తోందికానీ ఇప్పుడు అలాంటి వ్యవస్థలోని లోపాలు విద్యా వ్యవస్థను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. కాబట్టే మేం పాత నీట్ పరీక్ష విధానాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు తెలిపారు. -
పాక్ ప్రియుణ్ణి పెళ్లాడిన యూపీ మహిళ
ప్రేమ కోసం దేశ సరిహద్దులు దాటుతున్న వారి జాబితాలో ఇప్పుడు యూపీకి చెందిన నగ్మా చేరింది. ఇటువంటి ఉదంతాలు అటు పోలీసులకు, ఇటు ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని థానేకు చెందిన పోలీసులు తాజాగా 24 ఏళ్ల మహిళను విచారిస్తున్నారు. ఆమె గత మే నెలలో పాకిస్తాన్ వెళ్లి, తరువాత ముంబైకి తిరిగి వచ్చింది. ఈ సంగతి తెలుసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. నగ్మా తన బిడ్డతో సహా పాకిస్తాన్ వెళ్లినట్లు పోలీసులకు తెలియవచ్చింది. అయితే ఆ మహిళ నకిలీ పత్రాలు, మారుపేరుతో పాకిస్తాన్కు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.నకిలీ పత్రాలను ఉపయోగించి పాస్పోర్ట్, వీసా పొందడంలో నగ్మాకు సహాయం చేసిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆమె తాను పాకిస్తాన్కు చెందిన వ్యక్తిని ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నానని, అతనిని పాకిస్తాన్లో పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపింది. ఈ నేపధ్యంలో ఆమె వివాహ ధ్రువీకరణ పత్రం కూడా పోలీసులకు దొరికింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగ్మా స్వస్థలం ఉత్తరప్రదేశ్. ఆమె ఉద్యోగరీత్యా థానేలో ఉంటోంది. ప్రస్తుతం పోలీసులు నగ్మా డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు.
Advertisement