స్కూటీని లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
హైదరాబాద్ (సంతోష్ నగర్) : స్కూటీని లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్లోని డీఆర్డీఎల్ సంస్థ కార్యాలయుం సమీపంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు చోటుచేసుకుంది. స్కూటీ పై వెళుతున్న వారిని వెనక నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.