'రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాదిగలను ఎన్నికల్లో వాడుకొని అధికారం చేపట్టాక వారి సంక్షేమాన్ని మరిచారని' ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
నిజామాబాద్ (సిరికొండ): 'రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాదిగలను ఎన్నికల్లో వాడుకొని అధికారం చేపట్టాక వారి సంక్షేమాన్ని మరిచారని' ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండలో బుధవారం స్థానిక నాయకులు నిర్వహించిన సభకు మందకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాదిగలను ఏవిధంగా మోసం చేశారో వివరించారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టేంతవరకు విశ్రమించకుండా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.