ప్రజలా..? మాస్టర్ మైండా...? | Whose interest is paramount to Govt of AP, says KTR | Sakshi
Sakshi News home page

ప్రజలా..? మాస్టర్ మైండా...?

Published Wed, Jun 24 2015 4:55 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

ప్రజలా..? మాస్టర్ మైండా...?

ప్రజలా..? మాస్టర్ మైండా...?

అవినీతిపరులను కాపాడేలా ఏ చట్టం ఉండదని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

హైదరాబాద్: అవినీతిపరులను కాపాడేలా ఏ చట్టం ఉండదని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 'ఓటు కోట్లు' వ్యవహారంపై ట్విటర్ వేదికగా చంద్రబాబుపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. రాజ్యాంగబద్దంగా రూపొందించిన ఏ చట్టమైనా, సెక్షనైనా ప్రజలను కేంద్రబిందువుగా చేసుకుని ఉంటుందన్నారు. ఏపీ ప్రభుత్వం 5 కోట్ల ప్రజల ప్రయోజనాలు కాపాడుతుందా లేదా రూ. 5 కోట్లతో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన మాస్టర్ మైండ్ ను కాపాడుతుందా అని ప్రశ్నించారు.

ఏడాది కాలంగా అత్యంత ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్, తెలంగాణలో సెక్షన్ 8 పెట్టాలని ఏపీ సర్కారుకు ఇప్పుడు గుర్తుకురావడం శోచనీయమన్నారు. విభజన బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో సెక్షన్ 8 చెల్లదని అరుణ్ జైట్లీ చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ పై వివాదాలు చేయడం మానుకుని, ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని టీడీపీ ప్రభుత్వానికి హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement