వాజేడు (ఖమ్మం) : స్నేహితులతో కలిసి జలపాతంలోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వాజేడు మండలం బోగత జలపాతం వద్ద శనివారం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నల్లబల్లికి చెందిన అఖిల్ (20) స్నేహితులతో కలిసి బోగత జలపాతానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి జలపాతంలో పడి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన అతను స్నేహితులు, స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేస్తున్నారు.