
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ క్యారెక్టర్ నటుడు రాజా రవీంద్ర నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి జయప్రకాశ్ రాజు (70) సోమవారం మరణించారు. బ్రెయిన్ హ్యామరేజ్తో బాధపడుతున్న రాజా రవీంద్ర తండ్రి ఈరోజు ఉదయం 6.30 గంటలకు కన్నుమూశారు. రాజా రవీంద్ర స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.