Andhra Pradesh News
-
టాప్ 50 హెడ్లైన్స్@07:30 AM 23 April 2024
-
మార్నింగ్ ప్రైమ్ టైం@10:40AM 16 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:45AM 16 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:30 AM 12 April 2024
-
టాప్ 50 హెడ్లైన్స్@12:45PM 09 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@7AM 09 April 2024
-
టాప్ 30 న్యూస్@11:15AM 05 April 2024
-
మార్నింగ్ ప్రైమ్ టైం న్యూస్@11AM 05 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@03:15PM 29 March 2024
-
‘సైకిల్’ దొంగ దొరికాడోచ్!
గుంటూరు: పొన్నూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, తాయిలాల ఎరవేసి ఓట్లు దక్కించుకునేందుకు టీడీపీ పన్నాగం పన్నింది. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసి తల్లిదండ్రుల మెప్పుపొందేందుకు భారీ సంఖ్యలో సైకిళ్లను కొనుగోలు చేసింది. టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల స్వగ్రామం చింతలపూడిలోని ఓ రైస్మిల్లులో నిల్వ చేశారు. సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు వాటిని సీజ్ చేశారు. శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు పొన్నూరు నియోజకవర్గం ఎన్నికల అధికారులకు ఫోన్ చేశారు. మండలంలోని చింతలపూడి గ్రామంలోని ఓ రైస్మిల్లో టీడీపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఫొటో, సైకిల్ గుర్తుతో ఉన్న నూతన సైకిళ్లు వందల సంఖ్యలో ఉన్నాయని సమాచారం అందింది. వెంటనే అధికారులు హుటాహుటిన రైస్మిల్కు చేరుకుని వందల సంఖ్యలో ఉన్న సైకిళ్లను చూసి అవాక్కయ్యారు. అన్ని సైకిళ్లకు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ రంగు, గుర్తులు, అభ్యర్థి ఫొటో ఉండటంతో అన్ని సైకిళ్లను సీజ్ చేశారు. సంఘటనా స్థలానికి ఓ వ్యక్తి చేరుకుని తాను కోర్టు ద్వారా ఆక్షన్లో సైకిళ్లను దక్కించుకున్నానని, అధికారులకు తెలిపాడు. అయితే ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా సైకిళ్లు ఉన్నాయని, ఒకేచోట పార్టీ సింబల్స్తో ఇన్ని సైకిళ్లు ఉండరాదని తేల్చిచెప్పారు. కోడ్ ఉల్లంఘించిన కారణంగా 567 సైకిళ్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి వరదరాజులు, ఏంపీడీవో రత్నజ్యోతి తెలిపారు. ధూళిపాళ్ల నరేంద్ర ఎన్నికల తాయిలాల పంపకంతోనే విజయం సాధించే ప్రక్రియకు ఎన్నికల అధికారులు అడ్డుకట్ట వేశారు. ఇవి చదవండి: ‘ఆమ్ ఆద్మీ’ని అంతం చేసే కుట్ర -
సాక్షి స్పీడ్ న్యూస్@07:45 AM 26 March 2024
-
టాప్ 30 హెడ్లైన్స్@11:30AM 21 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:45 AM 21 March 2024
-
టాప్ 30 హెడ్లైన్స్@10:15 AM 19 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:30AM 19 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@02:30PM 13 March 2024
-
AP : సమాచార హక్కు కొత్త కమిషనర్ల ప్రమాణం
విజయవాడ, 11 మార్చి: రాష్ట్ర సమాచార కమీషన్కు నియమించబడిన ముగ్గురు నూతన కమీషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్. జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ మేరకు విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో నూతన సమాచార కమీషనర్లచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ మెహబూబ్ భాషా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సమాచార కమీషనర్లు ఐలాపురం రాజా, శామ్యూల్ జొనాతన్, కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమీషన్ లా సెక్రటరీ జీ. శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్, నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెహానా గురించి.. రెహానా స్వస్థలం కృష్ణా జిల్లా, ఉయ్యూరు. జర్నలిస్టుగా 20 ఏళ్ళ అనుభవం. జర్నలిజంలో పరిశోధనాత్మక కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో అరబ్ షేకుల కాంట్రాక్ట్ వివాహాలు, 2008 ముంబాయి మారణహోమం లైవ్ కవరేజ్, ఉత్తరాఖండ్ వరదల రిపోర్టింగ్, సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి కవరేజ్ వంటివి వీటిలో కొన్ని.. దక్షిణాన తమిళనాడు మొదలు ఉత్తరాన జమ్ము-కాశ్మీర్, పశ్చిమాన గుజరాత్ మొదలు తూర్పున త్రిపుర వరకు 17 రాష్ట్రల నుంచి వివిధ అంశాలపై రిపోర్ట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచినప్పుడు నరేంద్ర మోదీతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు రెహానా ఖాతాలో ఉన్నాయి. భారత భూభాగంలో భారత-పాక్, భారత-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ప్రయాణం చేసి ప్రత్యేక కథనాలు అందించారు. గత ఏడాది టర్కీలో జరిగిన భూకంప ప్రళయాన్ని సాహసోపేతంగా కవర్ చేశారు రెహాన. రెహానా రాసిన పుస్తకాలు అంతర్జాతీయ సరిహద్దుల్లో చేసిన పాత్రికేయ ప్రయాణ అనుభవాలతో "సరిహద్దుల్లో.." పేరుతో పుస్తకం తెచ్చారు. ఈ పుస్తకం "ఫ్రాంటియర్" పేరుతో ఇంగ్లీషులో అనువాదం అయ్యింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనాన్ని "పెన్ డ్రైవ్" పేరుతో వెలువరించారు. టర్కీ భూకంప కవరేజ్ అనుభవాలతో టర్కీ @7.8 టైటిల్ తో పుస్తకం తెచ్చారు. అవార్డులు-రివార్డులు.. తెలంగాణ ప్రభుత్వ బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు, తెలంగాణా ప్రెస్ అకాడమీ అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, వివిధ సంస్థల పురస్కారాలు, అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా జర్నలిస్టు పురస్కారంతో సత్కరించింది. ఏపీ మీడియా అకాడమీ కూడా బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పురస్కారం అందజేసింది. నిర్వర్తించిన ఇతర బాధ్యతలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ సభ్యురాలు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ సభ్యురాలిగా, ఏపీ మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇవి చదవండి: మనబడి ‘ఐబీ’కి అనుకూలం! -
టాప్ 50 హెడ్లైన్స్@08:30AM 05 March 2024
-
టాప్ హెడ్లైన్స్@06:30AM 05 March 2024
-
సాక్షి టాప్ హెడ్లైన్స్@06:45AM 21 February 2024
-
టాప్ హెడ్లైన్స్@06:30AM 20 February 2024
-
ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని తీవ్ర నిర్ణయం..
బాపట్ల: పరీక్షలు సరిగ్గా రాయలేనేమోననే బెంగతో మానసిక ఒత్తిడికి గురైన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బుధవారం సాయంత్రం మార్టూరులో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బలరాం కాలనీకి చెందిన తిరుమలశెట్టి నాగేశ్వరరావు కుమార్తె ప్రవల్లిక (16) చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. త్వరలో జరగబోతున్న పరీక్షలు సరిగా రాయలేనేమోనని తరచూ స్నేహితులతో చెప్పే ప్రవల్లిక మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు చీరెతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బైక్.. క్షణంలో ఇద్దరూ.. -
టాప్ 50 హెడ్లైన్స్@6AM 13 February 2024
-
టాప్ 30 హెడ్లైన్స్@9PM 07 February 2024
-
టాప్ 30 హెడ్లైన్స్@09:45AM 23 January 2024
-
టాప్ 30 హెడ్లైన్స్@02:50PM 18 January 2024
-
టాప్ 30 హెడ్లైన్స్@7AM 16 January 2024
-
టాప్ 30 హెడ్లైన్స్@5PM 12 January 2024
-
టాప్ 30 హెడ్లైన్స్@03:45PM 12 January 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@09:45AM 12 January 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@09:45AM 11 January 2024
-
టాప్ 30 హెడ్లైన్స్@04:45PM 05 January 2023
-
వికేంద్రీకరణను అడ్డుకుంటున్న విజ్ఞత లేని పార్టీలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించకుండా కొన్ని విజ్ఞత లేని రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయని పరిపాలనా వికేంద్రీకరణ నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజిపతిరాయ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన గురువారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ పరిపాలనా రాజధాని విషయంలో న్యాయపరమైన నిర్ణయం మరింత ఆలస్యం కావడంపై విచారం వ్యక్తంచేశారు. ఏదో ఒకరకమైన సాంకేతిక అంశాలను లేవనెత్తి సుప్రీంకోర్టులో త్వరితగతిన తీర్పు రాకుండా విజ్ఞత లేని రాజకీయ పార్టీలు అడ్డుకోవడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయించే అధికారం ఆయా ముఖ్యమంత్రులకు లేదని తెలిపే అధికరణ భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన స్పష్టంచేశారు. మారుతున్న అభివృద్ధి.. అవసరాల దృష్ట్యా పరిపాలనా వికేంద్రీకరణను ఇప్పటికే ప్రపంచంలో 14కు పైగా దేశాలు పాటిస్తున్నాయని చెప్పారు. మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో హైకోర్టు ఒకచోట ఉంటే శాసనసభ వ్యవహారాలు మరోచోట ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇవి చదవండి: Fact Check: ‘మీటర్ల’ కొద్దీ అసత్యాలు అల్లేస్తున్నారు! -
టాప్ హెడ్లైన్స్@10:30AM 02 January 2023
-
సాక్షి స్పీడ్ న్యూస్@09:45AM 02 January 2024
-
టాప్ 30 హెడ్లైన్స్@07:45AM 02 January 2024
-
తెలుగు తమ్ముళ్ల డిష్యుం డిష్యుం! తన్నుకున్నారిలా..
తూర్పుగోదావరి: కొత్త సంవత్సరం ఆరంభం రోజునే తునిలో తెలుగు తమ్ముళ్లు తన్నులాటలకు దిగారు. యనమల బ్రదర్స్ అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయి.. డిష్యుం డిష్యుం అంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు.. తన కళ్ల ముందే తెలుగు ‘తమ్ముళ్లు’ అరుపులు, కేకలతో.. ముష్టిఘాతాలతో ఫైటింగ్కు దిగినా.. ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు సైలెంటుగా ఉండిపోవడం చూపరులను విస్మయపరచింది. తన వరకూ వస్తేనే కానీ తత్త్వం బోధపడదంటారు పెద్దలు. ప్రజాదరణ కోల్పోయి, అధికారానికి దూరమై ఏళ్లు గడుస్తున్నా పార్టీలో గ్రూపులను కట్టడి చేయలేని దుస్థితిని తెలుగుదేశం అగ్ర నేతలు ఎదుర్కొంటున్నారు. టీడీపీలో గ్రూపు రాజకీయాలకు ఆది గురువుగా విమర్శలు ఎదుర్కొనే శాసనమండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు దాదాపు అటువంటి పరిస్థితే ఎదురైంది. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఆయన.. టీడీపీ ఆవిర్భావం నుంచీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై ఆధిపత్యం కోసం.. ఇటు కాకినాడ మెట్ట ప్రాంతం, అటు కోనసీమలో గ్రూపులను పెంచి పోషిస్తూ వచ్చారు. టీడీపీ అధికారంలో ఉండగా జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, దివంగత నేతలు మెట్ల సత్యనారాయణరావు, బొడ్డు భాస్కర రామారావులను గ్రూపులుగా చేసి, ఉమ్మడి జిల్లాపై పెత్తనాన్ని చెలాయించిన చరిత్ర రామకృష్ణుడు సొంతమనే వారు ఆ పార్టీలో కోకొల్లలు. ఇన్నేళ్ల పాటు తాను పెంచి పోషించిన గ్రూపు రాజకీయాలు.. తీరా సొంత నియోజకవర్గం తునిలో భగ్గుమనేసరికి రామకృష్ణుడికి దిక్కుతోచడం లేదనే చర్చ టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. రగులుతున్న కృష్ణుడి వర్గం సొంత కుమార్తె దివ్యను తన రాజకీయ వారసురాలిగా చేసేందుకు.. మూడు దశాబ్దాలుగా తన వెంట నడిచిన వరుసకు సోదరుడైన యనమల కృష్ణుడిని బలవంతంగా టీడీపీ తుని నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి రామకృష్ణుడు తప్పించారు. అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను దివ్యకు అప్పగించారు. ఆమెకు పార్టీలో ఎదురుండకూడదనే ఉద్దేశంతో కృష్ణుడిని వ్యూహాత్మకంగానే తప్పించారని ఆయన వర్గం కొంత కాలంగా రగిలిపోతోంది. దివ్యకు పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించడంపై కినుక వహించిన కృష్ణుడు.. కొంత కాలం అలకబూనారు. రాజకీయంగా పక్క చూపులు చూశారు. ఆ సమయంలో నియోజకవర్గ బాధ్యతలను రామకృష్ణుడి సొంత సోదరుని కుమారుడు రాజేష్ తన భుజాన వేసుకున్నారు. విధి లేని పరిస్థితుల్లో కృష్ణుడు టీడీపీలో తిరిగి క్రియాశీలకంగా మారారు. పార్టీపై పెత్తనం కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. అప్పటికే దివ్య కనుసన్నల్లో నియోజకవర్గ బాధ్యతలను కృష్ణుడు చూస్తున్నా.. టీడీపీ తొండంగి మండల బాధ్యతలు మాత్రం రాజేష్ చేతుల్లోనే ఉన్నాయి. ఒకప్పుడు నియోజకవర్గం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న కృష్ణుడి వర్గానికి ఇది అవమానంగానే అనిపించింది. దీంతో ఆ వర్గం సమయం కోసం వేచి చూస్తోంది. ముందస్తు వ్యూహమేనా..! రాజేష్ను ఎంత మాత్రం భరించలేని కృష్ణుడు నయాన భయాన ఆయనను పార్టీకి దూరం చేసేందుకు కొంతకాలం నుంచి ఎత్తుగడలు వేస్తున్నారు. దీనిలో భాగంగానే తొలి ప్రయత్నంగా సోమవారం జరిగిన నూతన సంవత్సర వేడుకలను వేదికగా చేసుకున్నారు. రామకృష్ణుడు కళ్లెదుటే రచ్చరచ్చ చేశారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే కృష్ణుడు తన అనుచరులతో రాజేష్పై దాడి చేయించారని టీడీపీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. తన్నుకున్నారిలా.. తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు వద్ద సాయి వేదికలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఇందులో యనమల రామకృష్ణుడు, దివ్యలకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పలు గ్రామాల నుంచి తెలుగు తమ్ముళ్లు వచ్చారు. వారు వరుస క్రమంలో వెళ్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో రామకృష్ణుడి సొంత అన్న కుమారుడు రాజేష్ అక్కడకు చేరుకున్నారు. రామకృష్ణుడిని, దివ్యను కలిసేందుకు క్యూతో ప్రమేయం లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. అదను కోసం వేచి ఉన్న కృష్ణుడి వర్గీయులు దీనిని అవకాశంగా మలచుకున్నారు. అందరూ క్యూలోనే రావాలంటూ అక్కడున్న వారిని అప్పటికే వారు కట్టడి చేస్తున్నారు. ఈ సమయంలో రాజేష్ క్యూలో కాకుండా నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో అతడిని కృష్ణుడి వర్గం లక్ష్యంగా చేసుకుని ఒక్కసారిగా దాడులకు దిగింది. రాజేష్పై ఆయన సొంత చిన్నాన్న రామకృష్ణుడు, దివ్య సమక్షంలోనే పిడిగుద్దులతో ఈ దాడి జరిగింది. అయినప్పటికీ రామకృష్ణుడి అనుచరులు కిమ్మనకుండా ఉండిపోయారు. ఇరు వర్గాలకూ సర్ది చెప్పలేక, వారిని కట్టడి చేయలేక నిర్లిప్తంగా చూస్తూ ఊరుకుండిపోయారు. ఆయన సైలెంటుగా ఉండిపోవడానికి కృష్ణుడు దూరమైతే రాజకీయంగా ఇబ్బంది పడతామనే భయం తప్ప మరొకటి కారణం కాదని పలువురు అంటున్నారు. కుమార్తె దివ్య ఇన్చార్జిగా ఉన్న సొంత నియోజకవర్గం తునిలోనే కళ్లెదుటే ఇంత జరిగినా.. చివరకు ఇరువర్గాలను సముదాయించడానికి తలప్రాణం తోకకొచ్చినట్టయ్యిందని అంటున్నారు. ఇన్నేళ్లూ పార్టీలో గ్రూపులను ప్రోత్సహించిన యనమల.. రక్త సంబంధీకులు, దాయాదుల పోరు, గ్రూపు రాజకీయాలు భగ్గుమనడంతో.. వాటి ప్రభావాన్ని స్వయంగా రుచి చూశారని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇవి చదవండి: దిగజారుతున్న టీడీపీ గ్రాఫ్.. 'పరిటాల' ఓవరాక్షన్కు బ్రేక్..! -
దిగజారుతున్న టీడీపీ గ్రాఫ్.. 'పరిటాల' ఓవరాక్షన్కు బ్రేక్..!
సాక్షి, అనంతపురం: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష టీడీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు విభేదాలతో తమ్ముళ్లు బాహాబాహీకి దిగుతున్నారు. ఎవరికి వారు గ్రూపులుగా ఏర్పడి వేరు కుంపట్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఇన్చార్జ్లుగా కొనసాగుతున్న వారిని బరిలో దింపితే సహకరించే ప్రసక్తే లేదని ప్రతి నియోజకవర్గంలోనూ వ్యతిరేక వర్గం తేల్చి చెబుతోంది. దీంతో ఎవరిని పోటీలో నిలపాలో తెలియక టీడీపీ పెద్దలు నానా తంటాలు పడుతున్నారు. దిగజారుతున్న టీడీపీ గ్రాఫ్.. టీడీపీ పెద్దలు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థిపై ఇప్పటికే పలు కోణాల్లో రహస్యంగా సర్వేలు చేసినట్లు సమాచారం. అయినా ఎక్కడా అనుకున్న ఫలితం రానట్లు తెలుస్తోంది. మరోవైపు ఫ్లెక్సీల ఏర్పాటు నుంచి ప్రతి విషయంలో పబ్లిసిటీ పిచ్చితో ‘తమ్ముళ్ల’ మధ్య వివాదం రాజుకుంటుండగా టీడీపీ గ్రాఫ్ రోజురోజుకూ తగ్గుతోంది. కదిరి, పెనుకొండ, ధర్మవరం, మడకశిర, పుట్టపర్తిలో ఇదే తంతు కొనసాగుతోంది. వర్గ విభేదాలతో పాటు కుల ప్రస్తావన, పెత్తందారీ వ్యవస్థ కారణంగా టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఉన్న ఒక్క సీటు (హిందూపురం) కూడా ఈసారి గెలుస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. రెండు (అనంతపురం, శ్రీసత్యసాయి) జిల్లాల్లో భాగంగా ఉన్న రాప్తాడులో అధికంగా బీసీ ఓటర్లు వైఎస్సార్సీపీ మొగ్గు చూపుతున్నారు. దీంతో అక్కడ ‘పరిటాల’ కుటుంబానికి ఈసారి కూడా ఓటమి తప్పేలా లేదు. పెనుకొండలో కురు‘బల పోరు’ టీడీపీకి 1994 నుంచి అనుకూలంగా ఉన్న పెనుకొండలో 2019లో భిన్న ఫలితాలు వచ్చాయి. ఈసారి కూడా అదే ఊపు కొనసాగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మూడోసారి ఓడిపోయిన బీకే పార్థసారథి పోటీకి ముందుకు రావడం లేదని సమాచారం. మరోవైపు బీకే పార్థసారథి సామాజిక వర్గానికి చెందిన సవితమ్మ బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ బీకే పార్థకు తెలియకుండా.. కార్యక్రమాలు చేయడం విభేదాలకు ఆజ్యం పోసినట్లు అవుతోంది. అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపినా మరో వర్గం పని చేయదనే క్లారిటీ ఉండటంతో పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. కదిరిలో కుల రాజకీయం.. గత నాలుగు ఎన్నికలను పరిశీలిస్తే కదిరిలో టీడీపీ ఒకసారి మాత్రమే గెలిచింది. అయినా.. ఇక్కడ కుల రాజకీయం మాత్రం తగ్గలేదు. ముస్లిం ఓట్లు అధికంగా ఉన్నప్పటికీ.. పరిటాల కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కందికుంట వెంకట ప్రసాద్కు పగ్గాలు ఇవ్వడంతో చాలామంది తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ముస్లిం ఓటర్లు వ్యతిరేకిస్తే గెలవడం కష్టమన్న భావనలో కందికుంట వెంకట ప్రసాద్ ఉన్నారు. మరోవైపు నకిలీ డీడీల కుంభకోణం కేసుసైతం అతన్ని వెన్నాడుతోంది. ఈ నేపథ్యంలోనే పోటీ చేయాలా, వద్దా అనే సందేహంలో పడ్డారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు అత్తార్ చాంద్బాషా ప్రయత్నిస్తున్నారు. పుట్టపర్తిలో ఇంటిగోల.. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. సొంత పార్టీ నేతలు వడ్డే వెంకట్, మల్లెల జయరామ్, పెదరాసు సుబ్రమణ్యం, పీసీ గంగన్న...ఇలా ఎవరికి వారుగా పల్లె రఘునాథరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ‘‘ఈ సారి పరిస్థితి బాగోలేదు.. వద్దులే నాన్న’’ అని ఆయన తనయుడు సూచించినట్లు సమాచారం. దీంతో సొంత కులం, సొంత ఇల్లు, సొంత పార్టీ నుంచి వ్యతిరేకత రావడంతో పల్లె రఘునాథరెడ్డి కూడా పునరాలోచనలో పడినట్లు సమాచారం. ‘పరిటాల’ ఓవరాక్షన్కు బ్రేక్.. రాప్తాడు, ధర్మవరంలో ‘పరిటాల’ కుటుంబ పెత్తనం ఎక్కువైంది. రాప్తాడులో ఓటమితో పరిటాల శ్రీరామ్ ఈసారి ధర్మవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నా...పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. అక్కడ శ్రీరామ్కు సొంత సామాజిక వర్గానికి చెందిన వరదాపురం సూరి నుంచి రాజకీయంగా ప్రమాదం పొంచి ఉంది. కాగా.. రాప్తాడు ఇన్చార్జ్గా ఉన్న సునీతను కాదని.. శ్రీరామ్ అక్కడి నుంచే బరిలో దిగుతారనే ప్రచారం మరోవైపు సాగుతోంది. దీంతో పరిటాల కుటుంబానికి మరోసారి పరాభవం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మడకశిరలో పెత్తందారీ వ్యవస్థ.. ఎస్సీలకు రిజర్వు చేసిన మడకశిర నియోజకవర్గంలోనూ పెత్తందారు గుండుమల తిప్పేస్వామికి పెత్తనం ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్నను ప్రతి సందర్భంలోనూ గుండుమల అవమానిస్తూ వస్తున్నారు. ఈరన్నకు కాకుండా మరెవరికై నా టికెట్ ఇప్పించాలని గుండుమల ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎస్సీ వర్గమంతా అధిష్టానంపై గుర్రుగా ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రెండు – మూడు గ్రూపులుగా విడిపోయారు. ఎవరు పోటీ చేసినా.. సమన్వయం చేసుకోవడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఫలితంగా ఏ వర్గం బరిలో దిగినా.. ఓడించాలనే ఉద్దేశంతో మిగతా వర్గాలు నిప్పు రాజేస్తున్నాయి. హిందూపురంలోనూ మారని తీరు.. సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే హోదాలో చుట్టపుచూపుగా హిందూపురం వస్తుంటారు. ఈసారి పోటీ చేస్తారో, లేదో తెలీదు. నారా లోకేశ్ హిందూపురం వస్తారనే ప్రచారం సాగుతోంది. స్థానికంగా నాయకత్వం లేక.. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారుగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఫలితంగా ఓ వర్గం ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తే మారోవర్గం వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడ ఎవరు పోటీ చేసినా ఓటమి ఖాయమని టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు. ఇవి చదవండి: అది చంద్రబాబు మనస్తత్వం.. వాళ్ల అరాచకం ఇలాగే ఉంటుంది: మంత్రి అంబటి ఫైర్ -
టాప్ 30 హెడ్లైన్స్@4PM 29 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@02:45PM 28 December 2023
-
జనవరి 19న అంబేద్కర్ విగ్రహావిష్కరణ: సజ్జల
సాక్షి, అమరావతి: జనవరి 19న విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని బుధవారం జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో ఏ మూల నుంచి చూసినా రాజ్యాంగనిర్మాత అంబేడ్కర్ కనిపిస్తారని చెప్పారు. సామాజిక న్యాయానికి వైఎస్సార్సీపీ, సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేసినట్లు తెలిపారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చరిత్రలో నిలిచిపోయే బహుమానమని పేర్కొన్నారు. భారతజాతి గురించి, మనదేశం గురించి చెప్పాలనుకున్నా మొదట చెప్పాల్సిన పేర్లలో అంబేడ్కర్ పేరు ఉంటుందన్నారు. అది ప్రతి రాజకీయనేత తలుచుకునే పేరన్నారు. అంబేడ్కర్ని ఓ సిద్ధాంతంగా తీసుకుని మనసావాచా నమ్మిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. అది సీఎం జగన్ మాత్రమేనని చెప్పారు. విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటులో వైఎస్ జగన్ సంకల్పం కనిపిస్తుందన్నారు. అంబేడ్కర్ ఎక్కడో ఊరిబయట కాదు.. నగరం నడిబొడ్డున ఉండాలని సీఎం జగన్ భావించారన్నారు. అదృష్టవశాత్తు విజయవాడ నగరం కూడా అందుకు చాలా సానుకూలమైందన్నారు. ప్రోగ్రెసివ్ ఆలోచనలకు పురిటిగడ్డ అయిన విజయవాడ రాజకీయపరమైన ఆలోచనలో అత్యంత అభ్యుదయకరమైన ఆలోచనలకు, స్వాతంత్ర పోరాటానికి యూనివర్సల్గా అన్నింటిని యాక్సెప్ట్ చేసిన నగరమని చెప్పారు. అందుకే అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి మాట్లాడుతూ రూ.400 కోట్లతో సీఎం జగన్ విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుచేయడం పెద్ద చరిత్ర సృష్టిస్తోందన్నారు. చంద్రబాబు ఎక్కడో ముళ్లకంపల్లో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తే సీఎం జగన్ మాత్రం విజయవాడలో ఎంతో విలువైన స్థలంలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. దళితులను అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్న సీఎం జగన్కి అందరూ అండగా నిలవాలన్నారు. దళితులంతా ఐకమత్యంగా ఉండాలని సూచించారు. టీడీపీలోని ఎస్సీ లీడర్లు కూడా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శాసనమండలి చైర్మన్ మోషేన్రాజు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహావిష్కరణ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో చేయాలన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి దళిత కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి పేట, ప్రతి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ గురించి తెలియజేయాలని సూచించారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో సీఎం జగన్ ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. గతంలో అంబేడ్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తానని చెప్పిన చంద్రబాబు దళితులను మోసం చేశారన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. దళితులంటే అసహ్యంగా భావిస్తారని చెప్పారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు ప్రతి దళితుడు గర్వంగా ఫీలవ్వాల్సిన అంశమని పేర్కొన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు. పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున పెట్టాలని సీఎం జగన్ గొప్ప ఆలోచన చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ దళితవర్గాలను పైకి తీసుకురావాలనేది సీఎం జగన్ దృఢసంకల్పమని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు నందిగం సురేష్, గురుమూర్తి, రెడ్డప్ప, ఎమ్మెల్సీలు ఇజ్రాయేల్, ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి.. చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్, పచ్చమీడియా కలసి ప్రభుత్వంపై, సీఎం జగన్పై చేస్తున్న దుష్ప్రచారాన్ని, విమర్శలను పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకత్వాలు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు పేదరికాన్ని ఏ విధంగా తగ్గిస్తున్నాయి, రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతిపథంలోకి తీసుకెళ్తున్నాయనే విషయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం ద్వారాగానీ, ప్రెస్మీట్ నిర్వహించిగానీ ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని అరికట్టేవిధంగా పనిచేయాలని కోరారు. రాష్ట్రస్థాయిలో పార్టీ విధానాలు, ప్రభుత్వ విధానాలపై పార్టీ రాష్ట్ర బాధ్యులు, మంత్రులు మాట్లాడుతుంటారని, కిందిస్థాయిలో ఎస్సీ సెల్ నేతలు, జిల్లా బాధ్యులు చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై సమాధానం చెప్పాలని సూచించారు. ఎన్నికలు రానున్న తరుణంలో ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేయాలన్నారు. మన ఇంట్లో పని సానుకూలం చేసుకునేందుకు ఓ సంకల్పంతో, పట్టుదలతో ఎలా పనిచేస్తామో.. అదేవిధంగా 2024లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేలా కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు. అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారు! ఎన్నికలు వచ్చినప్పుడు గెలిచే పార్టీలో పోటీచేయాలని చాలామంది ఆశపడతారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. టికెట్ల కోసం డిమాండ్ కూడా ఉంటుందన్నారు. నాయకులు ఎక్కువగా ఉన్నప్పుడు పోటీకి ఆశపడతారన్నారు. ఏ పార్టీలోనైనా కొన్ని అసంతృప్తులు సహజమని చెప్పారు. తాడేపల్లిలో బుధవారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. తమ పార్టీ మంచి ఫామ్లో ఉంది కాబట్టే, పోటీచేయటానికి నాయకులు పెద్దసంఖ్యలో వస్తున్నారని తెలిపారు. అసంతృప్తుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారని చెప్పారు. ఎవరూ టికెట్లు అడగలేదు, డిమాండ్ లేదు.. అంటే ఆ పార్టీ ప్రజల మనసుల్లో లేనట్లేనన్నారు. నిరసనలు సాధారణమని పేర్కొన్నారు. టీడీపీ లాంటి ఎత్తిపోయిన పార్టీల్లో అయితే నిరసలు ఉండవని చెప్పారు. పోటీకి ఆశపడే వారితో మాట్లాడతామని, అందరిని ఒక తాటిపైకి తెస్తామని, అదేమీ పెద్ద విషయం కాదని ఆయన తెలిపారు. -
ఏపీ, తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 27 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@04:45PM 26 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@4PM 26 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@01:45PM 26 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@10:45AM 26 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@10AM 26 December 2023
-
ఏపీ, తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 24 December 2023
-
ఏపీ, తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 23 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@3PM 22 December 2023
-
ఏపీ, తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 22 December 2023
-
ఏపీ, తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 20 December 2023
-
సాక్షి స్పీడ్ న్యూస్@09:50AM 19 December 2023
-
ఏపీ, తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 17 December 2023
-
ఏపీ, తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 16 December 2023
-
ఏపీ, తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 15 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@04:45PM 14 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@03:45PM 14 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@02:30PM 14 December 2023
-
ఏపీ, తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 13 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@04:45PM 12 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@02:45PM 12 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@2PM 12 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@12:50PM 12 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@10:45AM 12 December 2023
-
అంతర్వేది బీచ్ వద్ద విషాదం.. నవ వధువరులిద్దరూ..
ఏలూరు: అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి ముచ్చటగా రెండు మాసాలు గడవలేదు. పెళ్లి పందిరి తోరణాలు కూడా వాడలేదు. అంతలోనే నవవధూవరులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. స్వామివారిని దర్శించుకుని తిరిగి ఇంటికి వస్తారని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు నూతన జంట గల్లంతయ్యారనే సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది బీచ్లో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనతో వధూవరుల ఇళ్లు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఏలూరు జిల్లా కలిదిండి మండలం గుర్వాయిపాలెం గ్రామానికి చెందిన అంబటి పరుశురామయ్య, ఉదయలక్ష్మీ మొదటి కుమార్తె గాయత్రీ (21)ని పశ్చిమగోదావరి జిల్లా జువ్వాలపాలెంకు చెందిన రేలంగి బసవలింగం, జయలక్ష్మీ కుమారుడు లక్ష్మీనారాయణ (26)తో నవంబర్ 1న కై కలూరు నియోజకవర్గం సింగరాయపాలెం గుడిలో ఘనంగా వివాహం జరిపించారు. లక్ష్మీనారాయణ బీటెక్, బీఈడీ చేసి భీమవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో కొత్త దంపతులు లక్ష్మీనారాయణ, గాయత్రీ ద్విచక్రవాహనంపై మధ్యాహ్నం 3 గంటలకు అంతర్వేది దేవాలయాన్ని దర్శించుకుని నాలుగు గంటలకు బీచ్కు వెళ్లారు. బంధువులతో కలిసి కాకుండా వాహనంపై బీచ్లో దూరంగా వెళ్లారు. అక్కడ వాహనం, సెల్ఫోన్లు ఉంచి స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. తరువాత కొద్ది సమయానికే వీరు కనిపించలేదు. సెల్ఫోను ఆధారంగా బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో వరుడి తండ్రి బసవలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు, మైరెన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం వరకు వారి జాడ లేదు. ఇవి కూడా చదవండి: 11మందిని పొట్టన పెట్టుకుని? -
ఏపీ 90 స్పీడ్ న్యూస్ @ 11 December 2023
-
ఏపీ, తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 11 December 2023
-
ఏపీ 90 స్పీడ్ న్యూస్ @ 10 December 2023
-
ఏపీ, తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 10 December 2023
-
న్యూస్ దిస్ వీక్ @ 10 December 2023
-
టీడీపీలో ట్విస్ట్.. లోకేష్కు ఊహించని ఎదురుదెబ్బ!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ నేత లోకేష్ యువగళం పాదయాత్రపై ఆ పార్టీ నేతలే పెదవిరుస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర అవసరం లేదని, రూట్ మ్యాప్ మార్చాలంటూ వేడుకుంటున్నారు. మొదటగా ప్రకటించిన షెడ్యూల్లో ఉన్న తమ నియోజకవర్గాలను తప్పించి, కొత్త రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకోవాలని తేల్చిచెబుతున్నారు. పాదయాత్రకు జన సమీకరణ తమ వల్ల కాదని కొందరు అంటుంటే.. పార్టీ అధిష్టానం వైఖరిపై వ్యతిరేకతతో కొందరు ఆసక్తి చూపడం లేదు. ప్రధానంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అలకబూనడంతో నర్సీపట్నం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర రూట్ మ్యాప్ మారినట్టు ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటుపై స్పష్టత ఇవ్వకపోవడంతో యువగళం పాదయాత్రకు ఆసక్తి చూపడం లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు చోడవరం, మాడుగుల నియోజకవర్గాలకు చెందిన నేతలు ‘మా కొద్దీ యువగళం’ అని తెగేసి చెబుతున్నట్టు సమాచారం. ఫలితంగా ఈ మూడు నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర రద్దు అయినట్టు తెలుస్తోంది. తెలుగు తమ్ముళ్ల నిరాసక్తతో ఉమ్మడి విశాఖ జిల్లాలో యువగళం పాదయాత్ర రూట్మ్యాప్ను మార్చివేసినట్టు ఆ పార్టీ నేతలే పేర్కొనడం గమనార్హం. సొంత నేతల నుంచే నిరాసక్తత! వాస్తవానికి మొదటగా ప్రకటించిన షెడ్యూల్ మేరకు పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలో పాయకరావుపేట నుంచి కోటవురట్ల మీదుగా నర్సీప ట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పరవాడ, గాజువాక చేరుకొని, నగరంలోకి ప్రవేశించి, పెందుర్తి మీదుగా భీమిలి చేరుకోవాలి. తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 11న పాయకరావుపేటలో ప్రవేశించి యలమంచిలి, అనకాపల్లి, పరవాడ, గాజువాక మీదుగా నగరంలోకి ప్రవే శించనుంది. ఈ నెల 20 లేదా 21వ తేదీన భీమిలిలో ముగించాలని నిర్ణయించారు. ఇందులో నర్సీపట్నం, చోడవరంతో పాటు మాడుగుల నియోజకవర్గాలను తీసివేశారు. ప్రధానంగా తన కొడుకు ఎంపీ టికెట్పై పదే పదే అడుగుతున్నప్పటికీ తేల్చకపోవడంతో పాటు కేవలం ఎన్నికలకు ఏడాది ముందు బయటకు వచ్చిన గంటాకు ప్రాధాన్యత పెరగడాన్ని అయ్యన్నపాత్రుడు తీవ్రంగా తప్పుపడుతున్నట్టు తెలుస్తోంది. అనకాపల్లి ఎంపీ టికెట్ ను తన కొడుకుకు కేటాయించాలని కోరినా పట్టించుకోకపోగా.. ఈ స్థానంలో అభ్యర్థి కోసం గంటా కొంతమందితో మాటా మంతీ సాగించడంపై అయ్యన్న తీవ్రంగా తప్పుపడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చోడవరంలో పాదయాత్ర నిర్వహణకు ఆ పార్టీ ముఖ్యులు ముందుకు రాకపోగా.. మాడుగుల నియోజకవర్గంలో అసలు నేత ఎవరనే చిక్కు వచ్చింది. అంతేకాకుండా అధికార వైఎస్సార్ సీపీ నిర్వహించిన సామాజిక బస్సు యాత్రకు జనం జేజేలు పలకడంతో ముఠాలతో కుస్తీ పడుతున్న టీడీపీ నేతల వైఖరితో ఈ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహణ కష్టమని పార్టీ పెద్దలు కూడా భావించినట్టు తెలుస్తోంది. పార్టీ వైఖరిపై కినుక! వాస్తవానికి అనకాపల్లి ఎంపీ సీటుతో పాటు నర్సీపట్నం ఎమ్మెల్యే టికెట్ కావాలని అయ్యన్నపాత్రుడు పట్టుబడుతున్నారు. అయితే దీనిపై పార్టీ నుంచి సరైన స్పందన లభించలేదు. నర్సీపట్నం టికెట్ ఇస్తాం.. ఎంపీ టికెట్పై చూద్దామంటూ దాటవేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం మాజీ మంత్రి గంటా అభ్యర్థులను అన్వేషిస్తున్నారు. ఒక ఎన్ఆర్ఐను బరిలోకి నిలిపేందుకు వెదకడంతో పాటు కొద్ది మందిని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అయ్యన్నపాత్రుడు మండిపడుతున్నారు. అంతేకాకుండా నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా కొద్ది మంది అసంతృప్తి నేతలను కలిపి పిక్నిక్ తరహాలో వన భోజనాలను గతంలో గంటానే వెనుక ఉండి నిర్వహించేలా చేశారనేది అయ్యన్న అభియోగం. ఈ విషయాన్ని కూడా పార్టీ అధినేత వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ గంటాను పిలిచి మందలించడం వంటిది చేయకపోవడం అయ్యన్నకు మరింత ఆగ్రహాన్ని తెప్పించిందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే గంటా బయటకు రావడాన్ని అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే విమర్శించారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని నేతలను దూరం ఉంచాలని.. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా అయ్యన్న నేరుగా చంద్రబాబుకే స్పష్టం చేశారు. అయినప్పటికీ వైఖరి మారకపోవడంతో అలకబూనినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర నిర్వహణకు పెద్దగా ఆసక్తి చూపలేదని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో యువగళం పాదయాత్ర అంటేనే ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. లోకేష్ యువగళం పాదయాత్రకు ఆ పార్టీ నేతలే ఆసక్తి చూపడం లేదు. తమ నియోజకవర్గాల్లో వద్దు బాబోయ్ అంటూ వేడుకుంటున్నారు. పాదయాత్రకు జనం నుంచి పెద్దగా స్పందన లేకపోవడాన్ని గ్రహించిన ఆ పార్టీ నేతలు.. జన సమీకరణకు వచ్చే ఇబ్బందులను గ్రహించి తమ వద్ద వద్దంటూ తెగేసి చెబుతున్నారు. ఇక తన కొడుకు సీటు విషయంలో కినుక వహించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ‘మా కొద్దీ యువగళం’ అని స్పష్టం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహణకు ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. ఇవి కూడా చదవండి: చంద్రబాబు పిచ్చి కూతలు.. రామోజీ చెత్త రాతలు: మంత్రి కాకాణి ఫైర్ -
టీడీపీ కార్యకర్త దౌర్జన్యం.. బస్సు షెలర్ట్ కబ్జా!
శ్రీకాకుళం: తెలుగుదేశం నేతలు కబ్జాపర్వానికి తెరతీశారు. ఆర్టీసీ స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. అధికారుల ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హిరమండలం బ్యారేజీ సెంటర్ మూడు రహదారులకు జంక్షన్ కావడంతో(2018 –19) టీడీపీ హయాంలో బస్ షెల్టర్ నిర్మాణానికి ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.లక్షన్నర నిధులు కేటాయించారు. లోతట్టు ప్రాంతం కావడంతో పిల్లర్లు, బేస్మెంట్ శ్లాబ్ వేసి విడిచిపెట్టారు. అప్పటికి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మధ్యలో నిలిపివేశారు. తర్వాత కొద్దిరోజులకే ఎన్నికలు జరగడంతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ఆరేళ్లుగా అసంపూర్తి ఉన్న ఈ నిర్మాణంపై టీడీపీ నాయకుడు, ఎంపీటీసీ భర్త కన్ను పడింది. ఆర్అండ్ఆర్ కాలనీ సర్పంచ్ భర్త సహకారం తీసుకుని తనదే భూమి అన్నట్టు వ్యవహరించడం ప్రారంభించాడు. అసంపూర్తిగా ఉన్న బస్షెల్టర్ చుట్టూ సిమెంట్ ఇటుకలతో గోడల నిర్మాణానికి పూనుకున్నాడు. దీనిపై కొందరు స్థానికులు ఆర్అండ్బీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆర్అండ్బీ ఏఈ పోలీసుల సహకారంతో చేరుకుని పనులు నిలిపివేయించారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆక్రమణ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎలాగైనా స్థలం స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. దీనిలో భాగంగా రాత్రిపూట బస్షెల్టర్ పిల్లర్ల చుట్టూ గోడలు కడుతున్నారు. సమీపంలోని కొంత ఖాళీ స్థలాన్ని సైతం ఆక్రమించి గదులు కట్టాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది. రాత్రికి రాత్రే దర్శనమిస్తున్న నిర్మాణాలతో స్థానికులు షాక్కు గురవుతున్నారు. ఇక్కడ ఆక్రమణల్లో ఉన్న భూమి విలువ దాదాపు రూ.30 లక్షలు ఉంటుందని అంచనా. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తే భూమి మొత్తం ఆక్రమిస్తారని, ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నోటీసులు ఇస్తాం.. ఈ విషయమై తహసీల్దారు మురళీమోహన్ వద్ద ప్రస్తావించగా బస్షెల్టర్ అక్రమ నిర్మాణం విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇప్పటికే ఆర్ఐ, సర్వేయర్లును పంపించి సర్వే చేయించామని చెప్పారు. ఆ స్థలం మేజర్ పంచాయతీ పరిధిలోకి వస్తుందన్నారు. పంచాయతీ అధికారుల ద్వారా సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించి చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. ఇవి కూడా చదవండి: మాజీ మంత్రుల కార్యాలయాల్లో ద్రస్తాల చోరీ! -
టాప్ 30 హెడ్లైన్స్@04:45PM 09 December 2023
-
ఏపీ, తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 09 December 2023
-
చంద్రబాబు అర్ధరాత్రి 'షో'కాలు..
సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వచ్చిన చంద్రబాబు తన హయాంలోనే రైతులకు మేలు జరిగిందన్నట్లు కొత్త పల్లవి అందుకోవడంపై రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో వేమూరు నియోజకవర్గం అమర్తలూరు వచ్చిన చంద్రబాబు పెదపూడి, కూచిపూడి ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావిత పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమం పూర్తయ్యేసరికి చీకటి పడింది. ఆ తరువాత ఆయన చెరుకుపల్లి, నగరం ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం బాపట్ల నియోజకవర్గంలోని అమర్తలూరు, కర్లపాలెం గుండా రాత్రి 11.30 గంటలకు బాపట్ల చేరుకున్నారు. చంద్రబాబు పర్యటన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంటలను పరిశీలించి, రైతులను పరామర్శించినట్లు లేదు. పర్యటన మొత్తం రాత్రి పూట చీకట్లో రోడ్షోలా సాగింది. పర్యటన ఆసాంతం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం, వై.ఎస్.జగన్పై పనిగట్టుకుని విమర్శలు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. తన హయాంలోనే రైతులకు మేలు జరిగిందని, తుఫాన్లను సమర్థంగా ఎదుర్కొన్నానని, పంటల బీమాతోపాటు, అన్నిరకాల సహాయాలను అందించానని అబద్ధాలు వల్లెవేశారు. రైతు వ్యతిరేకిగా ముద్రపడిన బాబు ఇప్పుడు రైతులపై ప్రేమ వలకబోస్తూ మాట్లాడిన మాటలు విని రైతులు, ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తన హయాంలో రైతులకు పరిహారం ఎక్కువ ఇచ్చానని, జగన్ వచ్చాక దాన్ని తగ్గించారని బాబు విమర్శలు చేయడం చూసి రైతులు మండి పడుతున్నారు. తిరిగి తనకు అధికారం అప్పగిస్తే రైతులకు ఇచ్చే ఇన్సూరెన్సు, ఇన్పుట్ సబ్సిడీతోపాటు, అన్నిరకాల పథకాలకు సంబంధించిన పరిహారాలను రెండు నుంచి మూడింతలు పెంచుతానంటూ బాబు పదే పదే చెప్పారు. ఓట్ల కోసమే చంద్రబాబు రైతులను వంచించే ప్రయత్నం చేశారు. ఇది విన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనాడూ రైతుల గోడు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ఓట్ల కోసం రైతులపై ప్రేమను వలకబోస్తున్నారని విమర్శిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసమే బాబు కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్కు దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రభుత్వానికి పరిహారం విషయంలో సూచన చేయాల్సిన చంద్రబాబు అది చేయకుండా రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే పెద్ద మొత్తంలో పరిహారం ఇస్తానంటూ ఓట్ల రాజకీయానికి తెరలేపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి కూడా చదవండి: దొంగ ఓట్లన్నీ ఆ పార్టీ తమ్ముళ్లవే.. -
సీఏ విద్యార్థిని తీవ్ర నిర్ణయం! అసలేం జరిగింది?
సాక్షి, కడప: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం మల్లెల గ్రామంలో సీఏ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రవీంద్రబాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లెల గ్రామానికి చెందిన బలక రమేష్, సునీత దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. పొలం పనులు చేసుకుని పిల్లలను చదివించేవారు. పెద్ద కుమార్తె స్వాతి (21) గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్ కళాశాలలో సీఏ చదువుతుండగా, రెండో కుమార్తె బీటెక్, చిన్న కుమారుడు 6వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సీఏ చదువు పూర్తి చేసుకున్న పెద్ద కుమార్తె స్వాతి గుంటూరు నుంచి 15 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. ఈ తరుణంలో గురువారం సాయంకాలం నీ చదువు కోసం రూ.లక్షలు ఖర్చు చేశాం, పరీక్షలు బాగా రాశావా తల్లీ, గతంలో లాగా కాకుండా, ఈ సారైనా పాస్ అవుతావా అని కన్నవాళ్లు స్వాతిని ప్రశ్నించారు. లేకుంటే మంచి సంబంధం చూసి వివాహం జరిపిస్తామని సున్నితంగా సూచించారు. సదరు యువతి ఏమనుకుందో ఏమో, పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో, లేదా కన్నవాళ్ల ఆశలు నెరవేర్చలేనేమో అని అనుకుందో గాని క్షణికావేశంలో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: తమ్ముడు రాయితో కొట్టాడని.. అర్ధరాత్రివేళ కిరాతకంగా మారిన అన్న.. -
ఏమైంది తల్లీ? కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ..
సాక్షి, తిరుపతి: తుపాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం గూడూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఆయన ఏరియల్ సర్వే చేశారు. ఆపై క్షేత్ర స్థాయిలో పర్యటించి వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. బాధితుల కష్టాలు విని చలించిపోయారు. అన్నదాతల కన్నీళ్లు తుడుస్తూ అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. వాకాడు మండలంలోని తొమ్మిది గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడకుండా స్వర్ణముఖి నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలు తిరిగి వేసుకునేందుకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సీఎం ప్రకటనపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాళెం పరిధిలో కోతకు గురైన స్వర్ణముఖి నది లోలెవల్ కాజ్వే, వరి పంటలను పరిశీలించి ఆవేదనకు లోనయ్యారు. కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే వరప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షులు నేదురమల్లి రామ్కుమార్రెడ్డి, వాకాడు మాజీ ఏఎంసీ చైర్మన్ కొడవలూరు దామోదర్రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బారులుదీరిన అభిమానం! ముఖ్యమంత్రి వస్తున్నారని తెలుసుకున్న స్థానికులు విద్యానగర్ నుంచి బాలిరెడ్డిపాళెం వరకు బారులు తీరారు. తమ రాకకోసం నిరీక్షిస్తున్నారని గుర్తించిన ముఖ్యమంత్రి వారిని ఆప్యాయంగా పలకరించారు. రైతుల ఆవేదనను స్వయంగా విని చలించిపోయారు. వృద్ధురాలి కన్నీటిని తుడుస్తూ.. ‘ఏడ్వకవ్వా.. నేనున్నాను’ అంటూ భరోసానిచ్చారు. మానవత్వంతో స్పందించిన తీరుని చూసి వృద్ధురాలు సీఎం ముఖాన్ని పట్టుకుని ‘నువ్వ చల్లంగా ఉండాలి నాయనా’ అంటూ దీవెనలందించారు. అక్కడే ఉన్న స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ‘జగన్ మామయ్యా.. జగన్ మామయ్యా’ అంటూ దీనంగా తనవంక చూసి అరుస్తున్న చిన్నారుల వద్దకు వెళ్లి బుగ్గలు నిమిరారు. ‘బాగా చదువుకో’ అంటూ ముందుకు కదిలారు. ముఖాముఖి సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను తీసుకుని వాటి పరిష్కరించాలని కలెక్టర్ని ఆదేశించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసానిచ్చారు. శరవేగంగా సాగుతున్న సహాయక చర్యలపై సీఎం నేరుగా ప్రజలతో మాట్లాడి వారి నుంచి వివరాలు తీసుకున్నారు. బాధిత కుటుంబాలకు అందించే నిత్యావసర సరుకుల పంపిణీపైనా ఆరా తీశారు. విద్యుత్, రహదారులు, తాగునీటి సౌకర్యం పునరుద్ధరణ, పంట నష్టం అంచనాకు సంబంధించి ఎన్యూమరేషన్ ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగిన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్రెడ్డి, ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య తమ నియోజకవర్గాల్లో జరిగిన నష్టాలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎంకు ఘన స్వాగతం.. వాకాడు మండలం, బాలిరెడ్డిపాళెం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి కోట మండలం, విద్యానగర్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద నాయకులు ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి తానేటి వనిత ఉన్నారు. కాగా హెలీప్యాడ్ వద్ద మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి, గూడూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరు ఎమ్మెల్యేలు వరప్రసాద్రావు, సంజీవయ్య, మేకపాటి విక్రమ్రెడ్డి, ఎమ్మెల్సీలు మేరిగ మురళీధర్, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, బల్లి కల్యాణచక్రవర్తి, వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఇవి చదవండి: అపోహలొద్దు.. ఆదుకుంటాం -
తమ్ముడు రాయితో కొట్టాడని.. అర్ధరాత్రివేళ కిరాతకంగా మారిన అన్న..
సాక్షి, అనంతపురం: శెట్టూరు మండలంలోని కనుకూరు గ్రామానికి చెందిన గొల్ల కృష్ణమూర్తి(27) సొంత అన్న చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నపాటి గొడవ ఈ హత్యకు దారితీయడం గమనార్హం. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... గ్రామానికి చెందిన గొల్ల గోపాల్, మల్లక్క దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దకుమారుడు గొల్ల రవి, రెండో కుమారుడు కృష్ణమూర్తి, కుమార్తె భారతి ఉన్నారు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు కుమారులు అప్పుడప్పుడు చిన్నపాటి గొడవలు పడేవారు. వెంటనే కలసిపోయేవారు. గురువారం ఉదయం పెద్ద కుమారుడైన రవి తన తమ్ముడి సెల్ఫోన్ను చెప్పకుండా తీసుకుని కళ్యాణదుర్గం వెళ్లాడు. విషయం తెలుసుకున్న తమ్ముడు కృష్ణమూర్తి కళ్యాణదుర్గం వెళ్లి.. సెల్ఫోన్ ఇవ్వాలంటూ అన్నతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే రాయితీసుకుని అన్న తలపై కొట్టడంతో స్వల్ప గాయమైంది. స్థానికులు గమనించి ఇద్దరినీ దండించడంతో గొడవ సద్దుమణిగింది. గాయపడిన రవిని తమ్ముడు కృష్ణమూర్తి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. తర్వాత ఇద్దరూ ఒకే ద్విచక్ర వాహనంలో ఇంటికి చేరుకున్నారు. అయితే తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న రవి గురువారం అర్ధరాత్రి ఒకే ఇంట్లో నిద్రిస్తున్న తమ్ముడిని గొడ్డలితో విచక్షణరహితంగా నరికి చంపాడు. శుక్రవారం ఉదయం ఇంట్లోకి వచ్చిన తల్లి మల్లక్క రక్తపు మడుగులో ఉన్న కుమారుడిని చూసి కేకలు వేసింది. హత్య విషయం తెలుసుకొన్న గ్రామస్తులు నివ్వెరపోయారు. కళ్యాణదుర్గం సీఐ నాగరాజు, బ్రహ్మసముద్రం ఎస్ఐ పరుశురాముడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా..నిందితుడు రవి శెట్టూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. తల్లడిల్లిన తల్లిదండ్రులు.. కృష్ణమూర్తి హత్యతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబ భారమంతా తనే మోసేవాడు. తన సంపాదనతోనే చెల్లి పెళ్లి కూడా చేశాడు. తండ్రి గోపాల్కు మతిస్థిమితం లేదు. అన్న రవి కుటుంబ బాధ్యతలు పట్టించుకునేవాడు కాదు. కుటుంబాన్ని నెట్టుకొచ్చే కుమారుడు దారుణ హత్యకు గురికావడం, మరో కుమారుడు నిందితుడిగా జైలుపాలు కావడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. ఇవి చదవండి: సైకో కిల్లర్ అరెస్టు -
దొంగ ఓట్లన్నీ ఆ పార్టీ తమ్ముళ్లవే..
సాక్షి, అనంతపురం: 'తెలుగుదేశం పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం అడ్డదారులు తొక్కుతోంది. మైనర్లను ఓటర్లుగా చేర్పించడం.. అనుకూలమైన వారికి రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు కల్పించడం చేస్తోంది. అవకాశమున్న చోట్ల భారీగా దొంగ ఓట్లను జాబితాలోకి చేరుస్తోంది. చేసేదంతా చేసి తమకే పాపమూ ఎరుగనట్టు వైఎస్సార్సీపీపైకి నెపం నెడుతోంది. జాబితాను పరిశీలిస్తే టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన దొంగ ఓట్ల దందా ఇట్టే తెలిసిపోతుంది.' ఆత్మకూరు రాప్తాడు నియోజకవర్గం తమకు కంచుకోటగా భావిస్తూ వచ్చిన టీడీపీకి 2019 ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాష్రెడ్డి 25వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓటర్లు దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వడాన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ప్రజల పక్షాన నిలిచి ఓటర్లను తమవైపు ఆకట్టుకోవడం మరచి.. తప్పుడుదారిని ఎంచుకున్నారు. నియోజకవర్గంలోని ఆత్మకూరుతో పాటు మరికొన్ని మండలాల్లో కొంతమంది టీడీపీ నాయకులు తమకు తగ్గిపోయిన ఓట్ల స్థానంలో బోగస్ ఓటర్ల ద్వారా భర్తీ చేసుకోవాలని భావించారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి అవకాశమున్న చోట్ల డబుల్ ఓటు హక్కుకు దరఖాస్తు చేయించారు. చాలా చోట్ల అమ్మాయిలు పెళ్లిళ్లయ్యి మెట్టినిళ్లకు వెళ్లిపోయినా.. వారి ఓట్లను స్థానికంగా తొలగించకుండా అలానే ఉంచారు. అంతేకాదు పద్దెనిమిదేళ్లలోపు వయసు కలిగిన వారిని ఓటరుగా చేర్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఓటరు జాబితా సవరణలోనూ దొంగ ఓట్లను తొలగించడానికి టీడీపీ నాయకులు ససేమిరా అంటుండటం గమనార్హం. ► ఈ ఓటరు కార్డులో ఉన్న వ్యక్తి పేరు నరేంద్ర చౌదరి. ఈయనకు ఆత్మకూరు మండలం సిద్దరాంపురం, అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో రెండు చోట్ల ఓటు హక్కు ఉంది. ► ఈ బాలుడి పేరు మనేరి దేవ నంద. ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామం. ఆధార్ వివరాల ప్రకారం 2007 సంవత్సరంలో పుట్టాడు. 16 ఏళ్ల వయసున్న ఈ బాలుడికి టీడీపీ కార్యకర్తలు ఓటు హక్కు కల్పించే ప్రయత్నం చేశారు. ► ఈ ఓటరు కార్డులో కనిపించే మహిళ పేరు సాయి గీత. ఈమెకు ఆత్మకూరు మండలం సిద్దరాంపురంలోను, ఉరవకొండ మండలం 9వ వార్డులోను ఓటు హక్కు ఉంది. ► రాప్తాడు మండలం గాండ్లపర్తి గ్రామంలో అలివేలమ్మ స్థానికంగాను, అనంతపురంలోను ఓటు హక్కు కలిగి ఉంది. అలాగే తిమ్మక్కకు గాండ్లపర్తి, అనంతపురంలో రెండు చోట్ల ఓటు హక్కు ఉంది. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా చాలా చోట్ల టీడీపీ సానుభూతి పరులు రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటమి భయంతోనేనా..? వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టారు. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేశారు. ఉచితంగా పొలాల్లో బోర్లు వేయించారు. రైతులు, కూలీల వలసలు తగ్గించారు. అనారోగ్యంతో ఉన్న వారిని, పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పించి అండగా నిలిచారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అమ్మ డెయిరీ ఏర్పాటు చేశారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందేలా చూశారు. ప్రజల్లో ప్రకాష్రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం టీడీపీకి పట్టుకుంది. ఈ క్రమంలోనే దొంగ ఓట్లను చేర్చడం ద్వారా ఓటమి నుంచి గట్టెక్కాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని వారికి కూడా రామగిరి మండలంలో ఓటు హక్కు కల్పించినట్లు గతంలో సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి. ఇవి చదవండి: మానవత్వంతో స్పందించిన సీఎం -
టాప్ 30 హెడ్లైన్స్@03:45PM 08 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@10:45AM 06 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@10AM 06 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@06:30AM 06 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@04:40PM 05 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@03:30PM 05 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@3PM 05 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@6AM 03 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@02:55PM 02 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@06:45PM 01 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@4PM 01 December 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@03:45PM 29 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@02:45PM 29 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@02:30PM 28 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@11:45AM 23 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@10AM 23 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@7AM 23 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@06:10PM 22 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@1PM 21 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@11:45AM 21 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@10:45AM 21 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@10:15AM 21 November 2023
-
సాక్షి నాన్ స్టాప్ న్యూస్@06:45AM 21 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@6AM 21 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@06:45PM 17 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@05:45PM 17 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@03:40PM 17 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@3PM 17 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@04:45PM 16 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@03:45PM 16 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@02:45PM 16 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@12:30PM 14 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@11:30AM 14 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@10:30AM 14 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@10:15AM 14 November 2023
-
సాక్షి స్పీడ్ న్యూస్@09:15AM 14 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@6AM 14 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@7PM 13 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@06:30PM 13 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@5PM 13 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@03:45PM 13 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@03:10PM 13 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@9PM 10 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@06:45PM 10 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@03:45PM 10 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@02:45PM 10 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@06:30PM 09 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@3PM 09 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@12:40PM 08 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@11:45AM 08 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@10:30AM 08 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@10AM 08 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@6AM 08 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@12PM 07 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@10:45AM 07 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@10:30AM 07 November 2023
-
సాక్షి స్పీడ్ న్యూస్@10:15AM 07 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@6AM 07 November 2023
-
ఏపీ, తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 04 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@07:40PM 03 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@03:30PM 02 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@08:45PM 01 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@06:45PM 01 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@05:45PM 01 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@5PM 01 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@03:45PM 01 November 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@01:30PM 31 October 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@12:30PM 31 October 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@10:40AM 31 October 2023
-
టాప్ 30 హెడ్లైన్స్@10AM 31 October 2023