audio tapes
-
తెలంగాణ తరహాలో ఢిల్లీలో ఎమ్మెల్యేలకు ఎర
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో తరహాలో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణలో బయటకువచ్చిన మధ్యవర్తుల ఆడియో టేపుల ద్వారా ఈ కుట్ర కోణం స్పష్టంగా తెలుస్తోందన్నారు. కుట్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రమేయం ఉందని తేలితే అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్చేశారు. శనివారం సిసోడియా ఢిల్లీలోని ఆప్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ దళారిగా చెబుతున్న ఒక వ్యక్తి మాట్లాడిన ఆడియో టేప్ను మీడియాకు వినిపించారు. ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైదరాబాద్లో అరెస్ట్ అయిన ముగ్గురిలో ఒకరు నేరుగా బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయి’ అని సిసోడియా తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు రాజ్నా«థ్, కిషన్ రెడ్డి, ఇతర నేతలతో నిందితుల్లో కొందరు దిగిన ఫొటోలను మీడియాకు సిసోడియా చూపించారు. రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ అనే మధ్యవర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఎలా కుట్ర పన్నారో ఆడియో టేప్లో స్పష్టంగా వెల్లడైందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆశ చూపిస్తూ ఢిల్లీలోనూ ఎమ్మెల్యేలను కొనే వ్యవహారాన్ని నడిపిస్తున్నామని ఆడియో టేప్లో వినిపించిన అంశాన్ని సిసోడియా ప్రస్తావించారు. ‘ఇంకో ఆడియోలో ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేల కొనుగోలు తతంగం కొనసాగుతోందన్నారు. అంటే అంతటి భారీమొత్తంలో బీజేపీ నగదు సిద్ధం చేసుకున్నట్లు అర్థమవుతోంది’ అని అన్నారు. ‘ టేపుల్లో దళారులు అమిత్ షా పేరును పరోక్షంగా ప్రస్తావించడం తీవ్ర ఆందోళనకరం. షా ప్రమేయం ఉంటే ఆయన్ను వెంటనే అరెస్ట్ చేసి విచారించాలి. హోంశాఖ మంత్రి పదవి నుంచి తప్పించాలి. ఈడీ విచారణ చేపట్టాలి’ అని అన్నారు. వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనే అలవాటున్న బీజేపీకి ఉన్న రాజకీయపార్టీ గుర్తింపును ఈసీ రద్దుచేయాలని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ డిమాండ్చేశారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మరో ఆడియో టేపు
-
‘పచ్చ’పన్నాగం బెడిసికొట్టిందా..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మాటల్లో అహంకారం.. చేతల్లో విధ్వంసం.. రాజకీయ స్వార్థం కోసం ఎందాకైనా తెగించే తత్వం.. ఇదీ మూడు ముక్కల్లో ప్రతి‘పచ్చ’ పార్టీ వర్గీయుల పరిచయం. జిల్లాలో వీరి స్వార్థ రాజకీయాలకు దేవాలయాలను వేదిక చేసుకున్నారు. విగ్రహ విధ్వంస రాజకీయాలతో విద్వేషాలను ఎగదోసి రాక్షసానందం పొందాలనుకున్నారు. అధికార పార్టీపై అడుగడుగునా బురదజల్లే ప్రయత్నం చేశారు. వాస్తవాలు బయటపడడంతో వీరి కుయుక్తులను చూసి ప్రజలు ఛీ కొట్టారు. అయినా పద్ధతి మార్చుకోలేదు.. పంథా మార్చి శవరాజకీయాలకు తెరలేపారు. వీరి స్వార్థ ప్రయోజనాల కోసం సొంత పార్టీ కార్యకర్తల్నే బలిపశువులుగా మార్చేందుకు సిద్ధమయ్యారనే చర్చ ఆ పార్టీ లో జోరుగా జరుగుతోంది. తాజాగా పలాస నియోజకవర్గంలో జరిగిన టీడీపీ కార్యకర్త ఆత్మహత్య వ్యవహారం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. చదవండి: చంద్రబాబుది ఆర్థిక అరాచకం రాజకీయ స్వార్థం కోసం ఎందాకైనా.. ఇటీవల పలాస నియోజకవర్గంలో జరిగిన సంఘటనపై రాజకీయ విశ్లేషకుల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ‘అన్ని రకాలుగా వాడుకుని వాడిని వదిలేద్దాం’ అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు గోవిందరావును ఉద్దేశించి చేసిన వ్యంగ్యాస్త్రాలపై ఇప్పటికే ఆ పార్టీ నాయకుల్లో కలకలం రేపింది. తాజాగా మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటరావు ఆత్మహత్యకు అదే పార్టీకి చెందిన నేతల ఉసిగొలిపే ప్రయత్నాలు ఉన్నట్లు ఇప్పుడిప్పుడే ప్రచారం జరుగుతోంది. పలాస నియోజకవర్గంలో రాద్దాంతం సృష్టించి ఎలాగైనా పట్టు సాధించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో వెంకటరావు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో ఆమె పోలీసులపై చేసిన పరుష పదజాలం నివ్వెరపోయాలా చేసింది. అయితే ఈ ఆత్మహత్య వెనుక ఏమైనా రాజకీయ ఎత్తుగడలకు పాల్పడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంచలనంగా ఆడియోలు.. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, నిమ్మాడకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కింజరాపు అప్పన్నను టీడీపీ కార్యకర్త వెంకటరావు తీవ్రంగా బెదిరిస్తూ చేసిన ఆడియోలు ప్రస్తుతం బహిర్గతం కావడం సంచలనంగా మారింది. పోలీసుల బెదిరింపుల వల్లే వెంకటరావు మనస్తా పానికి గురై ఆత్యహత్యకు పాల్పడ్డాడు అనేది టీడీపీ నాయకుల వాదన. అచ్చెన్నాయుడు జోలికి వస్తే కాళ్లు నరికేస్తా.. చంపేస్తానంటూ నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకులపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి... మనస్తాపానికి ఎలా గురి కాగలడు అనే సందేహం స్థానికంగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వెంకటరావు ప్రవర్తన తెలుసుకునేందుకు వెళ్లిన పోలీసులను బెదిరించే క్రమంలో చేసిన ఆత్మహత్య ప్రయత్నంలో అదే పార్టీకి చెందిన నేతల ఉసిగొలిపే కుట్ర ఉందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాజకీయ లబ్ధి కోసం సొంత పార్టీకి చెందిన కార్యకర్తనే బలిగొన్నారంటూ అదే పార్టీకి చెందిన ఓ వర్గం నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. జిల్లాలో టీడీపీ పట్టు సాధించేందుకు కార్యకర్తలను స్వార్థం కోసం వినియోగించుకోవడంపై మండిపడుతున్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు సొంత పార్టీ కార్యకర్తలనే బలి చేస్తారా.. అంటూ స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బెంగాల్లో ఆడియో టేపుల కలకలం!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఒక ప్రముఖ చానెల్ సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టింది. విచారణా సంస్థలకు సంబంధించిన వర్గాల నుంచి కొన్ని ఆడియో టేపులు సంపాదించినట్లు పేర్కొంది. ఈ టేపుల్లో సీఎం మమత మేనల్లుడు అభిషేక్ అక్రమంగా సొమ్ములు సేకరిస్తున్నట్లుంది. తొలి టేపులో కోల్ స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనూప్ మాంఝీ సహచరుడు గణేశ్ బగారియా మాటలున్నాయి. రాష్ట్రంలో అవినీతి రాకెట్ ఎలా విస్తరించింది గణేశ్ వివరించాడు. రెండో టేపులో మమత రాజకీయంగా ఎదుగుతుంటే, అభిషేక్ ఎలా కిందకు లాగుతున్నది మాట్లాడుకున్నారు. మూడో టేపులో దాదాపు రూ. 45 కోట్ల కట్మనీ అభిషేక్ వద్దకు ఎలా చేరిందో చర్చించుకున్నట్లుంది. 4వ టేపులో మమతా గుడ్డిగా అభిషేక్ను నమ్ముతున్నారని ఉంది. చివరిటేపులో ఎక్సైజ్ కమిషనర్ను అభిషేక్ మిత్రుడు వినయ్ మిశ్రా లంచం అడగడం, కోల్మైనర్లను అభిషేక్ లంచం అడిగిన అంశం ఉన్నాయి. బెంగాల్కే అవమానం! మమత మేనల్లుడిపై ఆరోపణలు గుప్పిస్తూ విడుదలైన ఆడియో టేపులపై బీజేపీ మండిపడింది. మమతా బెనర్జీ, ఆమె బంధువులు పశ్చిమబెంగాల్ ప్రజలకు తలవంపులు తెచ్చారని విమర్శించింది. ప్రజలను మోసం చేసినందుకు మమత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మమత ఇచ్చే రక్షణతో కొందరు చెలరేగిపోతున్నారని, బెంగాల్లో అవినీతి దందా నడుపుతున్నారని ఆరోపించింది. ఆడియో టేపుల వ్యవహారంపై టీఎంసీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మమత పాలనలో దోపిడీదారుల ధైర్యం ఇలాగుందని, ఒక సమావేశంలో అభిషేక్ బెనర్జీకి దగ్గరైన ఒక దోపిడీదారుడు కమిషనర్కు దగ్గరగా కూర్చుని అక్రమ డిమాండ్లు చేయడం ఎలాంటి సందేశమిస్తుందని బీజేపీ ప్రశ్నించింది. మమతకు తెలిసే రాష్ట్రంలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయని ఆరోపించింది. -
నేను బీజేపీతోనే..
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్లో రాజకీయ పరిణామాలపై కొందరు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని బీజేపీ నేత, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే వ్యాఖ్యానించారు. తాను బీజేపీలోనే కొనసాగుతాననీ, పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తానని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, తిరుగుబాటు వర్గం నేత, మాజీ డిప్యూటీ సీఎం పైలట్ మధ్య విభేదాలతో తలెత్తిన సంక్షోభంలో గహ్లోత్కు వసుంధరా రాజే అంతర్గతంగా మద్దతిస్తున్నారంటూ రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ నేత, ఎంపీ హనుమాన్ బెణివాల్ శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలతో గహ్లోత్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. బీజేపీ నేతలు, అధిష్టానంపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందన్నారు. రాజస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ నేతల ఫోన్లను చట్ట విరుద్ధంగా ట్యాప్ చేయిస్తే సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని గహ్లోత్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితర బీజేపీ నేతల హస్తం ఉందంటూ కాంగ్రెస్ ఆడియో టేపులు విడుదల చేయడంపై బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర శనివారం స్పందించారు. ‘ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని, గహ్లోత్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయా? ఒక వేళ జరిగితే, నిర్దేశిత నిబంధనల మేరకే చేశారా? తమ గుట్టు బయటపడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిందా?’అని ప్రశ్నించారు. బీజేపీ తప్పు చేసినట్లే: కాంగ్రెస్ ఆడియో టేపుల వ్యవహారంలో బీజేపీ సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అలాగైతే, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్పై సచిన్ పైలట్ తదితరుల తిరుగుబాటు వెనుక తమ ప్రమేయం ఉన్నట్లు బీజేపీ ఒప్పుకున్నట్లే అవుతుందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. బీజేపీ నేతల ప్రమేయమే లేకుంటే హరియాణాలోని ఓ రిసార్టులో ఉన్న కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను ప్రశ్నించడానికి వెళ్లిన రాజస్తాన్ పోలీసులను ఎందుకు అనుమతించలేదని రాజస్తాన్ పీసీసీ నూతన అధ్యక్షుడు గోవింద్ సింగ్ ప్రశ్నించారు. గహ్లోత్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పన్నిన కుట్రకు సంబంధించినవిగా చెబుతున్న రెండు ఆడియో క్లిప్పులపై చీఫ్ విప్ మహేశ్ జోషి ఫిర్యాదు మేరకు ఆ రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో(ఏసీబీ) కేసు నమోదు చేసింది. -
రసవత్తరంగా రాజస్తాన్ డ్రామా
జైపూర్: రాజస్తాన్లో రాజకీయ డ్రామా రోజుకో మలుపుతో ఆసక్తికరంగా సాగుతోంది. గహ్లోత్ సర్కారుకు ముప్పు తొలగిన నేపథ్యంలో.. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తాజాగా, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు సంబంధించినవిగా పేర్కొంటూ రెండు ఆడియో టేప్లను సాక్ష్యాలుగా చూపింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ టేప్ల ఆధారంగా ఎమ్మెల్యేలను ప్రలోభపర్చి, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ నేత, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, తిరుగుబాటు వర్గ ఎమ్మెల్యే భన్వర్లాల్ శర్మ, వ్యాపారవేత్త సంజయ్ జైన్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జైన్ను బీజేపీ నేతగా పేర్కొంది. షెకావత్, భన్వర్లాల్, సంజయ్ జైన్లను తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మహేశ్ జోషి చేసిన ఫిర్యాదు మేరకు.. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) వారిపై భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని దేశద్రోహం, కుట్రకు సంబంధించిన 124–ఏ, 120–బీ సెక్షన్ల కింద రెండు కేసులను నమోదు చేసింది. అయితే, ఎఫ్ఐఆర్లో కేంద్ర మంత్రి అనే ప్రస్తావన లేకుండా గజేంద్ర సింగ్ అని మాత్రమే పేర్కొంది. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర మంత్రి షెకావత్ స్పందించారు. ఆ ఆడియో టేప్ల్లో వినిపించిన స్వరం తనది కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. మరోవైపు, తనతో పాటు తన వర్గం ఎమ్మెల్యేలు 18 మందిపై స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసుల విషయంలో తిరుగుబాటు వర్గం నేత సచిన్ పైలట్కు కాస్త ఊరట లభించింది. ఆ నోటీసులను సవాలు చేస్తూ పైలట్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఆ అనర్హత నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పీకర్ హైకోర్టుకు విన్నవించారు. మరోవైపు, తిరుగుబాటు ఎమ్మెల్యేలు భన్వర్లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్లను పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. వారికి షోకాజ్ నోటీసులను జారీ చేసింది. ఈ ఆడియో టేప్లే సాక్ష్యం అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందనేందుకు కీలక ఆధారాలు లభించాయని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్దీప్ సూర్జేవాలా ప్రకటించారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్లాల్ శర్మ, బీజేపీ నేత సంజయ్సింగ్లకు సంబంధించిన రెండు ఆడియో టేప్లను సాక్ష్యాలుగా చూపారు. ఆ టేప్ల్లోని సంభాషణ పూర్తి వివరాలను మీడియాకు చదివి వినిపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకు పాల్పడిన ఈ ముగ్గురిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ‘బీజేపీకి ఎమ్మెల్యేల జాబితా ఇవ్వాలి’ అని ఆ టేప్ల్లో పేర్కొనడంపై తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గహ్లోత్కు వసుంధర సాయం! గహ్లోత్ ప్రభుత్వం కూలిపోకుండా బీజేపీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సాయం చేశారా? గహ్లోత్ను వీడి వెళ్లవద్దని ఎమ్మెల్యేలను ఆమె కోరారా?.. ఈ ప్రశ్నలకు అనూహ్యంగా అవుననే సమాధానమిస్తోంది బీజేపీ మిత్రపక్షం ఒకటి. సీఎం అశోక్ గహ్లోత్, వసుంధర రాజేల మధ్య అంతర్గత అవగాహన ఉందని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ చీఫ్, లోక్సభ సభ్యుడు హనుమాన్ బెణివాల్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్వయంగా రాజేనే ఫోన్ చేసి గహ్లోత్కు మద్దతివ్వాలని కోరుతున్నారని బెణివాల్ పేర్కొన్నారు. హైకోర్టులో పైలట్కు ఊరట తిరుగుబాటు నేత సచిన్ పైలట్, ఆయన వర్గ ఎమ్మెల్యేలు 18 మందికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఎమ్మెల్యేలుగా వారి అనర్హతపై మంగళవారం సాయంత్రం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పీకర్ సీపీ జోషి శుక్రవారం హైకోర్టుకు తెలిపారు. పార్టీ విప్ను ధిక్కరించి, సీఎల్పీ భేటీకి గైర్హాజరు కావడంతో పాటు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడిన ఆరోపణలపై శుక్రవారం లోగా వివరణ ఇవ్వాలని పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ జోషి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటీసులను సవాలు చేస్తూ పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. ఆ కేసు విచారణను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మొహంతి, జస్టిస్ ప్రకాశ్ గుప్తాల ధర్మాసనం విచారించింది. ౖò అనర్హతకు సంబంధించి షోకాజ్ నోటీసులను జారీ చేసే అధికారం స్పీకర్కు ఉంటుందని, ఈ విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదని సింఘ్వీ వాదించారు. అనర్హత నోటీసులపై మంగళవారం సాయంత్రం వరకు ఏ చర్య తీసుకోబోమని స్పీకర్ జోషి ధర్మాసనానికి తెలిపారు. అనంతరం కేసు విచారణ సోమవారం ఉదయానికి వాయిదా పడింది. హరియాణాలో హై డ్రామా ఆడియో టేప్ల వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో.. బహిష్కృత ఎమ్మెల్యే భన్వర్లాల్ శర్మను ప్రశ్నించడంతో పాటు, ఆయన స్వర నమూనాలను సేకరించేందుకు హరియాణాలోని గురుగ్రామ్లోని మానెసర్లో ఉన్న ఒక హోటల్కు రాజస్తాన్ పోలీసులు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. అయితే, వారిని లోపలికి వెళ్లకుండా, హరియాణా పోలీసులు గంటపాటు అడ్డుకున్నారు. -
రాజస్తాన్: ఆడియో టేపుల కలకలం
జైపూర్/ఢిల్లీ: రాజస్తాన్ రాజకీయాల్లో ఆడియో టేపుల కలకలం రేగింది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రెబల్ ఎమ్మెల్యే భన్వర్లాల్ శర్మతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ యత్నించారని పేర్కొంటూ కాంగెస్ పార్టీ రాజస్తాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ)నకు ఫిర్యాదు చేసింది. వారి కుట్రలకు సంబంధించిన మూడు ఆడియో టేపులు కూడా తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాల తెలిపారు. అసమ్మతి ఎమ్మెల్యేలు, బీజేపీ నేతల కుట్రలను వెలికి తీయాలని ఆయన ఎస్ఓజీ పోలీస్ అధికారులను కోరారు. కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు గజేంద్ర సింగ్ షెకావత్, సంజయ్ జైన్, భన్వర్లాల్ శర్మపై ఎస్ఓజీ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం. (చదవండి: రాజకీయ సంక్షోభం: వసుంధరపై సంచలన ఆరోపణలు) ఇక ఇప్పటికే తిరుగుబాటు నేత సచిన్ పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేల పదవులను ఊడబెరికిన కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసింది. బీజేపీ నాయకులతో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేశారన్న ఆరోపణల నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలు భన్వర్లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్ల పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను కాంగ్రెస్ రద్దు చేసింది. వారికి షోకాజ్ నోటీసులను జారీ చేసింది. కాగా, కాంగ్రెస్ ఆరోపణనలన్నీ అవాస్తవాలేనని రెబల్ ఎమ్మెల్యే భన్వర్లాల్ శర్మ తోసిపుచ్చారు. ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. తమకు 109 మంది ఎమ్మెల్యేల బలం ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ మహేష్ జోషి వెల్లడించారు. అవసరమైనప్పుడు బలపరీక్షకు సిద్ధమని ప్రకటించారు. మరోవైపు రాజస్తాన్ స్పీకర్ జారీ చేసిన నోటీసులపై సచిన్ పైలట్ వేసిన పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు కాసేపట్లో విచారించనుంది. (19 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ నోటీసులు) -
కుప్పంలో ఎదురుగాలి? భువనేశ్వరి ఆడియో టేపులు వైరల్!
సాక్షి, కుప్పం : పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ అధినేత చంద్రబాబుకు టెన్షన్ పెరుగుతోంది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే టీడీపీ కోట బీటలు వారుతోందా? కుప్పంలో బాబుకు ఎదురుగాలి వీస్తోందా? కుప్పంలో అభివృద్ధి జరగలేదని, ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలతో టీడీపీ అధినేత గుండెల్లో గుబులు పుట్టిందా? పులివెందులకు వెళ్లి తొడకొట్టిన చంద్రబాబుకు సొంత నియోజకవర్గ పరిస్థితులే దడ పుట్టిస్తున్నాయా? పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. ఈసారి కుప్పంలో గట్టెక్కడమే కష్టమని బాబు కుటుంబానికి ముందే తెలిసిపోయిందా..? అందుకే 40 ఏళ్లలో ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడని ఆయన భార్య భువనేశ్వరి రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టారా...? కుప్పం నాయకులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడిన భువనేశ్వరే తనకు కాన్ఫిడెన్స్ లేదని మాట్లాడటం దేనికి సంకేతం? భువనేశ్వరి ఆడియో టేపులు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఇంతవరకు ఎప్పుడూ చంద్రబాబు భార్య భువనేశ్వరి రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. కుటుంబ నిర్వహణ, వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్న ఆమె ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై మానిటరింగ్ చేస్తున్నారు. ఏకంగా వందమంది నాయకులతో ఒకేసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాటల్లో ఎక్కడా కాన్ఫిడెన్స్ లేకపోవడంతో నేతల్లోనూ భయం పట్టుకుంది. మనం ఎన్ని చేసినా ఎక్కడో అనుమానం ఉందంటూ ఆమె అనడంతో నాయకులు, కార్యకర్తల్లో మరింత ఆందోళన పెరుగుతోంది. కుప్పం నియోజకవర్గ నాయకులు కూడా కొన్ని తప్పులు జరిగాయని అంగీకరించడం చూస్తుంటే ఈ సారి అక్కడ టీడీపీ పరిస్థితి కష్టంగా ఉందని అర్థమైపోతోంది. తప్పులు జరిగాయని.. సరిచేసుకుందామంటూ అక్కడ ఇన్ఛార్జ్ నాయకులను కోరడం చూస్తుంటే వారిలో విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో.. ఆ విభేదాలు పార్టీ అధినేతను ఏ రేంజ్లో కలవరపెడుతున్నాయో స్పష్టమవుతోంది. కుప్పం టీడీపీ నేతలతో భువనేశ్వరి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ఆడియో టేపులు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
పేదలకు కనీస ఆదాయ భద్రత
న్యూఢిల్లీ/పణజీ/రాయ్పూర్: లోక్సభ ఎన్నికల్లో గెలిచి తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని పేదలందరికీ కనీస ఆదాయ భద్రత కల్పించి పేదరికాన్ని రూపుమాపుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రకటించారు. దీంతో ‘పేదరికాన్ని తొలగించండి’(గరీబీ హఠావో) అంటూ 1971 లోక్సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఇచ్చిన నినాదాన్ని మళ్లీ రాహుల్ అందుకున్నట్లైంది. ప్రధాని మోదీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సరిగ్గా 4రోజుల ముందు కాంగ్రెస్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో రైతుల ర్యాలీలో సోమవారం రాహుల్ మాట్లాడారు. ‘చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రజలందరికీ కనీస ఆదాయ భద్రతను కాంగ్రెస్ కల్పించబోతోంది. దీంతో దేశంలో ఆకలి, పేదరికం అనేదే ఉండదు’ అని రాహుల్ అన్నారు. చెప్పింది చేస్తానని, పథకాన్ని దేశమంతటా అమలు చేస్తానన్నారు. ర్యాలీలో బీజేపీపై రాహుల్ పలు విమర్శలు చేశారు. 15 మంది బడా పారిశ్రామికవేత్తలు తీసుకున్న రూ.3.5కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేసిందనీ, రైతులకు రుణమాఫీ చేయలేదని అన్నారు. మోదీ ప్రభుత్వం రెండు భారత దేశాలను సృష్టించాలని ప్రయత్నిస్తోందనీ, వాటిలో ఒకటి రఫేల్ కుంభకోణం, అనీల్ అంబానీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ తదితరులు ఉండే దేశం కాగా, ఇంకొకటి పేద రైతులు ఉండే దేశమని రాహుల్ వ్యాఖ్యానించారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కు ఓటేసి భారీ మెజారిటీతో అధికారం కట్టబెట్టిన రైతులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ ర్యాలీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. కనీస ఆదాయ భద్రత హామీపై బీజేపీ స్పందించింది. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన వందలకొద్దీ అబద్ధపు హామీల్లో ఇదొకటనీ, వాటిని అమలు చేయడం ఆ పార్టీకి కుదరని పని అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఆ టేపులు నిజమైనవే రఫేల్ ఒప్పందానికి సంబంధించిన వ్యాఖ్య లున్న గోవా ఆడియో టేపులు నిజమైనవేనని రాహుల్ ఆరోపించారు. గోవా ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ రక్షణ మంత్రి మనోహరీ పరీకర్ వద్ద రఫేల్ ఒప్పందం గురించిన భారీ రహస్యాలు ఉన్నాయనీ, వాటి వల్లనే ప్రధాని నరేంద్ర మోదీపై అధికారం చెలాయించే అవకాశం పరీకర్కు దక్కిందని రాహుల్ అన్నారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన రహస్య పత్రాలు పరీకర్ వద్ద ఉన్నాయి కాబట్టే ఆయన పదవిలో ఉన్నాడంటూ గోవా మంత్రి విశ్వజిత్ రాణే ఒక గుర్తు తెలియని వ్యక్తికి చెబుతున్న ఆడియో టేపులు ఈ నెల మొదట్లో బయటపడటం తెలిసిందే. రాహుల్ మాట్లాడుతూ ‘30 రోజులవుతున్నా వీటిపై విచారణేదీ లేదు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. మంత్రిపై ఏ చర్యలూ లేవు. ఈ ఆడియోటేపులు నిజమైనవేనని తెలుస్తోంది. రఫేల్ రహస్య పత్రాలు పరీకర్ దగ్గర ఉన్నాయి’ అని అన్నారు. రఫేల్ డీల్కు చెందిన ఆధారాలు తన పడకగదిలో ఉన్నాయంటూ పరీకర్ వ్యాఖ్యానించినట్లుగా గతంలో వచ్చిన వార్తలపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటలయుద్ధం జరిగింది. ఆ ఆడియో టేపులు నకిలీవనీ, నిజాలను దాచి అబద్ధాలను వ్యాప్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని పరీకర్ అప్పట్లో చెప్పారు. బీజేపీ నేత అనంతకుమార్ హెగ్డే కేంద్ర మంత్రి పదవిలో ఉండేందుకు అనర్హుడనీ, ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని రాహుల్ అన్నారు. అంతకుముందు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ భార్యను ఉద్దేశించి హెగ్డే అనుచిత వ్యాఖ్యలు చేశారు. గోవాలో రాహుల్, సోనియా రాహుల్ తన తల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియాతో కలిసి శని, ఆదివారాల్లో గోవాలో వ్యక్తిగతంగా పర్యటించారు. పార్టీ నేతలతో సమావేశాలు అక్కడ ఏర్పాటు చేయలేదు. ఆదివారం వారు ఓ బీచ్ రెస్టారెంట్కు వెళ్లారు. కాగా, గోవాలో మండోవి నదిపై తమ ప్రభుత్వం ఏర్పాటుచేసిన 5.1 కిలో మీటర్ల పొడవైన తాళ్ల వంతెనను రాహుల్ సందర్శించి, దేశాన్ని బీజేపీ ఎలా మారుస్తుందో చూడాలని రాహుల్ను ట్విట్టర్లో బీజేపీ కోరింది. మాజీ ప్రధాని వాజ్పేయి పేరు మీదుగా ఈ వంతెనకు అటల్ సేతు అని పేరు పెట్టారు. -
ఆ ఆడియో టేపులు బూటకమే!
బెంగళూరు: కర్ణాటకలో విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్న కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకలో తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుంటూ కాంగ్రెస్ విడుదల చేసిన ఆడియో టేపులు బూటకమేనంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే శివరామ్ హెబ్బార్ సోమవారం స్పష్టం చేశారు. హెబ్బార్ భార్యతో బీజేపీ నేతలు మాట్లాడిన ఆడియోటేపులు ఇవేనంటూ విశ్వాస పరీక్షరోజు ఉదయం కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర, అతని మిత్రుడు పుత్తుస్వామిలు హెబ్బార్ భార్యకు డబ్బులు, మంత్రి పదవిని ఇస్తామని ప్రలోభపెట్టినట్లుగా ఉంది. దీనిపై హెబ్బార్ మండిపడ్డారు. తన ఫేస్బుక్ పోస్టులో ఆ ఆడియోటేపుల విశ్వసనీయతను ప్రశ్నించారు. ‘ఈ టేపులో ఉన్నది నా భార్య గొంతు కాదు. అసలు ఆమెకు బీజేపీ నేతల నుంచి ఫోన్లు రాలేదు. ఆ ఆడియో టేపులు బూటకం. దీన్ని నేను ఖండిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయకుండా ఉండేందుకే కాంగ్రెస్ బూటకపు ఆడియో టేపులతో విషప్రచారం చేసిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. కాగా, ‘మీడియాకు మేం విడుదల చేసిన ఆడియో టేపు నిజమైందే. మా ఎమ్మెల్యే (హెబ్బార్) చెప్పింది నిజమే. అందులో మాట్లాడింది ఆయన భార్య కాదు. కానీ మిగిలినవి మాత్రం విజయేంద్ర, పుత్తుస్వాముల గొంతులే. ఈ ఇద్దరికీ నిజంగా ధైర్యముంటే.. ఫోరెన్సిక్ వాయిస్ టెస్టుకు హాజరవ్వాలి’ అని కాంగ్రెస్ పేర్కొంది. ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా కూటమి: సంతోష్ హెగ్డే హైదరాబాద్: కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగానే ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ సొలిసిటర్ జనరల్ ఎన్ సంతోష్ హెగ్డే అభిప్రాయపడ్డారు. ఏదో ఒక పార్టీకి సరైన మెజారిటీ ఇవ్వడంలో కన్నడ ప్రజలు విఫలమయ్యారన్నారు. ఏదో ఒక పార్టీకి అధికారం కట్టబెట్టడం ద్వారా వైఫల్యాలు వస్తే నిందించేందుకు, విజయాలు సాధిస్తే ప్రశంసించేందుకు వీలుంటుందన్నారు. బీజేపీని దూరంగా ఉంచేందుకు జేడీఎస్కు కాంగ్రెస్ మద్దతివ్వడంలో తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఇక్కడ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఏమీ జరగలేదు. వారి అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, కొందరిని సంతోషపెట్టేందుకే ఈ కూటమి ఏర్పడింది’ అని అన్నారు. -
యడ్యూరప్ప బేరసారాలు వెలుగులోకి..!!
సాక్షి, బెంగళూరు : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభా పక్ష నేత, కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేతో బేరసారాలు జరిపిన ఆడియో టేప్ సంచలనం రేపుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్కు ఫోన్ చేసిన యడ్యూరప్ప బీజేపీకి మద్దతు తెలిపితే మంత్రి పదవి ఇస్తానని, అన్ని విధాలుగా అండగా ఉంటానని చెబుతున్న ఆడియో టేపును కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. బల పరీక్షకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ పెద్ద ఎత్తున ప్రలోభాలకు దిగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. యడ్యూరప్ప తనయుడికి సంబంధించిన మరో టేపును కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కాగా, ఇప్పటివరకూ విపక్ష శిబిరం నుంచి మొత్తం 10 మందికి బీజేపీ గాలం వేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు, జేడీఎస్ నుంచి ఒకరు, ఇద్దరు ఇండిపెండెట్లను బీజేపీ తనవైపు ఆకర్షించిందని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ, నారాయణరావు, రాజశేఖర్ పాటిల్, మహాతేజ, హోళగెరి, బయ్యాపూర్ అమెరగడలు, జేడీఎస్ నుంచి వెంకట రావ్ నడగడ, స్వతంత్రులు నరేష్, శంకర్లు ఇందులో ఉన్నట్లు సమాచారం. కాగా, ఇప్పటివరకూ ప్రొటెం స్పీకర్ 210 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. మధ్యాహ్నం 03.30 గంటలకు అసెంబ్లీని వాయిదా వేశారు. దీంతో మిగతావారి ప్రమాణస్వీకారంపై ప్రతిష్టంభన నెలకొంది. -
యాపిల్ హెడ్ ఆఫీసులో ఉద్యోగి మృతి
కాలిఫోర్నియా: అసలే ఈ ఏడాది నికర లాభాల్లో 13 శాతం నష్టాలు చవిచూసి బాధల్లో ఉన్న యాపిల్ కంపెనీకి మరో షాక్ తగిలింది. క్యూపర్టినో నగరంలో గల యాపిల్ హెడ్ క్వార్టర్స్లోని 1 ఇన్ఫినిటీ క్యాంపస్ వద్ద బుధవారం ఉదయం ఒక ఉద్యోగి అనుమానాస్పదస్థితిలో మరణించాడు. నగరంలోని యాపిల్ ఆఫీస్ నుంచి ఉద్యోగి మరణించినట్లు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో పోలీసులు సమాచారం అందుకున్నారు. హుటాహుటిన 1ఇన్ఫినిటీలూప్కు చేరుకున్న పోలీసులు ఉద్యోగి శవాన్ని పరిశీలించారు. ఉద్యోగిది ఆత్మహత్యా? లేక హత్యా? అనే విషయాలను విచారణ పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని క్యూపర్టినో నగర అధికారి షెరీఫ్ సెక్యూరిటీ డిప్యూటీ యురీనా తెలిపారు. ఓ వెబ్సైట్లో లభించిన ఆడియో టేపుల ప్రకారం అదే ఆఫీసులో పనిచేస్తున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వ్యక్తి మరణానికి రెండు నిమిషాల ముందు ఆమె తలపై ఎవరో తుపాకీ కాల్చినట్లు చెబుతున్నారు. కానీ, అతని మరణానికి ఆమె ఏ విధంగా కారణమనే విషయం మాత్రం ఆ టేపులో వెల్లడించలేదు. ఈ ఆడియో వివరాలపై అధికారులు స్పందించలేదు. ఈ విషయం మీద తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఎవరికి అపాయం లేదని అధికారులు చెప్పారు. ఘటనపై కంపెనీ ఇచ్చిన వివరాలను పోలీసులు బయటకు వెల్లడించలేదు. పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాత వివరాలను వెల్లడిస్తామన్నారు. అయితే, ఉద్యోగి మృతిపై యాపిల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
సంచలనం రేపుతున్న అనూష హత్యకేసు
-
డబ్బు సమకూర్చిన బడాబాబుల కోసం వేట
-
’వీడియో, ఆడియో టేపులన్నీ వాస్తవాలే’
-
'సాక్షి' చేతికి ఫోరెన్సిక్ నివేదిక
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో వాస్తవాలు బయటపడుతున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక 'సాక్షి' సంపాదించింది. ఓటుకు కోట్లు కేసులో నడిచిన వ్యవహారమంతా వాస్తవాలేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. ఏసీబీ దాడులు చేసిన సమయంలో రెడ్హాండెడ్గా పట్టుకున్న వీడియో, ఆడియో టేపులపై ఫోరెన్సిక్ ల్యాబ్ విశ్లేషించింది. దాదాపు 12 రోజులపాటు నిశితంగా విశ్లేషించి... అవన్నీ వాస్తవాలేనని నిర్ధారించింది. వీడియో, ఆడియో టేపులను ఎవరూ ఎడిట్ చేయలేదని, కల్పితాలు కాదని కూడా ల్యాబ్ విస్పష్టంగా ప్రకటించింది. ఈ ఫోరెన్సిక్ నివేదిక ఓటుకు కోటు కేసులో కీలకంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ...నగదు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలను మరింత నిర్ధారణ కోసం ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన విషయం తెలిసిందే. రెండు సెల్ఫోన్లు, కెమెరాలు, రేవంత్ రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న సీపీయూలను ల్యాబ్కు పంపారు. అలాగే మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను కూడా ల్యాబ్కు పంపారు. ఆడియోలో ఉన్నది తన గొంతు కాదంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న వాదనల నేపథ్యంలో ఆధారాలను ల్యాబ్కు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ 14 ఆడియోలో, వీడియో టేపుల్లో ఉన్న వాస్తవ అంశాలను ల్యాబ్ శాస్త్రీయ రీతిలో నిర్ధారణ చేశారు. *మొత్తం మూడు ఫైల్స్లో వీడియో దృశ్యాలు * మొదటి వీడియో ఫైల్ నిడివి 86 నిమిషాల 21 సెకండ్లు *రెండో వీడియో ఫైల్ నిడివి 10 నిమిషాల 38 సెకండ్లు *మూడో వీడియో ఫైల్ నిడివి 43 నిమిషాల 9 సెకన్లు * తొలి ఆడియో ఫైల్ నిడివి 45 నిమిషాల 12 సెకన్లు * రెండో ఆడియో ఫైల్ నిడివి 44 నిమిషాల 52 సెకన్లు *మూడో ఆడియో ఫైల్ నిడివి 47 నిమిషాల 18 సెకన్లు ఎవరు ఎవరితో ఏం మాట్లాడారో మొత్తం విపులంగా రిపోర్టులో పేర్కొన్న ఎఫ్ఎస్ఎల్ ఏసీబీ నుంచి జులై 14న టేపులు అందుకున్న ఎఫ్ఎస్ఎల్, జులై 24న నివేదిక ఇచ్చిన ఎఫ్ఎస్ఎల్ -
'సాక్షి' చేతికి ఫోరెన్సిక్ నివేదిక
-
ఓటుకినోటు హాట్టాపిక్
-
దమ్ముంటే సీబీఐ విచారణ కోరు
ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ఎమ్మెల్యేకు నీ సన్నిహితుడు రేవంత్రెడ్డి డబ్బులిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఇందులో నీ ప్రమేయం ఉన్నట్టు ఆడియో టేపులో బహిర్గతమైంది. రూ.50 లక్షలు ఎక్కడ నుంచి వచ్చాయి? తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆంధ్ర ప్రజలను మబ్బుల్లో పెట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య సమరానికి పన్నాగం చేస్తున్నావు. దీనికి రాష్ర్ట ప్రజలకు సంబంధమేమిటి? దమ్ముంటే ఈ అభియోగాలపై సీబీఐ విచారణ కోరు. రేవంత్ వ్యవహారంలో పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి. తెలంగాణ, ఆంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీగా ముడుపులు సేకరించారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు అన్యాయం చేస్తూ రూ.400 కోట్ల లబ్ధి పొందారు. ఏడాది కాలంలో వివిధ శాఖల ద్వారా నీ కొడుకును అడ్డు పెట్టుకుని రూ.1,200 కోట్ల వసూళ్లకు పాల్పడ్డావు. రేవంత్రెడ్డి ఏసీబీ కేసు వ్యవహారంపై మాట్లాడేందుకు కోర్టులో ఉందంటున్నారు. అలాగైతే మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేవలం ఆరోపణ వస్తే అతిగా ఎందుకు మాట్లాడారు? నీచసంస్కృతి మీవద్దే ఉంది. మా పార్టీలోకి వచ్చేందుకు 23 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నప్పటికీ, ప్రజలనుంచే అసలు సిసలైన తీర్పు రావాలని మా నాయకుడు కోరుకుంటున్నారు. - ముఖ్యమంత్రి చంద్రబాబునుద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ -
బాబు తీరు దొరికిపొయిన దొంగలా ఉంది
-
ఓటుకు నోటు ఆపరేషన్ సాగిన తీరిదీ..
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ మధ్య జరిగిన వ్యవహారం మొత్తం ఎలా సాగింది.. ఈ అపరేషన్లో స్టీఫెన్ను రేవంత్ ఎప్పుడు ఎలా కలిశారు... చంద్రబాబుతో ఎప్పుడు మాట్లాడించారు.. ఈ తతంగం ఎలా సాగిందో ఒకసారి చూద్దాం... రేవంత్ తనను బాసే ఆథరైజ్ చేసి పంపించాడంటూ స్టీఫెన్తో చెప్పారు. అంతేకాక తనకు ఇచ్చిన అప్పర్ లిమిట్ ఇచ్చింది 'రెండున్నర' అని చెప్పారు. దాంతో తాము ముగ్గురిని కలిసి మూడు ఇచ్చామన్నారు. ఈ విషయం తమకు కూడా తెలియాల్సిన పని లేదని, మీరే డైరెక్ట్గా సార్తో మాట్లాడుకోవచ్చని చెప్పారు. దానికీ స్టీఫెన్.. సార్ ఎప్పుడు కలుస్తారని అడగడంతో.. రేవంత్ 'ఇప్పుడే ఫోన్లో మాట్లాడిస్తా' అని చెప్పారు. ఇక్కడ ఏదైనా సమస్య అనుకుంటే.. మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడే ఇస్తాము.. ఇదే విషయాన్ని సార్తో చెబుతానన్నాడు. ఇంతలో చంద్రబాబు తరపు మనిషి ఫోన్లో స్టీఫెన్సన్తో మాట్లాడారు. 'హలో బ్రదర్ బాబుగారు మీతో మాట్లాడుతారు.. లైన్లో ఉండండి' అన్నాడు. చంద్రబాబు ఫోన్లో స్టీఫెన్తో ఫోన్లో ఇలా మాట్లాడారు... హాలో..బ్రదర్.. మనవాళ్లు నాకంతా వివరించారు. మీకు అండగా నేను ఉంటా...! కంగారు పడాల్సిందేమీ లేదని హామీ ఇచ్చారు. అన్నింటికి మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తామన్నారు. మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి... ఎలాంటి సమస్య ఉండదు..అది మా హామీ... మనం కలిసి పనిచేద్దామని స్టీఫెన్కు చంద్రబాబు హామీ ఇచ్చారు. -
ఫోన్లో మాట్లాడించింది ఎవరు.. ఏసీబీ ఆరా
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కోట్లు వెదజల్లిన కేసులో మరికొన్ని కీలక అంశాలు బయట పడుతున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ను చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించింది ఎవరన్నదానిపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఆడియో టేపులలో వినిపించిన మొదటి గొంతును పోల్చేందుకు ఏసీబీ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. 'అవర్ బాబుగారు వాంట్స్ టు టాక్ టు యూ.. బీ ఆన్ ద లైన్' అని చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు సాగుతోంది. సెబాస్టియన్ ద్వారానే చంద్రబాబు మాట్లాడినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గతంలోనే అనేక ఆపరేషన్లలో సెబాస్టియన్ మధ్యవర్తిత్వం వహించడంపై ఏసీబీ అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. -
ఆపరేషన్ సాగిన తీరిలా...
-
' ఫోన్లను ఎవరూ ట్యాపింగ్ చేయలేదు'
-
చీమా..చీమా .. ఎందుకు కుట్టావు?
(సాక్షి వెబ్సైట్ ప్రత్యేకం) సరిగ్గా సంవత్సరం క్రితం ఢిల్లీ విమానాశ్రయంలో ఒక దృశ్యం ఆవిష్కృతమైంది. బియాస్ నదిలో విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థులు కొందరు కొట్టుకుపోయి దుర్మరణం పాలవ్వగా, బతికి బయటపడ్డ విద్యార్థులకు అండగా నిలిచింది తామంటే తామని... మేము ఏర్పాటు చేసిన విమానంలో హైదరాబాద్ తరలిస్తామంటే ... కాదు మేమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు టీవీ కెమెరాల సాక్షిగా తోసుకున్నారు, వాదులాడుకున్నారు. అప్పటికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా కాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి ఒకటి రెండు రోజులు కాలేదు. తీవ్రమైన షాక్లో ఉన్న విద్యార్థులు బిక్కమొహం వేయగా, రాష్ట్ర ప్రజానీకం ఆశ్చర్యపోయింది. సంవత్సరం తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగాధం పూడ్చలేనంతగా పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయికి దిగజారిపోయాయి. గత సంవత్సరం రోజుల్లొ ఏ ఒక్క రోజు కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సామరస్యపూర్వక వాతావరణం కనిపించలేదు. కేసీఆర్, చంద్రబాబు పరస్పరం పలకరించుకోవడమే బ్యానర్ స్టోరీగా మారేంతగా సంబంధాలు దిగజారిపోయాయి. ఆస్తులు, అప్పులు విభజన దగ్గర మొదలైన విభేదాలు దాదాపు అన్ని విభాగాలకు పాకాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపకాలు, ఉన్నత విద్యామండలి విభజన, ఎమ్సెట్ లాంటి ప్రవేశ పరీక్షలు, నీటి వినియోగం, విద్యుత్తు కేటాయింపులు, పెట్టుబడుల ఆకర్షణ ఇలా ప్రతీ రంగంలో, ప్రతీ అంశంలో మాటల తూటాలు పేలాయి. గవర్నర్ దగర్గ పంచాయితీ సర్వసాధారణమైపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కేంద్రం హోంశాఖ దగ్గర కూడా పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు నోట్ల కట్టలకు ఓటు వ్యవహారంతో పూర్తిగా దిగజారిపోయాయి. రేవంత్ రెడ్డి వ్యవహారం చంద్రబాబుకు ప్రాణ సంకటంగా పరిణమించింది. తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా కదులుతోంది. చంద్రబాబు ఆడియో టేపుల వ్యవహారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. చంద్రబాబు మౌనాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తుంటే.. 'కుట్ర' అనే గొంతుకలు వినబడుతున్నాయి. మా ముఖ్యమంత్రికి నోటీసులిచ్చే దమ్ము ధైర్యం ఉందా అని రెచ్చగొడుతున్న వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా ఉన్నాయి. మీరు టేపులు విడుదల చేస్తే, మేము కేసులు పెడతామని ఆంధ్రప్రదేశ్లో చాలా పోలీస్ స్టేషన్లలో కేసీఆర్పై కుట్ర కేసులు నమోదు చేస్తున్నారు. ఈవారం, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ బాట పడుతున్నారు. చంద్రబాబు రేపు విమానం ఎక్కుతుంటే.. ఆ తర్వాత రెండు రోజులకు కేసీఆర్ కూడా ఢిల్లీ గడప తొక్కుతున్నారు. 'నిప్పులాంటి వాడిని...' 'ఎవరికీ భయపడను..' 'బుల్లెట్లా దూసుకుపోతాను' 'నీతికీ, నిజాయితీకి ఆంధ్ర అన్నా హజారేను' అని డాంబికాలు పోయే చంద్రబాబు ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. పోగా ప్రజలను తన మందీ మార్బలంతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా వ్యక్తిగత నైతికతకు సంబంధించిన అంశాలను ఆంధ్ర్రప్రదేశ్, తెలంగాణ సామాన్య ప్రజానీకం సమస్యగా మరల్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నారు. ఇందులో ఇరు రాష్ట్రాల ప్రజల ప్రమేయం ఏమిటో అర్థం కాదు చంద్రబాబు రాజకీయ ప్రయోజనం తప్ప. ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రజలు తిరగబడుతున్న సూచనలు కనపడుతూనే ఉన్నాయి. అసలు నిజం ఏమిటి? రేవంత్ వీడియోలు అబద్ధమా? నోట్ల కట్టలు అంతా ఉత్తివేనా? హలో బ్రదర్ అని వినబడిన గొంతు ఎవరిది? ఇందులోకి రెండు రాష్ట్రాల ప్రజలను ఎందుకు లాగుతున్నారు? లాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో కోకొల్లలు. ఆ ప్రశ్నల వాడి వేడీ కూడా పెరుగుతోంది. అసలు కేసీఆర్ ఎందుకు కుట్టాడు. ''చీమా చీమా ఎందుకు కుట్టావు? .. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?'' ఇపుడు జరుగుతోంది కూడా అదే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి గాలం వేస్తే చేప దొరకలేదు కానీ.. కొక్కెం ఊడిపోయే పరిస్థితి వచ్చింది. నా కొక్కెం ఊడిపోయింది అందుకు చేపల యజమాని కుట్రపన్నాడు.. ఇది నా ప్రజలను అవమానించడమే అంటూ గగ్గోలు. అసలు గాలం ఎందుకు వేయాలనుకున్నావు. పుట్టలో వేలు ఎందుకు పెట్టాలనుకుంటున్నావు. మమ్మల్ని ఈ బురదలోకి ఎందుకు లాగుతున్నావనే ప్రశ్నలకు జవాబులు రావు. ప్రజలనే కాదు.. ఇతర పార్టీలకు కూడా మసిపూసి ఇదుగో కుమ్మక్కు అని చూపించాలనే తాపత్రయం. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ వ్యవహారంతో సంబంధం ఏమిటి? స్టీవెన్ సన్తో మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో నాకు సబంధం లేదు. ఏ విచారణకైనా సిద్ధం అని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు. నిన్నటివరకు సీబీఐ విచారణ కావాలి అని ఎలుగెత్తిన గొంతులు .. ఆడియో టేపులు బయటకురాగానే ఆ మాటే ఎత్తడం లేదు... ఎందుకనో? -
'చంద్రబాబు ఫోన్లను ఎవరూ ట్యాపింగ్ చేయలేదు'
చంద్రబాబు నాయుడు ఫోన్లను ఎవరూ ట్యాపింగ్ చేయలేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. చంద్రబాబు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేసిన వ్యవహారంపై ఏసీబీ విచారణ చేస్తోందని ఆయన అన్నారు. ఇప్పటివరకు బయటపడినవి సెబాస్టియన్ ఫోన్ రికార్డులనే ఏసీబీ చెబుతోందని కేటీఆర్ చెప్పారు. -
చంద్రబాబు రాజీనామా చేయాలి:మైసూరారెడ్డి
-
సూట్కేసుతో చిన్నబాబు..బ్రీఫ్కేసుతో పెద్దబాబు
-
ఏసీబీ ప్రధాన కార్యాలయానికి రేవంత్
-
సీఎం ఫోన్ను ఎలా ట్యాప్ చేస్తారు