Bhavani Nagar
-
బంజారాహిల్స్: భర్తతో గొడవపడి.. సోదరి ఇంటికి వెళ్తున్నానని చెప్పి..
సాక్షి, హైదరాబాద్: భర్తతో గొడవ పడి ఇద్దరు పిల్లలతో బయటకు వెళ్లిన ఓ గృహిణి కనిపించకుండా పోయిన ఘటన భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన ప్రియాంక(35), శామ్యూల్ దంపతులు. వీరికి రిచల్ శరణ్(6), అభిషేక్పాల్(3) సంతానం. ప్రియాంక ఇటీవల భర్తతో గొడవపడి పాతబస్తీ లలితాబాగ్లో నివాసముండే సోదరి ప్రసన్న కుమారి ఇంటికి ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లింది. 9వ తేదీన సాయంత్రం ఇద్దరు పిల్లలతో కలిసి బయటకి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాతబస్తిలో కార్డన్ సెర్చ్
హైదరాబాద్: పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తలాబ్కట్ట, అమన్ నగర్ ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన దృవపత్రాలు లేని 83 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 10 మంది రౌడీ షీటర్లతో పాటు 84 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రెండు బెల్ట్ షాపులపై దాడులు చేసిన పోలీసులు 76 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ మండల డీసీప వి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్డన్ సెర్చ్లో 400 మంది పోలీసులు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో 8 మంది చిన్నారులకు గాయాలు
హైదరాబాద్ : భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో శనివారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి12 మంది గాయపడ్డారు. వారిలో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. సకాలంలో స్థానికులు స్పందించి, పెను ప్రమాదం జరగకుండా కాపాడగలిగారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. -
కత్తులతో దాడి..
హైదరాబాద్ సిటీ: భవానినగర్ పీఎస్ పరిధిలోని హైదయత్ ఫంక్షన్ హాల్ వద్ద ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఓ మేనమామ తన అల్లుడిపై దాడి చేశాడు. తన భార్యకు సంబంధించిన నగల విషయంతో గొడవ రావడంతో కత్తులతో సొంత మేనల్లుడిని దారుణంగా పొడిచాడు.ఈ ఘటనలో అహ్మద్ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం దగ్గరలోని అస్రా హాస్పిటల్కు తరలించగా చికిత్సపొందుతూ మరణించాడు. మరో ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బావిలో పడి చిన్నారి మృతి
-
పాతకక్షలతో ముగ్గురు యువకులపై దాడి
యాకుత్పురా: పాత కక్షల కారణంగా నలుగురు యువకులు ముగ్గురిపై దాడి చేసిన సంఘటన హైదరాబాద్ నగరం భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ వి.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్కట్టా మురాద్ మహాల్ ప్రాంతానికి చెందిన ముజఫర్ అలీ (22) చార్మినార్ సమీపంలో సెల్ఫోన్ రిపేరింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. కాగా శనివారం రాత్రి దుకాణం వద్దకు వచ్చిన అక్రమ్ అనే యువకుడు ముజఫర్ ఇంటి వద్ద కొందరు యువకులు గుమిగూడారని చెప్పారు. దీంతో ముజఫర్ హుటాహుటిన తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటి వద్ద మజాజ్ అనే యువకుడు ఇమ్రాన్, షాబాజ్, ఇమ్రోజ్లతో కలిసి ముజఫర్పై దాడికి పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారు. ముజఫర్ ఇంటి తలుపులు కొట్టగా ఇంట్లో నుంచి ముజఫర్ తల్లి బయటికి వచ్చింది. ఎవరు కావాలని అడగ్గా.. మజాజ్ తల్లిపై దాడి చేశాడు. దీంతో ముజఫర్, మజాజ్ల మధ్య గొడవ జరిగింది. మజాజ్ తన వెంట ఉన్న ఇమ్రాన్, ఇమ్రోజ్, షాబాజ్లతో కలిసి ముజఫర్పై దాడికి పాల్పడ్డాడు. దాడిని అడ్డుకోవడానికి వచ్చిన అబుబాకర్, సయ్యద్ మోయిజ్లను సైతం మజాజ్ గ్యాంగ్ చితకబాదారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ముజఫర్, అబుబాకర్, మోయిజ్లు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం జరిగిన దాడిపై ముజఫర్ భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వీణ-హరికృష్ణల కథ సుఖాంతం
-
వీణ-హరికృష్ణల కథ సుఖాంతం
తిరుపతి: గత రెండు రోజుల నుంచి భర్త, అత్తమామల వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ దీక్ష చేపట్టిన వీణ కథ సుఖాంతమయ్యింది. భార్య వీణతో కాపురం చేయడానికి భర్త సమ్మతి వ్యక్తం చేయడంతో ఆమె దీక్షకు ప్రతిఫలం లభించింది. దీక్ష స్థలిలోనే ఎమ్మెల్యే సమక్షంలో భార్య భర్తలిద్దరూ మరోసారి దండలు మార్చుకున్నారు. దీంతో వారిద్దరి సమస్య ఓ కొలిక్కి వచ్చినా.. ఆమె తల్లి దండ్రులు మాత్రం ఇంకా పూర్తి న్యాయం జరగలేదని అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు భర్త హరికృష్ణ తనతో కలిసి కాపురం చేస్తానంటేనే దీక్ష విరమిస్తానని వీణ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తనను భర్త ఆదరించాలంటూ రెండు రోజుల క్రితం దీక్ష చేపట్టిన వీణ శుక్రవారం కూడా కొనసాగించింది. ఉదయం బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే వెంకటరమణ.. సాయంత్రానికి కల్లా సమస్యను పరిష్కారిస్తానని హామీ ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే వీణ మామయ్య గోవిందయ్య తో చర్చలు జరిపాడు. వీణ దీక్ష చేస్తున్న వార్తలను చూసిన భర్త హరికృష్ణ కూడా ఘటనాస్థలికి చేరుకోవడంతో వారి మధ్య ఎమ్మెల్యే రాజీ కుదిర్చారు. దీంతో పాటు వీణకు అటు మీడియా, మహిళా సంఘాల మద్దతు కూడా లభించడంతో భర్త హరికృష్ణ కాపురం చేయడానికి అంగీకరించాడు. తిరుపతి భవానీనగర్కు చెందిన గోవిందయ్య, పద్మావతి కుమారుడు హరికృష్ణతో జీవకోనకు చెందిన వెంకటముని, జ్యోతి కుమార్తె వీణకు 2013 జనవరిలో వివాహమైంది. 11 నెలల క్రితం వీరికి ఆడబిడ్డ పుట్టిందని ఆమె నుంచి భర్తను దూరం చేసే యత్నం చేశారు. ఆడపిల్ల పుట్టిందని అత్తగారింటి నుంచి చూడడానికి ఎవ్వరూ రాలేదు. కనీసం తండ్రి హరికృష్ణ కూడా రాలేదు. ఈ సమస్య తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సూచన మేరకు బుధవారం ఏఎస్పీని కలిశారు. దీంతో వీణ భర్త హరికృష్ణను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తరువాత భర్త హరికృష్ణ మాయం కావడం. ఆమె దీక్ష చేపట్టడంతో కలకలం సృష్టించింది. -
భర్త ఆదరిస్తేనే దీక్ష విరమిస్తా: వీణ
తిరుపతి: భర్త హరికృష్ణ తనతో కలిసి కాపురం చేస్తానంటేనే దీక్ష విరమిస్తానని వీణ స్పష్టం చేసింది.గత రెండు రోజుల క్రితం తనను, బిడ్డను భర్త ఆదరించాలంటూ దీక్ష చేపట్టిన వీణ శుక్రవారం కూడా తన నిరసనను కొనసాగించింది. ఈ రోజు ఉదయం బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే వెంకటరమణ .. సాయంత్రానికల్లా సమస్యను పరిష్కారిస్తానని హామీ ఇచ్చాడు. ఇందులో భాగంగానే వీణ మామయ్య గోవిందయ్య చర్చలు చేపట్టారు. వీణ దీక్ష చేస్తున్న వార్తలను చూసిన భర్త హరికృష్ణ కూడా ఘటనా స్థలికి చేరుకున్నాడు. అయితే భర్త హరికృష్ణ తనతో కాపురం చేస్తేనే దీక్ష విరమిస్తానని వీణ తెలిపింది. ఒకవేళ అలా కాకపోతే దీక్షను కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేసింది. తిరుపతి భవానీనగర్కు చెందిన గోవిందయ్య, పద్మావతి కుమారుడు హరికృష్ణతో జీవకోనకు చెందిన వెంకటముని, జ్యోతి కుమార్తె వీణకు 2013 జనవరిలో వివాహమైంది. 11 నెలల క్రితం వీరికి ఆడబిడ్డ పుట్టింది. అప్పటి నుంచి అత్తగారింటి నుంచి చూడడానికి ఎవ్వరూ రాలేదు. కనీసం తండ్రి హరికృష్ణ కూడా రాలేదు. ఈ సమస్య తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సూచన మేరకు బుధవారం ఏఎస్పీని కలిశారు. దీంతో వీణ భర్త హరికృష్ణను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తరువాత ఇంటికి బయలుదేరినా మార్గమధ్యంలోనే అదృశ్యమయ్యాడని వీణ వివరించింది. తనను ఆదరించమని అత్తారింటి ముందు దీక్షకు దిగినట్లు ఆమె స్పష్టం చేసింది. ‘మా అత్తామామలకు, భర్తకు ఆస్తులు చూసుకోవడానికి వారసుడు కావాలని తనను భర్త నుంచి దూరం చేసేందుకు యత్నిస్తున్నారని వీణ ఏకరువు పెట్టింది. అవసరమైతే రెండో పెళ్లి చేయడానికైనా సిద్ధపడేలా ఉన్నారు. తనను, తన బిడ్డను భర్త దగ్గరకు చేర్చుకుంటాడనే ఆశ ఉంది అంటున్న వీణకు మహిళ సంఘాల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. -
ఆగని కోడలి దీక్ష
తిరుపతిక్రైం: ‘మా అత్తామామలకు, భర్తకు ఆస్తులు చూసుకోవడానికి వారసుడు కావాలంటున్నాడు. అవసరమైతే రెండో పెళ్లి చేయడానికైనా సిద్ధపడేలా ఉన్నారు. బుధవారం నుంచి నా భర్తకు ఉన్న మెడికల్ షాప్ను కూడా మూసివేసి కనపడకుండా పంపించివేశారు. నాకు కేసులు అవసరం లేదు. నాకు నాభర్త కావాలి. ఇదంతా నాభర్త కోసమే చేస్తున్నాను. మీరు ప్రచురించే వార్తను చూసైనా నన్ను, నాబిడ్డను దగ్గరకు చేర్చుకుంటాడనే ఆశ ఉంది’. అంటూ ఓ అభాగ్యురాలు మెట్టినింటి వద్ద లోకం పోకడ తెలియని పసిబిడ్డను ఒడిలో ఉంచుకుని గురువారం కూడా దీక్ష కొనసాగించింది. తిరుపతి భవానీనగర్కు చెందిన గోవిందయ్య, పద్మావతి కుమారుడు హరికృష్ణతో జీవకోనకు చెందిన వెంకటముని, జ్యోతి కుమార్తె వీణకు 2013 జనవరిలో వివాహమైంది. 11 నెలల క్రితం వీరికి ఆడబిడ్డ పుట్టింది. అప్పటి నుంచి అత్తగారింటి నుంచి చూడడానికి ఎవ్వరూ రాలేదు. కనీసం తండ్రి హరికృష్ణ కూడా రాలేదు. ఈ సమస్య తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సూచన మేరకు బుధవారం ఏఎస్పీని కలిశారు. దీంతో వీణ భర్త హరికృష్ణను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తరువాత ఇంటికి బయలుదేరినా మార్గమధ్యంలోనే అదృశ్యమయ్యాడని వీణ వివరించింది. తనను ఆదరించమని అత్తారింటి ముందు దీక్షకు దిగినట్లు ఆమె స్పష్టం చేసింది. పార్టీలు సంఘాల మద్దతు న్యాయం కోసం పోరాటం సాగిస్తున్న వీణకు వివిధ పార్టీలు, మహిళా సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు. ఆమెతో పాటు లక్ష్మి (ఐద్వా), టీ.రాజేంద్ర (వైఎస్ఆర్ సీపీ), రాటకొండ విశ్వనాథ్ (బీజేవైఎం) చిన్నం పెంచలయ్య (సీపీఐ)తో పాటు పలువురు నాయకులు బైఠాయించారు. ఐద్వా మద్దతు తిరుపతి కల్చరల్: న్యాయం కోసం భర్త ఇంటి ముందు మౌనదీక్ష చేపడుతున్న వీణకు ఐద్వా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. వీణను కాపురానికి నిరాకరించడంపై ఆమె భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
భర్త ఇంటి ముందు భార్య నిరసన
తిరుమలలోని భవానీ నగర్లో ఓ దారుణం చోటుచేసుకుంది. ఆడిపిల్ల పుట్టిందని ఓ భర్త తన భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. అతడు పెట్టే బాధలు భరించలేక చివరికి పోలీసులను ఆశ్రయించింది. రక్షణ కల్పించాల్సిందిగా ఖాకీలను కోరింది. అయినా పోలీసుల నుంచి స్పందన కరువైంది. భర్త తనను వేధింపులకు గురిచేస్తున్నాడని మెరపెట్టుకున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక చేసేదేమి లేక భర్త హరిప్రసాద్ ఇంటి ముందు ఆడ పసికందుతో భార్య నిరసనకు దిగినట్టు సమాచారం.