Chota K Naidu
-
వాళ్లంతా గొప్పవాళ్లు.. నేను కాను
‘‘పెదకాపు 1’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ వీవీ వినాయక్ చూశారు. విజువల్స్ ఆయనకు బాగా నచ్చడంతో పీసీ శ్రీరామ్గారితో నన్ను పోల్చారు. అయితే పీసీ శ్రీరామ్గారితో పోల్చుకునేటంత గొప్ప వ్యక్తిని కాదు నేను. పీసీ శ్రీరామ్, వీఎస్ఆర్ స్వామి, విన్సెంట్ (ఛాయాగ్రాహకులు).. వాళ్లంతా గొప్పవాళ్లు’’ అని కెమెరామేన్ ఛోటా కె. నాయుడు అన్నారు. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెదకాపు 1’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా చేసిన ఛోటా కె.నాయుడు విలేకరులతో పంచుకున్న విశేషాలు... ► ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో శ్రీకాంత్ అడ్డాల, నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తన ప్రతి సినిమా కథ నాకు చె΄్తాడు. ఇద్దరం కలసి చేద్దామనుకుంటాం కానీ ‘పెదకాపు 1’కి కుదిరింది. తన సినిమాల్లాగానే శ్రీకాంత్ చాలా కూల్గా ఉంటాడు. తనని చూస్తే నాకు కె.విశ్వనాథ్గారిలా అనిపిస్తారు. కూల్గా ఉండే తను ‘పెదకాపు 1’ లాంటి చిత్రం చేసి, ఇంత మంచి ఔట్పుట్ ఇవ్వడం నాకు షాక్ అనిపించింది. శ్రీకాంత్ అడ్డాలకి నటుడిగా ఇది తొలి చిత్రమైనా సింగిల్ టేక్లో చేసేసేవాడు.. తను నటించిన ప్రతి సీన్ని మా నిర్మాత రవీందర్ రెడ్డిగారు డైరెక్ట్ చేశారు. ► ‘పెదకాపు 1’ కథ 1983 నేపథ్యంలో జరుగుతుంది. ఈ కథ కొత్త ΄్యాట్రన్, కొత్త కలర్స్, మేకింగ్ని డిమాండ్ చేసింది.. దాన్ని తీసుకురావడం నాకు సవాల్గా అనిపించింది. ఈ విషయంలో క్రెడిట్ దర్శకుడిదే. ► నేనెప్పుడూ హీరో స్థానానికి గౌరవం ఇస్తాను. స్టార్ హీరోనా, పెద్ద హీరోనా, చిన్న హీరోనా అని చూడను. విరాట్కి ఇది తొలి సినిమా అయినా అనుభవం ఉన్న నటుడిలా చేశాడు. హీరోయిన్ ప్రగతికి కూడా మొదటి సినిమా అయినా చాలా బాగా చేసింది. నటి అనసూయ కూడా తన పాత్రని మేము అనుకున్నదానికంటే బాగా చేసింది.. మిక్కీ జె.మేయర్ ఇలాంటి చక్కని నేపథ్య సంగీతం ఇవ్వడం నన్ను సర్ప్రైజ్ చేసింది. ► ‘పెదకాపు 1’ ని రవీందర్ రెడ్డిగారు కాకుండా మరో నిర్మాత అయితే ఐదారు కోట్లలో సినిమా తీయమని చెప్పేవారు. కానీ, ఈ కథ ముప్పై నలభై కోట్లు డిమాండ్ చేస్తుంది. ఆయన కాబట్టి ఇంత భారీ బడ్జెట్తో తీశారు. పైగా తన బావమరిదిని హీరోగా లాంచ్ చేస్తున్నారు. ‘పెదకాపు 2’ చిత్రం కూడా ఉంటుంది. ► ‘పెదకాపు 1’ కోసం 1983 నాటి వాతావరణం సృష్టించడానికి చాలా కష్టపడ్డాం. ఈ మూవీలో హీరో, అతని స్నేహితులు జెండా కర్ర పాతే సన్నివేశం చిత్రీకరించడం నా కెరీర్లో అద్భుతం. నేను చాలా గర్వంగా చెప్పుకునే ఎపిసోడ్ ఇది. నెక్ట్స్ చిరంజీవిగారి 157వ సినిమా చేస్తున్నాను.. నవంబర్లో షూటింగ్ ్రపారంభమవుతుంది. -
అలాంటివాడిని కూడా ఇంటికి ఆహ్వానించాడు..అది చిరంజీవి సంస్కారం
దసరా సందర్భంగా హైదరాబాద్లక్ష హరియాణా గవర్నర్ బండారు దత్తత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ వేడుకలో చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో గరికపాటి మాట్లాడుతుంటే.. అక్కడ జనాలు పట్టించుకోకుండా చిరంజీవితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూశారు. దీంతో ఆగ్రహించిన గరికపాటి.. చిరంజీవి ఫోటో సెషన్ ఆపేసి స్టేజ్ మీదకు రాకుంటే..తాను వెళ్లిపోతానని హెచ్చరించాడు. ఈ వ్యాఖ్యలు చిరంజీవి అభిమానులను బాధించాయి. నాగబాబుతో సహా మెగా అభిమానులంతా గరికపాటిపై దండెత్తారు. సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్ చేశారు. చివరకు చిరంజీవికి గరికపాటి క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం చల్లారలేదు. (చదవండి: గాడ్ఫాదర్ ఆ రేంజ్ బ్లాక్బస్టర్: చిరంజీవి) తాజాగా ప్రముఖ ఛాయగ్రాహకుడు ఛోటా కె. నాయుడు కూడా గరికపాటిపై ఫైర్ అయ్యాడు. శనివారం జరిగిన ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ మీట్లో ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ.. ‘ఇండియన్ స్క్రీన్ పై చిరంజీవిగారితో పోలిక పెట్టడానికి ఎవరూ సరిపోరు. ఆల్ స్టార్స్ చిరంజీవిగారే. రీసెంట్గా అభిమానంతో ఫోటోలు తీసుకుంటుంటే... ఆయన ఎవరో.. మాట్లాడేవాడు మహాపండితుడు(గరికపాటి). ఆయన అలా మాట్లాడవచ్చా అండీ. అది తప్పు కదా. అలాంటివాడిని కూడా చిరంజీవి ఇంటికి ఆహ్వానించారు. అది కదా సంస్కారం. ఇది కదా మేం నేర్చుకుంటున్నాం’ అని అన్నారు. ఛోటా కె. నాయుడు అలా మాట్లాడుతున్న సమయంలో చిరంజీవి చేతులెత్తి నమస్కారం పెట్టారు. -
‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
చోటా కె నాయుడి ‘లవ్ స్టోరీ’
చోటా కె నాయుడి పేరులో ‘చోటా’ అని ఉండొచ్చు. సినిమాటోగ్రాఫర్గా ఆయన కెరీర్లో ఉన్నవన్నీ పెద్దవే! పెద్ద సినిమాలు.. పెద్ద హీరోలు.. పెద్ద పెద్ద దర్శకులు. అతడి వెనుక కూడా ఓ పెద్ద శక్తి ఉంది. సీతాదేవి! ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ముప్పై ఏళ్లయింది పెళ్లయి. లవ్లీగా, ప్రశాంతంగా ఉన్నారు. ‘క్రెడిట్ గోస్ టు మై వైఫ్ సీతాదేవి’ అంటాడు. అందుకే అతడు.. చోటా కె కాదు.. సీతా కె నాయుడు. ఆమె.. వైఫ్ మాత్రమే కాదు.. అతడి లైఫ్ కూడా. ►30 ఏళ్లకు పైగా మ్యారీడ్ లైఫ్ మీది. ఇద్దరూ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. సీక్రెట్? చోటా: మగవాడి డామినేషన్ ఉన్న ఈ దేశంలో స్త్రీకి సమాన హక్కులు ఉన్నా ఓ ప్లేసులో పెట్టి ఆమెను ఆపేశారు. అయితే మగవాడి డామినేషన్ ఉన్నప్పటికీ భార్య సపోర్ట్ లేకుంటే ఫ్యామిలీ కరెక్ట్గా ఉండదు. అది మగవాళ్లు అర్థం చేసుకోవాలి. నువ్వు ఎక్కువా నేను ఎక్కువా... లాంటివి ఉండకూడదు. అలాగే భార్యకి స్పోర్టివ్నెస్, ఓపిక, శక్తి లేకపోతే ఆ ఫ్యామిలీ కంటిన్యూ కాదు. మా సంసారం సాఫీగా ఉందంటే ‘దట్ క్రెడిట్ గోస్ టు మై వైఫ్ సీతాదేవి’. వైవాహిక జీవితం బాగుండాలంటే భార్యాభర్తలిద్దరూ కడదాకా ఒకేమాట మీద ఉండాలి. ►ఇంతకీ మీ ఇద్దరికీ ఎలా పరిచయం? చోటా: నేను చెన్నైలో మా గురువు దాసరిగారి సినిమాలకు కెమెరా అసిస్టెంట్గా చేశాను. ఇక కెమెరామేన్ అయిపోదాం అనుకుని ఉన్న పని మానేశాను. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం వేరే కెమెరామేన్ దగ్గర ఓ సంవత్సరం పని చేస్తే కెమెరామేన్ అయిపోవచ్చు అనుకున్నాను. ఆ టైమ్లో చాలామంది దర్శకుల దగ్గరికి వెళ్లి అవకాశం అడిగాను. ఎవరూ ఇవ్వలేదు. ఆ డిప్రెషన్లో ఉండగా హైదరాబాద్ నుంచి ఓ టీవీ సీరియల్కి కెమెరామేన్ కావాలని ఫోన్ వచ్చింది. ఆ అవకాశం నాకు రాలేదు, భరత్ పారేపల్లి (డైరెక్టర్) అని నా స్నేహితుడికి వచ్చింది. ఇద్దరం బయలుదేరి హైదరాబాద్ వచ్చాం. నాకూ చాన్స్ వచ్చింది. ‘క్రీస్తు జననం’ అనే టెలీఫిల్మ్ చేశాం. దానికి ప్రొడ్యూసర్ సీతాదేవిగారు, సంగీత దర్శకుడు కీరవాణిగారు, సింగర్ మనో. అందరి నోట్లో నుండి ఈమె పేరు వినేవాణ్ని కానీ, ఈమెను చూడలేదు. షూటింగ్ టైమ్లో ఏ కారులో నుంచి ఏ అమ్మాయి దిగినా ఆమె సీతాదేవి అనుకునేవాణ్ని. షూటింగ్ అయిపోయింది. మేం చైన్నై వెళ్లిపోయాం. ఆ తర్వాత ‘మర్యాద రామన్న’ సీరియల్ మొదలుపెట్టాలనుకున్నారామె. ఆ యూనిట్లో పని చేసే దుర్గా నాగేశ్వరరావు ఎవరో కెమెరామేన్ను సజెస్ట్ చేశారట. ‘లేదు.. నా టీమ్ నాకుంది’ అని నన్ను పిలిపించారామె. అప్పుడు నేను ఆమెను కలిశాను. అలా ట్రావెల్ చేస్తున్న టైమ్లో నేను ప్రపోజ్ చేశాను. ►ఆమె నిర్మాత కదా.. ప్రపోజ్ చేస్తే ఉన్న పని పోతుందేమో అని భయపడలేదా? చోటా: అలాంటి టెన్షన్ ఏమీ లేదు. ప్రతిరోజూ మా షూటింగ్ ప్యాకప్ అవగానే యూనిట్ అంతా ఎస్.ఆర్. నగర్లోని సీతాదేవిగారి ఇంటికి వెళ్లి భోజనం చేసి ఎవరి రూమ్లకు వాళ్లు వెళ్లాలి. అలా మేం వెళ్లేటప్పుడు తలుపుకు తాళం వేసుకుని లోపలికి వెళ్లిపోయేది. రోజులానే ఆ రోజు కూడా వచ్చి, తాళమేసుకుంది. నేను బయట నిలబడి ‘ఓ సారి మీ చేయి ఇటివ్వండి’ అన్నాను. ‘ఎందుకు’ అని అడుగుతూనే ఇచ్చింది. ఆ చేతిని ముద్దుపెట్టుకుని ‘ఐ లవ్ యూ’ అని పరుగో పరుగు (నవ్వుతూ). తాళం వేసి ఉంది కాబట్టి ఆమె నన్ను కొడదామన్నా కుదరదు కదా,అందుకే అలా చేశా. తర్వాత ఆమె కలిసినప్పుడు ‘ఇదే విషయం ఓ సంవత్సరం తర్వాత కూడా అనిపిస్తే అప్పుడు చెప్పు’ అన్నారు. ఏడాది తర్వాత అదే చెప్పాను. అలా మా లవ్ ట్రావెల్ కంటిన్యూ అయ్యింది. ►మీది ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ కదా? చోటా: నా కూతురికి ఇంతవరకు దాని క్యాస్ట్ ఏంటో తెలియదు. సీతాదేవి: చిన్నప్పుడు ఓసారి ఏదో ఫామ్ నింపుతూ ‘ఎస్.సి’ అని ఉన్నచోట టిక్ పెట్టిందట. ఇంటికొచ్చి ఆ విషయం చెప్పింది. అలా ఎందుకు పెట్టావు అంటే ఎస్.సి అంటే మనం ‘సూపర్ క్యాస్ట్’ కదా అంది. సో... మా ఇంట్లో నో క్యాస్ట్. ►బాగుంది.. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్లో ఓ సెక్యూరిటీ.. ఫైనాన్షియల్గా ఫుల్ హ్యాపీ. మరి పెళ్లయిన కొత్తలో ఏమైనా కష్టాలు ఫేస్ చేశారా? చోటా: మా పెళ్లయ్యేసరికి ఓ బ్లాక్ అండ్ వైట్ టీవీ, డబుల్ కాట్ బెడ్, ఓ డైనింగ్ టేబుల్, రెండు కేన్ కుర్చీలుండేవి. అప్పట్లో మూడువేల రూపాయల అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. అప్పుడు కూడా పనోళ్లు ఉండేవారు. సొంత కారు ఉండేది కాదు కానీ ట్రావెల్స్ నుండి ఎప్పుడూ ఓ కారు అద్దెకు తీసుకునేవాళ్లం. మా లైఫ్సై్టల్ అలా ఉండాలనుకునేవాళ్లం కాబట్టి వాటిని ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఇద్దరం బాగా కష్టపడేవాళ్లం. సీతాదేవి: అప్పుడు మేం బిజీగా ఉండేవాళ్లం. ఇంట్లో పెద్దవాళ్లు ఎవరూ లేకపోవటంతో మా పాప ఐశ్వర్యను హాస్టల్లో పెట్టాం. హాలిడేస్ అప్పుడు ‘ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం’ అని లిస్ట్ తెచ్చేది. కానీ, ఆయన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని హాలీడేకి రావడానికి కుదిరేది కాదు. నేను నా పని మానుకుని వెళ్లలేను. ఇలా ఎప్పుడూ బిజీగా ఉండేవాళ్లం. ఒకవేళ ఎక్కడికైనా వెళ్లినా తిరుపతి, షిరిడీ, శ్రీశైలం... అంతే కుదిరేది. అప్పుడు నేను మా పాపతో ‘నీకు పెళ్లయిన తర్వాత 24 గంటలూ హాలిడేకి వెళ్లే ఫ్యామిలీ దొరుకుతుంది’ అనేదాన్ని. ఆ దేవుడి దయ వల్ల అలాంటి ఫ్యామిలీయే వచ్చింది. వాళ్లెప్పుడూ టూర్స్లోనే ఉంటారు (నవ్వుతూ). ►సీతగారు... మీ కెరీర్ గురించి చెబుతారా? సీరియల్ ప్రొడ్యూసర్ ఎలా అయ్యారు? సీతాదేవి: నా ఫ్రెండ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని దూరదర్శన్లో ‘మర్యాదరామన్న’ అనే సీరియల్ చేశాను. సాయికుమార్, బాబుమోహన్, గౌతంరాజు, సీవీయల్ నరసింహారావు, ‘తెలంగాణ’ శకుంతల, శిల్ప, సుమ... ఇలా మంచి పేరు తెచ్చుకున్న చాలామంది అప్పుడు ఆ సీరియల్లో నటించారు. ఆ సీరియల్ స్పెషాలిటీ ఏంటంటే కృష్ణగారు నటించిన ‘సింహాసనం’ సినిమా సెట్ని, కాçస్ట్యూమ్స్ని వాడుకున్నాం. అందుకే ఆ సీరియల్ చాలా రిచ్గా ఉంటుంది. అలా ఓ 20 ఏళ్లపాటు ఎన్నో సీరియల్స్ చేశాను. ఫుల్ బిజీగా ఉండేదాన్ని. ►తర్వాత ఎందుకు మానేశారు? సీతాదేవి: ఓ డైలీ సీరియల్ చేస్తున్న సమయంలో హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. కొంచెం జ్వరంతో మొదలై ఆ తర్వాత అది పెద్ద ప్రాబ్లమ్ అయింది. నాలుగైదు నెలల పాటు ఎంతోమంది డాక్టర్ల దగ్గరకు తిరిగాం. ఒక హాస్పిటల్ వాళ్లయితే సరిగ్గా నిర్ధారించకుండానే ఏదో ఆపరేషన్ కూడా చేశారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఏంటీ అని అడిగితే, ‘మీకు ప్రాబ్లమ్ ఏం లేదు, సైకలాజికల్ ప్రాబ్లమ్’ అనేవాళ్లు. కొందరేమో ఎవరో చేతబడి చేసుంటారని అన్నారు. దాదాపు 20 కిలోలు బరువు తగ్గాను. నాకు మెల్లకన్నులా వచ్చేసింది. చూపు కూడా మందగించింది. నడక, మింగడం కూడా కష్టమయ్యాయి. చోటా: అప్పుడు ‘అంజి’ సినిమా విడుదలైంది. బాలకృష్ణగారి పెదపాప వచ్చి సినిమా బావుంది అంకుల్ అని చెబుతుంటే ఈమె దారిన ఈమె వెళ్లి కారులో కూర్చుంది. తర్వాత నేను కారెక్కగానే ముందెళ్లే కార్లన్నీ నాలుగు, నాలుగ్గా కనపడుతున్నాయి అంది. అప్పుడు నేను ఇదేదో సీరియస్ వ్యవహారమే అనుకున్నాను. సీతాదేవి: డాక్టర్లు ఇది న్యూరో ప్రాబ్లమ్ అని కనిపెట్టారు. ‘మల్టిపుల్ స్లె్కరోసిస్’ అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గురు’ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఆ సినిమాలో మాధవన్ని మీ ఆవిడ (విద్యాబాలన్) ఎందుకు మంచంలో ఉంది అంటే మల్టిపుల్ స్లె్కరోసిస్ అని చెబుతాడు. ఆ సినిమా చూస్తూ మణిరత్నం ఎప్పుడూ ఎవరికీ తెలియని, నోరు తిరగని జబ్బులు పెడతారు అన్నా. ఆ జబ్బు నాకొచ్చింది. చోటా: ఆ టైమ్లో డాక్టర్లు ‘రోజుల మనిషే’ అన్నారు కానీ స్టెరాయిడ్స్ ఇచ్చిన రెండోరోజు నుంచే మార్పు కనబడింది. మొదట 20 కిలోలు తగ్గిన మనిషి ఆ స్టెరాయిడ్స్ వల్ల 25 కిలోలు పెరిగింది. అలా 3, 4 నెలల్లో 45 కిలోలు పెరిగారు. ►ఆ టైమ్లో చోటాగారు ఎలాంటి ట్రస్ట్ ఇచ్చారు? సీతాదేవి: నా లైఫ్లో నన్ను బాగా చూసుకున్న వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకరు మా అమ్మ అయితే మరొకరు నా భర్త చోటా. అన్నీ బాగున్నప్పుడు మనతోపాటు ఎవరైనా ఉంటారు. మన కళ్లు మూతబడుతున్నట్లు, చుట్టూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఎవరో ఒకరు చూసుకోవాలి. వాళ్లకు మెడిసిన్ అందిందా? లేదా? ఏమైనా తిన్నారా? లేదా ఇవన్నీ శ్రద్ధగా పట్టించుకుంటే అదే మంచి పార్ట్నర్షిప్. అలాంటి పార్ట్నర్షిప్నే ట్రస్ట్ అంటాను నేను. నా పార్ట్నర్ (భర్త) ఈజ్ బెస్ట్. ►మామూలు మనిషి అయ్యాక మళ్లీ సీరియల్స్ నిర్మాతగా కంటిన్యూ కాలేదా? సీతాదేవి: ఆరోగ్య సమస్య వచ్చాక ఒక సంవత్సరం ఇంట్లోనే ఉన్నాను. మనం అనుకుంటాం గానీ ఏది జరగాలో ఆ దేవుడు అదే జరిగేలా చేస్తాడు. మనం అహంకారంతో ఏదేదో అనుకుంటాం. కానీ జీవితం వేరేలా డిసైడ్ చేస్తుంది. ‘నేనొక రోల్ మోడల్’ అని నాకు నేను అనుకుని బలవంతంగా చేద్దామనుకున్న పనులు కూడా చేయలేకపోయాను. ఎక్కువ వేడి తగలకూడదని, స్ట్రెయిన్ అవ్వకూడదని డాక్టర్లు చెప్పారు. షూటింగ్ అంటే లైట్స్.. ఆ వేడి ఎక్కువగా ఉంటుంది. దాంతో ఇక సీరియల్స్ జోలికి వెళ్లలేకపోయాను. అలాగని ఖాళీగా ఉండలేను. నాకు చీరలు, డ్రెస్ డిజైన్స్ విషయంలో క్రియేటివిటీ ఉంది. చీరలంటే కలక్షన్ కోసం ఊళ్లు తిరిగి, తేవాలి. ఈ ఊర్లు పట్టుకుని తిరగడం మనవల్ల కాని పని అని బ్యూటీ పార్లర్ అనుకున్నాను. అయితే ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా ఫ్రాంచైజీ తీసుకోండని కొందరు సలహా ఇచ్చారు. ఓన్గా చేయాలన్నది నా ఐడియా. అది కూడా గేటెడ్ కమ్యూనిటీస్లో నా పార్లర్ ఉండాలనుకున్నాను. గేటెడ్ కమ్యూనిటీ అనే కొత్త కాన్సెప్ట్తో హైదరాబాద్లో మొదలైన ఫస్ట్ బ్యూటీపార్లర్ మా ‘పింక్స్ అండ్ బ్లూస్’దే. 2005 డిసెంబరులో స్టార్ట్ చేశాను. సంవత్సరం పాటు మామూలుగా సాగింది. ఇప్పుడు సక్సెస్ఫుల్గా నడుస్తోంది. ఫ్రాంచైజీ తీసుకోవాల్సిన స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ►కెరీర్ పరంగా ఒకర్నొకరు సలహాలు..? చోటా: నాకెప్పుడూ చేతిలో నాలుగు సినిమాలు ఉండేవి. ఆ టైమ్లో రెమ్యునరేషన్ అంటే మూడు, నాలుగు లక్షలు ఇచ్చేవారు. నాలుగు సినిమాలకు అవకాశం వచ్చింది.. వీటిలో ఏది చేస్తే బాగుంటుంది? అని నేనే సీతని అడిగేవాణ్ణి. సీతాదేవి: నేను డబ్బు గురించి ఆలోచించకుండా సలహా ఇచ్చేదాన్ని. అది ఖచ్చితంగా కరెక్ట్ అయ్యేది. అందుకే చోటా ఎప్పుడూ నా డెసిషన్ ఫైనల్ అంటారు. ఓ సినిమా వాళ్లు 5 లక్షలు ఇస్తారని తెలిసినా కూడా ‘మన పరిస్థితి బాగాలేని టైమ్లో వీళ్లు మనకు అండగా నిలిచారు. 2 లక్షలు ఇచ్చినవాళ్లకే మనం చేద్దాం’ అని చెప్పేదాన్ని. ఆ టైమ్లో నిజంగా డబ్బు అవసరం ఉన్నా కూడా నేను చెప్పిన సినిమానే చేసేవారు. కెరీర్వైజ్గా నేనెప్పుడూ తనని సపోర్ట్ చేయమని అడగను. కాకపోతే మెయిన్ సపోర్ట్ ఏంటంటే.. నేను చేసే పనుల్లో ఇంటర్ఫియర్ అయి ఇలా ఎందుకు చేస్తున్నావు? అలా ఎందుకు చేస్తున్నావు అని అడగకుండా ఉండటమే (నవ్వుతూ). చోటా: నేను నాన్స్టాప్ షూటింగ్స్లో ఉంటాను. లేట్గా వస్తాను. బర్త్ డేలు, పెళ్లి రోజులు, ఫంక్షన్స్ అలాంటి సెలబ్రేషన్స్ ఏవీ ఉండవు. షూటింగ్స్ లో బిజీగా ఉంటే ఇక అవేం ఉంటాయి. సీతాదేవి: సినిమా అంటే తెలుసు కాబట్టి నేను పట్టించుకోను. ►మరి మీకు సెలబ్రేషన్ అంటే ఏంటి? సీతాదేవి: లాంగ్ డ్రైవ్లకు వెళ్తుంటాం.. ఇప్పుడు కాదు కానీ పెళ్లైన కొన్నేళ్లు లాంగ్ డ్రైవ్లకి వెళ్లాం. చోటా: ఇంట్లో మేం ఇద్దరమే ఉంటాం. మాతో పాటు తొమ్మిదిమంది పనివాళ్లు ఉంటారు. ఇంట్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ►మీవారికి పొగరని ప్రచారంలో ఉంది నిజమేనా? సీతాదేవి: (నవ్వుతూ) మొన్ననే మేం వైజాగ్లో ఒకాయన్ని కలవడానికి వెళ్లాం. చోటా అక్కడ ఎవర్నో తిట్టారు. నేను కలవడానికి వెళ్లిన మనిషి ఆ సీన్ చూశాడు. అతను ‘మేడమ్, చోటాగారిని తట్టుకోవటం ఎవరివల్లా కాదు. మీరే ఆయన బలం, బలహీనత’ అన్నాడు. నాకు నవ్వాగలేదు. చోటా: నాకు ఏదైనా ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే ముఖానే మాట్లాడేస్తాను. అందరూ కడుపులో పెట్టుకుంటారు, నాకు అది రాదు. ►అలా మాట్లాడినప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తుంటాయా? చోటా: రాకపోవటం ఏముంది? ప్లేటులు పగులుతూనే ఉంటాయి (నవ్వుతూ). సీతాదేవి: మొదట్లో అయితే నేను వాదన పెట్టుకునేదాన్ని, ఇప్పుడు కామ్గా ఉంటాను. చోటా: మాకు కోపం వస్తే మా ప్రాపర్టీ మీదే చూపించుకుంటాం తప్ప ఎవరికీ హాని చెయ్యం (నవ్వుతూ) ►ఇటీవల ఓ హీరోయిన్ని చోటాగారు స్టేజీ మీదే ముద్దు పెట్టుకున్నారు. అలాంటివి చూసినప్పుడు? సీతాదేవి: మీరు నమ్ముతారో లేదో కానీ, ఆయన ఇంటర్వూలు, ఫంక్షన్లు నేను చూడను. మా కజిన్స్ అప్పుడప్పుడూ ఫోన్ చేసి, ‘చోటా ఇంటర్వూ్య వచ్చింది, నీ గురించి బాగా మాట్లాడారు’ అంటారు. ఓ అవునా అనుకుంటాను కానీ, నేను చూడను. నా ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంది ఏంటంటే ఎవరూ ఎవరినీ మార్చలేరు. అయితే చోటా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా దేవుడు నాకు సపోర్ట్ చేశాడేమో. చోటా: ప్రతిదానికీ దేవుణ్ణి నమ్ముతుంది. నమ్మనివాళ్లు కూడా తనని చూసి నమ్ముతారు. మా ఇంట్లో ఓ అమ్మవారి ఫోటో ఉంది. దానికో కథ ఉంది. ►ఏంటా కథ? సీతాదేవి: నేను ‘మర్యాదరామన్న’ సీరియల్ షూటింగ్ చేస్తున్నప్పుడు మా ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్రాజుగారు నల్లగా ఉన్న అమ్మవారి బొమ్మను గోల్డ్ పెయింటింగ్ చేసి చాలా రిచ్గా తయారు చేశాడు. ఆ బొమ్మను నాతోపాటు ఇంటికి తెచ్చుకున్నాను. దాదాపుగా 36 ఏళ్లనుండి ఆ అమ్మవారి విగ్రహం నాతోనే ఉంది. అమ్మవారు నవ్వుతూ, నాతో మాట్లాడుతుంది అనే ఫీలింగ్తో నేను పూజ చేసుకుంటాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ►మీ కపుల్ పీస్ఫుల్గా కనిపిస్తున్నారు కాబట్టే ‘ఇద్దరూ ప్రశాంతంగా ఉన్నారు’ అనే పాయింట్తో ఇంటర్వూ్య మొదలుపెట్టాం.. ఇద్దరూ: ‘యస్.. వియ్ ఆర్ పీస్ఫుల్’. ఇంటర్వ్యూని కూడా ప్రశాంతంగా ముగించాం (నవ్వుతూ). ►మీ ఇద్దరికీ నచ్చే కామన్ విషయాలు? చోటా: క్లియోపాట్రా. అది మా కుక్కపిల్ల. అదికాక ఇద్దరికీ నచ్చేవి కార్లు, బట్టలు, పర్ఫ్యూమ్లు. ఇంకా చాలా ఉన్నాయి. ►ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఓపెన్గా షేర్ చేసుకుంటారా? సీతాదేవి: ఏ ప్రాబ్లమ్ వచ్చినా నేను ఈయనతో చెప్పను, టెన్షన్ పడతారు. మా అమ్మ ఉన్నప్పుడు ఆవిడతో షేర్ చేసుకునేదాన్ని. ‘నీకు ఇదేమన్నా పెద్ద ప్రాబ్లమా? నథింగ్ టు వర్రీ, నువ్వు చేయగలవు’ అని ధైర్యం చెప్పేది. ఇప్పుడు అలాంటిదేదైనా ఉంటే మా అమ్మాయి ఐశ్వర్యతో చెబుతాను. షీ ఈజ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్. చోటా: నా ప్రాబ్లమ్స్ అన్నింటినీ 100 పర్సెంట్ ఈవిడతోనే షేర్ చేసుకుంటాను. ►మీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది? చోటా: ఈవిడ నాకంటే చాలా బిజీ. ఉదయం పది గంటలకల్లా ఆఫీస్కి వెళ్లిపోతుంది. ‘పింక్స్ అండ్ బ్లూస్’ మొత్తం 50 బ్రాంచీలను ఇక్కడినుంచే ఆపరేట్ చేస్తుంది. పొద్దున్నే నేను జిమ్ చేసుకుంటాను. ప్రతిరోజూ నన్ను కలవటానికి ఓ సినిమా బ్యాచ్ వస్తారు. జిమ్ తర్వాత వాళ్లతో స్పెండ్ చేస్తా. 365 రోజులు ఇలానే ఉంటుంది. ఏదైనా సినిమా బాగుంది కానీ ఫ్లాప్ అయ్యింది అనే టాక్ వస్తే, ఆ సినిమా ఎందుకు ఫ్లాపయ్యిందో చూస్తా. మణిరత్నం సినిమా అయితే హిట్, ఫ్లాప్ అని ఉండదు. తప్పనిసరిగా చూస్తాను. సీతాదేవి: మొదట్లో ప్రివ్యూ షోలు వేసేవాళ్లు, వాటికి ఇద్దరం కలిసి వెళ్లేవాళ్లం. ఇప్పుడు పెద్దగా చూడట్లేదు. నా ఆరోగ్యరీత్యా కంటిన్యూస్గా ఓ మూడుగంటల పాటు సినిమా చూడాలంటే చాలా స్ట్రెయిన్ అవుతాను. ఏదైనా సినిమా చూసినా కొంచెం కొంచెంగా చూస్తాను. – డి.జి. భవాని -
అమ్మో.. ఛోటానా? అంటారు
‘‘నాకు నేను అప్గ్రేడ్ అవడానికి ఇప్పటి సినిమాలు చూస్తా. ముఖ్యంగా ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్లో బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగంలో ఎంపికైన 5 సినిమాలు చూస్తా.. ఎలా తీశారనే టెక్నిక్స్ తెలుసుకుంటా. మన భారతీయ సినిమా, హాలీవుడ్ సినిమాలన్నీ ఇప్పుడు బాగా దగ్గరైపోయాయి. ప్రస్తుతం కొత్త డైరెక్టర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా. ఎందుకంటే కొత్తవారు కొత్త ఆలోచనలతో వస్తారు. మనకు తెలియని విషయాలు కూడా వారికి తెలుస్తాయి’’ అని ప్రముఖ కెమెరామన్ ఛోటా కె.నాయుడు అన్నారు. అశ్విన్ బాబు, అవికా గోర్ జంటగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజుగారి గది 3’. ఈ శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరామన్గా చేసిన ఛోటా కె.నాయుడు చెప్పిన విశేషాలు. ►అల్లాణి శ్రీధర్గారి దర్శకత్వంలో నా తొలి సినిమా ‘రగులుతున్న భారతం’ స్టార్ట్ అయింది. అదే సమయంలో మా గురువు దాసరి నారాయణరావుగారి దర్శకత్వంలో ‘అమ్మ రాజీనామా’ చేశా. ‘రగులుతున్న భారతం’ కంటే ముందుగా ‘అమ్మ రాజీనామా’ విడుదలయింది. ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేశాననే సంఖ్య కరెక్టుగా తెలియదు. మా వాళ్లేమో 94 అంటున్నారు. అందుకే 100కు దగ్గరలో ఉన్నానని చెబుతుంటా. ►కొందరు హీరోలు, నిర్మాతలు ‘అమ్మో.. ఛోటానా?’ అంటూ నా వద్దకు రాకుండా వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా ప్రొఫెషనల్గా ఉంటా. ఏ విషయంలోనూ రాజీ పడను. ‘ఠాగూర్’ సినిమాకి చిరంజీవిగారు ఛోటాని తీసుకుందామని చెప్పగానే వీవీ వినాయక్ ఎగిరి గంతెయ్యలేదు. మన మాట వింటాడో? లేదో? అని లోపల మదనపడ్డాడు. రెండు రోజులు షూటింగ్ తర్వాత.. ‘మీరేంటో, మీ పనేంటో నాకు అర్థం అయింది’ అని వినాయక్ సంతోషంగా చెప్పాడు. ►‘స్టాలిన్’ సినిమా తర్వాత ఓంకార్ యాంకర్గా ఉన్న ఓ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచాడు. అప్పటి నుంచి మా మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ‘జీనియస్’ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నానంటూ ఓంకార్ కథ చెప్పగానే ఆశ్చర్యపోయా. ఆ సినిమాకి డేట్స్ కుదరకపోవడం వల్ల నేను చేయలేకపోయా. ఆ తర్వాత ‘రాజుగారి గది’ చిత్రానికి కూడా పని చేద్దామనుకున్నాం. కానీ, కుదరలేదు. ‘రాజుగారి గది 3’కి కుదిరింది. ►పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘రాజుగారి గది 3’. హారర్ అంశాలు తక్కువగా ఉంటాయి. నాకు చెప్పిన కథని ఓంకార్ అదే విధంగా తెరపైకి తీసుకొచ్చాడు. ఈ సినిమాలో హీరో అశ్విన్ బాబు అనగానే పూర్తి స్థాయి పాత్రకి సరిగ్గా న్యాయం చేయగలడా?’ అనిపించింది. ఎందుకంటే హీరోగా చేయడం అంటే చాలా కష్టం. కానీ తన నటన చూశాక చాలా సర్ప్రైజ్ అయ్యా. డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్... ఇలా ప్రతిదీ సింగిల్ టేక్లోనే చేశాడు. తనకు మంచి భవిష్యత్ ఉంటుంది. హీరోయిన్గా తమన్నా స్థానంలో అవికా గోర్ని తీసుకున్నామని ఓంకార్ చెప్పగానే సరిగ్గా చేయగలదా? అనిపించింది. పతాక సన్నివేశాల్లో తన నటన చూసి అభిమాని అయిపోయా. అద్భుతంగా నటించింది. ►దర్శకత్వం చాలా కష్టమైన పని. ఇప్పుడు నాకున్న టెంపర్కి దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదు. పైగా ప్రస్తుతం సినిమాలకి కథ చాలా ముఖ్యం. అది లేకుంటే ఏమీ చేయలేం. మంచి కథ కుదిరితే కొన్నేళ్ల తర్వాత అయినా దర్శకత్వం చేస్తా. నాకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. ఆ తర్వాత ప్రేమకథలంటే ఆసక్తి. ►‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమా తర్వాత రాత్రిళ్లు షూటింగ్ చేయడం మానేశా. కానీ, ‘రాజుగారి గది 3’కి మాత్రం చాలా రోజులు రాత్రిళ్లు పని చేయాల్సి వచ్చింది. పొద్దున్నే 6:30 గంటలకు సెట్స్కి వెళ్లడమే నా పని. రాత్రి అయినా ఎప్పుడు ప్యాకప్ చెబుతాడన్నది ఓంకార్ ఇష్టం. ►24 శాఖల్లో నాకు కొరియోగ్రఫీ అంటే ఇష్టం. భారతీయ కెమెరామన్లలో సంతోష్ శివన్, పీసీ శ్రీరామ్, ఛోటా కె.నాయుడు (నవ్వుతూ) అంటే ఇష్టం. హాలీవుడ్ కెమెరామన్ రాబర్ట్ రిచర్డ్సన్ అంటే ఎంతో ఇష్టం. ఆయనతో రెండున్నర గంటలు కలిసి మాట్లాడిన రోజుని మరచిపోలేను. ఎవరైనా దర్శకులు, కెమెరామన్లు అద్భుతం చేస్తే అహంభావం లేకుండా వాళ్లకు నేను సరెండర్ అయిపోతా.. అభినందిస్తా. ►ఏ సినిమాకైనా 100శాతం డైరెక్టర్లతో ప్రయాణం చేస్తా. వాళ్లు అనుకున్న దానికంటే కనీసం ఒక్క శాతమైనా ఎక్కువ చేయాలనుకుంటా. అదే నా విజయ రహస్యం. నా తమ్ముడు శ్యామ్ కె.నాయుడు నా కంటే మంచి కెమెరామన్.. చాలా మంచి సినిమాలు చేశాడు. ప్రస్తుతానికి నేను కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదు. చివరి శ్వాస ఉన్నంత వరకూ కెమెరామన్గానే పని చేయాలన్నది నా కోరిక. -
జగన్ రియల్ హీరో
-
జగన్ రియల్ హీరో
తెల్లారి లేస్తే హీరోలను కలిసే ఫొటోగ్రాఫర్ జనంలో తిరిగినప్పుడు ఒక రియల్ హీరోను చూశారు.జనం ఆ రియల్ హీరో గురించి మాట్లాడటం గమనించారు.జనం ఆ రియల్ హీరో కావాలనుకోవడం చూసి అబ్బుర పడ్డారు.జాతి, కులం, మతం, వర్గం తేడా లేకుండా మార్పు కోసం ఆ రియల్ హీరో కోసం జేజేలు పలకడం ఆయన గమనించారు.మార్పు రాబోతున్నది అనేది ఆయన విశ్వాసం. జగన్ వల్లే అది సాధ్యం అంటున్నారు చోటా కె నాయుడు. జగన్ను ఎందుకు రియల్ హీరో అంటున్నదిఆయన ఈ ఇంటర్వ్యూలో వివరించారు. మీరు ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే 40 ఏళ్లు గడిచిపోయాయంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తెలుగు పరిశ్రమ, ప్రేక్షకులు మీతో సుదీర్ఘకాలం కనెక్ట్ అయి ఉన్నారు. మీకెలా అనిపిస్తోంది? చోటా: 1979 సెప్టెంబర్లో నేను సినిమా రంగంలో ప్రవేశించాను. ఇది 2019. ఇంత సుదీర్ఘమైన ప్రయాణం అంటే సర్ప్రైజింగ్గా ఉంది. మా నాన్నగారు నాటక రచయిత, దర్శకులు. నన్ను కెమెరామేన్గా చూడాలన్నది ఆయన కోరిక. నాన్నగారి సహకారంతోనే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఒక కెమెరామేన్ వద్ద అసిస్టెంట్గా చేరితే చాలు లైఫ్ సెటిల్ అయిపోద్దనుకున్నా, ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావుగారిలాంటి హీరోతో ఓ సినిమాకి పనిచేస్తే చాలనుకున్నా. తర్వాత నాగార్జున, చిరంజీవిగారు, రజనీకాంత్గారితో ఒక్క సినిమా.. ఇలా అనుకున్నవన్నీ నెరవేరాయి. పిల్లల విజయం వాళ్ల అమ్మానాన్న చేసిన పుణ్యం మీద ఆధారపడి ఉంటుందంటారు. మా అమ్మానాన్న చేసిన పుణ్యం నాకు హెల్ప్ అయింది. అలాగే నా వైఫ్ సీతాదేవి కూడా. అంతేకానీ నా ప్రతిభ వల్లే ఇంత సక్సెస్ అయ్యానని అనుకోవడంలేదు. డెస్టినీయే కారణం అంటాను. ఇప్పటికీ ఏదైనా పెద్ద సినిమా అంటే ఛోటా కావాలంటున్నారు. అది మీ టాలెంట్ కాదా? (నవ్వుతూ) నో ఆన్సర్. అయితే ఒకటి చెబుతా. ఒకప్పుడు నా సక్సెస్ అంతా నా టాలెంట్ వల్లే అనుకున్నాను. కానీ వ్యక్తిగా సాధించిన అనుభవాలు ఆ తర్వాత దాన్ని డెస్టినీకి ఆపాదించేలా చేశాయి. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేశారు? కరెక్టుగా తెలీదు. సెంచరీకి దగ్గరగా ఉన్నాను. సెంచరీ పూర్తయ్యాక ఇక చాలు వీడికి అంటారేమో అని కరెక్ట్ కౌంట్ చెప్పడానికి భయపడుతున్నా (నవ్వుతూ).‘దాసరిగారు నా గురువు’ అని చెబుతుంటారు. డైరెక్టర్స్లో ఆయన 150 సినిమాల రికార్డ్ సాధించారు గదా. మరి కెమెరామేన్గా మీరు కూడా...తలరాతలు బ్రహ్మ రాస్తాడు అంటారు. కానీ, నా రాతని దాసరి నారాయణరావుగారనే బ్రహ్మ రాశారు. నా రాత రాసేటప్పుడు 150 సినిమాలు చేయమని రాశారేమో తెలియదు. వందకు దగ్గరలో ఉన్నాను. ఆ తర్వాత ఆయన ఏం రాశారో. చూద్దాం.. డెస్టినీ అన్నది నన్ను ఎంతవరకూ తీసుకెళుతుందో. దాసరిగారితో మీ అనుబంధాన్ని ఓసారి గుర్తు చేసుకుంటారా? కెమెరామేన్ కె.ఎస్. హరిగారి ద్వారా దాసరిగారు పరిచయం. ఆ రోజు నుంచి నాకు సర్వం ఆయనే అయిపోయారు. ఆయన దగ్గరే నేను ఓనమాలు దిద్దుకున్నా. క్రమశిక్షణ, ముక్కుసూటిగా మాట్లాడటం... ఇవన్నీ అక్కడి నుంచే అలవడ్డాయి నాకు. ఇండస్ట్రీలో కొత్త నీరు రావడం చూసి మీరేమైనా ఫీలవుతున్నారా? ఎందుకు ఫీలవ్వాలి? కొత్తవాళ్లు రావాలి కదా. ఇళయరాజాగారు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన తర్వాత ఏఆర్ రెహమాన్ వచ్చాడు. ఇప్పుడు అనిరు«థ్ అని ఇంకో అబ్బాయి వస్తున్నాడు. ఇళయరాజాగారు ఏమైనా అయిపోయారా? ఆయన ఆయనే.. నేను నేనే. వందమంది వచ్చినా, రెండొందల మంది వచ్చినా, ఎవరి స్టాండర్డ్ వారికి ఉంటుంది. సినిమాలు తప్ప మీకు మరో ప్రపంచం మీద ధ్యాస ఉండదనిపించింది. కానీ ఆ మధ్య ఓ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘జగన్గారు దమ్మున్న మగాడు’ అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. పాలిటిక్స్ని ఫాలో అవుతారా? నిజమే. నేను రాజకీయాలకు దూరం. కానీ, రాజశేఖర్ రెడ్డిగారంటే అభిమానం. ఎలాగంటే ఓ సామాన్య పౌరుడిగా. నాలాగే కొన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఆయన్ను అభిమా నించేవారు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డిగారి దమ్ము, లవ్ అండ్ ఎఫెక్షన్, టాలెంట్, పవర్.. ఇలా అన్నీ జగన్లో నేను చూశాను. ‘హీ ఈజ్ ఎ ఫైటర్’. ముందు జగన్ని ఓ ముఖ్యమంత్రి కొడుకుగానే చూశాను. ఆ తర్వాత ఆయనలో నాకో రియల్ హీరో కనిపించాడు. నాలా స్ట్రగుల్ అయి, పైకి వచ్చినవాళ్లందరికీ ఆయన హీరోలానే కనిపిస్తారు. ఆయనపై పెట్టిన కేసులు కానివ్వండి, ఆయన్ని ఇరికించిన విధానం.. వాటిని ఎదుర్కొంటున్న తీరు.. ఇవి చాలు ఆయన్ను దమ్మున్నోడు అనడానికి. నేను ఆయన్ను చూడటం మొదలుపెట్టినప్పుడు జగన్కి 34–35 సంవత్సరాలు ఉంటాయేమో. అప్పటినుంచి వ్యక్తిగా రోజురోజుకీ స్ట్రాంగ్ అవుతూ అన్నింటినీ ఎదుర్కొనే విధానం నాకు బాగా నచ్చింది. అందుకని నేను జగన్ దమ్మున్నోడు అన్నాను. ఆయనలాంటి వాళ్లు రావాలి. ఎందుకు రావాలి? అంటే మీరు చెప్పే సమాధానం? జగన్గారు యంగర్ జనరేషన్. హైలీ ఎడ్యుకేటెడ్. మాట తప్పని మనిషి. తండ్రికి తగ్గ తనయుడు. అద్భుతమైన వ్యక్తి. ఆయన సీఎం అయితే ఎలా ఉంటాడన్నది నాకున్న పరిజ్ఞానం, అనుభవం, జ్ఞానం మేరకు ఆయన అద్భుతం అని నేను అనుకుంటున్నా. గత డిసెంబరులో నా సినిమా విడుదలయ్యాక రెండు నెలలు నేను ఫ్రీగా ఉన్నాను. నిజం చెప్పాలంటే 40 ఏళ్ల తర్వాత నాకు ఓ హాలిడే దొరికింది. దాంతో ఆంధ్రప్రదేశ్లో నేను చాలా ప్లేసులకు వెళ్లాను. ఎక్కడికి వెళ్లినా ఎవరితో మాట్లాడినా ‘జగన్గారంటే అభిమానం’ అన్నారు. ‘ఒక్కసారి ఆయనకి అవకాశం ఇద్దామనుకుంటున్నాం’ అని ఎంతోమంది నాతో చెప్పారు. వాళ్లే కాదు.. నాతో సహా ఆయనకు ఒక్క అవకాశం ఎందుకు ఇద్దామనుకుంటున్నామంటే.. ఆయన ఆరోజు ఎలా ఉన్నారో ఈరోజూ అలాగే ఉన్నారు. ఆయన ఆ రోజు ఏం మాట్లాడారో ఇప్పుడూ అదే మాట్లాడుతున్నారు. వైఎస్గారి మరణానంతరం ‘ఓదార్పు యాత్ర’ అనే ఓ కాన్సెప్ట్ పెట్టుకున్న తర్వాత దాన్ని కొంతవరకూ పరిమితం చేయమన్నప్పుడు.. నేను చేయను అని వచ్చేసినప్పటి నుంచి నేను జగన్ని ఫాలో అవుతున్నా. నేను తిరిగిన మా ఊర్లు ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, రామచంద్రాపురం, పాలకొల్లు ప్రాంతాల వాళ్లు చెబుతుంటే నేను కూడా వారిలాగా ఆయన గురించి ఆలోచించడం మొదలుపెట్టా. జగన్ వస్తే ఓ మార్పు వస్తుంది. కొత్త జనరేషన్, కొత్త ఐడియాలజీ ఇవి మాత్రమే కాకుండా.. ఆయనకు ఉన్న పవర్, ఎడ్యుకేషన్ చూసి ఒక గొప్ప వ్యక్తి రావాలి అనిపించింది. ‘జగన్ ఈజ్ ఫైటర్’ అనటం వల్ల ఇండస్ట్రీలో మీకు కొంతమంది దూరం అయ్యే అవకాశం ఉందా? మీకు అవకాశాలు తగ్గుతాయనుకోవచ్చా? మా సినిమా ఇండస్ట్రీకి, పాలిటిక్స్కి సంబంధం లేదు. టాలెంట్ని మాత్రమే పట్టించుకుంటుంది. అయినా ‘జగన్ ఈజ్ ఎ ఫైటర్’ అన్నానని నా గురించి ఎవరేం అనుకున్నా ఐ డోంట్ కేర్. కానీ నేను నమ్ముతున్నా. ఆయన ఎక్స్ట్రార్డినరీగా పని చేస్తారు. ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ రావాలని కోరుకుంటున్నాను. నేనే కాదు.. చాలామంది మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు జగన్వల్లే సాధ్యం అవుతుందని నమ్ముతున్నాను. జగన్గారిలో మీకు నచ్చిన విషయాలేంటి? మా నాన్నగారు ప్రవేశపెట్టిన 108, 104 సరిగ్గా నడవటం లేదు.. దాన్ని నేను సరిగ్గా గాడిలో పెడతా అన్నారు జగన్. అలాగే ఆరోగ్యశ్రీ. ఈ విషయంలో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఊరు రామచంద్రాపురంలో వైఎస్గారి ఆరోగ్యశ్రీ వల్ల ఓ వ్యక్తికి ఓపెన్హార్ట్ ఆపరేషన్ జరిగింది. ప్రతినెలా కొన్ని మందులు అతనికి అందేవి. వైఎస్గారు చనిపోయిన తర్వాత, ప్రభుత్వం మారాక ఆ మందులు ఆయనకు అందలేదు. ఇలా ఎన్నో ఫ్యామిలీలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకు ఆయన రావాలి అంటే ఈ సంక్షేమ పథకాలన్నీ వైఎస్గారు ప్రవేశపెట్టారు కాబట్టి, జగన్గారు వస్తే మళ్లీ పక్కాగా అమలవుతాయన్నది నా నమ్మకం. అలాంటి పేదవాళ్లందరికీ హెల్ప్ చేయడానికి జగన్ రావాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసులు వస్తున్నారు. వారసత్వ రాజకీయాల గురించి మీరేం చెబుతారు? తప్పేంటి? ఇందిరా గాంధీ మరణం తర్వాత పైలెట్గా ఉన్న రాజీవ్ గాంధీని తీసుకొచ్చి ప్రధానిని చేశారు.. ఆయన వారసుడు కాదా? మా ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ వారసులు వస్తున్నారు. అయితే టాలెంట్ ఉన్నవాళ్లే సూపర్స్టార్స్ అయ్యారు. రాజకీయాల్లో, సినిమాల్లో వారసత్వం అన్నది ఉన్నా నిరూపించుకోవడం అనేది ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. జగన్.. వైఎస్గారి అబ్బాయి అని కాదు. ఆయనలోని క్వాలిటీస్ మనం చూడాలి కదా? రాజకీయాల్లో వారసులు లేరా? వారందరి పేర్లు చెబితే స్పేస్ వృథా అవుతుందని చెప్పడం లేదు. ఈ రెండు మూడు నెలల్లో నేను తిరిగిన ప్రాంతాల్లో జగన్ గురించి నేనేం ఫీలవుతున్నానో చాలా మంది అలానే ఫీలవుతున్నారు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ ఓ రాజకీయ పార్టీకి ఫేవర్గా ఉండేదని చెప్పుకునేవారు. ఇప్పుడు కొంతమంది మరో పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ పార్టీ నుంచి ఎందుకు డీవియేట్ అవుతున్నారు? నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో అందరూ ఒకటే. రాజకీయాల విషయానికొస్తే మాత్రం ఎవరి ఇష్టం వారిది. మా గురువు దాసరిగారి విగ్రహాన్ని పాలకొల్లులో ఏర్పాటు చేసినప్పుడు వెళ్లాను. ఓ రోజంతా అక్కడే తిరిగా. వారందర్నీ జగన్ గురించి అడగలేదు. ఎన్నికలొస్తున్నాయి కదా ఎవరికి ఓటు వేస్తారని అడిగితే.. నాకు తెలిసి 80 శాతం మంది జగన్ పేరు చెప్పారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ నుంచి ఏం కోరుకుంటున్నారో అదే మా ఫిల్మ్ ఇండస్ట్రీవారు కూడా కోరుకుని ఆయన పార్టీలో చేరారనుకుంటున్నా. జగన్గారు వస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని అనుకుంటున్నారా? ఏపీలో ఇంకా అభివృద్ధి చూడొచ్చనుకుంటున్నారా? సినిమా పరిశ్రమకు రాజశేఖర్ రెడ్డిగారు చాలా చాలా చేశారని నాకు తెలుసు. జగన్ కూడా అంతే. ఆయన మంచి విజన్ ఉన్న వ్యక్తి. కచ్చితంగా వైజాగ్లో ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయొచ్చు? చేస్తారేమో? దానికంటే ముందు ఆయనకు ఎన్నో ఆలోచనలున్నాయి. వాటి ముందు మా ఇండస్ట్రీ విషయాన్ని రుద్దడం అవసరం లేదేమో అనిపిస్తోంది. ఇక్కడ కేసీఆర్గారు మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు. జగన్గారిని పర్సనల్గా ఎన్నిసార్లు కలిశారు? జగన్గారిని చాలాసార్లు పేపర్లో, టీవీల్లో చూశా. ఒకే ఒక్కసారి పాదయాత్రలో కలిశాను. ఆయనతో కలిసి ఐదుగంటలు పాదయాత్ర చేశా. ఓ పొలంలో కూలీ వాళ్లు పనులు చేసుకుంటున్నారు. జగన్ వస్తున్నారని వాళ్లకి ముందే తెలిసి ఉంటుంది కదా. ఆయన రాగానే పనులు మానుకుని పరుగెత్తుకుంటూ వచ్చి ఆయనతో కరచాలనం చేస్తూ మాట్లాడారు. అప్పుడు నేను ఆయన పక్కనే ఉండి గమనించాను. గోల్డెన్ స్పూన్తో పుట్టిన జగన్ వారితో ఎలా ఇంట్రాక్ట్ అవుతారా? ఏంటా? అని. వాళ్ల చేతులకి మట్టి ఉన్నా షేక్ హ్యాండ్ ఇచ్చారాయన. ఓ ముసలావిడ వచ్చి గట్టిగా పట్టుకుంటే ఆమె నుదటిపై ముద్దు పెట్టారు. ఇలాంటి దృశ్యాలు కంటిన్యూస్గా ఐదు గంటలు చూశా. నేను నడిచిన ఐదు గంటల్లో ఆయనతో మాట్లాడింది కేవలం ఐదు నిమిషాలే. నడిచినంత సేపు కూడా ఎక్కడా ఆయన మంచినీళ్లు తాగడం చూడలేదు. ఆయన భోజనం చేయడానికి క్యార్వాన్ వద్దకు వెళుతున్నప్పుడు కూడా చుట్టూ ఓ 500 మంది ఉన్నారు. ఎక్కడా విసుగు చెందకుండా వారిని ఆప్యాయంగా పలకరించారు. రాజశేఖర్ రెడ్డిగారు పాదయాత్ర చేసినప్పుడు టీవీల్లో చూశానే కానీ లైవ్లో చూడలేదు. వైఎస్గారు సీఎం అవకముందే జగన్గారు వ్యాపారవేత్త. అంచలంచెలుగా ఆయన ఎదిగారు. ఎంపీగా 5లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో నెగ్గిన వ్యక్తి ఆయన. ప్రపంచంలో అతి తక్కువమందికి సీటు దొరికే లండన్లోని ఓ కాలేజీలో వాళ్ల పాప చదువుకుంటోంది. ఆయన ఏజ్కి, డబ్బుకి హ్యాపీగా అక్కడికి వెళ్లిపోయి లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకండీ.. ఎవరో బురద చేతులతో మజ్జిగ అన్నం పెడుతున్నా సంతోషంగా తింటున్నారు? అది నేను ఒక్క ఎమ్జీఆర్ (దివంగత తమిళ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి)లోనే చూశా. మళ్లీ ఇప్పుడు జగన్లోనే చూశా. ఆయనకి ఏం అవసరం అంటే అదొక కమిట్మెంట్. నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంతమంది హఠాన్మరణం పొందారే, వారికి మేమున్నాం అంటూ భరోసా ఇవ్వడానికి ‘ఓదార్పు యాత్ర’ చేపట్టారు. పాదయాత్రలో అంత స్పీడుగా నడుస్తున్నా ఓ జెన్యూన్ సమస్యను పూర్తిగా విన్నారు. ఆ సమస్య తాలూకు పేపర్ని ఓ వ్యక్తి ఇస్తే తీసుకుని లంచ్ టైమ్లో దీని గురించి మాట్లాడాలి అన్నారు. ఆయన పాదయాత్ర చేస్తారా? సమస్యలు వింటారా? పేపర్లు తీసుకుంటారా? ఈసారి జగన్ సీఎం అయితే 100 శాతం రాబోయే కాలంలో ఇంకో వ్యక్తి రాలేడు. అంతటి అనుభవం ఆయనకి ఉంది. ఆయన నడిచిన నడకలో కొన్ని లక్షలకోట్ల ఫ్యామిలీలు వారి వారి పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పాయి. నాయకుడు అనేవాడు హృదయంతో స్పందించాలి. ఆ స్పందన జగన్లో చూశా. అందుకే జగన్ అంటే ఇష్టం. ఫైనల్లీ... మీరు భవిష్యత్లో రాజకీయాల్లోకి వస్తున్నారా? అందరూ డైరెక్షన్ ఎప్పుడు అని అడుగుతుంటారు. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు అని అడుగుతున్నారు. డైరెక్షన్, రాజకీయాలు అన్నవి వెరీ టఫ్, చాలా కమిట్మెంట్తో ఉండాలి. జగన్లా నడవలేను.. ఎవరైనా ఏ చేత్తో పడితే ఆ చేత్తో పెడితే తినలేను. అందుకని.. ఎవరు చేయాల్సిన పనుల్లో వాళ్లు ఉండాలి. జగన్ అలానే ఉండాలి.. ఇండస్ట్రీలోని దర్శకులు అలానే ఉండాలి.. నేను కెమెరామేన్గా ఇలానే ఉండాలి. డి.జి. భవాని మీకు సినీరంగంలో అవకాశం ఇచ్చిన దాసరిగారు మీ గురువు. చిరంజీవి గారితో ఎక్కువగా ట్రావెల్ చేశారు. మీతో మంచి అనుబంధం ఉన్న పవన్ కల్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టారు. మరి ఆయనకు సపోర్ట్ ఇవ్వకుండా జగన్గారికి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? గురువుగారు (దాసరి) నన్ను కెమెరామేన్గా పరిచయం చేసినా, నా బిగినింగ్ డేస్లో రామానాయుడుగారు ఓ తండ్రిలాగా నన్ను కాపాడుకుంటూ వచ్చారు. ఆయన బ్యానర్లో వరుసగా 9 సినిమాలు చేసే అవకాశమిచ్చారు. కేఎస్ రామారావుగారు కూడా నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడే నన్ను కెమెరామేన్గా చేయమని చెప్పేవారు. సినిమాల వరకూ రామానాయుడుగారు నాకు దేవుడు, తండ్రిలాంటివారు. ఆయన బ్యానర్లో ఏ సినిమా మొదలెట్టినా ‘ఛోటా ఉన్నాడా? లేకపోతేనే వేరే కెమెరామేన్కి వెళ్లండి?’ అనేవారు. దాసరి, రామానాయుడు, దేవీవరప్రసాద్ అశ్వనీదత్, కేయస్ రామారావుగార్లు నన్ను ప్రోత్సహించారు. ఇక్కడ నా ఎదుగుదలకు అన్ని సామాజిక వర్గాలు సహకరించాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను చాలా రఫ్గా ఉండేవాడిని. నన్ను ఓ కైండ్హార్టెడ్గా మార్చింది చిరంజీవిగారు. కల్యాణ్ (పవన్ కల్యాణ్) నాకు బ్లడ్ బ్రదర్లాంటివాడు. అతను గొప్ప వ్యక్తి. అతని ఆలోచనా విధానం, మాట్లాడే విధానం వేరే. పక్క వ్యక్తికి ఏదైనా సమస్య వచ్చినా అయ్యో అని ఫీలయిపోతాడు. రాజకీయాల్లోకి వెళ్లాక పవన్ సిద్ధాంతాలు ఇంకో రకంగా ఉన్నాయి. రాజకీయపరంగా మాత్రం జగన్ అంటేనే ఇష్టం. -
ప్రజాసంకల్పయాత్రపై సినీ ప్రముఖుల స్పందన
-
వైఎస్ జగన్ రియల్ హీరో: చోటా కే నాయుడు
-
పాదయాత్రలో పాల్గొన్న చోటా కే నాయుడు
-
వైఎస్ జగన్ను కలిసిన చోటా కే నాయుడు
సాక్షి, మండపేట : ప్రభుత్వం వైఫ్యల్యాలను ఎండగడుతూ, ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు తూర్పు గోదావరి జిల్లా ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలను జననేతతో విన్నించుకుంటున్నారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ కోరుతున్నారు. వారికి భరోసానిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు, కార్యకర్తలే కాకుండా సినీ ప్రముఖలు తమ మద్దతు తెలియచేస్తున్నారు. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు వైఎస్ జగన్ను కలిశారు. సోమవారం, మండపేట నియోజకవర్గం సోమేశ్వరంలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో జననేతను కలిసి తమ మద్దతును తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని అన్నారు. గతంలో ప్రజాసంకల్పయాత్రలో ప్రముఖ సినీనటులు పోసాని కృష్ణమురళి, పృధ్వీలు వైఎస్ జగన్ను కలిసిన సంగతి తెలిసిందే. -
మా మదిలో వైఎస్సార్ - చోటాకే నాయుడు
-
నా ప్రేమ నువ్వేనా
వాస్దేవ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘నాలో ప్రేమ నువ్వేనా’. జై చిరంజీవ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా లోగోని సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు ఆవిష్కరించి, బెస్ట్ విషెష్ చెప్పారు. వాసుదేవ్ మాట్లాడుతూ –‘‘న్యూ ఏజ్ అండ్ డిఫరెంట్ లవ్స్టోరీతో తెరకెక్కిన సినిమా ఇది. త్వరలోనే పాటలను విడుదల చేసి, సమ్మర్లో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. రాశీ సైనా, సంజయ్ శివలింగమ్, రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అర్జున్. -
‘టచ్ చేసి చూడు’ న్యూ వర్కింగ్ స్టిల్స్
-
నో ఈగోస్!
సడన్గా ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ సీకే మురళీధరన్ తప్పుకున్నారనే వార్త బయటకొచ్చింది. ఆయన ప్లేస్లో చోటా కె. నాయుడు వచ్చి చేరారు. ఇందులో వింతేముంది? సినిమా అన్నాక ఇలాంటివి కామనే కదా అనుకోవచ్చు. అయితే... ఇక్కడే ఉంది తిరకాసు. ఆల్మోస్ట్ వన్ మంత్ ఈ సినిమా షూటింగ్ జరిగిన తర్వాత సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడానికి రీజన్ ఏంటి చెప్మా? అని అభిమానులు ఆలోచిస్తున్న టైమ్లో ‘దర్శకుడితో ఈగో క్లాషెస్ అంట’ అని కొందరు వార్తలు వండేశారు. వీటిపై సినిమా టీమ్ త్వరగా స్పందించిందండోయ్! ‘‘ఈగో క్లాషెస్ గట్రా ఏం కాదు. ఆ వార్తల్లో నిజం లేదు. అంతకు ముందున్న కమిట్మెంట్స్ వల్ల మురళీధరన్ తప్పుకున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా 19నే సినిమాలో హీరో ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్రామ్ నిర్మిస్తున్నారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - విన్నర్
-
సందీప్ సరసన నిత్యా..?
ఆసక్తికరమైన కథలను ఎంచుకుంటూ యంగ్ జనరేషన్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తున్న ఈ యంగ్ హీరో 'ఒక అమ్మాయి తప్ప' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైన ఈ సినిమాకు ఇంత వరకు హీరోయిన్ను మాత్రం ఫైనల్ చేయలేదు. ప్రస్తుతం సందీప్ కిషన్తో పాటు విలన్గా నటిస్తున్న రవికిషన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించడానికి స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ను సంప్రదించారన్న టాక్ వినిపిస్తోంది. బడా బడా స్టార్ హీరోల సరసన వరుస సూపర్ హిట్స్లో నటిస్తున్న ఈ భామ, సందీప్ సరసన హీరోయిన్గా నటించడానికి అంగీరిస్తుందా లేదా చూడాలి. అయితే నిత్యామీనన్కు ఈ సినిమా కథ చాలా బాగా నచ్చిందని, సినిమాలో నటించటం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్. ఇంత వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం చేయలేదు. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ రచయిత రాజసింహా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. అంజి రెడ్డి నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. -
‘గజిని’అంత సక్సెస్ అవుతుంది : ఛోటా కె. నాయుడు
‘‘నా మేనల్లుడైన సందీప్ కిషన్ ఎప్పుడూ కొత్తదనానికే ప్రాధాన్యమిస్తాడు. ఈ చిత్ర దర్శకుడు ఆనంద్, మురుగదాస్కు శిష్యుడు. ఈ సినిమా స్క్రీన్ప్లే విన్న తర్వాత కచ్చితంగా ‘గజిని’ అంత సక్సెస్ అవుతుందనిపించింది’’ అని ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు చెప్పారు. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ కాంబినేషన్లో వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్.వి. ప్రసాద్ నిర్మిస్తున్న ‘టైగర్’ పాటల ఆవిష్కరణ ఇటీవల హైదరాబాద్లో జరిగింది. దర్శకుడు వీవీ వినాయక్, శాసన సభ్యులు భూమా నాగిరెడ్డి పాటల సీడీని ఆవిష్కరించి, హీరో ‘అల్లరి’ నరేశ్, నిర్మాత అనిల్ సుంకరకు అందించారు. వినాయక్ మాట్లాడుతూ -‘‘ ‘టైగర్’ సినిమా గురించి సందీప్ ఎంతో ఉద్వేగపడుతున్నాడు. తన కలలన్నీ తప్పకుండా నిజమవుతాయి’’ అన్నారు. సందీప్ను సూపర్స్టార్గా చూడాలనుకుంటున్నానని దర్శకుడు సుకుమార్ పేర్కొన్నారు. కెరీర్లో ఎదగడానికి దొరికిన గొప్ప అవకాశం ఇదని సందీప్కిషన్ చెప్పారు. ‘టైగర్’ పాటలు రికార్డులు సృష్టిస్తాయని సంగీత దర్శకుడు తమన్ ఆశాభావం వెలిబుచ్చారు. ఈ వేడుకలో రకుల్ ప్రీత్సింగ్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్, ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు, శానం నాగ అశోక్కుమార్, అలంకార్ ప్రసాద్ ‘మధుర’ శ్రీధర్, చిన్మయి తదితరులు మాట్లాడారు.