Coal scam case
-
పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేశాం సార్!
పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేశాం సార్! -
‘ఈ నాన్చుడెందుకు.. డైరెక్ట్గా అరెస్ట్ చేయండి’.. జార్ఖండ్ సీఎం సవాల్
రాంచీ: ‘నేను తప్పు చేసినట్లయితే, ఈ ప్రశ్నించటాలేంటి? నేరుగా వచ్చి అరెస్ట్ చేయండి.’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. బొగ్గు కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక ట్రైబల్ ముఖ్యమంత్రిని వేధింపులకు గురిచేసే కార్యక్రమంలో భాగంగానే ఈడీ సమన్లు జారీ చేసినట్లు ఆరోపించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘నాకు ఛత్తీస్గఢ్లో కార్యక్రమంలో ఉన్న క్రమంలో ఈరోజు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. నేను పెద్ద నేరం చేసినట్లు అయితే, రండి, నన్ను అరెస్ట్ చేయండి. ఈ ప్రశ్నించటాలేందుకు?. ఈడీ ఆఫీస్ వద్ద భద్రత పెంచారు. జార్ఖండ్ ప్రజలను చూసి ఎందుకు భయపడుతున్నారు?. అధికార బీజేపీని వ్యతరేకిస్తున్న వారి గొంతు నొక్కేందుకు రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయటమే ఇది. ఈ కుట్రకు తగిన సమాధానం లభిస్తుంది.’అని పేర్కొన్నారు సీఎం హేమంత్ సోరెన్. రాంచీలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో ఈరోజు విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ వెళ్లకుండా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అంతకు ముందు బీజేపీ పేరు చెప్పకుండానే ట్విటర్ వేదికగా పరోక్ష విమర్శలు చేశారు సీఎం. ‘నన్ను వేధించేందుకు జరుగుతున్న ఈ దాడుల వెనుక అసలు కుట్ర ట్రైబల్స్, వెనకబడినవారు, మైనారిటీల హక్కులను కాలరాసేందుకే. నాకు రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల మద్దతు ఉన్నంత వరకు వారి కుట్రల్లోనే ఏ ఒక్కటి ఫలించదు.’అని పేర్కొన్నారు. బొగ్గు మైనింగ్ కుంభకోణం కేసులో ఇప్పటికే ఆయన సన్నిహితుడు పంకజ్ మిశ్రా సహా మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసింది ఈడీ. జులైలో దాడులు నిర్వహించి మిశ్రా బ్యాంకు ఖాతాల్లోని రూ.11.88 కోట్లు సీజ్ చేసింది. అలాగే ఆయన ఇంట్లో రూ.5.34 కోట్ల అక్రమ నగదు లభించినట్లు వెల్లడించింది. #WATCH | I've been summoned by ED today when I already have a program in Chhattisgarh today. If I've committed a crime that big, come & arrest me. Why the questioning?... Security near ED office has increased. Why, are you scared of Jharkhandis?, says Jharkhand CM Hemant Soren pic.twitter.com/41cR92FCHM — ANI (@ANI) November 3, 2022 ఇదీ చదవండి: Hemant Soren: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం -
బొగ్గు స్కాం కేసు: మమతా బెనర్జీ మేనల్లుడికి ఈడీ సమన్లు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీకి మరో షాక్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). ఇప్పటికే స్కూల్ జాబ్స్ స్కామ్లో కీలక నేత పార్థా ఛటర్జీని అరెస్ట్ చేయగా.. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి సమన్లు జారీ చేసింది. బొగ్గు అక్రమ రవాణా కుంభకోణం కేసులో భాగంగా శుక్రవారం కోల్కతాలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ‘మా అధికారుల ముందు విచారణకు హాజరుకావాలని అభిషేక్ బెనర్జీకి సమన్లు జారీ చేశాం. ఆయను విచారించేందుకు ఢిల్లీ నుంచి మా అధికారులు వస్తారు.’ అని తెలిపారు ఈడీ సీనియర్ అధికారి ఒకరు. మరోవైపు.. కోల్కతాలో ఓ ర్యాలీలో సోమవారం పాల్గొన్న మమత బీజేపీపై విమర్శలు గుప్పించారు. తన మేనల్లుడికి కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోపించారు. ఆమె భావించినట్లుగానే ఆ మరుసటి రోజునే ఈడీ సమన్లు జారీ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: ‘మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి’.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్ -
బొగ్గు కుంభకోణంలో మాజీ కార్యదర్శి దోషే: కోర్టు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ఆ శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తా, మాజీ సంయుక్త కార్యదర్శి కేఎస్ క్రోఫాలను సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషులుగా తేల్చింది. మహారాష్ట్రలోని లొహారా ఈస్ట్ కోల్ బ్లాక్ కేటాయింపుల్లో వీరిద్దరూ నేరపూరిత కుట్రకు, మోసం, అవినీతికి పాల్పడ్డారని పేర్కొంది. గ్రేస్ ఇండస్ట్రీస్(జీఐఎల్)ను, ఆ కంపెనీ డైరెక్టర్ ముకేశ్ గుప్తాను కూడా ప్రత్యేక జడ్జి అరుణ్ భరద్వాజ్ దోషిగా పేర్కొన్నారు. వీరికి ఆగస్ట్ 4న శిక్షలు ఖరారు చేయనున్నారు. 2005–11 సంవత్సరాల మధ్య బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇదీ చదవండి: ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు -
బొగ్గు కుంభకోణం: అభిషేక్ బెనర్జీకి హైకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కె దురైంది. మనీల్యాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన సమన్లపై స్టే విధించాలంటూ పెట్టుకున్న పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అయితే, నోటీసులకు సంబంధించి అభిషేక్ బెనర్జీతోపాటు ఆయన భార్య రుజిరా పెట్టుకున్న వినతులను పరిశీలించాలని ఈడీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న బొగ్గు కుంభకోణంలో మనీల్యాండరింగ్ అభి యోగాలపై ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో మంగళవారం జరిగే విచారణకు అభిషేక్, రుజిరా వ్యక్తిగతం హాజరు కావాల్సి ఉంది. -
టీఎంసీ ఎంపీకి మూడోసారి ఈడీ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 21 న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసులో అభిషేక్కు సమన్లు జారీ చేయడం ఇది మూడోసారి. బొగ్గు అక్రమ రవాణా కేసులో విచారణకు బెనర్జీ శుక్రవారం హాజరు కావాల్సి ఉంది కానీ సమయం తక్కువగా ఉందంటూ అభిషేక్ బెనర్జీ హాజరు కాలేదు. దాంతో ఈ నెల 21 న హాజరుకావాలని మరోసారి సమన్లు ఇచ్చింది. అలాగే సెప్టెంబరు 1న విచారణకు హాజరు కావాలని అభిషేక్ భార్య రుజిరాను ఈడీ సమన్లు జారీచేసింది. అయితే కోవిడ్ పరిస్థితులు కారణంగా చిన్నపిల్లలతో తాను ఢిల్లీకి కాలేనని, దీనికి బదులుగా ఆమె కోల్కతా ఇంటిలో ఆమెను ప్రశ్నించాలని ఈడీని కోరారు. సోమవారం (సెప్టెంబర్ 6) ఢిల్లీలోని జామ్ నగర్ హౌస్లో ఈడీ అధికారులు అభిషేక్ బెనర్జీని ఎనిమిది గంటలకు పైగా విచారించారు. కుటుంబ సభ్యులతో సంబంధమున్న రెండు సంస్థలు అందుకున్న లెక్కకు మించిన డబ్బు గురించి ప్రత్యేకంగా ప్రశ్నించినట్టు సమాచారం. ఈ విషయంలో పూర్తి సమాచారాన్ని అందించడంలో బెనర్జీని విఫలమైనట్టు తెలుస్తోంది.బొగ్గు అక్రమ రవాణా ద్వారా వచ్చిన నగదు విషయంలో వినయ్ మిశ్రా కీలక పాత్ర పోషించారని ఈడీ ఆ రోపిస్తోంది. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితుడైన టీఎంసీ యువనేత వినయ్ మిశ్రాతో ఉన్న సంబంధాలపై బెనర్జీని సోమవారం ప్రశ్నించగా ఈ ఆరోపణలన్నింటిని తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రంపై పట్టు సాధించేందుకు తృణమూల్ కాంగ్రెస్ భారీ కసరత్తే చేస్తోంది. 2023 లో అసెంబ్లీ ఎన్నికలే లక్క్ష్యంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ అభిషేక్ బెనర్జీ రానున్న బుధవారం (సెప్టెంబరు 15 ) త్రిపురలోని అగర్తలాలో రోడ్షో నిర్వహించ నున్నారని టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ వెల్లడించారు. -
అభిషేక్ బెనర్జీకి షాకిచ్చిన ఈడీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ, అభిషేక్ బెనర్జీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కోల్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభిషేక్, ఆయన భార్య రుచిరా బెనర్జీకి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 6 న అభిషేక్, సెప్టెంబర్ 1 న రుజీరా ఈడీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. రాష్ట్రంలో జరిగిన బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని అభిషేక్ దంపతులను ఆదేశించింది. అలాగే బెనర్జీల తరఫు న్యాయవాది సంజయ్ బసు సెప్టెంబర్ 3 , వీరితోపాటు ఇదే కేసులో బెంగాల్ పోలీసు ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు శ్యామ్ సింగ్, జ్ఞవంత్ సింగ్లు సెప్టెంబర్ 8 ,9 తేదీల్లోహాజరుకావాలని ఈడీ ఆదేశించింది. కోట్లరూపాయల అవినీతి సంబంధించి సీబీఐ (నవంబర్, 2020) దాఖలు చేసిన కేసు అధారంగా ఈ సమన్లు జారీ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించిన మరికొంతమందిని కూడా వచ్చే నెలలో హాజరుకావాలని సమన్లు జారీ చేశామన్నారు. మరోవైపు ఈ ఆరోపణలను ఖండించిన అభిషేక్ దర్యాప్తు సంస్థల ద్వారా బీజీపీ సర్కారు తమపై వేధింపులకు పాల్పడుతోందని అభిషేక్ ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ పరిణామమని మండిపడ్డారు. కాగా పశ్చిమ బెంగాల్లో కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్కు(ఈసీఎల్) చెందిన బొగ్గు గనుల్లో బొగ్గును అక్రమంగా తవ్వుకొని, స్వాహా చేశారని ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంతో రుచిరా బెనర్జీకి, మరదలు మేనకా గంభీర్కు కూడా సంబంధం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. అలాగే అక్రమమైనింగ్ వ్యవహారంలో అభిషేక్ ప్రధాన లబ్ధిదారుని గతంలో ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
మాజీ మంత్రికి మూడేళ్లు జైలు శిక్ష
సాక్షి, న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు సోమవారం ఢిల్లీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 1999లో జార్ఖండ్ బొగ్గు బ్లాక్ కేటాయింపుల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో రే దోషిగా తేలారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో పాటు నిందితుల వాదనలు విన్న ఢిల్లీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో దిలీప్ రే ఇంధన శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. దిలీప్ రేతో పాటు ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ఇద్దరు సీనియర్ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యనంద్ గౌతమ్, కాస్ట్రాన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (సీటీఎల్) డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్లకు సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించి శిక్ష విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. నిబంధనలను ఉల్లంఘించి సీటీఎల్కు బొగ్గు మైనింగ్ ప్రాంతాన్ని కేటాయించడాన్ని కోర్టు తప్పుబట్టింది. సొంత ప్రయోజనాల కోసమే నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది. జార్ఖండ్లోని గిరిదిహ్లోని బ్రహ్మాదిహ బొగ్గు బ్లాక్ను 1999లో నిబంధనలకు విరుద్ధంగా సీటీఎల్కు కేటాయించినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. చదవండి: బొగ్గు స్కాంలో దోషిగా తేలిన మాజీమంత్రి -
బొగ్గు స్కాంలో దోషిగా తేలిన మాజీమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేను బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలుస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేతో పాటు మరో ముగ్గురు అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతం, సీఎంల్ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్లను కూడా దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. 1999లో ఝార్ఖండ్లోని గిరిధిలో ఉన్న బ్రహ్మదిహ బొగ్గు గనులను కాస్ట్రాన్ టెక్నాలజీస్ లిమిటెడ్కు కేటాయించగా, ఇందులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో దీనిపై విచారణకు ఆదేశించారు. దశాబ్ధాలుగా ఈ విషయంపై విచారణ కొనసాగింది. ఈ కేటాయింపుల్లో దిలీప్ రేతో పాటు మరో ముగ్గురు అవినీతికి పాల్పడినట్లు ప్రత్యేక కోర్టు గుర్తించింది. మాజీ ప్రధాని అటల్బిహారి వాజ్పేయీ ప్రభుత్వ హయంలో దిలీప్ రే ఉక్కు, బొగ్గుశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నెల 14న దిలీప్ రేతో పాటు దోషిగా తేలిన మరో ముగ్గురుకు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. చదవండి: యూఎన్ఓవి అనవసర వ్యాఖ్యలు: భారత్ -
బొగ్గు స్కాంలో మాజీ కార్యదర్శి దోషి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బొగ్గు కుంభకోణంలో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తాను ఢిల్లీలోని ఓ కోర్టు దోషిగా నిర్ధారించింది. యూపీఏ హయాంలో పశ్చిమ బెంగాల్లోని పలు బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గుప్తాతోపాటు మరో ఐదుగురిని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. వీరిలో ఒకరు రిటైరయ్యారు. 2005–08 సంవత్సరాల మధ్య బొగ్గు శాఖ కార్యదర్శిగా ఉన్న గుప్తాకు బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడిన రెండు కేసుల్లో కలిపి ఇప్పటికే ఐదేళ్ల వరకు జైలుశిక్షలు పడ్డాయి. ఆయన ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. కోర్టు దోషులుగా ప్రకటించిన వారిలో కేఎస్ క్రోఫా అప్పట్లో బొగ్గు శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉండి, తర్వాత మేఘాలయ చీఫ్ సెక్రటరీగా రిటైరయ్యారు. మరో అధికారి కేసీ సమ్రియా యూపీఏ హయాంలో బొగ్గు శాఖ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం మైనారిటీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. శుక్రవారం విచారణ అనంతరం సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు దోషులందరినీ కస్టడీలోకి తీసుకున్నారు. డిసెంబర్ 3వ తేదీన కోర్టు వీరికి శిక్షలు ప్రకటించేదాకా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారు. బొగ్గు బ్లాకుల కేసులో మాజీ ప్రధాని మన్మోహన్కు ట్రయల్ కోర్టు 2015లో జారీ చేసిన సమన్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆయన పిటిషన్ ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సమాచారాన్ని సీబీఐ లీక్ చేస్తోంది బొగ్గు కుంభకోణం దర్యాప్తులో సీబీఐ గోప్యత పాటించడం లేదని స్పెషల్ జడ్జి ఓపీ సైనీ అన్నారు. సుప్రీంకోర్టు సూచనలను సీబీఐ పట్టించుకోకుండా బయటి వ్యక్తులకు దర్యాప్తు సమాచారాన్ని చేరవేస్తోందని వ్యాఖ్యానించారు. కుంభకోణానికి సంబంధించిన పలు కీలక విషయాలను సీబీఐ కోర్టు దృష్టికి తేకుండా దాచి ఉంచిందంటూ దాఖలైన పిటిషన్పై ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
కోల్ స్కాం : జిందాల్పై ముడుపుల అభియోగం
సాక్షి, న్యూఢిల్లీ : బొగ్గు గనుల కేటాయింపు స్కాంలో పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ నేత నవీన్ జిందాల్ ఇతరులపై ముడుపుల అభియోగాలూ నమోదు చేసినట్టు ప్రత్యేక న్యాయస్ధానానికి సీబీఐ నివేదించింది. జార్ఖండ్లోని అమరకొండ ముర్గదంగల్ కోల్ బ్లాక్ కేటాయింపునకు సంబంధించిన కేసులో నిందితులపై ముడుపుల అభియోగాలను నమోదు చేశామని తెలిపింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7, 12 కింద ప్రభుత్వ అధికారికి ముడుపులు చెల్లించడం లేదా స్వీకరించడం శిక్షార్హమని..నిందితులపై ఆయా సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశామని సీబీఐ తరపు న్యాయవాది వీకే శర్మ చెప్పారు. ఈ కేసులో జిందాల్తో పాటు కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తా సహా 11 మందిపై నేరపూరిత కుట్ర, మోసం వంటి పలు అభియోగాలు నమోదు చేయాలని 2016, ఏప్రిల్లో న్యాయస్ధానం ఆదేశించగా, తాజాగా వీరిపై ముడుపుల ఆరోపణలనూ చార్జ్షీట్లో చేర్చారు. -
బొగ్గు స్కాంలో మధు కోడాకు మూడేళ్లు జైలు
-
మధుకోడాకు మూడేళ్ల జైలు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలిన జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడాకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించింది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకే బసు, కోడా సన్నిహితుడు విజయ్ జోషిలకు మూడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. విసుల్ సంస్థకు రూ.50 లక్షలు, జోషికి రూ.25 లక్షలు; బసు, గుప్తాలకు రూ.లక్ష జరిమానావేసింది. జార్ఖండ్లోని రాజారా ఉత్తర బొగ్గు గనులను విసుల్ సంస్థకు కేటాయించడంలో వీరు అవినీతి, నేరపూరిత కుట్రలకు పాల్పడటంతో ఈ శిక్షలు వేశామని కోర్టు వ్యాఖ్యానించింది. ‘మామూలు నేరాల కంటే వైట్ కాలర్ నేరాలే సమాజానికి అత్యంత ప్రమాదకరం. వీటి వల్ల దేశం భారీ స్థాయిలో ఆర్థికంగా నష్టపోతోంది’ అని సీబీఐ కోర్టు జడ్జి భరత్ పరాశర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పుతో మధుకోడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోనున్నారు. ఇదిలాఉండగా మొత్తం 30 బొగ్గు కుంభకోణం కేసుల్లో ఇప్పటివరకు నాలుగింటిలో 12 మంది వ్యక్తులకు, నాలుగు సంస్థలకు శిక్షలు పడ్డాయి. కాగా తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానని మధుకోడా చెప్పారు. -
బొగ్గు స్కామ్లో మధు కోడాను దోషిగా తేల్చిన కోర్టు
-
మాజీ ముఖ్యమంత్రిని దోషిగా తేల్చిన కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా ప్రకటించింది. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసులతో పాటుగా మరొకరిని కోర్టు బుధవారం దోషులుగా తేల్చింది. కోర్టు వీరిని రేపు (గురువారం) శిక్షలు ఖరారు చేయనుంది. కాగా కోల్కతాకు చెందిన సంస్థకు బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించి కోడాతో పాటు మాజీ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తా, మరో ఐదుగురిపైనా చార్జిషీట్ దాఖలు అయిన విషయం తెలిసిందే. -
వైట్కాలర్ నేరాలు గుర్తించడం కష్టమే
న్యూఢిల్లీ: సమాజంలో గౌరవ, మర్యాదలు పొందే వ్యక్తులు పాల్పడే నేరాల(వైట్కాలర్ నేరాలు)ను గుర్తించడం కష్టమేనని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు భావిస్తున్న బొగ్గు కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ ఇలా పేర్కొంది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తా, మరో ఇద్దరు సీనియర్ అధికారులు కేఎస్ క్రోఫా, కేసీ సమారియాలను కోర్టు ఈ కేసులో దోషులుగా నిర్ధారిస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రజల నైతిక స్థైరాన్ని దెబ్బతీసే వైట్కాలర్ నేరాలు, సాధారణ నేరాల కన్నా ప్రమాదకరమని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి నేరాలు అధిక ఆర్థిక నష్టాలను కలిగించడమే కాకుండా అందరి దృష్టిని ఆకర్షిస్తాయని జడ్జి భరత్ పరాశర్ అన్నారు. వైట్కాలర్ నేరాలకు పాల్పడేవారు ఎగువ ఆర్థిక, సామాజిక తరగతికి చెందినవారని, తమ వ్యక్తిగత లేదా వృత్తిపర విధుల్లో చట్టాలను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. ఎంతో ఆలోచించి, పక్కా ప్రణాళికతో చేయడం వల్ల వైట్కాలర్ నేరాలను పసిగట్టడం అత్యంత కష్టమని అన్నారు. -
జూలై 15న బొగ్గు స్కాం కేసు విచారణ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు సమన్లు జారీ అయిన బొగ్గు స్కాం కేసు విచారణ జూలై 15న జరగనుంది. ఈ మేరకు విచారణ తేదీని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం నిర్ణయించింది. మార్చి 11న మన్మోహన్కు జారీ అయిన సమన్లపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు విచారణను సీబీఐ కోర్టు గతంలో వాయిదా వేసింది. తాజాగా ఈ కేసు తదుపరి విచారణకు తేదీని నిర్ణయించింది. నిజానికి ఈ కేసు మూసివేతకు గత డిసెంబర్ 16న సీబీఐ నివేదిక సమర్పించింది. అయితే దీన్ని తిరస్కరించిన కోర్టు.. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని, అప్పట్లో బొగ్గు శాఖ బాధ్యతలను కూడా చూసుకున్న మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను, పీఎంవో అధికారులను విచారించాలని ఆదేశించింది. ఒడిశాలోని తాలాబిరా-2 బొగ్గు బ్లాకును హిందాల్కో కంపెనీకి 2005లో కేంద్రం కేటాయించింది. ఇందులో అక్రమాలు చోటుచేసుకున్నట్లు నమోదైన కేసులో మన్మోహన్ను కూడా నిందితుడిగా సీబీఐ పేర్కొంది. కోర్టు ఆదేశాలతో మాజీ ప్రధానితోపాటు హిందాల్కో కంపెనీకి, దాని యాజమాన్యానికి, ఇద్దరు ఉన్నతాధికారులకు సమన్లు జారీ అయ్యాయి. దీనిపై నిందితులు సుప్రీంను ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. -
సీల్డ్ కవర్లో వాంగ్మూలాలు
బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తు పురోగతి నివేదికను ప్రత్యేక కోర్టుకు సమర్పించిన సీబీఐ సీల్డ్ కవర్ తెరిచి పరిశీలించిన న్యాయమూర్తి రెండు వారాల్లో దర్యాప్తు పూర్తిచేస్తామన్న సీబీఐ న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కుంభకోణం కేసులో కొనసాగుతున్న దర్యాప్తులో ప్రగతిపై నివేదికను, ఈ కేసుకు సంబంధించి తాజాగా సీబీఐ అధికారులు ప్రశ్నించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, నాటి పీఎంఓ ఉన్నతాధికారుల వాంగ్మూలాలను.. కేంద్ర దర్యాప్తు సంస్థ మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు సీల్డ్కవర్లో సమర్పించింది. ఈ కేసులో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను కూడా ప్రశ్నించాల్సిందిగా సీబీఐని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బొగ్గు మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్, పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా తదితరులు నిందితులుగా ఉన్న ఈ బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తును పూర్తిచేసేందుకు మరో రెండు వారాల గడువును సీబీఐ కోరింది. విచారణ సందర్భంగా సీల్డ్ కవర్ను తెరచి.. సీబీఐ సమర్పించిన వాంగ్మూలాలు, ఇతర పత్రాలను ప్రత్యేక న్యాయమూర్తి భరత్పరాశర్ పరిశీలించారు. అయితే.. ఈ వాంగ్మూలాలు, పత్రాలను తదుపరి దర్యాప్తు పూర్తయ్యేవరకూ సీల్డ్ కవర్లోనే ఉంచాలని, వాటిని పరిశీలించేందుకు అనుమతించరాదని సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.కె.శర్మ కోర్టుకు విజ్ఞప్తిచేశారు. ఈ నేపధ్యంలో ఆయా పత్రాలన్నిటినీ మళ్లీ సీల్డ్ కవర్లో ఉంచి, కోర్టు సీల్తో సీల్ చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. దర్యాప్తును రెండు వారాల్లో పూర్తిచేస్తామని సీబీఐ పేర్కొనడంతో.. కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేశారు. బొగ్గు స్కాం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, అప్పటి ప్రధానమంత్రి కార్యాలయంలోని ఉన్నతస్థాయి అధికారులైన మన్మోహన్ ముఖ్య కార్యదర్శి టి.కె.ఎ.నాయర్, వ్యక్తిగత కార్యదర్శి బి.వి.ఆర్.సుబ్రమణ్యం తదితరులను కూడా ప్రశ్నించాల్సిందిగా ప్రత్యేక కోర్టు గత డిసెంబర్ 16వ తేదీన ఆదేశించటంతో.. సీబీఐ ఆ మేరకు వారిని ప్రశ్నించి తాజాగా పురోగతి నివేదికను, వాంగ్మూలాల పత్రాలను కోర్టుకు సమర్పించింది. ఒడిశాలోని తాలాబిరా-2 బొగ్గు క్షేత్రాన్ని 2005 సంవత్సరంలో హిందాల్కో సంస్థకు కేటాయించటంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. హిందాల్కోకు అనుకూలంగా వ్యవహరించలేదన్న మన్మోహన్! తాలాబిరా-2 కేటాయింపులో హిందాల్కోకు ఏ విధంగానూ అనుకూలంగా వ్యవహరించలేదని.. నిర్దిష్ట విధివిధానాల ప్రకారమే కేటాయింపు జరిగిందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సీబీఐకి స్పష్టంచేసినట్లు తెలిసింది. ఈ కేసులో కోర్టు ఉత్తర్వుల మేరకు 10 రోజుల కిందట తనను ప్రశ్నించిన సీబీఐ అధికారులకు ఆయన పై విధంగా వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. తాలాబిరా-2 బొగ్గు క్షేత్రం కేటాయింపు జరిగినపుడు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నాటి ప్రధాని మన్మోహన్ పర్యవేక్షణలోనే ఉన్న విషయం తెలిసిందే. హిందాల్కో సంస్థకు తాలాబిరా-2 బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా 2005 మే 7, జూన్ 17 తేదీల్లో ప్రధానికి రెండు లేఖలు రాసిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి.. సీబీఐ అధికారులు కొద్ది రోజుల కిందట మన్మోహన్ను ప్రశ్నించినట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి. -
మన్మోహన్ ను ప్రశ్నించనున్న సీబీఐ
-
మన్మోహన్ ను ప్రశ్నించనున్న సీబీఐ?
ఢిల్లీ: కోల్స్కాం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను విచారించడానికి సీబీఐ సన్నద్ధమయినట్లు తెలుస్తోంది. యూపీఏ ప్రభుత్వంలో బొగ్గుశాఖ బాధ్యతలను అదనంగా నిర్వర్తించిన ఆనాటి ప్రధాని మన్మోహన్ కూడా విచారించాలని సీబీఐ యోచిస్తోంది. హిందూల్కోకు బొగ్గు గనుల కేటాయింపుపై సీబీఐ సమర్పించిన తుది నివేదికను ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. హిందూల్కోకు బొగ్గు గనుల కేటాయింపులో మన్మోహన్ వాంగ్మూలం నమోదు చేయాలని సీబీఐకి ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మన్మోహన్ ను సీబీఐ విచారించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. -
మన్మోహన్ను విచారించలేదేం?
బొగ్గు స్కాం కేసులో సీబీఐని ప్రశ్నించిన ప్రత్యేక కోర్టు మాజీ ప్రధానిని ప్రశ్నించేందుకు అనుమతివ్వలేదన్న సీబీఐ సీబీఐ న్యాయవాదిపై {పశ్నల వర్షం కురిపించిన జడ్జి న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంలో బొగ్గుశాఖ బాధ్యతలను అదనంగా నిర్వర్తించిన నాటి ప్రధాని మన్మోహన్సింగ్ను కోల్స్కాం కేసులో విచారించడానికి తమకు అనుమతి రాలేదని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టుకు సీబీఐ తెలిపింది. ఒరిస్సాలోని తలాబిరా-2, 3బొగ్గుగనుల కేటాయింపుల్లో అక్రమాలకు సంబంధించిన కేసు మంగళవారం కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఈ కేసులో పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్తోపాటు హిందాల్కో కంపెనీ అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి భరత్ పరాశర్.. సీబీఐదర్యాప్తు అధికారిపై ప్రశ్నల పరంపర కురిపించారు. ‘ఈ కేసులో నాటి బొగ్గుశాఖ మంత్రిని విచారించాల్సిన అవసరం లేదని మీరు భావించారా? కేసులో అనేక అంశాలపై స్పష్టత వచ్చేందుకు ఆయన వాంగ్మూలం అవసరమని మీకు ఎందుకు అనిపించలేదు’ అని ప్రశ్నించారు. దర్యాప్తు అధికారి బదులిస్తూ.. ‘మొదట మన్మోహన్ను ప్రశ్నించాలని భావించాం. కానీ ప్రధాని కార్యాలయం అధికారులు నాయర్, జావెద్ ఉస్మానీలను ప్రశ్నించాం. వారి వాంగ్మూలం సరిపోతుందనుకున్నాం.’ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో నాటి బొగ్గుశాఖ బాధ్యతలను చూసిన ప్రధానిని విచారించేందుకు తమకు అనుమతి రాలేదని వివరించారు. ఈ సందర్భంగా పీఎంవో అధికారులను ముఖాముఖీ ప్రశ్నించా రా? లేదా వారికి ప్రశ్నావళిని పంపి సమాధానాలు అడిగారా? అని న్యాయమూర్తి అడిగారు. ఇందుకు నేరుగానే ప్రశ్నించామని న్యాయవాది బదులిచ్చారు. తర్వాత న్యాయమూర్తి... ‘దీనిపై సమగ్ర అవగాహనకు రావాలంటే కేసు దర్యాప్తు ఎలా సాగింది, ఎవరెవరిని ఎలా ప్రశ్నించారన్న విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ కేసు డైరీ, ఇతర ఫైళ్లన్నీ సీల్డ్ కవర్లో మా ముందుంచండి’అని సీబీఐని ఆదేశించారు. కేసు తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. 2005లో ప్రధాని మన్మోహన్ అదనంగా బొగ్గుశాఖ బాధ్యతలను నిర్వర్తించారు. కాగా, తలాబిరా బొగ్గు గనుల కేటాయింపు కేసు డైరీ, సంబంధిత ఫైళ్లన్నీ న్యాయస్థానానికి అందజేస్తామని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా చెప్పారు. వాటిని పరిశీలించాక మన్మోహన్ను ప్రశ్నించకపోవడం తప్పో కాదో నిర్ణయించాల్సింది కోర్టేనని అన్నారు. -
‘కోల్గేట్’ దర్యాప్తు అధికారికి రాష్ట్రపతి పతకం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 24 మంది ప్రతిభావంతులైన అధికారులకు ప్రకటించిన రాష్ట్రపతి పతకాల జాబితాలో బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తునకు నేతృత్వం వహించేందుకు సుప్రీంకోర్టు పునర్నియమించిన డీఐజీ రవికాంత్ కూడా ఉన్నారు. పెరల్స్ గ్రూప్ బ్యాంకింగ్ సేవల మోసం కేసులో ఇన్చార్జిగా ఉన్న సీబీఐ జేడీ రాజీవ్ శర్మ, కాశ్మీర్లోని షోపియన్లో ఇద్దరు మహిళల హత్యకేసును దర్యాప్తు చేసిన డీఐజీ రతన్ సంజ య్లు కూడా రాష్ట్రపతి పతకాలు అందుకోనున్నారు. టట్రా ట్రక్కుల స్కాంపై దర్యాప్తుకు నేతృత్వం వహించిన అధికారులకూ రాష్ట్రపతి పోలీసు పతకాలు దక్కాయి.