holi dip
-
Mahakumbh-2025: యూపీ, బీహార్ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్.. 70 కి.మీ. పొడవునా..
ప్రయాగ్రాజ్: నేడు (బుధవారం) మౌని అమావాస్య. ఈ సందర్భంగా కుంభమేళాలో స్నానం చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపధ్యంలో కుంభమేళాకు దారితీసే మార్గాల్లో ఎన్నడూ లేని విధంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.యూపీ-బీహార్ సరిహద్దు అయిన కర్మనాషా నుంచి బీహార్లోని రోహ్తాస్లోని శివసాగర్ ఖుర్మాబాద్ వరకు 70 కి.మీ మేరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచే జీటీ రోడ్డులోని రెండు లేన్లు పూర్తిగా జామ్ అయ్యాయి. దీని కారణంగా ద్విచక్రవాహనాలు వెళ్ళడం కూడా కష్టంగా మారింది.భారీ ట్రాఫిక్ జామ్ దృష్ట్యా ఉత్తరప్రదేశ్లోకి భారీ వాహనాల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని అధికారులు సడలించారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. మరోవైపు ఢిల్లీ నుండి కోల్కతాకు వెళ్లే ప్రయాణికులకు ఆధారమైన జీటీ రోడ్డు గత 12 గంటలుగా స్తంభించిపోయింది. కుద్ర, మోహానియా, కైమూర్ జిల్లాలోని టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన ట్రాఫిక్ జామ్ నెలకొంది. కోల్కతా, జార్ఖండ్తో పాటు ఇతర ప్రాంతాల నుండి ప్రయాగ్రాజ్కు వెళుతున్న భక్తుల వాహనాలు జాతీయ రహదారి- 19లో చిక్కుకుపోయాయి. భక్తులతో వెళ్తున్న ఒక బస్సు రాత్రంతా రద్దీలో చిక్కుకుపోయింది.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: నాలుగు నిముషాలకు ఒక రైలు.. మౌని అమావాస్యకు ప్రత్యేక ఏర్పాట్లు -
Mahakumbh : 15 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి.. మౌని అమావాస్య అంచనాలివే
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతోంది. దేశ విదేశాల నుండి పర్యాటకులు, భక్తులు మహా కుంభమేళాకు తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.మహాకుంభమేళాలో మూడవ పుణ్య స్నానం జనవరి 29న అంటే మౌని అమావాస్య రోజున జరగనుంది. ఆ రోజున పుణ్యస్నానం ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివస్తారనే అంచనాలున్నాయి. ఇప్పటివరకు మహా కుంభ స్నానం చేసే వారి సంఖ్య 15 కోట్లు దాటింది. గడచిన 17 రోజుల్లో 15 కోట్లకు పైగా జనం మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేశారు. మకర సంక్రాంతి సందర్భంగా 3.5 కోట్ల మంది భక్తులు, సాధువులు స్నానమాచరించారు.రాబోయే మౌని అమావాస్య సందర్భంగా 8 నుండి 10 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు వస్తారనే అంచనాలున్నాయి. 2025 మహా కుంభమేళాకు మొత్తంగా 40 కోట్ల మంది హాజరవుతారనే అంచనాలున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మౌని అమావాస్య అనంతరం ఫిబ్రవరిలో వసంత పంచమి సందర్భంగా అమృత స్నానం జరగనుంది. మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 26న అంటే మహాశివరాత్రి రోజున చివరి అమృత స్నానంతో ముగియనుంది.ఇది కూడా చదవండి: ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు -
Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత?
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకూ కొనసాగనుంది. ఈ సమయంలో కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. కుంభమేళా జరిగే రోజుల్లో కొన్ని తిథులను ప్రత్యేకమైనవిగా భావిస్తారు. వాటిలో మౌని అమావాస్య ఒకటి. మాఘ మాసంలో వచ్చే ఈ అమావాస్య నాడు గంగా నదిలో స్నానం చేస్తే, పాపాల నుండి విముక్తి లభిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. మౌని అమావాస్య జనవరి 29, బుధవారం నాడు వచ్చింది.హిందూ క్యాలెండర్ ప్రకారం మౌని అమావాస్య మాఘ మాసంలో వస్తుంది. అందుకే ఈ అమావాస్యను మాఘ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఆ రోజున ఎవరైనా తమ పెద్దలకు పిండప్రదానం చేస్తే, వారు పితృ దోషం నుండి విముక్తి పొందుతారని పెద్దలు చెబుతుంటారు. ఇదేవిధంగా మౌని అమావాస్య నాడు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇప్పుడొచ్చిన మౌని అమావాస్య..మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో రావడం విశేషంగా భావిస్తున్నారు. మౌని అమావాస్యనాడు నిశ్శబ్ద ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతుంటారు.మౌనం వలన కలిగే లాభాలను మౌని అమావాస్య గుర్తుచేస్తుంది. మౌనం అంటే బాహ్య మౌనం కాదని, అంతర్గతంగా మౌనంగా ఉండాలని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి మనిషి మౌన ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందని మానసికశాస్త్రవేత్తలు కూడా చెబుతుంటారు. తద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుందని, ఏకాగ్రత ఏర్పడుతుందని, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం అలవడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మౌనం పాటించడం అనేది సాధకులను ఎంతో ముఖ్యమని, తద్వారా ఆధ్యత్మిక ఎదుగుదల అలవడుతుందని ఆధ్మాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: మళ్లీ గూగుల్ మ్యాప్ బురిడీ.. ఈ సారి ఫ్రెంచ్ పర్యాటకుల వంతు -
ఫిబ్రవరి 5నే ప్రధాని మోదీ కుంభస్నానం ఎందుకు? ఆ రోజు ప్రత్యేకత ఇదే..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో పుణ్యస్నానం చేసేందుకు జనం పోటెత్తుతున్నారు. ప్రతీరోజు ప్రముఖులు మొదలుకొని సామాన్యుల వరకూ.. కొన్ని లక్షలమంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న కుంభ స్నానం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ ఫిబ్రవరి 5నే మహా కుంభ స్నానానికి ఎందుకు వెళ్తున్నారనే ప్రశ్న అందరిమదిలో మెదులుతోంది.ఫిబ్రవరి 5.. మాఘ మాసం, గుప్త నవరాత్రి, అష్టమి తిది(ఉత్తరాదిన) రోజున ప్రధాని మోదీ కుంభమేళాలో పుణ్యస్నానం చేయనున్నారు. ఆరోజున స్నానం చేయడం, ధ్యానం చేయడం ఎంతో మంచిదని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అలాగే మాఘ మాసం అష్టమి రోజున పవిత్ర నదిలో స్నానం చేసి, పూర్వీకులకు నీరు, నువ్వులు, బియ్యం, పండ్లు మొదలైనవి సమర్పించడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుందని హిందూ గ్రంథాలలో పేర్కొన్నారు.కాగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, బీజేపీ ఎంపీ రవి కిషన్, ఆధ్యాత్మిక గురువు సద్గురు, నటుడు అనుపమ్ ఖేర్, కుమార్ విశ్వాస్ సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించారు. -
నేడు కుంభమేళాకు గౌతమ్ అదాని.. సంస్థ అందిస్తున్న సేవలివే..
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా సాగుతోంది. నేడు (మంగళవారం) అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్రాజ్కు రానున్నారు.గౌతమ్ అదానీ తన పర్యటనలో భాగంగా తొలుత త్రివేణీ సంగమంలో స్నానం చేయనున్నారు. అలాగే బడే హనుమంతుని దర్శనం చేసుకోనున్నారు. అదానీ గ్రూప్.. ఇస్కాన్, గీతా ప్రెస్ల భాగస్వామ్యంతో మహా కుంభమేళాలో భక్తులకు పలు సేవలు అందిస్తోంది. మహాకుంభమేళా ప్రాంతంలో ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు అదానీ గ్రూప్ మహాప్రసాదాన్ని పంపిణీ చేస్తోంది.గౌతమ్ అదానీ నేడు ఇస్కాన్ ఆలయంలో నిర్వహించే భండార సేవలో కూడా పాల్గొననున్నారు. మహా కుంభమేళాలో అదానీ అందిస్తున్న సేవలను చూసి భక్తులు మెచ్చుకుంటున్నారు. గీతా ప్రెస్ సహకారంతో అదానీ గ్రూప్ భక్తులకు ఆధ్మాత్మిక పుస్తకాలను వితరణ చేస్తోంది. ఈ విధంగా ఆదానీ సంస్థ ఆధ్యాత్మిక సాహిత్యం గురించి అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఇదేవిధంగా ఆదానీ గ్రూప్ భక్తులకు ప్రయాగ్రాజ్లో ఉచిత ప్రయాణి సౌకర్యాన్ని అందిస్తోంది. ఇది మహా కుంభమేళాకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఉపయోగకరంగా ఉంది. ఇది కూడా చదవండి: Trump oath ceremony: ‘అమెరికా ది బ్యూటీఫుల్’ గాయని ఘనత ఇదే -
Mahakumbh: 18 నాటికి ఎన్నికోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారంటే..
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జనవరి 18 వరకు 7.72 కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానం చేశారు.ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం(జనవరి 19) మధ్యాహ్నం నాటికీ ఈ ఒక్కరోజే 30.80 లక్షలకు పైగా జనం సంగమంలో స్నానం చేశారు.యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈరోజు(ఆదివారం) ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. ఆయన ఈరోజు ఐదు గంటల పాటు కుంభ్ ప్రాంతంలో ఉండి, పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ఈరోజు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ మహా కుంభమేళాలో పుణ్య స్నానం చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం సంగమంలో స్నానం చేసి, మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ను ప్రశంసించారు.ఇది కూడా చదవండి: తమకు తామే పిండం పెట్టుకుని.. నాగ సాధువులుగా మారిన 1,500 మంది సన్యానులు -
Mahakumbh 2025: స్నానానికి 45 నిముషాలు.. ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్లో వెల్లడి
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. త్రివేణీ సంగమానికి చేరుకున్న భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే ప్రతీభక్తుడు పుణ్య స్నానానికి ఎంత సమయం కేటాయిస్తున్నాడు? తాజాగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.భక్తుల సంఖ్యను తెలుసుకునేందుకు..త్రివేణీ సంగమంలో స్నానమాచరిస్తున్న ప్రతి భక్తుడు స్నాన ఘాట్లో సగటున 45 నిమిషాలు గడుపుతున్నాడని వెల్లడయ్యింది. రేడియో ఫ్రీక్వెన్సీ రిస్ట్ బ్యాండ్ల ద్వారా సేకరించిన డేటా ఈ వివరాలను తెలియజేసింది. ఇదేవిధంగా ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్ నుండి సేకరించిన డేటాను మేళాకు హాజరయ్యే భక్తుల సంఖ్యను లెక్కించేందుకు కూడా సంబంధిత అధికారులు ఉపయోగిస్తున్నారు.మహా కుంభమేళాకు వచ్చే భక్తుల వాస్తవ సంఖ్యను తెలుసుకునేందుకు అధికారులు ప్రత్యేక పద్దతిని ఉపయోగిస్తున్నారు. అదే ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్. దీనిని యాత్రికుల మణికట్టుకు కట్టారు. ఈ ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్ల నుండి సేకరించిన డేటా ప్రకారం, మకర సంక్రాంతి, పుష్య పూర్ణిమ రోజుల్లో భక్తులు స్నాన ఘాట్ల వద్ద సగటున 45 నిమిషాలు గడిపారని వెల్లడయ్యింది. ఘాట్ చేరుకోవడం నుండి స్నానం చేసి, తిరిగి వచ్చే వరకు 45 నిముషాలు పట్టిందని తేలింది.ఐదు లక్షల మంది ఉచిత ప్రయాణాలుఘాట్ వద్ద భక్తులు సగటున ఎంత సమయం గడుపుతారో తెలుసుకోవడం ద్వారా రద్దీని నియంత్రించగలుగుతామని పోలీసు అధికారులు తెలిపారు. ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్ డేటా అనాలిసిస్ టెక్నాలజీ నుండి పొందిన ఫలితాలు జనసమూహ నిర్వహణకు సహాయపడతాయని ఎస్ఎస్పీ రాజేష్ కుమార్ ద్వివేది తెలిపారు. కాగా పుష్య పూర్ణిమ, మకర సంక్రాంతి పండుగల సందర్భంగా జనం మధ్య చోటుచేసుకున్న తోపులాటలో 200 మందికి పైగా జనం గాయపడ్డారు. వీరికి చికిత్స అందిస్తున్నామని స్థానిక ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి చెందిన సర్జన్ డాక్టర్ వినయ్ యాదవ్ తెలిపారు. గడచిన నాలుగు రోజుల్లో దాదాపు ఐదు లక్షల మంది ప్రయాణికులు షటిల్ బస్సులలో ఉచితంగా ప్రయాణించారు. గురువారం నుండి ప్రయాణికులు సాధారణ రోజుల మాదిరిగానే ఈ బస్సులలో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు.93 ఏళ్ల తర్వాత..1932లో ప్రయాగ్రాజ్ నుండి లండన్కు ఒక విమానాన్ని నడిపారు. ఇప్పుడు 93 ఏళ్ల తర్వాత బుధవారం ప్రయాగ్రాజ్ విమానాశ్రయం నుండి అంతర్జాతీయ విమానం బయలుదేరింది. ఈ విమానం అమెరికన్ బిలియనీర్ మహిళా వ్యవస్థాపకురాలు లారెన్ పావెల్ జాబ్స్ కోసం ఇక్కడికి వచ్చింది. ఈ విమానం భూటాన్కు వెళ్లింది. జాబ్స్ కొద్ది రోజుల పాటు భూటాన్లో ఉంటారని సమాచారం. బ్రిటిష్ పాలనలో ప్రయాగ్రాజ్ నుండి అంతర్జాతీయ విమానాలు నడిచేవి. 1932 వరకు ఇక్కడి నుండి లండన్ కు నేరుగా విమానం ఉండేది.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: నేడు అంతర్జాతీయ ప్రతినిధుల బృందం పవిత్ర స్నానాలు -
Mahakumbh 2025: మహాకుంభమేళాలో మూడో రోజు విశేషాలు..
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. దేశవిదేశాల నుంచి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.ఈరోజు(బుధవారం) మహాకుంభమేళాలో మూడవ రోజు. అత్యంత భారీస్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు వివిధ ఘాట్ల వద్ద భక్తులు ఉదయం నుంచే క్యూలు కడుతున్నారు. మహా కుంభమేళా(Great Kumbh Mela) ప్రారంభమైనది మొదలుకొని ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు గంగా మాత హారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో సంగమతీరం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది.మంగళవారం మకర సంక్రాంతి(Makar Sankranti) సందర్భంగా సాధువులతో పాటు భక్తులు తొలి అమృత స్నానం చేశారు. 13 అఖాడాలకు చెందిన సాధువులు ఒకరి తర్వాత ఒకరుగా స్నానం చేశారు. మకర సంక్రాంతి నాడు సుమారు 3.50 కోట్ల మంది భక్తులు గంగా సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. సోమవారం మొదటి స్నానోత్సవం నాడు 1.65 కోట్ల మంది భక్తులు స్నానం చేశారు. ఈ విధంగా రెండు రోజుల్లో మొత్తం 5.15 కోట్ల మంది సంగమంలో స్నానం చేశారు.ఈసారి జరుగుతున్న మహా కుంభమేళా ఎంతో ప్రత్యేకమైనది. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న కుంభమేళా ఇది. సంగమ తీరంలోని 4,000 హెక్టార్ల ప్రాంతంలో ఈ ఉత్సవం జరుగుతోంది. మహా కుంభమేళాలో స్నానం చేసిన భక్తులు తాము సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కుంభమేళా తొలిరోజున సంగమతీరంలో స్నానాలాచరిస్తున్న వారిపై హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు.ఇది కూడా చదవండి: Mahakumbh: ఉత్సాహం ఉరకలేస్తోంది: బల్గేరియా పర్యాటకులు -
Mahakumbh: ఉదయం 8:30కే కోటిమందికిపైగా పుణ్యస్నానాలు
నేడు మకర సంక్రాంతి సందర్భంగా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తజనం పోటెత్తారు. ఈరోజు చేసే స్నానాన్ని అమృత స్నాన్ అని అంటారు. దీనిని ఆచరించేందుకు సంగమం ఒడ్డున భక్తులు బారులు తీరారు. ఉదయం 8.30 గంటల కల్లా కోటి మందికి పైగా జనం త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు.మకర సంక్రాంతి(Makar Sankranti) సందర్భంగా అఖాడా వర్గానికి చెందిన సాధువులు అమృత స్నానాన్ని ఆచరిస్తున్నారు. పంచాయితీ అఖాడా మహానిర్వాణి, శంభు పంచాయితీ అటల్ అఖాడా మొదట అమృత స్నానం ఆచరించారు. అమృత స్నాన సమయంలో 13 అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఇది ముగిసిన అనంతరం సామాన్యులు స్నానం ఆచరిస్తున్నారు. అమృత స్నాన్ మహా కుంభమేళాలో ప్రధానమైనదిగా పరిగణిస్తారు. ఇందులో స్నానం చేసేందుకు మొదటి అవకాశం నాగ సాధువులకు ఇస్తారు.పురాణాల్లోని వివరాల ప్రకారం సముద్ర మథనం నుండి వెలువడిన అమృత భాండాగారాన్ని దక్కించుకునేందుకు దేవతలు, రాక్షసులు ఒకరితో ఒకరు పోరాడుతున్నప్పుడు నాలుగు అమృత బిందువులు నాలుగు ప్రదేశాలలో (ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్,నాసిక్) పడ్డాయి. నాటి నుంచి ఈ ప్రాంతాల్లో మహా కుంభమేళా(Great Kumbh Mela) ప్రారంభమైంది. నాగ సాధువులను మహాశివుని అనుచరులుగా పరిగణిస్తారు. అందుకే వారిని ముందుగా ఈ స్నానం ఆచరించడానికి అర్హులుగా భావిస్తారు. ఈ నేపధ్యంలోనే వారికి తొలుత స్నానం ఆచరించేందుకు అవకాశం కల్పిస్తారు.ఇది కూడా చదవండి: రూ. 25 లక్షల చైనీస్ మాంజా స్వాధీనం.. బుల్డోజర్తో ధ్వంసం -
Mahakumbh-2025: మకర సంక్రాంతి వేళ.. అమృత స్నానానికి పోటెత్తిన జనం
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పుష్య పూర్ణిమ స్నానంతో మహా కుంభమేళా ప్రారంభమైంది. తొలిరోజు సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 1.65 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ నుండి భక్తులపై పూల వర్షం కురిపించారు. ఇందుకోసం 20 క్వింటాళ్ల గులాబీ రేకులను వినియోగించారు. #WATCH | The first Amrit Snan of #MahaKumbh2025 will begin with Mahanirvani Panchayati Akhara taking holy dip in Triveni Sangam on the auspicious occasion of Makar SankrantiSadhus of the 13 akhadas of Sanatan Dharm will take holy dip at Triveni Sangam - a sacred confluence of… pic.twitter.com/xgN3urCEUI— ANI (@ANI) January 14, 2025మహా కుంభమేళా నగరం భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికే ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలతో పాటు అమెరికా, రష్యా, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఈక్వెడార్ తదితర దేశాల నుండి వచ్చిన జనం ఇక్కడి సనాతన సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు. సంగమంలో స్నానం చేసి, నుదుటిపై తిలకం పూసుకుని ఆధ్యాత్మిక ఆనందంలో మునిగితేలుతున్నారు.#WATCH | Prayagraj, Uttar Pradesh: On former Apple CEO Steve Jobs' wife Laurene Powell Jobs, Spiritual leader Swami Kailashanand Giri says, "She is in my 'shivir'. She has never been to such a crowded place. She has got some allergies. She is very simple...All those people who… pic.twitter.com/1bQXP2lId7— ANI (@ANI) January 14, 2025కుంభమేళాలో మొదటి అమృత స్నానం మకర సంక్రాంతి శుభ సందర్భంగా జరిగింది. ఇది మహానిర్వాణి పంచాయితీ అఖాడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడంతో మొదలయ్యింది. గంగా, యమున, మర్మమైన సరస్వతి నదుల పవిత్ర త్రివేణి సంగమంలో సనాతన ధర్మంలోని 13 అఖాడాలకు చెందిన సాధువులు ఈరోజు పవిత్ర స్నానం ఆచరించనున్నారు.#WATCH | Prayagraj | Preparations are underway for the first Amrit Snan of #MahaKumbh2025 The first Amrit Snan of #MahaKumbh2025 will begin with Mahanirvani Panchayati Akhara taking holy dip in Triveni Sangam on the auspicious occasion of #MakarSankranti pic.twitter.com/fIlzfygkos— ANI (@ANI) January 13, 2025మాజీ ఆపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ ఆధ్యాత్మిక గురువు స్వామి కైలాశానంద గిరి మీడియాతో మాట్లాడుతూ ‘లారెన్ పావెల్ జాబ్స్ నా శిబిరంలో ఉన్నారు. ఆమె ఏనాడూ ఇంత రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్లలేదు. ఆమెకు కొన్ని అలెర్జీలున్నాయి. మన సంప్రదాయాన్ని ఎప్పుడూ చూడని వారుకూడా మాతో చేరాలని కోరుకుంటున్నాం’ అన్నారు.#WATCH | Prayagraj | Devotees take holy dip on the first Amrit Snan of #MahaKumbh2025 on the auspicious occasion of #MakarSankranti #MahaKumbh2025 began yesterday with a record gathering of over 1.5 cr devotees on the first day pic.twitter.com/3MAk0yKD8y— ANI (@ANI) January 13, 20252025 మహా కుంభమేళా అమృత స్నానానికి ముందస్తు సన్నాహాలు చేశారు. మహాసంక్రాంతి శుభ సందర్భంగా మొదటి అమృత స్నానం మహానిర్వాణి పంచాయతీ అఖాడాలోని త్రివేణి సంగమంలో జరిగే పవిత్ర స్నానాలతో ప్రారంభమయ్యింది.#WATCH | Gorakhpur | Uttar Pradesh CM Yogi Adityanath says, "I extend my best wishes to all on the occasion of Makar Sankranti - it's a festival and a celebration to express gratitude towards lord Sun. Followers of Sanatan Dharm celebrate this festival with different names in… pic.twitter.com/HJukhqOpWo— ANI (@ANI) January 13, 2025మకర సంక్రాంతి శుభ సందర్భంగా మొదటి అమృత స్నానాన్ని భక్తులు ఆచరించారు. మొదటి రోజు రికార్డు స్థాయిలో 1.5 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు.#WATCH | Prayagraj | Sadhus of Mahanirvani Panchayati Akhara will be the first to take the holy dip at the first Amrit Snan of #MahaKumbh2025 on the auspicious occasion of Makar Sankranti as Sadhus of the 13 akhadas of Sanatan Dharm will take holy dip at Triveni Sangam - a sacred… pic.twitter.com/0lM8c1jbVP— ANI (@ANI) January 13, 2025ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ‘మకర సంక్రాంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది సూర్యభగవానునికి కృతజ్ఞతలు తెలిపే పండుగ. ఈ పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో భిన్నంగా జరుపుకుంటారన్నారు.#WATCH | Mahamandleshwar Swami Chidambaranand of Mahanirvani Panchayati Akhara, says, "I extend my best wishes to all on the occasion of #makarsankranti2025. Mahanirvani Panchayati Akhara will be the first to take holy dip on today's Amrit Snan - the first of #MahaKumbh2025..." https://t.co/0deSPAtEEe pic.twitter.com/Wftc0Nz3dO— ANI (@ANI) January 13, 2025మకర సంక్రాంతి శుభ సందర్భంగా సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.#WATCH | #MahaKumbh2025 | Prayagraj, Uttar Pradesh: "I come from the US but I live in Lisbon, Portugal. I was travelling in the South. I came here via Varanasi yesterday... I like how the energy is very calm and peaceful, and everyone is very friendly. It feels very good to be… pic.twitter.com/z45G1rGxER— ANI (@ANI) January 13, 2025మహానిర్వాణి పంచాయతీ అఖాడాకు చెందిన మహామండలేశ్వర్ స్వామి చిదంబరానంద మకరసంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.సనాతన ధర్మంలోని 13 అఖాడాల క్రమాన్ని మహా కుంభమేళా పరిపాలన విభాగం ఖరారు చేసింది. ప్రతి అఖాడాకు సమయాన్ని షెడ్యూల్ చేశారు.ఇది కూడా చదవండి: Maha Kumbh-2025: ఒక్కో ఘాట్కు ఒక్కో ప్రత్యేకత.. విశేష ఫలితం -
Mahakumbh 2025: తొలి రోజే కోటిన్నర
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా సోమవారం అంగరంగ వైభవంగా మొదలైంది. భారీగా పోటెత్తిన భక్తులతో తొలి రోజే ప్రయాగ్రాజ్ జనసంద్రమైంది. ఏ వైపు చూసినా కనుచూపు మేరా కట్టలు తెగినట్టుగా జనప్రవాహమే. ఎముకలు కొరికే చలి. దట్టంగా కమ్ముకున్న పొగమంచు. అతి శీతల జలాలు. ఇవేవీ భక్తుల ఉత్సాహానికి అడ్డుకట్ట వేయలేకపోయాయి. తెల్లవారుజాము కల్లా త్రివేణి సంగమ స్థలి ఇసుక వేసినా రాలనంత జనంతో నిండిపోయింది. శంఖనాదం, మంత్రోచ్చారణల నడుమ గంగా, యమున, సరస్వతి కలిసే చోట మేళా లాంఛనంగా ప్రారంభమైంది. ఆ వెంటనే ‘జై గంగా మాతా’, ‘హరహర మహాదేవ్’, ‘జై శ్రీరాం’ నినాదాలు మిన్నంటాయి. తర్వాత భక్తుల పుణ్యస్నానాలు మొదలయ్యాయి. తెల్లవారుజామున తొలి విడత స్నానాల్లో పాల్గొన్న వారిని యూపీ ప్రభుత్వం హెలికాఫ్టర్ ద్వారా పూలు చల్లి స్వాగతించింది. సోమవారం సాయంత్రానికే ఏకంగా 1.65 కోట్ల మందికి పైగా పుష్య పౌర్ణమి స్నానం ఆచరించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం సంక్రాంతి సందర్భంగా 13 అఖాడాలతో పాటు దేశ నలుమూలలకు చెందిన పలు ఆధ్యాత్మిక పీఠాల అధిపతులు, సాధుసంతులు తొలి షాహీస్నాన్ (రాజస్నానం) ఆచరించనున్నారు. ఈ సందర్భంగా భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రిన చివరి రాజస్నానంతో మేళా ముగియనుంది. వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ 144 ఏళ్లకు ఓసారి వచ్చే అత్యంత అరుదైన ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొనేందుకు విదేశీయులు కూడా భారీ సంఖ్యలో ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. స్థానికులు, భక్తులు, సాధుసంతులతో కలిసి శంఖాలూదుతూ, భజనలు చేస్తూ భక్తి భావనతో పులకించిపోయారు. ఈసారి కుంభమేళా ఆధ్యాత్మికత, సంస్కృతి, మత విశ్వాసాలు, సంప్రదాయాలతో పాటు అధునాతన టెక్నాలజీకి కూడా అద్దం పట్టేలా జరుగుతోంది. ‘ఏక్తా కా మహాకుంభ్’ హాష్ట్యాగ్ సోమవారం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో నిలిచింది. భక్తులు, సాధవులు రాకపోకలకు ఏర్పాటు చేసిన 30 బల్లకట్టు వంతెనలతో పాటు ఈ మహా క్రతువును నిర్వహణకు కేటాయించిన 10 వేల ఎకరాల స్థలమూ కిక్కిరిసి కన్పిస్తోంది. 1.5 లక్షల మరుగుదొడ్లను 15 వేలకు పైగా పారిశుద్ధ కారి్మకులు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. మహాకుంభ్ను గ్రీన్, డిజిటల్, ప్లాస్టిక్రహితంగా యోగి సర్కారు ప్రకటించింది. తొలి రోజే మేళాలో తప్పిపోయిన 500 పై చిలుకు మందిని సొంతవారి చెంతకు చేర్చారు. 2 లక్షల గుడారాలతో వెలిసిన టెంట్ సిటీ ప్రపంచంలోనే అతి పెద్ద తాత్కాలికంగా రికార్డు సృష్టించింది.లక్షల్లో కల్పవాస దీక్షలు తొలి రోజే లక్షలాది భక్తులు కల్పవాద దీక్ష తీసుకున్నారు. యూపీలోని బుందేల్ఖండ్కు చెందిన దినేశ్ స్వరూప్ బ్రహ్మచారికి ఇది వరుసగా 41వ కల్పవాసం కావడం విశేషం! దీక్షధారుల్లో యువత కూడా ఎక్కువ సంఖ్యలో కనిపించారు. వారిలో యూపీఎస్సీ వంటి అత్యున్నత పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వాళ్లు కూడా ఉన్నారు. కుంభమేళాలో నెలపాటు కల్పవాసం చేస్తే వందేళ్లు తపస్సు చేసిన ఫలం దక్కుతుందని పద్మపురాణం, మహాభారతం చెబుతున్నాయి. అందులో భాగంగా 21 రకాల నియమనిష్టలు పాటించాల్సి ఉంటుంది. రూ.1,296కే హెలికాప్టర్ రైడ్ కుంభమేళా విహంగవీక్షణానికి హెలికాప్టర్ సేవలను యూపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.1,296 చెల్లించి 7 నిమిషాల పాటు ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఆధ్యాత్మిక శోభను తిలకించవచ్చు. సంగమ ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా చేరే వెసులుబాటూ కల్పించారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటును నిర్దేశించారు. ప్రత్యేకమైన రోజు ఇది: మోదీ, యోగి భారత ఆధ్యాత్మిక వారసత్వాన్ని మహా కుంభమేళా ప్రతిబింబిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ‘‘భక్తి, విశ్వాసం, సంప్రదాయాల సంగమం జాతి, మతం, సరిహద్దులకు అతీతంగా ఇన్ని కోట్ల మందిని ఒక్కచోటికి చేర్చింది. భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది ప్రత్యేకమైన రోజు. పవిత్ర స్నానాలు ఆచరించి, దైవాశీస్సులు పొందేందుకు ఇంతమంది రావడం హర్షణీయం’’ అంటూ మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆయన త్వరలో కుంభమేళాలో పాల్గొననున్నారు. మేళా ప్రాంతంలో భక్తులు మోదీ, యోగి కటౌట్ల వద్ద భారీగా ఫొటోలు దిగుతుండటం విశేషం.అద్భుతం: విదేశీ భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్న వైనంకుంభమేళాకు విదేశీయులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. వారిలో పలువురు ఆసక్తి, జిజ్ఞాస కొద్దీ వచ్చివారు కాగా చాలామంది పూర్తిస్థాయిలో సన్యాసులుగా మారి మోక్షమార్గం పట్టినవాళ్లు కూడా ఉండటం విశేషం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని అర్థమైన మీదట మోక్షారి్థగా మారానని విదేశీ సన్యాసి బాబా మోక్షపురి చెప్పుకొచ్చాడు. అమెరికాకు చెందిన ఆయన పూర్వాశ్రమ నామం మైకేల్. సైన్యంలో పని చేశాడు. తర్వాత కొన్నేళ్ల క్రితం జునా అఖాడాలో చేరి సన్యాసం స్వీకరించాడు. ‘‘నాకిది తొలి కుంభమేళా. అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రకంపనలతో పరవశించిపోతున్నా’’ అంటూ హర్షం వెలిబుచ్చాడు. రొమారియో (బ్రెజిల్), జూలీ (స్పెయిన్) తదితర విదేశీయులు కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చారు. కుంభమేళాలో పాల్గొనే మొత్తం భక్తుల సంఖ్యే ప్రపంచంలో సగం దేశాల జనాభా కంటే కూడా ఎక్కువని తెలిసి తెగ ఆశ్చర్యపోయినట్టు జూలీ చెప్పుకొచ్చింది. ‘‘అంతటి వేడుక ఎలా జరుగుతుందన్నది నా ఊహకు కూడా అందలేదు. అందుకే ప్రత్యక్షంగా చూసి తీరాలని వచ్చా’’ అని వివరించంది. ప్రత్యేక ఆకర్షణగా స్టీవ్ జాబ్స్ భార్యఆపిల్ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె శనివారం వారణాసిలో విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం హైందవేతరులు విశ్వనాథ లింగాన్ని తాకేందుకు వీల్లేదు. దాంతో ఆమె తలపై దుపట్టా ధరించి గర్భాలయం వెలుపల నుంచే అభిõÙకంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం 40 మంది బృందంతో కలిసి శనివారం రాత్రి కుంభ్నగర్ చేరుకున్నారు. నిరంజనీ అఖాడాకు చెందిన చెందిన స్వామి కైలాసానంద గిరి ఆశ్రమంలో బస చేశారు. పసుపు రంగు సల్వార్, చేతిలో రక్షసూత్రం, మెడలో రుద్రాక్ష మాలతో నిరాడంబరంగా సన్యాసి వేషధారణలో కనిపించారు. సంప్రదాయ మట్టి కప్పులో వేడివేడి మసాలా టీ ఆస్వాదించారు. ఆమె గురువారం దాకా కుంభమేళాలో పాలుపంచుకుంటారు. భారతీయ సంప్రదాయాలు, ఆధ్యాత్మికత అంటే లారెన్కు అపారమైన గౌరవమని స్వామి కైలాసానంద గిరి చెప్పారు. ఆమెకు కమలగా నామకరణం చేసినట్టు వివరించారు.ఇది కూడా చదవండి: Maha Kumbh: పుణ్యస్నానాలు ప్రారంభం -
పుష్కర ఒడిలో.. గోదారమ్మ గుడిలో..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆ అమ్మ నడయాడే నేలంతా సిరుల ధామం.. అణువణు వునా వేదనాదం.. సాహితీ సారస్వత సుమాల హారం.. ఆ తల్లి గుడికెళ్లి గుప్పెడు పసుపు.. కుంకుమతో అర్చిం చేందుకు తరుణీ మణులంతా తహతహలాడారు. దివంగతులైన పెద్దలకు పుణ్యగతులు సంప్రాప్తింప చేసేందుకు మగ మహారాజులంతా జలదేవత చెంతన పిండ ప్రదానాలు చేసి తర్పణలిచ్చారు. జనమంతా గోదారమ్మ గుడిలో తీర్థ విధులు నిర్వర్తించి తరించారు. అంత్య పుష్కరాల వేళ పుణ్యస్నానం ఆచరించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. కొవ్వూరు, నరసాపురం పట్టణాలు పుష్కర యాత్రికులతో కిటకిటలాడాయి. గోదావరి అంత్య పుష్కరాలకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. రెండో రోజైన సోమవారం మాసశివరాత్రి కావడంతో జిల్లాలోని స్నానఘట్టాలన్నీ కిటకిటలాడాయి. సుమారు 80వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నరసాపురంలో 10,436 మంది, ఆచంటలో 3,210 మంది, యలమంచిలిలో 5,020 మంది స్నానాలు చేయగా, కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని ఘాట్లలో 50,725 మంది స్నానాలు ఆచరించినట్టు అధికారులు లెక్కగట్టారు. ఒక్క కొవ్వూరులోనే 25 వేల మంది స్నానాలు చేయగా, పెనుగొండలో 10,800 మంది, నిడదవోలులో 2,225 మంది, పెరవలి మండలంలో 12,200 మంది భక్తులు స్నానాలు ఆచరించినట్టు అధికారిక అంచనా. పోలవరం, పట్టిసీమ ఇతర ఘాట్లలో 4వేల మంది వరకూ పుణ్యస్నానాలు చేశారు. కొవ్వూరు, సిద్ధాంతం, నరసాపురంలలో భక్తుల రాకతో కోలాహలం నెలకొంది. తొలి రోజుతో పోలిస్తే రెండోరోజు భక్తుల తాకిడి పెరిగింది. మంగళవారం రాష్ట్ర బంద్ ఉండటంతో ఆ ప్రభావం పుష్కరాల స్నానాలపై ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి రోజున నరసాపురంలో వలంధరరేవు ఘాట్కే భక్తులు పరిమితం కాగా, రెండో రోజున అమరేశ్వరఘాట్, కొండాలమ్మ ఘాట్ వద్ద కూడా స్నానాలు చేశారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం, నరసాపురం వలంధర రేవులో సోమవారం ఉదయం నుంచి 12 గంటల వరకూ రద్దీ కొనసాగింది. ఆ తరువాత జనం పలుచపడ్డారు. వలంధరరేవులో రెండో రోజున జల్లు స్నానం అందుబాటులోకి వచ్చింది. కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. మొదటిరోజు హడావుడి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు రెండో రోజున పత్తాలేకుండా పోయారు. ఘాట్లవద్ద నియమించిన అధికారులు, సిబ్బంది తప్పిస్తే.. మిగిలిన వారెవరూ పరిశీలనకు రాలేదు. రానున్న రోజుల్లో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.