Hyderabad UT
-
కావూరి మూడు షరతులు
-
పదేళ్లపాటు హైదరాబాద్ యూటీ చేయాలి: కావూరి
తెలంగాణ బిల్లుకు సవరణలు చేస్తేనే తాము ఆమోదిస్తామని, లేని పక్షంలో మళ్లీ వెల్లోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు అన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలతో కూడిన రాయల తెలంగాణను ఏర్పాటుచేయాలని, భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో కలపాలని ఆయన డిమాండు చేశారు. కేంద్ర సంఘటిత నిధి నుంచి సీమాంధ్రలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, హైదరాబాద్ నగరాన్ని పది సంవత్సరాల పాటు కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని, హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంలో సీమాంధ్రకు కూడా భాగం ఇవ్వాలని కావూరి అడిగారు. ఈ సవరణలకు అంగీకరించని పక్షంలో తాము మరింతగా ఆందోళన చేయడం ఖాయమని ఆయన చెప్పారు. -
తెలంగాణ బిల్లు ఆమోదం పొందే సమస్యే లేదు: కావూరి
తెలంగాణ బిల్లు ఈ సమావేశాల్లో ఆమోదం పొందే సమస్యే లేదని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు. అందుకు తమ వ్యూహాలు తమకున్నాయని, తమ అస్త్రాలు, ఎత్తుగడలు అన్నీ సిద్ధంగానే ఉన్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్ ను యూటీ చేయకపోతే కేంద్ర మంత్రివర్గ సమావేశం నుంచి వాకౌట్ చేస్తానని కావూరి అన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయకపోతే ఇక సీమాంధ్రులకు ఏరకంగా ఉపయోగం ఉంటుందని ఆయన మండిపడ్డారు. అయితే హైదరాబాద్ నగరాన్ని నేరుగా యూటీ చేయకుండా, యూటీకి ఉండే లక్షణాలన్నీ దానికి కల్పిస్తామని జీవోఎం అంటే, అలా చేస్తే ఉపయోగం ఏమీ ఉండదని కావూరి వాదించారు. -
శాశ్వత యూటీగా హైదరాబాద్
సోనియాకు చిరంజీవి వినతి రాజీనామా చేయాలన్న అశోక్ బాబుపై ఆగ్రహం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో తాము ఇప్పటికే పరీక్ష రాశామని, అందులో పాసా, ఫెయిలా అనేది త్వరలోనే తెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మంత్రి చిరంజీవి శనివారం వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో కృషిచేశామని, మంత్రి పదవులను కూడా త్యజించామని చెప్పారు. రాష్ట్ర విభ జన ప్రక్రియ వేగం పుంజుకున్న నేపథ్యంలో సీమాంధ్రుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరేందుకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా అది సాధ్యపడని విషయం తెలిసిందే. దాంతో శనివారం మరోమారు సీమాంధ్ర కేంద్ర మంత్రులు సోనియా అపాయింట్మెంట్ కోరారు. కేంద్ర మంత్రులను బృందంగా కలిసేందుకు నిరాకరించిన సోనియా, చిరంజీవికి మాత్రం ఐదు నిమిషాల సమయం ఇచ్చారు. ఈ సమయంలోనే విభజన విషయంలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను చిరంజీవి సోనియా ముందుంచారు. విభజనకు తామంతా అంగీకరిస్తున్నామని, హైదరాబాద్ను అసెంబ్లీతో కూడిన శాశ్వత యూటీ చేయాలని కోరారు. అలా వీలుకాని పక్షంలో సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకైనా హైదరాబాద్ను యూటీ చేయాలని కోరారు. చిరంజీవి చెప్పిన అన్ని అంశాలను విన్న సోనియా, పరిశీలిస్తామని చెప్పి పంపినట్లుగా తెలిసింది. ఈ భేటీ అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు. విభజన అనివార్యమని తెలుస్తున్న పరిస్థితుల్లో సీమాంధ్రుల భద్రత దృష్ట్యా హైదరాబాద్లోని హెచ్ఎండీఏ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయడం మంచిదని సోనియాకు విన్నవించానన్నారు. భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని, 1956 పూర్వస్థితినే కొనసాగించాలని కోరానన్నారు. రాయల తెలంగాణకు తాను వ్యతిరేకమూ కాదు, అనుకూలమూ కాదని చిరంజీవి స్పష్టం చేశారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబుపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా పదవులకు రాజీనామాలు చేశామని, అశోక్బాబు ఉద్యోగానికి రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. -
జైపాల్రెడ్డితో జేడీశీలం భేటీ
-
పరిమిత ఆంక్షలు.. పదేళ్లు ఉమ్మడి
-
పరిమిత ఆంక్షలు.. పదేళ్లు ఉమ్మడి
హైదరాబాద్ చుట్టూ తుది కసరత్తు.. కొలిక్కి వచ్చిన జీవోఎం నివేదిక హైదరాబాద్పై పరిమిత ఆంక్షలతో తెలంగాణ ఏర్పాటుకు సూచన సీమాంధ్ర కేంద్రమంత్రుల యూటీ ప్రతిపాదనకు తిరస్కారం శాంతిభద్రతలు, రెవెన్యూ, భూపరిపాలన అధికారాలు కేంద్రానికి ఆర్టికల్ 258(ఎ) కింద గవర్నర్ లేదా కమిటీకి ప్రత్యేకాధికారాలు ఆర్టికల్ 371(డి), భద్రాచలం జోలికి వెళ్లకుండానే విభజన? ఢిల్లీలో వేగంగా పరిణామాలు.. రోజంతా జీవోఎం కీలక భేటీలు నేడు మళ్లీ భేటీ.. ఇదే ఆఖరి సమావేశమన్న జైరాంరమేశ్ ఇదే తుది సమావేశమని చెప్పలేమని వ్యాఖ్యానించిన షిండే రాష్ట్రపతి ప్రణబ్తో సోనియా భేటీ.. న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రివర్గ బృందం (జీవోఎం) నివేదిక ఒక కొలిక్కి వచ్చింది. మంగళవారం హస్తినలో సాగిన జీవోఎం భేటీలు మొత్తం హైదరాబాద్ కేంద్ర బిందువుగా సాగాయి. ఢిల్లీలో చకచకా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా చేయాలన్న ప్రతిపాదన పూర్తిగా వెనక్కి వెళ్లింది. విభజన ప్రక్రియలో రాజ్యాంగాన్ని సవరించాలన్న సంకట స్థితిని తప్పించుకోవడానికి అంతిమంగా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయనవసరం లేకుండానే కొన్ని షరతులతో ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలలో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తీసుకున్న మౌలిక నిర్ణయానికే కట్టుబడాలన్నది కేంద్ర ప్రభుత్వ తాజా యోచనగా తెలుస్తోంది. హైదరాబాద్ను యూటీ చేయకపోయినా మెజారిటీ సీమాంధ్రులు కోరుతున్నట్టుగా కొంత కాలం పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకే సమాయత్తమవుతున్నారు. ఉమ్మడి రాజధానిని నిర్ణీత కాలం వరకే అనే భరోసా తెలంగాణ వారికీ, ఆ సమయంలో శాంతి భద్రతలకు పూచీ ఇచ్చే నమ్మకాన్ని సీమాంధ్రులకు కలిగించే ఏర్పాట్ల కోసం కసరత్తు చేస్తున్నారు. గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు తదితరులు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనల పట్ల సీమాంధ్రులు తరచూ ఆందోళన, అభద్రత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మధ్యేమార్గంగా శాంతిభద్రతలు, రెవెన్యూ, భూపరిపాలన అంశాల పర్యవేక్షణ బాధ్యతను గవర్నర్ లేదా కేంద్ర అథారిటీ పరిధిలో ఉంచేందుకు కేంద్రం సిద్ధమైంది. అందుకోసం రాజ్యాంగంలోని 258 (ఎ) అధికరణను అనుసరించి ఎలాంటి రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా ఆయా అంశాలకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలను కేంద్రం పర్యవేక్షించేలా ఏర్పాటు చేయాలని జీవోఎం బిల్లు ముసాయిదాలో ప్రతిపాదించింది. విభజన అనంతరం తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలతో పాటు కేంద్ర ప్రతినిధితో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసేలా ఇరు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కూడా అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విషయంలో తెలంగాణ వాదుల నుంచి వ్యక్తమవుతున్న సందేహాలను నివత్తి చేసేందుకు నిర్దిష్ట కాల పరిమితి (సన్సెట్) అంశాన్ని తెలంగాణ బిల్లులో పొందుపరచారని సమాచారం. వివాదాస్పదమైన 371 (డి) అధికరణకు రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే రాష్ట్రాన్ని విభజించవచ్చని నివేదికలో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సవరించే సంకట స్థితే కాకుండా నియోజకవర్గ పునర్విభజన వంటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తకుండా చూసే క్రమంలో భద్రాచలం వంటి వివాదాస్పద అంశాల జోలికి జీవోఎం వెళ్లలేదు. నీరు, వనరుల పంపిణీ, విద్య, ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై జీవోఎం ఇప్పటికే తుదినిర్ణయానికి రాగా మంగళవారం వేగంగా సాగిన సమావేశాలు, సమాలోచనలన్నీ హైదరాబాద్ అంశం చుట్టే తిరిగాయి. అంతా మేడం కనుసన్నల్లోనే... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాలకు అనుగుణంగానే జీవోఎం సభ్యులు నివేదికలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జీవోఎం సారథి, కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండే, జీవోఎం సభ్యుడు, మరో కేంద్రమంత్రి జైరాంరమేశ్లు నివేదిక రూపకల్పనపై కసరత్తు చేశారు. హైదరాబాద్ అంశంపైనే రోజంతా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం జీవోఎం మరో సభ్యుడు, రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని నివాసంలోనూ జీవోఎం సభ్యులు సమావేశమై దీనిపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు బుధవారం ఉదయం సీమాంధ్ర కేంద్ర మంత్రులు జైరాంరమేశ్ను కలిసి హైదరాబాద్ అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. తరువాత జీవోఎం సభ్యులు నార్త్బ్లాక్లో సమావేశమై నివేదికను ఖరారు చేయనున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. బుధవారం జరగబోయే జీవోఎం సమావేశమే చివరిదని, నివేదికను ఖరారు చేస్తామని జైరాంరమేశ్ మంగళవారం ఢిల్లీలో మీడియాతో పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు జీవోఎం సమావేశం ఉంటుందని చెప్పారు. ఎవరినీ బాధపెట్టని పరిష్కారం వెదుకుతున్నాం: షిండే అయితే.. జీవోఎం సారథి షిండే అందుకు విరుద్ధంగా పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘‘తెలంగాణపై జీవోఎం సమావేశం కొనసాగుతుంది. రేపు (బుధవారం) కూడా జరుగుతుంది. రేపటి సమావేశమే చివరిదని చెప్పలేం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటపుడు ఏ ప్రాంతం వారినీ బాధపెట్టకుండే ఉండే పరిష్కార మార్గాలను వెదుకుతున్నాం’’ అని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా జీవోఎం నివేదికను కేంద్ర కేబినెట్కు సమర్పిస్తామని చెప్పారు. అయితే.. షిండే వ్యాఖ్యల నేపథ్యంలో జీవోఎం నివేదిక ఈ నెల 28వ తేదీ (గురువారం) సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందా? లేదా? అన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. దీనిపై జైరాం సహా జీవోఎం సభ్యులెవరూ స్పష్టత ఇవ్వటం లేదు. ఇప్పటివరకైతే అలాంటి సంకేతాలు మాత్రం రాలేదని, కేబినెట్ ముందుకు ఎప్పడు నివేదికను పంపాలన్నది పూర్తిగా సోనియాగాంధీ ఆదేశాలపైనే ఆధారపడి ఉందని, నివేదిక మాత్రం దాదాపుగా ఖరారైందని కాంగ్రెస్ అధిష్టానం వర్గాలు చెప్తున్నాయి. షిండే, జైరాంలతో సిబల్ భేటీ... మరోవైపు మంగళవారం పలువురు కేంద్ర మంత్రులు జీవోఎం సభ్యులు షిండే, జైరాంరమేశ్లను కలిసి రాష్ట్ర విభజన విషయంలో తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. తొలుత న్యాయశాఖ మంత్రి కపిల్సిబల్.. షిండేతో కొద్దిసేపు సమావేశమై వెళ్లారు. ఆర్టికల్ 371డీ, హైదరాబాద్ యూటీ, సీమాంధ్రలో భద్రాచలం విలీనం వంటి అంశాలపై న్యాయపరంగా తలెత్తిన అంశాలపై పలువురు న్యాయనిపుణుల అభిప్రాయాలతో క్రోడీకరించిన నోట్ను జీవోఎం సభ్యులకు సిబల్ అందజేసినట్లు తెలిసింది. ఆ తరువాత కొద్దిసేపటికి జాతీయ విపత్తు నివారణా సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం షిండేను కలిసింది. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని కోరుతూ వినతిపత్రం అందజేసింది. ‘కర్నూలు రాజధాని’ కోరిన కోట్ల... అనంతరం రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి అక్కడికి వచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కర్నూలును సీమాంధ్ర రాజధానిగా చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. అది సాధ్యం కాని పక్షంలో కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని కోరారు. ఈ రెండు జిల్లాల్ల గల సుమారు 2,300 గ్రామాలకు గాను దాదాపు 1700 గ్రామ పంచాయతీలు రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని కోరుతూ తీర్మానం చేశాయని పేర్కొంటూ వాటి వివరాలను జీవోఎం సభ్యులకు కోట్ల అందజేసినట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. జీవోఎం సభ్యులు తమను అడుగడుగునా అవమానిస్తున్నందున ఇకపై తాను వారిని కలిసే ప్రసక్తే లేదని ప్రకటించిన కోట్ల రెండు రోజుల్లోనే మనసు మార్చుకుని అక్కడికి రావడం చర్చనీయాంశమైంది. పరిమిత ఆంక్షలకు జైపాల్ ఓకే! ఆ తరువాత కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి జీవోఎం సభ్యులు షిండే, జైరాంరమేశ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్పైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ను యూటీ చేయకుండా సీమాంధ్రులకు రక్షణ కల్పించే విషయంపై జీవోఎం సభ్యులతో మాట్లాడాలంటూ సోనియాగాంధీ చేసిన సూచనల మేరకే జైపాల్రెడ్డి వారితో సమావేశమైనట్లు చెప్తున్నారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో హోంశాఖ ఉన్నతాధికారులు కూడా హాజరై ఆయన అభిప్రాయాలను నోట్ చేసుకున్నట్లు తెలిసింది. ఆ తరువాత జైపాల్రెడ్డి నివాసానికి వెళ్లిన జైరాంరమేశ్ ఆయనతో కొద్దిసేపు సమావేశమై వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆంటోని నివాసంలో జీవోఎం సభ్యులు వీరప్పమొయిలీ, నారాయణస్వామి కొద్దిసేపు సమావేశమై హైదరాబాద్ అంశంపై చర్చించినట్లు తెలిసింది. అనంతరం జైపాల్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ అంశంపై మాట్లాడినట్లు చెప్పారు. ‘‘హైదరాబాద్లో సీమాంధ్రుల కోసం పరిమిత కాలానికి రక్షణలను ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగ, న్యాయపరంగా ఉన్న చిక్కులపై చర్చించాం. తెలంగాణ వాదిగా వాటిపై నా అభిప్రాయాలను వివరించాను. నా వివరణ తరువాత జీవోఎం ఏ నిర్ణయం తీసుకుంటుందో అవగాహన లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగనున్న హైదరాబాద్లో సీమాంధ్రుల రక్షణ కోసం ఊరట కలిగించే చర్యలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ తీర్మానంలో ఉందన్నారు. అలాంటిదేమీ అవసరం లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వమే ఈ విషయంలో రాజ్యాంగపరమైన విధులను నిర్వర్తిస్తుందనే నమ్మకం ఉందన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సీమాంధ్రులకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవటానికి తనకేమీ అభ్యంతరం లేదన్నారు. హైదరాబాద్ను యూటీ చేయడానికి తనతో సహా తెలంగాణ ప్రజలు, పార్టీలు, నాయకులెవరూ ఒప్పుకోరని స్పష్టంచేశారు. రాజ్యాంగంలోని 258 (ఎ) విషయాల పై తానిప్పుడు మాట్లాడబోనన్నారు. అయితే యూటీ లేకుండా, రాజ్యాంగ సవరణ లేకుండానే హైదరాబాద్లో సీమాంధ్రుల రక్షణ కోసం కొన్ని చర్యలు తీసుకోవచ్చని జీవోఎం సభ్యులకు చెప్పానని.. వాటిని మీడియాకు వెల్లడించలేనని తెలిపారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి ఎప్పుడు వెళుతుందో చెప్పలేనన్నారు. అయితే డిసెంబర్ 20 లోపు మాత్రం మొత్తం తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందనే విశ్వాసం తనకు ఉందన్నారు. తెలంగాణ నాయకులను సంప్రదించిన తరువాతే రాయల తెలంగాణ అంశంపై తాను మాట్లాడతానని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. యూటీ చేస్తే చాలు..: ప్రధానికి శీలం వినతి సీమాంధ్ర రాష్ట్రంలో కొత్త రాజధానిని నిర్మించుకునేంత వరకు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే చాలని కేంద్రమంత్రి జె.డిశీలం మంగళవారం ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కోరారు. ఈ విషయంలో తెలంగాణ నేతలను ఒప్పించే బాధ్యతను తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం ప్రధానిని కలిసిన ఆయన ఈ మేరకు ఓ వినతి పత్రం అందజేశారు. ఆ తరువాత ఆర్థికమంత్రి చిదంబరంతో శీలం సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని తాము ఒప్పుకుంటున్నామన్నారు. అయితే సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటయ్యే వరకు మాత్రమే హైదరాబాద్ను యూటీ చేయాలని కోరుతున్నామని, ఈ విషయంలో తెలంగాణ నేతలు భీష్మించుకోకుండా ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరించాలే తప్ప నిర్దయగా ఉండొద్దని సూచించారు. తెలంగాణ వాళ్లు అడిగిందల్లా ఇవ్వాలని తాము కోరుతున్నామని, తమకు మాత్రం కొద్ది కాలం హైదరాబాద్ను యూటీ చేస్తే చాలని అన్నారు. తద్వారా 90 శాతం మంది ప్రజలను సంతోషపడతారని చెప్పారు. కాదూ కూడదని తెలంగాణ నేతలు భీష్మించుకుంటే జరగబోయే పర్యవసానాలకు తాము బాధ్యులం కాదని వ్యాఖ్యానించారు. సోనియాతో కృపారాణి భేటీ మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి సమావేశమైనట్లు తెలిసింది. కోస్తాలో వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సోనియాను కోరిన కృపారాణి.. రాష్ట్ర విభజన అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ హైదరాబాద్ను యూటీ చేసే అంశాన్ని పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. అయితే సోనియాగాంధీ మాత్రం ఆ ప్రతిపాదన సాధ్యం కాదని, సీడబ్ల్యూసీ తీర్మానం పరిధిలోనే రాష్ట్ర విభజన జరుగుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులను ఈ విషయంలో ఒప్పించాల్సి బాధ్యత ఆ ప్రాంత కేంద్ర మంత్రులదేననని సూచించినట్లు తెలిసింది. రాష్ట్రపతితో సోనియా భేటీ ఇదిలవుంటే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీని కలుసుకున్నారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో సోనియా రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మంత్రివర్గ భేటీ తర్వాత తుది రూపం సంతరించుకునే విభజన బిల్లు ముసాయిదా అంశాన్ని ఆమె రాష్ట్రపతి దృష్టికి తెచ్చినట్టు సమాచారం. -
రెండేళ్లు హైదరాబాద్ యూటీ?
-
రెండేళ్లు హైదరాబాద్ యూటీ?
సాధ్యాసాధ్యాలపై సోనియా ఆరా హైదరాబాద్పై జీవోఎం సభ్యులతో మేడమ్ అత్యవసర సమావేశం అలాగైతే సీమాంధ్ర ఎమ్మెల్యేలు సహకరిస్తారన్న కేంద్ర మంత్రులు 28 నాటి కేబినెట్ భేటీకల్లా తెలంగాణ బిల్లు సిద్ధం చేయాలని ఆదేశం యూటీకి తాను సుముఖమేనన్న కిరణ్! విభజనకు సహకరిస్తాం.. సీఎంనూ ఒప్పిస్తాం: శీలం రేపు సాయంత్రం 4.30కు భేటీ కానున్న జీవోఎం న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ను తాత్కాలిక కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధినంతటినీ రెండేళ్ల పాటు యూటీ చేసే విషయంపై తలెత్తే ఇబ్బందులేమిటో తెలుసుకుని, వాటిని అధిగమించేందుకు తగిన ప్రతిపాదనలు చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచించారు. సోమవారం సాయంత్రం జీవోఎం సభ్యులతో ఆమె అత్యవసరంగా సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లు, నివేదికలోని అంశాలపై గంటకు పైగా చర్చించారు. జీవోఎం సారథి సుశీల్కుమార్ షిండే, సభ్యులు పి.చిదంబరం, ఏకే ఆంటోనీ, జైరాం రమేశ్లతో పాటు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ కూడా భేటీలో పాల్గొన్నారు. ఏఐసీసీ వర్గాల సమాచారం మేరకు.. సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రతిపాదనల అమలు సాధ్యాసాధ్యాలపై తీవ్రంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు పూర్తిగా సహక రిస్తామని, అయితే హైదరాబాద్లోని సీమాంధ్ర ప్రజల భద్రత కోసం దాన్ని యూటీ చేయాలని ఇటీవల సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇటీవల జీవోఎం సభ్యులతోపాటు హైకమాండ్ పెద్దలను విడివిడిగా కలిసి ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. సీమాంధ్రలో వేగంగా కొత్త రాజధాని నిర్మించుకోవాలంటే కనీసం రెండేళ్లయినా పడుతుందని, అప్పటి వరకైనా హైదరాబాద్ను యూటీ చేస్తే చాల ని కోరారు. తమ ప్రతిపాదనకు అంగీకరిస్తే అసెంబ్లీలో విభజన బిల్లుకు ఇబ్బంది లేకుండా ఉండేలా సీమాంధ్ర ఎమ్మెల్యేలను ఒప్పిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇదే విషయంపై తాము ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితోనూ మాట్లాడామని, ఆయన కూడా సానుకూలంగా ఉన్నారని జీవోఎం సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం ఈ విషయాన్ని సోనియా దృష్టికి కూడా తీసుకెళ్లారు. యూటీ సాధ్యాసాధ్యాలను పరిశీలించడమే గాక విభజనపై ఆంటోనీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలని, నవంబర్ 28న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశానికి నివేదికను సమర్పించాలని సోనియా ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. దీంతో జీవోఎం సభ్యులంతా బుధవారం సాయంత్రం 4.30 గంటలకు నార్త్ బ్లాక్లో సమావేశమై హైదరాబాద్ యూటీ, ఆంటోనీ నివేదిక సిఫార్సుల అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించి తమ నివేదికను ఖరారు చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర విభజనను బయటికి మాత్రం వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, లోలోన మాత్రం ఆ విషయంలో అధిష్టానానికి తన పూర్తి సహకారాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే విభజనకు తనకెలాంటి అభ్యంతరమూ లేదని ఆయన స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. సీమాంధ్రకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ యూటీ ప్రతిపాదన తెచ్చినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే రాష్ర్ట విభజనకు సహకరిస్తామని శీలం సోమవారం సాయంత్రం కొన్ని టీవీ చానళ్లతో మాట్లాడుతూ తెలిపారు. ‘‘సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి కనీసం రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. అందుకే అప్పటిదాకా హైదరాబాద్ను యూటీ చేయాలని కోరుతున్నాం. మా ప్రతిపాదనకు అంగీకరిస్తే విభజన బిల్లుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలందరినీ ఒప్పిస్తాం’’ అని ఆయన తెలిపారు. అంటే కిరణ్ను కూడా విభజనకు ఒప్పిస్తారా అని ప్రశ్నించగా, అందరిలో సీఎం కూడా ఒకరని బదులిచ్చారు. కేబినెట్లో చర్చకు రాని తెలంగాణ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నివాసంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ అంశం చర్చకు రాలేదని తెలుస్తోంది. సుమారు 45 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో ఆర్థిక, వాణిజ్య వ్యవహారాలపైనే చర్చ జరిగినట్టు సమాచారం. నేడు షిండేతో మర్రి బృందం భేటీ విభజన నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని డిమాండ్ చేస్తున్న టీ కాంగ్రెస్ నేతలు మంగళవారం షిండేను కలవనున్నారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో నేతల బృందం ఉదయం 10.30కు షిండేను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేయనుంది. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను ప్రస్తుతమున్న 119 నుంచి 153కు పెంచాలని అందులో పేర్కొనున్నారు. -
హైదరాబాద్ను యూటీ చేస్తే.. తెలంగాణకు సహకరిస్తాం: జేడీ శీలం
హైదరాబాద్ నగరాన్ని కొన్ని సంవత్సరాలైనా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, అలాగైతే తెలంగాణకు తాము సహకరిస్తామని కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. అలాగే ఈ ప్రతిపాదనకు అందరినీ ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తామన్నారు. కనీసం సీమాంధ్ర రాజధాని ఏర్పడేంతవరకు హైదరాబాద్లో తమకు అవకాశం ఇస్తే చాలని శీలం చెప్పారు. రాయల తెలంగాణపై తమకు సమాచారం లేదని ఆయన న్యూఢిల్లీలో సోమవారం నాడు 'సాక్షి'తో మాట్లాడుతూ అన్నారు. -
కాంగ్రెస్పై ప్రజలు కోపంగా ఉన్నారు: జెడి శీలం
గుంటూరు: కాంగ్రెస్పై ప్రజలు కోపంగా ఉన్నారని కేంద్ర మంత్రి జేడీ శీలం చెప్పారు. అయితే ఎప్పటికైనా కాంగ్రెస్యే ప్రజలకు న్యాయం చేస్తుందన్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సిందేనని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుతోపాటు జేడీ శీలం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ను యూటీ చేయకుంటే రాష్ట్ర విభజనకు అంగీకరించేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకి స్పష్టం చేసినట్లు కూడా ఆయన తెలిపారు. -
'హైదరాబాద్ను యూటీ చేయాల్సిందే'
-
హైదరాబాద్ను యూటీ చేయాల్సిందే: సీమాంధ్ర మంత్రులు
ఐదు కోట్ల మంది సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందన్న నమ్మకం తమకు కుదిరిందని కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. హైదరాబాద్, నీళ్లు, ఉద్యోగాలు, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై తాము జీవోఎంతో చర్చించామని ఆయన చెప్పారు. అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే జరిగిందని, అందువల్ల హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాండిచ్చేరి తరహాలోనే హైదరాబాద్ పాలన ఉండాలన్నారు. సీమాంధ్రలోని ప్రతి విద్యార్థి హైదరాబాద్ కావాలంటున్నాడని చెప్పారు. ఉమ్మడి రాజధాని హెచ్ఎండీఏ పరిధి వరకు ఉండాలని కోరామన్నారు. విభజన వల్ల వచ్చే సమస్యలను తెలిపామని, సమస్యలు పరిష్కరించాకే ముందుకెళ్లాలన్నామని అన్నారు. హైదరాబాద్లో మరో నగరం అభివృద్ధి చెందేవరకు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని చెప్పినట్లు తెలిపారు. విభజన అనివార్యమైతే సీమాంధ్రుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు. తాము మూడు నెలల నుంచి చెబుతున్నామని, ఇప్పుడు కూడా రాయలసీమ నీటి సమస్యను ప్రస్తావించామని అన్నారు. హైదరాబాద్లో 30 లక్షల మంది సీమాంధ్రులు నివసిస్తున్నారని, వాళ్ల ప్రయోజనాల మాటేమిటని తాము కేంద్ర మంత్రుల బృందం సమావేశంలో ప్రస్తావించామన్నారు. జీవోఎంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. అనంతరం బయటకు వచ్చిన మంత్రులు పళ్లంరాజు, జేడీ శీలం తదితరులు విలేకరులతో మాట్లాడారు. అయితే.. శీలం మాట్లాడుతుండగానే మరో ముగ్గురు కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, కిల్లి కృపారాణి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పళ్లంరాజు కూడా మీడియాతో మాట్లాడలేదు. -
కేంద్రం చేతిలో అధికారం ఉంటే మేము ఏం చేయాలి?
హైదరాబాద్ : హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే ఒప్పుకునేది లేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్పై ఏది పడితే అలా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. కేంద్రపాలిత ప్రాంతమంటూ కొందరు చేస్తున్న వాదనలపై దానం మండిపడ్డారు. యూటీ అంటే అధికారాలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్తాయన్నారు. కేంద్రం చేతిలో అధికారం ఉంటే.... ప్రజాప్రతినిధులుగా తాము ఏమి చేయాలని (చీపుళ్లు పట్టుకోవాలా) అని ఎద్దేవా చేశారు. కీలక అధికారాలు కేంద్రం పరిధిలో ఉంటే తమకు సమ్మతం కాదన్నారు. హైదరాబాద్ యూటీ అంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీఎల్పీలో తీర్మానం చేశామని దానం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాడు స్పీకర్గా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్ను యూటీ చేస్తే ఒప్పుకోం: ఎంఐఎం
-
హైదరాబాద్ను యూటీ చేస్తే ఒప్పుకోం: ఎంఐఎం
హైదరాబాద్ : హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తేల్చి చెప్పారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఒకవేళ విభజన అనివార్యమైతే రాయల తెలంగాణకే తాము మొగ్గు చూపుతామన్నారు. అసదుద్దీన్ కేంద్రపాలితం ఆలోచనే కాకుండా.. ఉమ్మడి రాజధానిపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్పై కేంద్రం పెత్తనాన్ని సహించేది లేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు. షరతులు లేని రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్నారు. విభజనపై ఏర్పాటు అయిన జీవోఎంకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ....మజ్లీస్ 46 పేజీల నివేదిక పంపింది. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు వెంటనే కొత్త రాజధాని ఏర్పాటు సత్వర చర్యలు చేపట్టాలని ఎంఐఎం తన లేఖలో కోరింది. విడదీయాల్సి వస్తే రాయలసీమలోని నాలుగు జిల్లాలను కలిసి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆపార్టీ సూచించింది. -
హైదరాబాద్ యూటీ అంటే మరో ఉద్యమం: జానారెడ్డి
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారని చెబితే మరో ఉద్యమానికి దారితీసే అవకాశం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే విభజన జరుగుతుందని, ఎవరికీ ఏ వ్యక్తిగత అభిప్రాయాలున్నా కేంద్రాన్ని అధిగమించి ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇప్పటివరకు సామరస్యపూర్వక వాతావరణం ఉందని, ఎలాంటి కార్యక్రమాలైనా శాంతియుతంగా జరిగేలా చూసే బాధ్యత తమపై ఉందని జానారెడ్డి అన్నారు. ఇక తెలంగాణ ప్రాంతంలో ఉన్న ముస్లింలు కూడా హైదరాబాద్తో కూడిన తెలంగాణ కావాలనే కోరుకుంటున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు. తెలంగాణ ప్రాంతం 400 ఏళ్లుగా అభివృద్ధి చెందిందని, ఈ నగరాన్ని ఏ ఒక్కరూ అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు. -
హైదరాబాద్ యూటీ అంటే మరో ఉద్యమం: జానారెడ్డి
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారని చెబితే మరో ఉద్యమానికి దారితీసే అవకాశం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే విభజన జరుగుతుందని, ఎవరికీ ఏ వ్యక్తిగత అభిప్రాయాలున్నా కేంద్రాన్ని అధిగమించి ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇప్పటివరకు సామరస్యపూర్వక వాతావరణం ఉందని, ఎలాంటి కార్యక్రమాలైనా శాంతియుతంగా జరిగేలా చూసే బాధ్యత తమపై ఉందని జానారెడ్డి అన్నారు. ఇక తెలంగాణ ప్రాంతంలో ఉన్న ముస్లింలు కూడా హైదరాబాద్తో కూడిన తెలంగాణ కావాలనే కోరుకుంటున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు. తెలంగాణ ప్రాంతం 400 ఏళ్లుగా అభివృద్ధి చెందిందని, ఈ నగరాన్ని ఏ ఒక్కరూ అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు. -
ఎంఐఎంతో కలిసి ఉద్యమం:కెటిఆర్ హెచ్చరిక
ఢిల్లీ: హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసే ప్రతిపాదనను కేంద్రం తెస్తే ఎంఐఎంతో కలిసి ఉద్యమం చేస్తామని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు. కేంద్రపాలిత ప్రాంతం ప్రతిపాదనను తాము ఒప్పుకోం అని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం కాంగ్రెస్ పెద్దలందర్నీ కలుస్తాన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే సంబరం, లేదంటే సమరమేనని హెచ్చరించారు. తెలంగాణపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ భవన్కు త్వరలోనే టులెట్ బోర్డు పెట్టుకోవాలన్నారు. ఏపీఎన్జీవోల సభ అనుమతిపై డీజీపీ రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. -
చంద్రబాబు మంచి స్నేహితుడు: దిగ్విజయ్
-
చంద్రబాబు మంచి స్నేహితుడు: దిగ్విజయ్
చంద్రబాబు తనకు మంచి స్నేహితుడని, ఆయన కూడా తనను టార్గెట్ చేయడం సంతోషమేనని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశంపై మంగళవారం నాడు న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విభజనకు అన్ని పార్టీలూ సరేనన్న తర్వాత మాత్రమే తాము ముందుకెళ్లామని, ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నాయని ఆయన చెప్పారు. విభజన గురించి అన్ని అంశాలను ఆంటోనీ కమిటీ పరిశీలిస్తోందని, ఆంటోనీ కమిటీతో ఎవరైనా వచ్చి అన్ని అంశాలను చర్చించవచ్చని దిగ్విజయ్ తెలిపారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందంటూ వచ్చిన వార్తల గురించి ప్రస్తావించగా, దాని గురించి మాత్రం సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు.