independent inquiry
-
సీజేఐపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి
న్యూఢిల్లీ: తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లుగా భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(ఎస్సీఏఓఆర్ఏ) పేర్కొంది. సుప్రీంకోర్టు పూర్తి ధర్మాసనం ఎంపిక చేసిన కమిటీ ఆరోపణలపై దర్యాప్తు జరపాలంది. భారీ కుట్ర ఉంది... నిష్పాక్షిక దర్యాప్తుతో మాత్రమే సీజేఐపె వచ్చిన ఆరోపణలపై నిజాలు వెలుగుచూస్తాయని, న్యాయవ్యవస్థ స్వతంత్రత బలోపేతమవుతుందని సీనియర్ న్యాయవాది, ప్రముఖ న్యాయ నిపుణుడు రాకేశ్ ద్వివేది అభిప్రాయపడ్డారు. మాజీ ఉద్యోగిని ఒకరు సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం వెనుక భారీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో న్యాయస్థానం పూర్తి ధర్మాసనం నిర్ణయం తీసుకునేదాకా సీజేఐ విధులకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. సీజేఐ రాజీనామాకు కుట్ర సీజేఐతో రాజీనామా చేయించేందుకే లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారంటూ సుప్రీంకోర్టు న్యాయవాది ఉత్సవ్ సింగ్ బైన్స్ పేర్కొన్నారు. ఓ మాజీ మహిళా ఉద్యోగి తరఫున అజయ్ అనే వ్యక్తి తన వద్దకు వచ్చి సీజేఐకు వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయిస్తే రూ.కోటిన్నర ఇస్తానంటూ ఆశ చూపాడని బైన్స్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. -
కశ్మీర్లో స్వతంత్ర విచారణకు మద్దతు
ఐక్యరాజ్యసమితి: కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై స్వతంత్ర అంతర్జాతీయ విచారణకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ మద్దతు పలికారు. ఈ విషయంలో మానవ హక్కుల హైకమిషనర్ నిర్ణయాలు ఐరాస గొంతును ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు. స్వతంత్ర విచారణ జరపాలని ఐరాస మానవ హక్కుల విభాగం హైకమిషనర్ ప్రతిపాదించి ఓ నివేదిక రూపొందించారు. అయితే స్వతంత్ర విచారణ చేయాలన్న ప్రతిపాదనను భారత్ ఖండించింది. కాగా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కశ్మీర్లలో సాయుధులు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న హింస వల్ల పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అంతర్జాతీయ శాంతిభద్రతకు విఘాతం కలిగించే స్థాయి లేని అంశాలను కూడా ఆ నివేదికలో పేర్కొన్నారని భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
బిహార్ బుక్లెట్పై పాకిస్తాన్ బాలిక
పట్నా: బిహార్లో ‘స్వచ్ఛ్ జమయి, స్వస్థ్ జమయి ప్రచారానికి ముద్రించిన బుక్లెట్ కవర్పేజీపై పాకిస్తాన్ బాలిక చిత్రం ఉండటం విమర్శలకు దారితీసింది. ఐదేళ్ల ఆ బాలిక కుర్చీలో కూర్చుని పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని గీస్తున్నట్లు అందులో కనిపిస్తోంది. పాకిస్తాన్లో బాలికా విద్యపై అవగాహన పెంచేందుకు యూనిసెఫ్ ఆ ఫొటోను గతంలో వాడింది. పొరపాటున ఆ ఫొటో స్వచ్ఛ్ బుక్లెట్లోకి వచ్చిందని జముయి జిల్లా అధికారులు చెప్పారు. సుమారు 5 వేల బుక్లెట్లపై పాక్ బాలిక చిత్రం ముద్రితం కావడంపై బిహార్ సీఎం నితీశ్ స్వతంత్ర విచారణకు ఆదేశించారు. ఆ ప్రతులను జముయి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పంపిణీ చేశారు. -
లోయాది సహజ మరణమే
న్యూఢిల్లీ: సీబీఐ మాజీ న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతిపై స్వతంత్ర విచారణ కోరుతూ వచ్చిన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఆయనది సహాజ మరణమేననీ, న్యాయ వ్యవస్థను అపఖ్యాతి పాల్జేసేందుకే దురుద్దేశంతో ఈ పిటిషన్లను వేశారనీ, దీనిని తీవ్ర చర్యగా పరిగణిస్తున్నామని పేర్కొంది. లోయా మృతికి సంబంధించిన అన్ని పిటిషన్లపై విచారణ ఇక ఈ తీర్పుతో ముగిసినట్లేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ల త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్ల వెనుక రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలున్నాయనీ, న్యాయవ్యవస్థపై బురదజల్లాలనే దురుద్దేశంతోనే పిటిషన్లు వేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లోయా మృతికి దారితీసిన పరిస్థితులపై నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన వాంగ్మూలాలను అనుమానించడానికి కారణం లేదనీ, లోయాది సహాజ మరణమేనని రికార్డులను పరిశీలిస్తే స్పష్టమవుతోందని పేర్కొంది. సీనియర్ న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలైన దుష్యంత్ దవే, ఇందిరా జైసింగ్, ప్రశాంత్ భూషణ్ తదితరులు లోయా మృతిపై స్వతంత్ర విచారణ కోరుతూ పిటిషన్లు వేశారు.కోర్టుల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసేలా, న్యాయవ్యవస్థకు చెడ్డపేరు తెచ్చేలా వీరు ఈ పిటిషన్ల రూపంలో ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింది.‘వాణిజ్య వివాదాలను మార్కెట్లో పరిష్కరించుకోవాలి. రాజకీయ విభేదాలను ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. చట్టాన్ని పరిరక్షించడం న్యాయస్థానాల బాధ్యత’ అని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు. జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లు మహారాష్ట్రకు చెందిన వారు కాబట్టి లోయా మృతికేసును బాంబే హైకోర్టులో విచారించిన న్యాయమూర్తులు వారికి తెలిసి ఉంటారనీ, కాబట్టి వారిద్దరూ ఈ కేసును విచారించకూడదని ప్రశాంత్ భూషణ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీన్ని కూడా కోర్టు తీవ్రంగా పరిగణించింది.న్యాయమూర్తులపై అసంబద్ధ ఆరోపణలు చేయడం తగదంది. పిటిషనర్లపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుందామని తొలుత అనుకున్నామనీ, కానీ తర్వాత వెనక్కు తగ్గామని ధర్మాసనం తెలిపింది. కాగా, సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్లు ఈ ఏడాది జనవరి 12న మీడియా ముందుకు వచ్చి.. బీహెచ్ లోయా మృతి కేసు సహా పలు సున్నితమైన కేసుల కేటాయింపులో సరైన విధానాన్ని ప్రధాన న్యాయమూర్తి అవలంభించడం లేదంటూ ఆరోపణలు చేయడం తెలిసిందే. దేశ చరిత్రలోనే దుర్దినం: కాంగ్రెస్ జడ్జి లోయా మృతిపై సుప్రీం తీర్పు దేశ చరిత్రలోనే దుర్దినమని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. మృతిపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేసింది. సుప్రీంలో ఈ పిటిషన్ల దాఖలు వెనుక రాహుల్ హస్తముందన్న బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ ప్రతినిధి సూర్జేవాలా ఖండించారు. ‘ఈరోజు దేశ చరిత్రలోనే అత్యంత దుర్దినం. న్యాయవ్యవస్థపై నమ్మకమున్నవారికి లోయా అనుమానాస్పద మృతి ఘటన తీవ్ర ఆందోళన కలిగించే విషయం. తీర్పు పూర్తిస్థాయి కాపీని ఇంకా చూడలేదు. కానీ న్యాయవ్యవస్థపై నమ్మకమున్నవారికి ఇంకా పలు అనుమానాలు ఉన్నాయి. మృతికి సంబంధించిన నిజాలు ఏదో ఒకరోజు వెలుగులోకి వస్తాయి’ అని అన్నారు. లోయా కేసులో ఇప్పటివరకూ ఎలాంటి విచారణ జరగకపోవడాన్ని గుర్తుచేశారు. మరోవైపు రాహుల్ ట్వీటర్లో స్పందిస్తూ.. ‘భారతీయులు తెలివైనవాళ్లు. బీజేపీ నేతలతో సహా చాలామంది భారతీయులు అమిత్ షాకు సంబంధించిన నిజాలను ఇట్టే అర్థం చేసుకోగలరు.’ అని ట్వీట్ చేశారు. పిల్ వెనుక రాహుల్ హస్తం: బీజేపీ జస్టిస్ లోయా మృతిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వెనుక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అదృశ్య హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. జస్టిస్ లోయాది సహజమరణమేనని తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ తమకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. న్యాయవ్యవస్థను వాడుకుని కాంగ్రెస్ అమిత్ పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని బీజేపీ ప్రతినిధి సంబిత్ ఆరోపించారు. స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్రపతిని రాహుల్ కలవడం సిగ్గు చేటని ఇది ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థని తప్పుదారి పట్టించడమేనని ఆయన అన్నారు. కేంద్రమంత్రి నఖ్వీ సుప్రీం కోర్టు తీర్పుపై స్పందిస్తూ...తమ పార్టీ అధినాయకత్వాన్ని దెబ్బతీయాలని కాంగ్రెస్ చేసిన కుటిల యత్నాలను సుప్రీం కోర్టు తీర్పు తిప్పి కొట్టిందని..ఇప్పటికైనా ఆపార్టీ ఇటువంటి ప్రయత్నాలు మానుకుని తమకు క్షమాపణలు చెప్పాలన్నారు. రాజకీయ ప్రయోజనాలకోసం న్యాయవ్యవస్థను ఎవరూ తప్పుదోవ పట్టించలేరని సుప్రీం తీర్పు రుజువు చేసిందని హోం శాఖ మంత్రి రాజ్నాథ్ ట్వీట్చేశారు. చివరి ఆశ కూడా పోయింది: లోయా కుటుంబసభ్యులు ముంబై: స్వతంత్ర విచారణను సుప్రీంకోర్టు తిరస్కరించడంపై లోయా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై లోయా మామ శ్రీనివాస్ మాట్లాడారు. ‘తీర్పు మా అంచనాలకు తగ్గట్లుగా లేదు. అనుమానాలకు సమాధానాలు దొరకలేదు. ఈ కేసులో మేం ఇక ఎవ్వరిపైనా ఎలాంటి ఆశలు పెట్టుకోలేం. ఈ కేసులో ప్రతీ అంశాన్ని వాళ్లు మేనేజ్ చేసినట్లు కన్పిస్తోంది. మీడియా, ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండేట్లు లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వాస్తవం వెలుగులోకి వస్తుందన్న ఒకే ఒక్క నమ్మకం కూడా సుప్రీం తీర్పుతో పోయింది. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇంకా మాట్లాడటానికేం మిగల్లేదు’ అని లోయా సోదరి అనురాధ వాపోయారు. కాగా, తీర్పు అనంతరం లోయా కుమారుడు అనూజ్ అందుబాటులో లేకుండా పోయారు. నేపథ్యమిదీ.. గుజరాత్లో 2005లో సోహ్రబుద్దీన్ షేక్, అతని భార్య కౌసÆŠ, వారి సన్నిహితుడు తులసీరామ్ ప్రజాపతిని పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేసి చంపేసిన కేసులో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు, నాటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షా గతంలో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బ్రిజ్గోపాల్ హరికిషన్ లోయా 2014 డిసెంబర్ 1న మృతి చెందగా, ఆ తర్వాత ఆయన స్థానంలో వచ్చిన జడ్జి గోసావి అమిత్ను నిర్దోషిగా ప్రకటించారు. లోయా మృతి, తదనంతరం జరిగిన ఘటనలు 2014, డిసెంబర్ 1: నాగ్పూర్లో సహచరుడి కూతురి పెళ్లికి వెళ్లిన లోయా అక్కడే గుండెపోటుతో మృతిచెందారు. 2018 జనవరి 11: లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరిపేందుకు ఆదేశాలివ్వాలంటూ వచ్చిన 2 పిటిషన్లను స్వీకరించిన సుప్రీంకోర్టు జనవరి 12: లోయా మృతి తీవ్ర అంశమనీ, దీనిపై స్పందన తెలపాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం జనవరి 22: పిటిషన్లలో పేర్కొన్నవి తీవ్ర అంశాలంటూ లోయా మృతిపై బాంబే హైకోర్టులో ఉన్న రెండు కేసులను తన వద్దకే తెప్పించుకున్న సుప్రీంకోర్టు ఫిబ్రవరి 12: లోయా మరణించినప్పుడు ఆయన పక్కన ఉన్న నలుగురు న్యాయమూర్తుల వాంగ్మూలాలను బట్టి ఆయనది సహజమరణమేనని సుప్రీంకోర్టుకు తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 8: కేసు వేసిన వారినే గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారనీ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ అడగడం లేదంటూ న్యాయమూర్తులపై సీనియర్ న్యాయవాది ఆరోపణలు. ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు మార్చి 16: లోయా మృతిపై విచారణ కోరుతూ వచ్చిన పిటిషన్లపై తీర్పును రిజర్వ్లో పెట్టిన సుప్రీంకోర్టు. ఏప్రిల్ 19: పిటిషన్లను తిరస్కరిస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు -
జస్టిస్ లోయా మృతి తీవ్రమైన అంశం
న్యూఢిల్లీ: సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ బీహెచ్ లోయా అనుమానాస్పద మృతిని తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ ప్రత్యేక జడ్జి లోయా 2014 డిసెంబరు 1న తన సహచరుడి కూతురి వివాహా వేడుకకు హాజరవ్వడానికి నాగ్పూర్ వెళ్లినప్పుడు మరణించారు. లోయా మృతిపై ఆయన సోదరి గతేడాది నవంబరులో అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం చర్చనీ యాంశమైంది. మృతి కేసులో సుప్రీంకోర్టు స్వతంత్ర విచారణ చేపట్టాలంటూ దాఖలైన రెండు పిటిషన్లను కోర్టు శుక్రవారం విచారించింది. లోయా పోస్టుమార్టమ్ నివేదికను సమర్పించాలనీ, కేసు విచారణపై తన స్పందనను ఈ నెల 15లోపు తెలియజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు ఇప్పటికే బాంబే హైకోర్టు వద్ద విచారణలో ఉందనీ, దీనిని సుప్రీంకోర్టు కూడా ఇప్పుడే విచారిస్తే హైకోర్టుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున పిటిషన్లను తిరస్కరించాల్సిందిగా బాంబే న్యాయవాదుల సంఘం తరఫున న్యాయవాది దుశ్యంత్ దవే కోరారు. అయితే విచారణ సమయంలో వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని జడ్జీలు పేర్కొన్నారు. -
రాహుల్ చేసిన ‘భూకంపం’ ప్రకటన ఇదే
-
మోదీకి ముడుపులు
• గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సహారా, బిర్లా సంస్థలు ఇచ్చాయి • రాహుల్ చేసిన ‘భూకంపం’ ప్రకటన ఇదే • స్వతంత్ర విచారణకు డిమాండ్ • రాహుల్ వ్యాఖ్యలు అవాస్తవం: బీజేపీ మెహ్సానా: ప్రధాని మోదీ అవినీతిపరుడని, ఆయన వ్యక్తిగత అవినీతికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, ఆయన అవినీతిపై తాను నోరు విప్పితే భూకంపమే వస్తుందంటూ ఇటీవలి కాలంలో వరుసగా ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ‘ఆ భూకంపం వచ్చే’ ఆరోపణల వివరాలు తాజాగా వెల్లడించారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో బుధవారం జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. గుజరాత్ సీఎంగా ఉండగా మోదీకి ప్రముఖ వ్యాపార సంస్థలు సహారా గ్రూప్, బిర్లా గ్రూప్లు ముడుపులు చెల్లించాయని, అందుకు సంబంధించిన ఆధారాలు ఆదాయ పన్ను శాఖ వద్ద ఉన్నాయని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ‘అక్టోబర్ 2013, ఫిబ్రవరి 2014 మధ్య 9 సార్లు దాదాపు రూ.40 కోట్ల మేర సీఎంకు ముడుపులు చెల్లించినట్లుగా సహారా గ్రూప్ కార్యాలయాల్లో ఐటీ శాఖ నిర్వహించిన తనిఖీల్లో తేలింది. నవంబర్ 2014లో ఆ తనిఖీలు జరిగాయి. దాని ఆధారాలు ఐటీ శాఖ వద్ద ఉన్నాయి. ఆ సమయంలో గుజరాత్ సీఎంగా మోదీనే ఉన్నారు. అలాగే, మోదీ సీఎంగా ఉండగా ఆయనకు బిర్లా గ్రూప్ రూ. 12 కోట్లు ఇచ్చినట్లుగా కూడా ఐటీ వద్ద వివరాలున్నాయి. దీనిపై ఇంత వరకు ఎలాంటి విచారణ జరగకపోవడం ఆశ్చర్యకరం. ఇప్పటికైనా ఈ వివరాలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలి’ అని రాహుల్ పేర్కొన్నారు. పార్లమెంట్లో తనను మాట్లాడనివ్వడం లేదని, మోదీ అవినీతి గురించి తాను మాట్లాడితే భూకంపమే వస్తుం దంటూ గతవారం రాహుల్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై బీజేపీ స్పందిస్తూ.. అవి నిరాధార, తప్పుడు, దురుద్దేశపూరిత ఆరోపణలని కొట్టివేసింది. హెలికాప్టర్ స్కామ్లో కాంగ్రెస్ పెద్దల పేర్లు బయటకు వస్తుండటంతో.. దృష్టిని మళ్లించడం కోసం ఈ ఆరోపణలు చేస్తున్నారంది. ప్రధాని మోదీ గంగానది అంత పవిత్రమైనవాడంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమర్ధించారు. రాహుల్ ఆరోపణలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందించారు. ఈ ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. దేశాన్ని క్యూల్లో నిలబెడ్తున్నారు.. బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘దేశ ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులపై, వారి నిజాయితీపై మీకు అనుమానాలు ఉన్నాయి. అందుకే వారిని క్యూల్లో నిలబెడుతున్నారు. ఇప్పుడు వారి తరఫున నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ముడుపులు అందాయన్నది నిజమా? కాదా? దీనిపై ఎప్పుడు విచారణ జరిపిస్తారు’ అని మోదీని రాహుల్ సూటిగా ప్రశ్నించారు. దీనిపై రెండున్నరేళ్లుగా విచారణ ఎందుకు జరగడం లేదని.. దేశం తరఫున తాను ప్రశ్నిస్తున్నానన్నారు. దీనిపై విచారణ జరపాలని ఐటీ కూడా సిఫారసు చేసిందని వెల్లడించారు. మోదీ తీసుకున్న నోట్ల రద్దుపైనా రాహుల్ విమర్శలు గుప్పించారు. పార్లమెంటు లో తనను మాట్లాడనీయలేదని, ప్రధాని తనముందు నిలబడటానికి కూడా సిద్ధంగా లేరన్నారు. నోట్ల రద్దు పేదలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమని ఆరోపించారు. కొన్ని నెలల పాటు పేదల డబ్బు బ్యాంకుల్లోనే ఉంచి.. వాటితో తనకు సన్నిహితులైన పెద్దల రుణాలను మాఫీ చేయడమే మోదీ ఉద్దేశమని స్పష్టం చేశారు. కాగా, ముడుపుల ఆరోపణలపై స్వతంత్ర విచారణకు మోదీ సిద్ధం కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ‘కామన్ కాజ్’ వేసిన పిటిషన్లోనివే.. మోదీ అవినీతికి సంబంధించి కామన్ కాజ్’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లోనే రాహుల్ పేర్కొన్న అంశాలున్నాయి. సరైన సాక్ష్యాధారాలు లేవని, కేవలం ఆరోపణలనే ఆధారంగా తీసుకోలేమని గతవారం ఆ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించలేదు. సరైన ఆధారాలను సమర్పించాలని, ఆ తరువాతే పిటిషన్ విచారణార్హమా, కాదా అనేది నిర్ణయిస్తామని కోర్టు పేర్కొంది. ‘బిర్లా గ్రూప్ కార్యాలయాలపై అక్టోబర్ 2013లో ఐటీ శాఖ దాడులు చేసింది. ఆ సమయంలో ఆ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ శుభేందు అమితాబ్ ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లలో కొన్ని వివరాలు బయటపడ్డాయి. ‘2012లో సీఎంకు 25 కోట్లు( 12 కోట్లు ఇచ్చాం)’ అనే ఎంట్రీ కూడా వాటిలో ఉంది’ అనే వివరాలు కూడా ప్రశాంత్ భూషణ్ కోర్టుకు అందించిన వివరాల్లో ఉన్నాయి. ఈ అంశాలను గతంలో కేజ్రీవాల్ కూడా పలు సందర్భాల్లో లేవనెత్తిన విషయం గమనార్హం. మోదీ గంగానదిఅంతా పవిత్రం: బీజేపీ రాహుల్ ఆరోపణలు నిరాధారమని.. మోదీ గంగానదిఅంతా పవిత్రమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధమున్న అగస్టా కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాబర్ట్ వాద్రాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రాహుల్ ఎందుకు స్పందించరని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ‘ప్రధానిపై రాహుల్ వ్యాఖ్యలను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ నాయకులే రాహుల్ గాంధీని లైట్గా తీసుకుంటున్నారు’అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రాహుల్ ఓ పార్ట్టైమ్ నాన్ సీరియస్ రాజకీయ నేత అని ఆయన విమర్శించారు.