industrial corridor
-
నాచారం ఇండస్ట్రియల్ కారిడార్లో భారి బ్లాస్ట్
-
విశాఖ -చెన్నై కారిడార్ పై అవాస్తవాలతో ఈనాడు కథనం
-
క్రిస్సిటీ నిర్మాణానికి దిగ్గజ సంస్థల పోటీ
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో కృష్ణపట్నం వద్ద అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక నగరం ‘క్రిస్’సిటీ నిర్మాణానికి దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. తొలిదశలో రూ.1,503.16 కోట్లతో 2,500 ఎకరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులివ్వడంతో ఈపీసీ విధానంలో రూ.1,021.41 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఆహ్వానించింది. తుది బిడ్డింగ్లో మూడు కీలక సంస్థలు అర్హత సాధించినట్లు ఏపీఐఐసీ వీసీఎండీ ప్రవీణ్కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈ టెండర్ల మదింపు జరుగుతోందని, అర్హత సాధించిన తర్వాత వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధంచేసినట్లు ఆయన తెలిపారు. చెన్నై–బెంగళూరు కారిడార్లో భాగంగా కృష్ణపట్నం వద్ద 10,834.5 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్డిక్ట్)తో కలిసి ఏపీఐఐసీ నిక్డిక్ట్–కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ (క్రిస్సిటీ) పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటుచేసింది. పూర్తిస్థాయిలో తొలిదశ అందుబాటులోకొస్తే 78,900 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. -
సీఎం జగన్ ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో పరిశ్రమలు
గోపవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో సెంచురీ ఫ్లై పరిశ్రమను నిర్మిస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ సజ్జన్ భజాంకా తెలిపారు. వైఎస్సార్ జిల్లా గోపవరం వద్ద నిర్మిస్తున్న పరిశ్రమ పనులను గురువారం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధతో కలిసి ఆయన పరిశీలించారు. పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భజాంకా మాట్లాడుతూ తొలుత తమిళనాడులో యూనిట్ నెలకొల్పాలని భావించామని, అయితే వెనుకబడిన ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేయడం వలన ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ తమకు చెప్పారని, దీంతో తాము ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు చకచక రావడంతో పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ నాటికి మొదటి దశ పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. 2024 డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో పనులు పూర్తి చేసి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. ముందుగా రూ.600 కోట్లతో యూనిట్ను ఏర్పాటు చేయాలని భావించామని, ఇప్పుడు రూ.1,600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు భజాంకా తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కావడం వలన రెండు వేల మందికి ప్రత్యక్షంగాను, నాలుగు వేల మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంని, 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వనున్నట్లు భజాంకా వెల్లడించారు. నిరుద్యోగులకు ఎలాంటి అనుభవం లేకున్నా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వివరించారు. కార్యక్రమంలో సెంచురీ ప్యానల్ జీఎం రమేష్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
‘క్రిస్ సిటీ’ పారిశ్రామిక నగర నిర్మాణంలో కీలక అడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఫ్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీ పారిశ్రామిక నగర నిర్మాణంలో కీలక అడుగు పడింది. కేంద్ర పర్యావరణ శాఖ పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా, వ్యర్థాలను శుద్ధి చేయాలని, భూగర్భ జలాలను, సహజ సిద్ధంగా ఉన్న కాలువలు, చెరువులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా నిర్మాణం చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తొలి దశ ప్రాజెక్టుకు జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదం కూడా లభించింది. చదవండి: AP: పీఆర్సీ ఐదేళ్లకే.. జీవో జారీ.. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లోభాగంగా కృష్ణపట్నం వద్ద మొత్తం 11,095.9 ఎకరాల్లో రూ.5,783.84 కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నిక్డిట్ నిధులతో అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీ కోసం ఏపీఐఐసీ నిక్డిట్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. టెక్స్టైల్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, ఎంఎస్ఎంఈ రంగాల పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకొస్తే 2,96,140 మందికి ప్రత్యక్షంగా, 1,71,600 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. తొలిదశలో 2,006.09 ఎకరాలు అభివృద్ధి చేస్తారు. తొలి దశకు రూ.1,500 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. తొలి దశ నిర్మాణానికి జ్యుడిషియల్ ప్రివ్యూ నుంచి కూడా ఆమోదం లభించిందని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని ఏపీఐఐసీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. సుమారు రూ.1,054.63 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలుస్తారు. క్రిస్ సిటీ నిర్మాణ సమయంలో రోజుకు 500 కిలో లీటర్లు, ప్రాజెక్టు పూర్తయ్యాక పరిశ్రమలకు రోజుకు 99.7 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ నీటిని 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కండలేరు రిజర్వాయర్ నుంచి సరఫరా చేయనున్నారు. -
‘క్రిస్ సిటీ’ తొలి దశకు టెండర్లు
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (క్రిస్ సిటీ) తొలి దశ పనులకు ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. పరిశ్రమల ఏర్పాటుతో పాటు నివాసయోగ్యంగా ఉండేలా నిర్మిస్తున్న క్రిస్ సిటీలో రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, మురుగు, వరద నీరు పారుదల, మురుగునీటి శుద్ధి వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.1,190 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ 36 నెలల్లో పనులను పూర్తి చేయాలన్న నిబంధన విధించింది. అలాగే పనులు పూర్తయిన తర్వాత నాలుగేళ్ల పాటు క్రిస్ సిటీ నిర్వహణ బాధ్యతలను కూడా చూడాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు నవంబర్ 4 మధ్యాహ్నం 3 గంటల్లోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. సీబీఐసీ కారిడార్లో భాగంగా మొత్తం 12,944 ఎకరాల్లో కృష్ణపట్నం నోడ్ను అభివృద్ధి చేయనుండగా తొలిదశ కింద 2,134 ఎకరాలను అభివృద్ధి చేయడానికి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్ డిట్) ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2,139.44 కోట్లను నిక్డిట్ కేటాయించింది. ఈ క్రిస్ సిటీ నిర్మాణం ద్వారా రూ.37,500 కోట్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని అంచనా. -
క్రిస్ సిటీ టెండర్లకు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ(క్రిస్ సిటీ) మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. మొత్తం 12,944 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న కృష్ణపట్నం నోడ్లో తొలిదశలో 2,134 ఎకరాలకు సంబంధించి ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్కు ఆమోదం తెలపడంతో సుమారు రూ.1,200 కోట్లతో ఈపీసీ టెండర్లను ఏపీఐఐసీ పిలవనుంది. ఈ టెండర్లను న్యాయ పరిశీలన కోసం జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపుతున్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్కుమార్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే నెలలోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి జూన్లో పనులు మొదలు పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రెండేళ్లలో అందుబాటులోకి... క్రిస్ సిటీ పనులు జూన్లో మొదలు పెట్టి రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని ఏపీఐఐసీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం 12,944 ఎకరాలను అభివృద్ధి చేయడం ద్వారా రూ.37,500 కోట్ల పెట్టుబడులు, 5.15 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రాజెక్టు రిపోర్టు రూపొందించిన జాకబ్ సంస్థ అంచనా వేసింది. 99,400 మంది నివాసం ఉండేలా ఈ పారిశ్రామిక నగరాన్ని నిర్మిస్తున్నారు. మూడు క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తున్న క్రిస్సిటీలో ప్రధానంగా ఆహార ఉత్పత్తులు, టెక్స్టైల్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆప్టికల్ ఫైబర్ తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా అభివృద్ధి చేస్తున్నారు. పోర్టుల ఆధారంగా అభివృద్ధి చెందిన చెన్నై, కోల్కతా లాంటి నగరాల మాదిరిగా పరిశ్రమలతోపాటు నివాసయోగ్యంగా ఉండేలా ఫ్యూచర్ వర్క్లైఫ్ అనే ట్యాగ్లైన్తో క్రిస్ సిటీ బ్రాండింగ్ చేస్తున్నట్లు రవీన్కుమార్ తెలిపారు. అభివృద్ధి చేస్తున్న మొత్తం ప్రాంతంలో 46 శాతం మాత్రమే పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. 13.9 శాతం ఉద్యోగులు అక్కడే నివసించేలా గృహ సముదాయాల నిర్మాణానికి వినియోగిస్తారు. లాజిస్టిక్ అవసరాలకు 5.6 శాతం కేటాయిస్తారు. 10.9 శాతం పర్యావరణ పరిరక్షణ కోసం ఖాళీగా ఉంచుతారు. క్రిస్ సిటీ తొలిదశ ద్వారా సుమారు రూ.18,548 కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు 98,000 మందికి ఉపాధి లభిస్తుందని ఏపీఐఐసీ అంచనా వేసింది. ఎస్పీవీకి భూమి బదలాయింపు.. కృష్ణపట్నం నోడ్ తొలిదశ పనులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపి రూ.2,139.44 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఏర్పాటైన ఎస్పీవీకి భూమి బదలాయింపులో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పనులు ప్రారంభించేందుకు ఆటంకాలన్నీ తొలగిపోయినట్లు ఏపీఐఐసీ అధికారులు పేర్కొన్నారు. -
3 కారిడార్లు దక్కించుకున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు
సాక్షి, అమరావతి: పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. మౌలిక వసతులు కల్పించడం ద్వారా పరిశ్రమలను ఆకర్షించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణంపై దృష్టి సారించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం నుంచి ఇప్పటికే విశాఖ-చెన్నై కారిడార్, చెన్నై-బెంగళూరు కారిడార్లు వెళ్తుండగా తాజాగా హైదరాబాద్-బెంగళూరు కారిడార్కు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీంతో మూడు పారిశ్రామిక కారిడార్లు దక్కించుకున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. ఈ కారిడార్లలో మొత్తం 8 క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్డిట్) నుంచి భారీగా నిధులను తీసుకురావడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. చదవండి: భీమిలి భోగాపురం మధ్య.. పారిశ్రామిక కారిడార్ ఏడీబీ నిధులు రూ.4,598 కోట్లతో విశాఖ-చెన్నై కారిడార్: విశాఖ-చెన్నై కారిడార్ను ఏడీబీ(ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్) రుణ సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. తొలిదశలో విశాఖలో అచ్యుతాపురం-రాంబిల్లి, నక్కపల్లి క్లస్టర్లు, చిత్తూరు జిల్లాలో ఏర్పేడు-శ్రీకాళహస్తి క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్లస్టర్లలో మౌలిక వసతులకు సంబంధించి రూ.4,598 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. భూ సేకరణ పనుల కోసం రూ.165 కోట్ల అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కారిడార్లో భాగంగానే మెడ్టెక్ జోన్ రెండో దశ పనులను రూ.110కోట్లతో చేపడుతున్నారు. చదవండి: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం: పోస్కో నిక్డిట్ నిధులతో అభివృద్ధి చేస్తున్న క్లస్టర్లు: కొప్పర్తి: తొలిదశలో 4 వేల ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నీటిని సోమశిల ప్రాజెక్టు నుంచి తీసుకురావడానికి ప్రభుత్వం డీపీఆర్ తయారు చేస్తోంది. కృష్ణపట్నం: 2,500 ఎకరాల్లో సుమారు రూ.1,500 కోట్ల నిధులతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. శ్రీకాళహస్తి: ఈ క్లస్టర్ను నిక్డిట్ నిధులతో 8వేల ఎకరాల్లో, ఏడీబీ నిధులతో 2,500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. నక్కపల్లి: విశాఖ-చెన్నై కారిడార్లో భాగంగా ఈ కస్టర్ను ఏడీబీ నిధులతో వేయి ఎకరాలు, నిక్డిట్ నిధులతో 3 వేల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నారు. వీటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్లస్టర్లతో పాటు 7వేల ఎకరాల్లో ప్రకాశం జిల్లా దొనకొండ నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్)ను అభివృద్ధి చేయనున్నారు. ఓర్వకల్లు: హైదరాబాద్-బెంగళూరు కారిడార్లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో క్లస్టర్ను తాజాగా అభివృద్ధి చేయనున్నారు. దీన్ని కూడా నిక్డిట్ నిధులతో చేపట్టడానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. సుమారు 7వేల ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేస్తోంది. మౌలిక వసతులపైనే దృష్టి సీఐఐ, ఐఎస్బీ, అసోచామ్ వంటి పెద్ద సంస్థల నుంచి వచ్చిన సూచనల మేరకే మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నాం. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఆటోమొబైల్ వంటి కీలక రంగాల వారీగా క్లస్టర్లను అభిృవృద్ధి చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పారిశ్రామిక పార్కుల పనులను శరవేగంగా పూర్తి చేయడంపై దృష్టి సారించాం. - మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి -
భీమిలి భోగాపురం మధ్య.. పారిశ్రామిక కారిడార్
సాక్షి, అమరావతి: భీమిలి నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు సుమారు 20 కి.మీ పారిశ్రామిక కారిడార్ను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేసే సంస్థ ఎంపిక కూడా పూర్తయింది. డీపీఆర్ కాంట్రాక్టును నాగపూర్కు చెందిన కేఅండ్జే ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. ఈ డీపీఆర్ తయారీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఇన్క్యాప్) రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) బిడ్లను ఆహ్వానించగా మొత్తం నాలుగు సంస్థలు పోటీపడ్డాయి. ఇందులో అతి తక్కువ ధర కోట్ చేసి ఎల్1గా నిలిచిన కేఅండ్జే ప్రాజెక్ట్స్ సంస్థను ఎంపిక చేసినట్లు ఇన్క్యాప్ వైస్ చైర్మన్, ఎండీ ఆర్.పవనమూర్తి తెలిపారు. సాంకేతిక అంశాల పరిశీలన అనంతరం పోటీపడ్డ నాలుగు సంస్థల్లో మూడు సంస్థలు.. ఎల్అండ్టీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్, కేఅండ్జే ప్రాజెక్ట్స్, ట్రాన్స్లింక్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ తుది బిడ్కు ఎంపికయ్యాయి. వీటిలో రూ. 41 లక్షల కోట్ చేసిన కేఅండ్జే సంస్థ ఎల్1గా నిలిచింది. డీపీఆర్ తయారీలో ప్రధాన అంశాలు.. ► భీమిలి నుంచి భోగాపురం ఎయిర్పోర్టు ప్రధాన గేటు వరకు ఉన్న 20 కి.మీ రహదారి అభివృద్ధితో పాటు వ్యాపార అవకాశాలను పరిశీలించాలి. ► మొత్తం 8 లేన్ల రహదారిలో తొలుత ఆరు లేన్లు, రెండు వైపుల సర్వీసు రోడ్డు నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందో అంచనా వేయాలి. ► ప్రస్తుతం ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ప్రైవేటు భూమి ఎంత సేకరించాల్సి ఉంటుందన్న అంశాన్ని పరిశీలించాలి. ► రహదారికి ఇరువైపుల తయారీ రంగానికి సంబంధించి పారిశ్రామిక పార్కులు, పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు అంశాలను పరిశీలించాలి. ► టూరిజం, హెల్త్, విద్య వంటి సేవా రంగాల పెట్టుబడులు, లాజిస్టిక్ హబ్స్ వ్యాపార అవకాశాలపై నివేదిక రూపొందించాలి. ప్రస్తుత ట్రాఫిక్, ఎయిర్పోర్టు అభివృద్ధి అయిన తర్వాత ఎంతమేర ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందన్న అంశాన్ని అంచనా వేయాలి. ► వాతావరణ పరిస్థితులు, వాటిని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించాలి. ► ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత మొత్తం అవసరమవుతుంది, దీనికి నిధులు ఎలా సేకరించాలి, లాభదాయకత వంటి అంశాలు పరిశీలించాలి. -
పరిశ్రమల ఖిల్లా.. రంగారెడ్డి జిల్లా
పరిశ్రమల స్థాపనకు మన జిల్లా కేరాఫ్ అడ్రస్గా మారింది. సూక్ష్మ నుంచి మెగా వరకు ఏ కేటగిరీని తీసుకున్నా పరిశ్రమల ఏర్పాటులో జిల్లా ప్రత్యేకతను చాటుతోంది. అదేవిధంగా బహుళజాతి కంపెనీలు విస్తృతంగా వెలుస్తుండటం శుభపరిణామం. హైదరాబాద్ మహానగరం శివారు చుట్టూ మన జిల్లా విస్తరించి ఉండటం, అనువైన రవాణా వ్యవస్థ కలిగి ఉండటంతో పెట్టుబడుల వరద పారుతోంది. ముఖ్యంగా ‘టీఎస్–ఐపాస్’ పేరిట 2014లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ.. పరిశ్రమలకు స్థాపనకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పాలసీ అమల్లోకి వచ్చి ఐదేళ్లు గడవగా.. విజయవంతంగా అమలు చేసిన జాబితాలో మన జిల్లా అగ్రభాగాన ఉండటం విశేషం. పరిశ్రమల ఏర్పాటులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో జిల్లాకు అవార్డు వచ్చింది. బుధవారం నగరంలోని శిల్పకళావేదికలో నిర్వహించే టీఎస్–ఐపాస్ ఐదేళ్ల సంబరాల్లో భాగంగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీష్, డీఐసీ జనరల్ మేనేజర్ జె.రాజేశ్వర్రెడ్డి అవార్డు అందుకోనున్నారు. ఈనేపథ్యంలో జిల్లాలో పరిశ్రమల స్థాపన.. పెట్టుబడులు.. ఉపాధి కల్పనపై ప్రత్యేక కథనం.. సాక్షి, రంగారెడ్డి: పరిశ్రమల స్థాపనలో మన జిల్లా వేగంగా దూసుకెళ్తోంది. 2014 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ చట్టం (టీఎస్–ఐపాస్) అమల్లోకి తీసుకురావడంతో మహర్దశ పట్టింది. త్వరితగతిన అనుమతులు జారీ చేయడం, నెల రోజుల నిర్దిష్ట సమయంలో అనుమతులు మంజూరు, ఆన్లైన్లో విధానంలో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఈ పాలసీతో కలిగింది. దీంతో పారిశ్రామికవేత్తలు.. ఎన్నో అనుకూల అంశాలు ఉన్న మన జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు అమితమైన ఆసక్తి చూపారు. టీఎస్–ఐపాస్ పాలసీ అమల్లోకి వచ్చాక ఆయా కేటగిరీల్లో మొత్తం రూ.46 వేల కోట్ల వ్యయంతో 935 పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆన్లైన్ దరఖాస్తులు అందాయి. వీటిద్వారా 7.64 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం. ఇందులో ఇప్పటివరకు 690 పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. రూ.13,385 కోట్ల పెట్టుబడులు జిల్లాకు వచ్చాయి. ఇప్పటివరకు 1.95 లక్షల మందికి ఉపాధి లభించడం విశేషం. పరోక్షంగా మరో 50 వేల మంది వరకు జీవనోపాధి అవకాశాలు లభించాయి. రూ.వేల కోట్ల పెట్టుబడులు జాతీయ, బహుళ జాతీయ కంపెనీలు కూడా మన జిల్లాలో ఏర్పాటయ్యాయి. మహానగరం చుట్టూ జిల్లా విస్తరించడం, రవాణామార్గాలు అనువుగా ఉండటం.. తదితర సానుకూలతలు పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నాయి. ఒక్కో మెగా కంపెనీలు రూ.వేల కోట్లు పెట్టుబడులు పెడుతుండగా.. మరికొన్ని విస్తరణకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. టైల్స్ తయారీ చేసేందుకు వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ కంపెనీ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దీనివల్ల 500 మందికి ఉపాధి లభించనుంది. అలాగే నందిగామలో ఎంఎస్ఎన్ ఫార్మా విస్తరణకు వెళ్తోంది. ఇందుకోసం రూ.300 కోట్లు ఖర్చు చేస్తుండగా.. సుమారు 1,200 మందికి ఉపాధి దొరకనుంది. ఇక ఆదిబట్లలో ఏరోసిటీలో టాటా ఏరో స్పేస్ ఆరు విభాగాల్లో తమ ఉత్పత్తులను మొదలు పెడుతోంది. ఇందుకోసం రూ.1,200 కోట్లు పెట్టుబడులు పెట్టింది. దీంతోపాటు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తన సేవలను మొదలుపెట్టింది. వీటికంటే ముందు జిల్లాలో ఐటీ కారిడార్, హార్డవేర్ పార్క్లు, ఐడీఏ కాటేదాన్ , ఐడీఏ కొత్తూరు తదితర సెజ్లు, పార్క్లు కూడా విస్తరించడం తో పారిశ్రామికరంగంలో జిల్లా దూసుకెళ్తోంది. పరిశ్రమల స్థాపనకు అనుకూలతలు ఇవీ.. జిల్లా శివారు ప్రాంతాలన్నీ మహానగరం చుట్టూ ఉండటం నైపుణ్యం ఉన్న మానవ వనరులు పుష్కలంగా లభిస్తుండటం టీఎస్–ఐపాస్ ద్వారా సరళంగా, సులభతరంగా అనుమతులు లభించడం కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉండటం రవాణా వ్యవస్థ బాగా విస్తరించడం ఇన్చార్జి కలెక్టర్ హర్షం టీఎస్–ఐపాస్ అవార్డు లభించడంపై ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్ సంతోషం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయడంతోనే ఉత్తమ ప్రతిభ చూపేందుకు సాధ్యమైందని పేర్కొన్నారు. అవార్డు మరింత బాధ్యతలను పెంచిందని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు జిల్లా అన్ని విధాల అనుకూలమని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జె.రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. టీఎస్–ఐపాస్ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు రూ.13 వేల కోట్లకుపైగా పెట్టుబడులు జిల్లాకు వచ్చాయని తెలిపారు. -
హైదరాబాద్ టు వరంగల్.. ఇండస్ట్రియల్ కారిడార్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం మీదుగా వెళ్తున్న ముఖ్యమైన జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాలను జోడించి పారిశ్రామిక అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2014 నూతన పారిశ్రామిక విధానంలో ఆరు ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధిని పరిశ్రమల శాఖ ప్రతిపాదించింది. వీటిలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు (పారిశ్రామిక వాడలు) ఏర్పాటు చేయడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించి, జిల్లాల్లోనూ ఉపాధి అవకాశాలు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రతిపాదనలో భాగంగా హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–నాగ్పూర్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–మంచిర్యాల, హైదరాబాద్–నల్లగొండ, హైదరాబాద్–ఖమ్మం ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పారిశ్రామిక కారిడార్ల ద్వారా ఆయా జిల్లాల్లో లభ్యమయ్యే సహజన వనరుల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. అయితే తొలి దశలో వరంగల్, నాగ్పూర్, బెంగళూరు కారిడార్ల అభివృద్ది చేయాలని, మరో మూడు కారిడార్లను రెండో దశలో అభివృద్ధి చేయాలని నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ఐపాస్)లో పేర్కొన్నారు. అయితే హైదరాబాద్–వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు కారిడార్ అభివృద్ధికి మాస్టర్ప్లాన్ రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. వరంగల్ కారిడార్కు అధిక ప్రాధాన్యత ప్రస్తుతం 163వ నంబరు జాతీయ రహదారిని రూ.1,905 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లేన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. మరోవైపు ఎన్ఐటీతో సహా పలు సాంకేతిక, వృత్తి విద్యా సంస్థలకు వరంగల్ నగరం కేంద్రంగా ఉండటంతో ఐటీ రంగం అభివృద్ధికి అనువైన వాతావరణం ఉందని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఇక్కడ రూ.11,586 కోట్లతో ఏర్పాటయ్యే మెగా టెక్స్టైల్ పార్కు ద్వారా 1.13 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు బెంగళూరుకు మైసూరు శాటిలైట్ ఇండస్ట్రియల్ కారిడార్ను అభివృద్ధి చేసిన తరహాలో హైదరాబాద్–వరంగల్ కారిడార్ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం హైదరాబాద్ ఫార్మాసిటీ (హెచ్పీసీ)కి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్టు (ఎన్ఐసీడీఐటీ) ద్వారా మౌలిక సదుపాయాల కోసం రూ.3,418 కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ మేరకు ఈ ఏడాది అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఐటీ క్లస్టర్ల మాస్టర్ప్లాన్ సిద్ధం చేసిన తర్వాత కారిడార్ అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకుంటాయని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. ఈ కారిడార్ ద్వారా ఫార్మా, ఐటీ, రవాణా, వ్యవసాయాధారిత పరిశ్రమలకు ఊతం లభించనుంది. -
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ.. పారిశ్రామిక కారిడార్
అవినీతి అక్రమాలకు తావు లేకుండా.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ నూతన పారిశ్రామిక కారిడార్కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా భూసేకరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో భూ సేకరణలో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకోవడంతో పాత విధానానికి స్వస్తిపలికి.. నూతన పారిశ్రామిక విధానానికి కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, రహదారి సౌకర్యం, రైల్వే మార్గం, నీటి సౌకర్యం, ఆకాశ మార్గంలో రాకపోకలకు అనుకూలంగా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్ర యం, జిల్లాకు అతి సమీపంలో సముద్రతీర ప్రాంతం ఉండటంతో పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులతో రావడానికి ఆసక్తిచూపుతున్నారు. సాక్షి, తిరుపతి: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, నీటి సరఫరాకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయు డు కండ్రిగ మండలాల పరిధిలోని మొ త్తం 34 గ్రామాల్లో విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతంగా గుర్తించినట్లు తెలిసింది. అందుకు అవసరమైన భూముల సేకరణకు జిల్లా అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. కలెక్టర్ నారాయణ భరత్గుప్త ఆదేశాల మేరకు తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి ఆధ్వర్యంలో 40 మందితో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. ఈ బృందాన్ని ఉత్తర, దక్షిణ విభాగాలుగా విభజించారు. ఉత్తరంలో 11వేల ఎకరాలు, దక్షిణంలో 13వేల ఎకరాలను సేకరించనున్నారు. పర్యావరణానికి ముప్పు లేకుండా జాగ్రత్తలు పర్యావరణానికి ముప్పు వాటిల్ల్ల కుండా ఎక్కడా చెరువుల జోలికి వెళ్లకుండా జనావాసానికి ఎటువంటి ఆటం కాలూ లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అదేవిధంగా రెండు పంటలు పండే భూములను కూడా తీసుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. రెండు పంటలు పండే భూములకు కండలేరు జలాశయం నుంచి 6 టీఎంసీల నీటిని సరఫరా చేసేం దుకు ప్రభుత్వ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. భూములు ఇచ్చే రైతులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం రూ.1,507 కోట్లు కేటాయించినట్లు ఆర్డీఓ కనకనరసారెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పరిహారం పంపిణీలో జరిగిన అవకతవకల నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం నేరుగా రైతులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించనుంది. భూములకు సంబంధించిన పత్రాలు పరిశీలించి, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన తర్వాతే పరిహారం పంపిణీ చెయ్యనుంది. దీంతో పరిహారం పంపిణీలో అవకతవకలు జరిగే అవకాశాలు ఉం డవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు పూర్తయితే శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరికే పరిస్థితులు ఉన్నాయి. సీఎం సాహసోపేత నిర్ణయం స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టం చెయ్యడం సాహసోపేత నిర్ణయం. సీఎం తీసుకున్న నిర్ణయంతో నియోజకవర్గంలో అనేకమంది నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేకూరనుంది. ముఖ్యంగా వారి కుటుం బాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. – బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే -
తమిళనాట పారిశ్రామిక కారిడార్
తిరుచిరాపల్లి: రక్షణ సంబంధ పరికరాలు దేశీయంగానే ఉత్పత్తి చేసే దిశగా కేంద్రం అడుగులు వేసింది. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తమిళనాడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ను ప్రారంభించారు. ఈ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా రూ. 3,038 కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో అత్యధిక భాగం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టనున్నాయి. ఇక ప్రైవేటు కంపెనీలైన టీవీఎస్, డేటా ప్యాట్రన్స్, అల్ఫా డిజైన్స్ తదితర సంస్థలు పెట్టనున్నాయి. ఇందులో తాము కూడా పెట్టుబడులు పెడతామంటూ అంతర్జాతీయ భారీ భద్రతా సంస్థల్లో ఒకటైన లాక్హీడ్ మార్టిన్ ప్రకటించింది. తమిళనాడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ను తమిళనాడు డిఫెన్స్ ప్రొడక్షన్ క్వాడ్ అని కూడా పిలవనున్నారు. ఈ కారిడార్ జాబితాలో తిరుచిరాపల్లితోపాటు రాజధాని నగరం చెన్నై, హోసూర్, సేలం, కోయంబతూర్ కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి సీతారామన్ మాట్లాడుతూ ‘డిఫెన్స్ కారిడార్కి స్థానిక పరిశ్రమల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. పాలక్కాడ్ వరకూ పొడిగించాలంటూ అనేకమంది కోరుతున్నారు. అయితే దీనిని ప్రస్తుతానికి ఈ ఐదు నగరాలకే పరిమితం చేస్తున్నాం’ అని అన్నారు. ఈ కారిడార్ వల్ల రక్షణ ఉత్పత్తులు పెరగడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అంతేకాకుండా వివిధ రక్షణ కారిడార్ల మధ్య కనెక్టివిటీ బాగా పెరుగుతుందన్నారు. ఈ ఐదు నగరాల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులు ఉన్నాయని, రక్షణ ఉత్పత్తుల విక్రేతలు ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ఇతర అనుబంధ సంస్థలతో చేయి చేయి కలిపి ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి’అని అన్నారు. పారిశ్రామిక కారిడార్ ప్రారంభ కార్యక్రమానికి ఐదు వందలమందికిపైగా వివిధ సంస్థల ప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. గతేడాదే ప్రకటన దేశంలో రెండు రణ ఉత్పత్తుల పారిశ్రామిక కారిడార్లను ప్రారంభిస్తామంటూ గతేడాది ఫిబ్రవరి, రెండో తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ ప్రకటించడం తెలిసిందే. అందులోభాగంగా ఒకటి ఉత్తరప్రదేశ్లో, మరొకటి తమిళనాడులో మొదలయ్యాయి. తొలుత ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో గతేడాది ఆగస్టు, 11వ తేదీన ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రారంభించడం తెలిసిందే. -
ఘనంగా హరీశ్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: మంత్రి హరీశ్రావు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున నేతలు, అభిమానులు పోటెత్తడంతో మంత్రుల నివాస సముదాయం జనసందోహంగా మారింది.ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్రెడ్డి, ఈటల రాజేందర్, చందూలాల్, ఎంపీలు, తదితరులు ఎమ్మెల్యేలు తీగల, గాంధీ, మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. హరీశ్ తన తల్లి లక్ష్మి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, అత్యంత క్రియాశీలకంగా పనిచేసే మన మంత్రుల్లో హరీశ్ ఒకరంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటలో ఇండస్ట్రియల్ కారిడార్ సిద్దిపేట జోన్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే సిద్దిపేటలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని నీటి పారుదల మంత్రి హరీశ్రావు అన్నారు. మలేసియాకు చెందిన ప్రముఖ సంస్థ డీఎక్స్ఎన్ సిద్దిపేటలో మొదటి పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆదివారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో మంత్రి హరీశ్తో మలేసియా ప్రతినిధి డాక్టర్ లిమ్సీయోజిన్ భేటీ అయ్యారు. -
అవసరం కొండంత..ఇచ్చింది గోరంత
► జిల్లాపై బాబు శీతకన్ను ► బడ్జెట్లో వెలిగొండకు కేటాయించింది రూ.200 కోట్లే ► ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.2,800 కోట్లు అవసరం ► కొరిశపాడు లిఫ్ట్కు ఇచ్చింది రూ.7.45 కోట్లు ► పాలేరు రిజర్వాయర్కు రూ.3.98 కోట్లు ► రాళ్లపాడుకు రూ.1.28 కోట్లు ► ఊసే లేని రామాయపట్నం పోర్టు, విమానాశ్రయం ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు ఒక్కో హామీని గాలికొదిలేసింది. ఆది నుంచి జిల్లా అభివృద్ధిపై చిన్నచూపు చూస్తోంది. తాజా బడ్జెట్లోనూ మొండిచేయి చూపింది. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలకు అరకొర కేటాయింపులతో సరిపెట్టగా..జిల్లా అభివృద్ధికి కీలకమైన పోర్టు, విమానాశ్రయం, పారిశ్రామికవాడల ఊసే ఎత్తలేదు. సంక్షేమ పథకాల అమలుకూ మొక్కుబడిగా నిధులిచ్చి చేతులు దులుపుకున్నారు. బడ్జెట్లో జిల్లాను చిన్నచూపు చూడటంపై జనం మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాకు 2017–18 బడ్జెట్లో బాబు సర్కారు మొండిచేయి చూపింది. జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామంటూనే సర్కారు వంచనకు పాల్పడింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో రూ.2,800 కోట్లు అవసరం కాగా, బుధవారం శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.200 కోట్ల నిధులను మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి దశాబ్దాలు పట్టే పరిస్థితి నెలకొంది. రూ.1,56,980 కోట్ల బడ్జెట్ అంటూ ఘనంగా చెప్పుకున్న బాబు సర్కారు ప్రకాశం జిల్లాను చిన్నచూపు చూసింది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు అరకొర నిధులు విదల్చగా ఇక జిల్లాకు ఇచ్చిన ప్రధాన హామీలు రామాయపట్నం పోర్టు, విమానాశ్రయం, మైనింగ్ యూనివర్సిటీ, కనిగిరి నిమ్జ్, దొనకొండ పారిశ్రామికవాడ మొదలుకొని ఏ ఒక్క హామీని బడ్జెట్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. వెలిగొండకు చిల్లర విదిలింపు: తాజా అంచనాల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.2,800 కోట్లు అవసరం. కనీసం ఫేజ్–1 పరిధిలోని టన్నెల్–1, హెడ్రెగ్యులేటర్ కాలువ పెండింగ్ పనులను పూర్తి చేసేందుకే వెయ్యి కోట్లు అవసరం. కానీ ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించింది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి ప్రాధాన్యతా క్రమంలో పెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించినా... బడ్జెట్ కేటాయింపులకు వచ్చేసరికి మొక్కుబడి నిధులతో సరిపెట్టారు. ఇప్పటికే పాత బకాయిలు రూ.50 కోట్లు ఉన్నాయి. వాటికి పోను కేటాయింపులు చూస్తే కేవలం రూ.150 కోట్లు ఇచ్చినట్లు. జిల్లాలోని కరువును పారదోలటంతో పాటు ఫ్లోరైడ్ నుంచి గట్టెక్కాలంటే వెలిగొండ నీరే శరణ్యం. జిల్లా వాసులకు తాగు, సాగునీరుకు ఈ ప్రాజెక్టే ఏకైక ఆధారం. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాల పరిధిలో 4.40 లక్షల ఎకరాలకు, వందలాది గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించాల్సి ఉంది. 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని బాబు సర్కారు హామీ ఇచ్చింది. దాని నిధుల కేటాయింపులు చూస్తే మరో దశాబ్ద కాలానికి కూడా వెలిగొండ పూర్తయ్యే పరిస్థితి కానరావడం లేదు. సాగు నీరు సంగతి దేవుడెరుగు, తాగునీరు కూడా అందదు. మిగిలిన ప్రాజెక్టులకూ అరకొర కేటాయింపులే..: కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.125 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో రూ.7.45 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక పాలేరు రిజర్వాయర్ పరిధిలో రూ.50 కోట్లు అవసరం కాగా రూ.3.98 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. రాళ్లపాడు స్టేజ్–2 పనులకు రూ.1.28 కోట్లు, వీరరాఘవునికోట ప్రాజెక్టుకు రూ.1.8 కోట్లు, కంభం చెరువుకు రూ.28 లక్షలు, పాలేటి బిట్రగుంట పనులకు రూ.45 లక్షలు, ఒంగోలు నగర పరిధిలోని పోతురాజు కాలువ డ్రైనేజీ పనులకు రూ.45 లక్షల చొప్పున కేటాయించారు. ఇక గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి తాజా బడ్జెట్లో రూ.266.73 కోట్లు కేటాయించినట్లు లెక్కల్లో చూపారు. వాస్తవానికి గుండ్లకమ్మ ప్రాజెక్టు వైఎస్ హయాంలోనే 95 శాతం పనులు పూర్తయ్యాయి. ఆయన మరణానంతరం నిధుల కేటాయింపులు లేవు. పట్టుమని రూ.20 నుంచి రూ.30 కోట్ల నిధులు కేటాయిస్తే పనులు పూర్తయ్యేవి. అయితే చంద్రబాబు సర్కారు వచ్చాక బడ్జెట్ అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచారు. ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లలోపు నిధులు అయితే సరిపోతాయని అధికారులు తాజా అంచనాలు ప్రభుత్వానికి పంపారు. విచిత్రమేమిటంటే బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.266.73 కోట్లు కేటాయించటం గమనార్హం. ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున దోచుకునేందుకే అంచనాలను భారీగా పెంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నాగార్జున సాగర్ కాలువ ఆధునికీకరణ పనులకు రూ.103.56 కోట్లు కేటాయించారు. మొత్తంగా జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు చంద్రబాబు సర్కారు నిధుల కేటాయింపుల్లో మొండిచేయి చూపిందని చెప్పాలి. పోర్టు..పారిశ్రామిక కారిడార్ల ఊసేదీ..: బడ్జెట్లో రామాయపట్నం ఊసే లేదు. దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్, కనిగిరి నిమ్జ్లను ఏ మాత్రం పట్టించుకున్నట్లు లేదు. విమానాశ్రయం సంగతి మరిచారు. నిరుద్యోగ భృతికి కేవలం రూ.500 కోట్లను కేటాయించటం చూస్తే బాబు సర్కారు చిత్తశుద్ధి ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చినా మొత్తం బడ్జెట్లో వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించిన పాత బకాయిలే జిల్లా స్థాయిలో రూ.30 కోట్ల వరకు ఉన్నాయి. వాటిని చెల్లించే పరిస్థితి లేదు. ఇక డ్వాక్రా మహిళల పెట్టుబడి నిధి, రైతు రుణమాఫీలకు నామమాత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. రైతుల కోసం రూ.5 వేల కోట్లకుపైగా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటామని బాబు సర్కారు గతంలో పలుమార్లు చెప్పినా బడ్జెట్లో మొక్కుబడి కేటాయింపులతో సరిపెట్టారు. ఇక పేదలకు అడిగినన్ని గృహాలు కట్టిస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చినా అవేమీ నెరవేరలేదు. తాజాగా లక్షల గృహాలు నిర్మిస్తామంటూ బాబు సర్కారు ప్రకటించిన ఆ స్థాయిలో నిధుల కేటాయింపుల్లేకపోవడం గమనార్హం. మొత్తంగా 2017–18 బాబు బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి మిగిలింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
భూములు తీసుకుంటే.. కాపురాలు కూలుతాయి!
⇒ భూ నోటిఫికేషన్ను రద్దు చేయాలని డిమాండ్ ⇒ భూ దందాపై మూకుమ్మడిగా రైతుల అభ్యంతరాలు మచిలీపట్నం(కృష్ణా జిల్లా): ప్రభుత్వంపై రైతులు తిరుగుబావుటా ఎగురవేశారు. మచిలీపట్నంలో పారిశ్రామిక కారిడార్, పోర్టు నిర్మాణం పేరుతో 33,601 ఎకరాలను సమీకరించేందుకు ప్రభుత్వం ఇటీవల భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపధ్యంలో మంగళవారం కోన, పోలాటితిప్ప, అరిసేపల్లి, మేకవానిపాలెం, బుద్దాలపాలెం గ్రామాల్లో రైతుల నుంచి అంగీకారపత్రాలు, అభ్యంతరాలు తీసుకునేందుకు అవగాహన సదస్సులను మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) అధికారులు ఏర్పాటు చేశారు. మాకు ఉన్న ఎకరం, రెండు ఎకరాల భూమిని కూతుళ్ల పెళ్లి చేసే సమయంలో కట్నంగా ఇచ్చామని, భూ సమీకరణ పేరుతో ఆ భూములు తీసుకుంటే వందలాది కాపురాలు కూలిపోయే ప్రమాదం ఏర్పడుతోందని పలువురు మహిళలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఐదు గ్రామాలకు చెందిన రైతులు పార్టీలకు అతీతంగా భూసమీకరణకు భూములు ఇచ్చేది లేదని ఏకగ్రీవంగా తీర్మానించి సంతకాలు చేసి ఎంఏడీఏ అధికారులకు అందజేశారు. అసైన్డ్ భూములు సమీకరణ నోటిఫికేషన్లో ఒకరి పేరున ఉండగా వేరే రైతులు ఆ భూమికి హక్కుదారులుగా ఉన్నారని ఈ తరహా రైతులను ఏం చేస్తారని రైతులు అధికారులను ప్రశ్నించారు. గ్రామాలకు గ్రామాలను సైతం ఖాళీ చేయించే పనిలో భాగంగా భూసమీకరణ అంశాన్ని టీడీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని, ప్రాణాలు పోయినా భూములను ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. భూసమీకరణ అవగాహన సదస్సు నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పోలీసులను అడ్డు పెట్టుకుని భూములు గుంజుకోలేరని రైతులు ఈ సందర్భంగా స్పష్టంచేశారు. భూసమీకరణ నోటిఫికేషన్ను రద్దు చేయాలని, ప్రభుత్వ భూ దందాను ఇప్పటికైనా ఆపాలని అన్ని గ్రామాల్లోని రైతులు నినాదాలు చేశారు. అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం జరగటంతో పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు జోక్యం చేసుకున్నారు. -
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు ఏడీబీ నిధులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫండింగ్ ఏజెన్సీ ‘ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్’ (ఏడీబీ) తాజాగా భారత్ తొలి తీరప్రాంత పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు రుణ సాయం అందించేందుకు ఆమోదం తెలిపింది. ఈ పారిశ్రామిక కారిడార్ విశాఖపట్నం-చెన్నై మధ్యలో నిర్మాణం కానుంది. దీనికోసం ఏడీబీ 631 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4,200 కోట్లు) మేర నిధులను అందించడానికి ముందుకొచ్చింది. ఈ నిధులతో తొలిగా మొత్తం 2,500 కిలోమీటర్ల కారిడార్ ఏర్పాటులో ప్రధానమైన 800 కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చని, దీంతో దక్షిణ తూర్పు ఆసియా దేశాలతో భారత్ వాణిజ్య కార్యకలాపాలు మరింత బలోపేతమవుతాయని ఏడీబీ పట్టణాభివృద్ధి విభాగపు ప్రధాన విశ్లేషకుడు మనోజ్ శర్మ అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వల్ల విశాఖ-చెన్నై తీరం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా అవతరిస్తుందని చెప్పారు. కాగా మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 846 మిలియన్ డాలర్లు. మిగతా 215 మి. డాలర్లను ఆంధ్రప్రదేశ్ సర్కారు సమకూర్చాల్సి ఉంటుంది. -
పారిశ్రామిక కారిడార్గా తీరప్రాంతం
హంసలదీవి పర్యటనలో సీఎం చంద్రబాబు కోడూరు : పరిశ్రమలు స్థాపించేందుకు అనువుగా ఉన్న సముద్రతీర ప్రాంతం వెంబడి పారిశ్రామిక(ఇండస్ట్రియల్) కారిడార్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సీఎం ఎన్.చంద్రబాబు తెలిపారు. హంసలదీవి పవిత్ర కృష్ణా సాగరసంగమ ప్రాంతంలో సీఎం గురువారం పర్యటించి.. పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఇచ్ఛాపురం దగ్గర నుంచి తడ వరకు సముద్రతీరం వెంబడి రోడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం చెప్పారు. బందరు పోర్టు పనులను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా సాగరసంగమ ప్రాంతానికి చేరుకున్న సీఎం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణమ్మ-సాగరుడు కలిసే ప్రాంతంలో నదీమతల్లికి హారతులిచ్చారు. ఎన్టీఆర్ వైద్యసేవలో మరో 106 వ్యాధులను చేర్చామని తెలిపారు. ఇప్పటికే వైద్యశాలల్లో వ్యాధిగ్రస్తుల డేటా ఉందని, ఈ డేటాను వైద్యులు తీసుకుని వారివద్దకే వెళ్లి వైద్యం చేస్తారని చెప్పారు. 26,27న గుంటూరులో జాబ్మేళా: దళిత, గిరిజన యువతకు జాబ్మేళాలు నిర్వహించాలని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్బాబును సీఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం ఉదయం తన నివాసంలో మంత్రి రావెలతో కలసి ఈనెల 26, 27న గుంటూరులోని చౌడవరంలో నిర్వహించే జాబ్మేళా వాల్పోస్టర్ను సీఎం విడుదల చేశారు. రావెల ట్రస్ట్, వికాస సంస్థ ఆధ్వర్యంలో ఆర్వీఆర్-జేసీ కళాశాల ప్రాంగణంలో మేళా జరగనుంది. టెన్త్ నుంచి ఇంజనీరింగ్ వరకు చదువుకున్న వారెవరైనా ఈ మేళాకు రావచ్చన్నారు. ఆసక్తి గలవారు www.ravelatrust. org వెబ్సైట్ ద్వారా ఈనెల 23లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. -
చంద్రబాబుకు భూదాహం
ఏపీ రైతు సంఘం విజయవాడ (భవానీపురం) : మచిలీపట్నం పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం లక్ష ఎకరాల భూమిని సమీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ముఖ్యమంత్రి చంద్రబాబు భూ దాహానికి నిదర్శనమని ఏపీ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి.బలరాం, వంగల సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. బందరు, పెడన మండల పరిధిలో 30 గ్రామాల్లో భూ సమీకరణకు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించటం, అందుకు ప్రభుత్వం పూనుకోవడం దారుణమని పేర్కొన్నారు. 30 గ్రామాల్లో ఈ భూమినంతటినీ మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా సంవత్సరంలోపు తీసుకోనుందని ఆరోపించారు. కేవలం రెండు వేల ఎకరాలు సరిపోయే పోర్టుకు లక్ష ఎకరాలు సేకరించడం క్విడ్ ప్రోకో కోసమేనని విమర్శించారు. గతంలో భూ సేకరణకు గ్రామాల్లో సభలు నిర్వహించేందుకు ఎంపీ కొనకళ్ల నారాయణ, మంత్రి కొల్లు రవీంద్ర వెళ్తే ప్రజలు తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. మచిలీపట్నం కోన గ్రామంలో ఇద్దరు నేతలను తరిమి కొట్టారని పేర్కొన్నారు. పొట్లపాలెంలో ఏర్పాటు చేసిన సభను బహిష్కరించారని వివరించారు. భూ సమీకరణ పేరుతో ఏకంగా 426 చదరపు కిలోమీటర్ల పరిధిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందని, దీంతో బందరు మండలంతోపాటు 29 గ్రామాల, పెడన మండలంలోని కాకర్లమూడితో కలిసి 30 గ్రామాలు కనుమరుగుకానున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ గ్రామాల్లో సుమారు 2.25 లక్షల మంది వ్యవసాయంపైనే జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇప్పుడుకూడా ప్రభుత్వం భూ సమీకరణ ఆపకపోతే రైతులు తీవ్రంగా ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. -
'ఇండస్ట్రియల్ కారిడార్కు ఆమోదం తెలపాలి'
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ కారిడార్కు ఆమోదం తెలపాలని తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆయన ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్తో భేటీ అయ్యారు. అనంతరం మద్యాహ్నం 3 గంటలకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్తో కేటీఆర్ భేటీ కానున్నట్టు సమాచారం. -
పారిశ్రామిక వాడగా శ్రీసిటీ
హార్టికల్చర్ హబ్గా రాయలసీమ శ్రీసిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి ప్రతినిధి, తిరుపతి: పారిశ్రామిక వాడగా శ్రీసిటీ.. ప్రజారాజధానిగా అమరావతి అంతర్జాతీయ స్థాయిలో శాశ్వతంగా నిలిచిపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సోమవారం శ్రీసిటీలో ఏర్పాటుచేసిన మాండలెజ్ (క్యాడ్బరీ) పరిశ్రమ తొలిదశ ఉత్పత్తులను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ శ్రీసిటీ పరిశ్రమలకు అత్యంత అనువైందనీ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు వుండేలా రూపుదిద్దుకుంటోందన్నారు. అందుకే ప్రపంచస్థాయి సంస్థలు ఇక్కడకు వస్తున్నాయని అన్నారు. శ్రీసిటీని మూడు నగరాలను కలిపే ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రాన్ని కలుపుతూ నెల్లూరు, చెన్నై ఎక్స్ప్రెస్ హైవే రూపుదిద్దుకోబోతోందని తెలిపారు. ఈ ప్రాంతంలో సోమశిల, కండలేరు నీరు ఉండడం వల్ల నీటి సమస్య లేదన్నారు. కృష్ణపట్నం పవర్ ప్లాంటు ఉన్నందున విద్యుత్ సమస్య తలెత్తదన్నారు. శ్రీసిటీలో 25 వేల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే శ్రీసిటీలో 80 కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభించాయని మరో 40 కంపెనీలు నిర్మాణ దశలో వున్నాయని సీఎం అన్నారు. 35 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించాయనీ, రూ.25వేల కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దేశస్థాయిలో ఇండస్ట్రియల్ టౌన్షిప్ అంటే శ్రీసిటీ ఒక్కటేనని గుర్తించేలా తీర్చిదిద్దుతామని తెలి పారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు అందుబాటులో వుండే విధంగా ఆరు నెలల్లో 5 వేల గృహాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు. రవాణా వ్యవస్థలో శ్రీసిటీకి రైలు, రోడ్డు, జల మార్గాలు, విమానమార్గాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శ్రీసిటీలో 1600 మంది గ్రామీణ యువతకు శిక్షణ కల్పించి ఉద్యోగావకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దనున్నామని అన్నారు. ప్రస్తుతం 23 హెక్టార్లలో కోకో పండిస్తున్నామని మరో పదేళ్లలో 75వేల హెక్టార్లకు విస్తరించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాల ఉత్పత్తిలో ఏపీ ప్రథమ స్థానంలో వుందనీ, చాక్లెట్ ఉత్పత్తులకు అవసరమయ్యే పాల పౌడర్కు కొరతలేదని తెలిపారు. శ్రీసిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన టూరిజం స్పాట్ను ఏర్పాటుచేయాలని సూచించారు. దీనిపై మాండలెజ్ సంస్థ ప్రతినిధులతో చర్చించామని తెలిపారు. కార్యక్రమంలో క్యాడ్బరీ సంస్థ ప్రతినిధులు డేనియల్ మెర్స్, ఆస్కార్రంగెల్, చంద్రమౌళి, వెంకటేశన్, రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు తలారి ఆదిత్య, సత్యప్రభ, సుగుణమ్మ, శ్రీసిటీ అధినేతలు రవీంద్రసన్నారెడ్డి, శ్రీనిరాజు, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, జేసీ భరత్గుప్తా, తిరుపతి సబ్కలెక్టర్ ిహ మాంశు శుక్లా, చిత్తూరు ఎస్పీ జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇండస్ట్రియల్ కారిడార్కు రైతులు సహకరించాలి
ఆర్డీవో సూర్యారావు నక్కపల్లి: ఇండస్ట్రియల్ కారిడార్కు రైతులు సహకరిస్తే పనులు వేగవంతం చేస్తామని నర్సీపట్నం ఆర్డీవో కె.సూర్యారావు కోరారు. బుధవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో నలుగురు డిప్యూటీ కలెక్టర్లతో కలిసి సమావేశం అయ్యారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. నక్కపల్లి మండలంలో వేంపాడు, రాజయ్యపేట, అమలాపురం, డీఎల్పురం, బుచ్చిరాజుపేట, చందనాడ ప్రాంతాల్లో రెండు విడతలుగా సుమారు 6 వేల ఎకరాలు భూసేకరణ జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్పారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినందున భూముల సర్వేకు ఐదు బృందాలు నియమించామని చెప్పారు. గ్రామాల్లో బుధవారం నుంచి సర్వే ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రభుత్వ, జిరాయితీ భూముల సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. సర్వే పూర్తయితే నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు సమగ్ర వివరాలు సర్వే బృందాలకు అందజేయాలని కోరారు. డిప్యూటీ కలెక్టర్లు గోవిందరాజులు, వి.రమణ,సత్తిబాబు, సుబ్రమణ్యం,సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. -
తిరుధామం.. పారిశ్రామిక తోరణం
ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి శ్రీకాళహస్తి-ఏర్పేడు ఇండస్ట్రియల్ కారిడార్లో భూముల సేకరణ స్థలం కావాలని ఏపీఐఐసీకి వినతులు తిరుపతి చుట్టుపక్కల 500 ఎకరాల భూమి సేకరించేందుకు కసరత్తు తిరుపతి: తిరునగరిలో పరిశ్రమల ఏర్పాటుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రం వీడిపోయాక తిరుపతి పరిశ్రమల కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే శ్రీసిటీ సెజ్లో వందలాది పరిశ్రమలు నెలకొల్పారు. తిరుపతి సమీపంలోని విమానాశ్రయం వద్ద రూ.1,070కోట్ల పెట్టుబడితో శ్రీవెంకటేశ్వర ఎలక్ట్రానిక్ మొబైల్ తయారీ హబ్ ఏర్పడింది. విద్యా సంస్థలు ఐఐటీ, ఐజర్కు శంకుస్థాన చేశారు. చెన్నె, బెంగళూరు నగరాలకు తిరుపతి అందుబాటులో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయం కలిగి ఉండటం కలిసొచ్చే అంశం. 1,720 ఎకరాలు సిద్ధం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జిల్లాలో 1,720 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయి. పీలేరు సమీపంలో 600 ఎకరాలు, కలికిరి సమీపంలోని తాటిగుంటపల్లెలో 1000, గంగవరం మండలం గండ్రరాజులపల్లెలో 120 ఎకరాలు ఉన్నాయి. ఎక్కువమంది పారిశ్రామికవేత్తలు తిరుపతి సమీపంలోనే భూములు కావాలని దరఖాస్తు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తిరుపతి చుట్టుపక్కల 500 ఎకరాల భూమిని సేకరించడానికి ఏపీఐఐసీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు జిల్లాలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 2వేల ఎకరాల భూమిని పరిశ్రమల కోసం కేటాయించారు. శ్రీకాళహస్తి-ఏర్పేడు ప్రాంతంలో.. తిరుపతి చుట్టుపక్కల భూములు లేకపోవడంతో శ్రీకాళహస్తి-ఏర్పేడు ప్రాంతాల వైపు పారిశ్రామికవేత్తలు దృష్టి సారించినట్లు సమచారం. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్ల నుంచి నీటిని తరలించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ ఇబ్బంది తలెత్తితే కాళంగి రిజర్వార్ నుంచి నీటిని వినియోగించుకునేందుకు వీలుగా ప్రయివేటు ఏజెన్సీ ద్వారా డీపీఆర్ సిద్ధం చేశారు. ఇటీవలే సర్వే కూడా పూర్తి అయినట్లు సమాచారం. ఐటీ కంపెనీలు.. ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ సంస్థలు తిరుపతిలో ఏర్పాటుచేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా తిరుపతి సమీపంలోని విమానాశ్రయ సమీపంలో, ఏర్పేడు ప్రాంతాల్లో కంపెనీ ప్రతినిధులు భూములను పరిశీలించినట్లు తెలుస్తోంది. టీసీఎస్, హెచ్సీఎల్ సంస్థల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెరికాకు చెందిన కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థ రూ.1,500 కోట్లతో తిరుపతిలో క్యాంపస్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు, ఇందులో భాగంగానే కంపెనీ ప్రతినిధులు అనువైన ప్రదేశాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద తిరుపతి నగరంలో పరిశ్రమలు స్థాపించేందుకు కంపెనీ యజమానులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుతం ఈ అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందో వేచి చూడాలి. -
ఇండస్ట్రియల్ కారిడార్గా తిరుపతి
రేణిగుంటలో సెల్కాన్ తయారీ యూనిట్కు సీఎం భూమిపూజ సాక్షి ప్రతినిధి, తిరుపతి: పరిశ్రమల ఏర్పాటుకు తిరుపతి అనుకూల ప్రాంతమని,జాతీయ రహదారుల సౌకర్యం ఉన్నందున తిరుపతి-చెన్నై -నెల్లూరు మధ్య తిరుపతి కేంద్రంగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తిరుపతి-ఏర్పేడు ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చేస్తామన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఐటీ పార్కులో రూ.150 కోట్లతో ఏర్పాటు చేస్తున్న సెల్కాన్ మొబైల్ తయారీ కంపెనీకి ముఖ్మమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం భూమి పూజ చేశారు. కంపెనీ ఆవరణలో మొక్కలు నాటి, నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటేశ్వర మొబైల్ యూనిట్లో మొదటి కంపెనీ సెల్కాన్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం హర్షణీయమన్నారు. ఇండియాలోని బెస్ట్ కంపెనీల్లోఒకటైన సెల్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తిరుపతికి రావడం సంతోషమన్నారు. దీని ద్వారా మొదటి దశలో ప్రత్యక్షంగా 20వేల మందికి, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. సెల్కాన్ సీఎండీ వై.గురు కంపెనీ ప్రగతిని వివరించారు. సీఎండీ గురు, డెరైక్టర్లు పవన్, రాధాకృష్ణలను ముఖ్యమంత్రి సన్మానించారు. -
రాచకొండకు రాజయోగం
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని రాచకొండకు మళ్లీ రాజయోగం పట్టనుంది. ఇన్నాళ్లూ ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన రాచకొండకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీఎస్ ఐపాస్ పేరుతో తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో మహర్దశ పట్టనుంది. ఈ పారిశ్రామిక విధానానికి ఆకర్షితులవుతున్న పారిశ్రామికవేత్తలు, ఇప్పుడిప్పుడే హైదరాబాద్కు చేరువలోని రాచకొండపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇది పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనువైన ప్రాంతమని భావిస్తున్నారు. నల్లగొండ-రంగారెడ్డి-మహబూబ్నగర్ జిల్లాల సరిహద్దులో రాచకొండ అటవీ ప్రాంతం ప్రభుత్వ, అటవీ, అసైన్డ్, సీలింగ్ భూములతో కలుపుకొని 42 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది హైదరాబాద్ నగరానికి చేరువలో, శంషాబాద్ విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల లోపు దూరంలో, ఔటర్ రింగ్రోడ్డుకు అతి సమీపంలో ఉంది. దీంతో ప్రభుత్వం మూడు జిల్లాల సరిహద్దులోని ప్రాంతమంతటినీ పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రెండుమార్లు ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా గుర్తించారు. పారిశ్రామిక వేత్తలు కూడా పరిశీలించి బాగుందని చెప్పడంతో, మహబూబ్నగర్ జిల్లా ముశ్చర్లలో ఫార్మాసిటీకి 11 వేల ఎకరాల భూమిని కేటాయించారు. రాచకొండలో 2 వేల ఎకరాల్లో ఆత్యాధునిక హంగులతో కూడిన సినిమా సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైలు బోగీల పరిశ్రమ రాచకొండలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన స్థలం కోసం ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం సర్వే చేసింది. 14 వేల ఎకరాల భూమి పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నట్టు తేల్చింది. ఈ భూమిని క్లస్టర్లుగా విభజించనున్నారు. ఒక్కో క్లస్టర్ను ఒక్కో దానికి కేటాయించే ఆలోచన చేస్తున్నారు. ఓ క్లస్టర్లో 2 వేల ఎకరాలు ఫిలింసిటీకి, మరో 2 వేల ఎకరాలు స్మార్ట్ సిటీకి కేటాయించే ఆలోచన చేస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో రైలు బోగీల పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన రుయా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పవన్కుమార్ రుయా, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కంపెనీల ప్రతినిధులతో కలసి వారంరోజుల క్రితం రాచకొండ ప్రాంతాన్ని పరిశీలించారు. శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్రోడ్డు, ఎన్హెచ్-65లకు రాచకొండ ఎంతదూరంలో ఉందనే విషయంపై ఆరా తీశారు. అనంతరం రాచకొండ పరిశ్రమల ఏర్పాటుకు బాగుందని కితాబునిచ్చారు. ఏడు దేశాల కంపెనీల సహకారంతో 2 వేల ఎకరాల్లో రూ.20 వేల కోట్ల పెట్టుబడులతో స్మార్ట్సిటీతోపాటు, పలు పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే ప్రభు త్వ పరిశీలనలో ఫిల్మ్సిటీ, స్పోర్ట్స్సిటీ, ఎడ్యుకేషన్ హబ్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రతిపాదనల్లో ఉన్నాయి. కాగా ఇప్పటికే, రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే పలు పరిశ్రమలకు ఏపీఐఐసీ భూములను కేటాయించింది. రాచకొండకు నాలుగులేన్ల రోడ్లు రాచకొండకు హైదరాబాద్ నుంచి, శంషాబాద్ నుంచి, 65వ నెంబరు జాతీయ రహదారి నుంచి నాలుగులేన్ల రోడ్లను అభివృద్ది చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్రోడ్డుకు అనుసంధానంగా, మెదక్, వరంగల్, కరీంనగర్, శ్రీశైలం, విజయవాడ జాతీయ రహదారులను కలుపుతూ, మరో రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇదే విషయమై ఇప్పటికే హైదరాబాద్ నుంచి 60 నుంచి 100 కి.మీ. దూరంతో రింగ్ రోడ్డు ఉంటుందని ప్రకటన కూడా చేసింది. హైవేలను కలపడం ద్వారా, రాజధానికి వాహనాల రద్దీని తగ్గించాలనేది ఈ రింగ్రోడ్డు ఉద్దేశం. ఈ రోడ్డుతో రాచకొండ ప్రాంతం రింగురోడ్డు లోపలకు వస్తుంది. ైెహ దరాబాద్కు రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. -
గ్రేటర్ వరంగల్
చారిత్రక సిటీకి అరుదైన గుర్తింపు వరంగల్ నగరానికి గ్రేటర్ హోదా రాష్ట్రంలో రెండో మహా నగరం మనదే.. మెరుగుపడనున్న పౌర సేవలు రూపు మారనున్న నగరం టైక్స్టైల్ పార్కు, కమిషనరేట్, వ్యాగన్ పరిశ్రమ, ఇండస్ట్రియల్ కారిడార్, ఐటీ ఇంక్యుబేషన్ వచ్చారుు. ప్రస్తుతం నగరానికి గ్రేటర్ హోదా దక్కింది.ఆధునిక పద్ధతిలో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రెరుునేజీ, వీధి దీపాలు, రవాణా వ్యవస్థ, ఆర్థిక స్థితిగతులు, కంప్యూటరీకరణ, మౌలిక వసతులు ఇలా అనేక రకాలుగా అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. {Vేటర్లో భాగంగా 42 గ్రామాలు విలీనం కావడంతో ఐదుగురు ఎమ్మెల్యేల ప్రాతినిథ్యం ఉండనుంది. వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు రాజకీయంగా ప్రాధాన్యం ఉంటుంది. హన్మకొండ : ఏకశిలా నగరానికి అరుదైన గుర్తింపు లభించింది. 800 ఏళ్ల చరిత్ర ఉన్న వరంగల్ సిగలో గ్రేటర్ నగ చేరింది. వరంగల్ నగర పాలక సంస్థను గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్గా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. వరంగల్ నగరం హోదాను పెంచుతూ ప్రభుత్వం ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో హైదరాబాద్కు మాత్రమే ప్రస్తుతం గ్రేటర్ హోదా ఉంది. రాజధాని తర్వాత పెద్ద నగరంగా ఉన్న వరంగల్కు తాజాగా గ్రేటర్ హోదా వచ్చింది. రెండు రో జుల క్రితమే వరంగల్ అర్బన్ పోలీస్ ప్రాంతాన్ని క మిషరేట్గా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవల ప రంగా కీలకమైన కార్పొరేషన్ విషయంలో ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. వరంగల్కు గ్రేటర్ హోదాతో న గరపాలక సంస్థ పరంగా సేవలు పెరగనున్నాయి. గ్రేటర్ వరంగల్కు పరిపాలన అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారే ఉంటారు. పరిపాలన సౌలభ్యం కో సం ఇప్పుడునున్న రెండు సర్కిల్ కార్యాలయాలకు తోడు మరో మూడు లేదా నాలుగు ఏర్పాటు చేస్తారు. సేవలతోపాటు పన్నుల వసూలు ప్రక్రియ కొంతపుంతలు తొక్కనుంది. ఫలించిన నిరీక్షణ వరంగల్ నగరపాలక సంస్థను గ్రేటర్ వరంగల్గా మార్చాలనే డిమాండ్ ఐదేళ్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కొనసాగిన కాలంలో హైదరాబాద్, విశాఖపట్నం తర్వాత వరంగల్ నగరానికి గ్రేటర్ హోదాను కల్పించేందుకు అప్పటి ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. 2012 డిసెంబరులో జరిగిన కాకతీయ ఉత్సవాల ప్రారంభోత్సవాల్లో.. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి గ్రేటర్ వరంగల్ ఏర్పాటుపై హామీ ఇచ్చారు. ఆ తర్వాత వరంగల్ నగర శివారులోని 42 గ్రామాలను వరంగల్ నగరపాలక సంస్థలో విలీనం చేస్తూ ఉత్తర్వులు రెండేళ్ల కిందటే వచ్చాయి. గ్రేటర్ వరంగల్పై ఉత్తర్వులు మాత్రం రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. 2015 జనవరిలో నాలుగు రోజులపాటు నగరంలో బస చేశారు. నగరాభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్పై ఉత్తర్వుల జారీలో జరుగుతున్న ఆలస్యం సీఎం దృష్టికి వచ్చింది. నగర పర్యటన ముగించికుని వెళ్లిన 20 రోజుల వ్యవధిలోనే వరంగల్ నగరాన్ని గ్రేటర్ వరంగల్గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం గ్రేటర్ వరంగల్ పరిధిలో 9 లక్షలకు పైగా జనాభా ఉంది. కార్పొరేషన్ డివిజన్ల విభజన త్వరలోనే కొలి క్కి రానుంది. గ్రేటర్లో భాగంగా నగరంలో 42 గ్రా మాలను కలపడం వల్ల నగరపాలక సంస్థలో ఐదుగు రు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం ఉండనుంది. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకర్గాలు పూర్తిగా కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. వర్ధన్నపేట నియోజకర్గ పరిధిలో హన్మకొండ, హసన్పర్తి, వర్ధన్నపేట మండలాల్లోని 30 గ్రామాలు.. పరకాల నియోజకర్గం పరిధిలో గీసుకొండ, సంగెం మండలాల్లో 10 గ్రామాలు, స్టేషన్ఘన్పూర్ నియోజకర్గం పరిధిలో ధర్మసాగర్ మండలం పరిధిలో రెండు గ్రామాలు గ్రేటర్ పరిధిలో ఉన్నాయి. కార్పొరేషన్ పాలన వ్యవహారాల్లో పార్లమెంటు కార్యదర్శి వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, రమేశ్, ధర్మారెడ్డి, రాజయ్యలు ప్రత్యక్షంగా పాలుపంచుకోనున్నారు. శరవేగంగా అభివృద్ధి చరిత్రాత్మక నగరంగా ఉన్న వరంగల్ ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదు. అజాంజాహి మిల్లు వంటి ప్రతిష్టాత్మక పరిశ్రమలు మూతపడ్డాయి. రైల్కోచ్ ఫ్యాక్టరీ వంటి కీలక ప్రాజెక్టులు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. తెలంగాణ ఏర్పాటుతో వరంగల్ నగరం అభివృద్ధి పథంలో పడింది. టైక్స్టైల్ పార్కు, కమిషనరేట్ ఏర్పాటు, వ్యాగన్ పరిశ్రమ, ఇండిస్ట్రియల్ కారిడార్, ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ వంటి కీలక ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు వరుసగా వెలువడుతున్నాయి. అదేక్రమంలో నగరానికి గ్రేటర్ హోదా దక్కింది. తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా గుర్తించినట్టయ్యింది. హైదరాబాద్ నగరం ఇష్టారీతిగా అభివృద్ధి చెందడంతో అక్కడ కీలక ప్రాజెక్టులు చేపట్టం సంక్లిష్టంగా మారింది. దానితో రాష్ట్రంలో రెండో ఆర్థిక, పారిశ్రామిక కేంద్రంగా వరంగల్ను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తగినరీతిలో ఆధునిక పద్ధతిలో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రెరుునేజీ, వీధి దీపాలు, రవాణా వ్యవస్థ, ఆర్థిక స్థితిగతులు, కంప్యూటరీకరణ, మౌలిక వసతుల కల్పన ఇలా అనేక రకాలుగా అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది. -
ఉపాధికి ‘కారిడార్’
* హైదరాబాద్- నల్లగొండ మధ్య పరిశ్రమల ఏర్పాటుకు సీఎం హామీ * రెండో దశలో చేపడతామని అసెంబ్లీలో ప్రకటన * ఫార్మా అనుబంధ పరిశ్రమలకు ఎక్కువ అవకాశం * ఇప్పటికే 11వేల ఎకరాలను సర్వే చేసిన * జిల్లా యంత్రాంగం * అన్నీ అనుకూలిస్తే మూడేళ్లలో పూర్తయ్యే అవకాశం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర రాజధానికి సమీపంలోని జిల్లాకు మరో కారిడార్ మంజూరైంది. హైదరాబాద్-నల్లగొండ మధ్య ఇండ స్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు. ప్రభుత్వ పరిశ్రమల విధానంలో భాగంగా తెలంగాణలో కారిడార్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, అందులో హైదరాబాద్-నల్లగొండ కారిడార్ను రెండో దశలో చేపడతామని ఆయన వెల్లడించారు. సీఎం ప్రకటనతో జిల్లాకు చెందిన ఔత్సాహిక పారి శ్రామికవేత్తల్లో ఉత్సాహం నెలకొంది. అయితే, అన్నీ అనుకూలిస్తే ఈ కారిడార్ మూడేళ్లలో పూర్తి కావచ్చని పరిశ్రమల అధికారులంటున్నారు. ఇప్పటికే భూమి చూసేశారు.. వాస్తవానికి మన జిల్లాలో ఫార్మా, సిమెంటు పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. సిమెంటు పరిశ్రమలు కృష్ణానది తీరంలో, రాష్ట్ర సరిహద్దులో ఎక్కువగా ఉండగా, హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై చౌటుప్పల్ సమీపంలో ఫార్మా కంపెనీలు ఉన్నాయి. పరిశ్రమల కారిడార్ సీఎం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకు ఫార్మా అనుబంధ పరిశ్రమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ఫార్మా పరిశ్రమ ఇప్పటికే ఉన్నందున దాని అనుబంధ ఉత్పత్తులకు చెందిన పరిశ్రమలతోపాటు హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఔషధ, జూట్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని జిల్లాకు చెందిన పరిశ్రమల శాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో ఎంత భూమి అందుబాటులో ఉందన్న దానిపై రెండు నెలల క్రితం అధికారులు ఓ సర్వే నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)తో పాటు జిల్లా పరిశ్రమల శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 11వేల ఎకరాలను గుర్తించారు. అయితే, అందులో 3వేల ఎకరాలు పరిశ్రమల ఏర్పాటుకు ఉపయుక్తంగా ఉంటాయని ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాల్సి వస్తే ఈ భూముల్లో టీఎస్ఐఐసీ మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. అంటే రోడ్డు సౌకర్యం, కరెంటు, ఇతర మౌలిక అవసరాలను సమకూరుస్తుంది. ఆ తర్వాత పరిశ్రమల శాఖ.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పించి ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తుంది. ఈ పార్కులన్నింటినీ కలిపి ఇండస్ట్రియల్ కారిడార్గా వ్యవహరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మూడేళ్లు పడుతుందని ప్రాథమిక సమాచారం. -
వరంగల్-హైదరాబాద్ మధ్య పారిశ్రామిక కారిడార్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్-వరంగల్ మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చే యనున్నట్లు ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. రెండో దశలో హైదరాబాద్-మహబూబ్నగర్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ రూపొందిస్తామని వెల్లడించారు. వరంగల్, సిరిసిల్లలో టెక్స్టైల్ పార్కులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వినయ్ భాస్కర్, గువ్వల బాలరాజు (టీఆర్ఎస్), తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు (వైఎస్ఆర్సీపీ) అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. దేశంలోనే అత్యుత్తమమైన నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వచ్చే ఏడాది 2వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. 1800 మెగావాట్ల సౌర విద్యుత్తుకు బిడ్లు వచ్చాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని, వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామీకరణకు సంబంధించి అవ గాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహకాలతో పాటు మార్జిన్ మనీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఈ వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. అలాగే అనుమతులకు సంబంధించి సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 15 నుంచి 30రోజుల్లో అన్ని అనుమతులు వచ్చేలా ఈ విధానం ఉంటుందన్నారు. ప్రతి జిల్లాలో స్థానికంగా లభించే వనరుల ఆధారంగా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి మాట్లాడుతూ.. 2005 నుంచి 2014 వరకు పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. -
'దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్'
హైదరాబాద్: ప్రకాశం జిల్లా దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ ప్రభుత్వం నిర్ణయించింది. 45 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు. సోలార్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్, గ్రానైట్ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. బీవోటీ(బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ ఫర్) విధానంలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని మంత్రి తెలిపారు. -
పరిశ్రమలకు కేంద్రంగా జిల్లా..
బూర్గంపాడు: నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జిల్లాను ఇండస్ట్రీయల్ కారిడార్గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లాలో పవర్ప్లాంట్లు, కాగితపు పరిశ్రమ, ఉక్కు పరిశ్రమలతో పాటు వీటి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ, భూ లభ్యతపై జిల్లా అధికారయంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. నీరు, బొగ్గు తదితర ప్రకృతి వనరులు అందుబాటులో ఉండటంతో పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా కీలకంగా మారింది. ఇప్పటికే పాల్వంచలోని కేటీపీఎస్ విస్తరణకు ప్రజాభిప్రాయసేకరణ కూడా పూర్తయింది. మణుగూరు పరిసర ప్రాంతాల్లో మరో పవర్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు భూముల పరిశీలన జరుగుతోంది. మణుగూరుకు సమీపంలోని సాంబాయిగూడెం, చిక్కుడుగుంట, దమ్మక్కపేట గ్రామాల సమీపంలోని 2 వేల ఎకరాల భూముల లభ్యతపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటిలో రైతుల సాగుభూములు, ప్రభుత్వభూములు, అటవీభూముల వివరాలను సేకరిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు వ్యవసాయభూములను ఇచ్చేందుకు రైతుల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో జిల్లా అధికారులు పవర్ప్లాంట్ నిర్మాణాల కోసం అశ్వా పురం మండలంలోని కేశవాపురం, చింతిర్యాలలో కూడా భూముల అన్వేషణ ప్రారంభించారు. ఇటీవల కలెక్టర్ ఇలంబరితి అశ్వా పురం మండలంలో కూడా భూములను పరిశీలించారు. ప్రత్యామ్నాయంగా బూర్గంపాడు మండలంలోని ఇరవెండి, మోతె గ్రామాల సమీపంలోని భూముల వివరాలను కూడా జిల్లా యంత్రాంగం సేకరిస్తోంది. పినపాక నియోజకవర్గంలో సాగుభూములు ఎక్కువగా ఉండటంతో గోదావరి నదికి అవతలి ఒడ్డున ఉన్న భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో కూడా భూముల లభ్యతపై అధికారులు ఆరా తీస్తున్నారు. బూర్గంపాడు మండలంలోని సారపాక నుంచి మణుగూరు క్రాస్రోడ్ వరకు సుమారు 1300 ఎకరాల అటవీభూముల్లో ఐటీసీ మరో మెగా పేపర్పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే వన్యప్రాణి సంరక్షణ, అటవీశాఖల నుంచి పేపర్ పరిశ్రమ ఏర్పాటుకు సానుకూల సంకేతలు లభించాయి. ఇటీవల ఐటీసీ యాజమాన్యం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుని కలసి పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం ప్రాంతంలో ఓ కెమికల్ ఇండస్ట్రీని ఏర్పాటుచేసేందుకు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా స్థానికంగా చర్చసాగుతోంది. పేపర్, పవర్ప్లాంటు ఏర్పాటుతో పాటు వీటికి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కూడా కొందరు పారిశ్రామికవేత్తలు భూముల అన్వేషణలో ఉన్నారు. భూసేకరణే అసలు సమస్య: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని వనరులు ఉన్నా భూసేకరణే అసలు సమస్యగా మారనుంది. పరిశ్రమల ఏర్పాటుకు సాగు భూములను ఇచ్చేందుకు రైతులు సుముఖంగా లేరు. తమ జీవనాధారమైన పంట భూములను పరిశ్రమ ఏర్పాటుకు ఇస్తే తమ భవిష్యత్ ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వభూములు అన్యాక్రాంతైమైనాయి.అదేవిధంగా వేలాది ఎకరాల అటవీభూములు కబ్జాకు గురయ్యాయి. వీటిని ప్రభుత్వం గుర్తించి తిరిగి ప్రభుత్వపరం చేసుకుంటే పరిశ్రమల ఏర్పాటు సులభమయ్యే అవకాశం ఉంది. కేంద్రప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో చేసిన భూసేకరణ చట్ట నిబంధనలు కఠినతరంగా ఉండటంతో భూసేకరణ అంతతేలికగా జరిగే పరిస్థితులు లేవు. -
రూ.200 కోట్లతో వీకేటీ ఫార్మా ఏర్పాటు
విశాఖపట్నం: రూ. 200 కోట్ల స్థూల పెట్టుబడితో శ్రీకాకుళంలోని ఇండస్ట్రియల్ కారిడార్లో వీకేటీ ఫార్మా ఉత్పాదక యూనిట్ను నెలకొల్పినట్లు సంస్థ అధినేత పొట్లూరి రమేష్బాబు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇండస్ట్రియల్ కారిడార్కి పునాదిలా అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీకేటీ ఫార్మా పెద్ద అడుగు వేసిందన్నారు. తాము ప్రమోట్ చేసిన మరో కంపెనీ ఎస్ఎంఎస్ ఫార్మా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాలకు పలు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. అల్సర్, మైగ్రేన్, ఫంగల్, హెచ్ఐవీ లాంటి వైద్యచికిత్సలో అవసరమయ్యే మందుల ఉత్పాదనలో అగ్రగామిగా కొనసాగుతున్నామన్నారు. తాజాగా శ్రీకాకుళంలో 75 ఎక రాల విస్తీర్ణంలో ఫార్మా రంగపు తొలిపరిశ్రమగా వీకేటీ ఆవిర్భవించిందన్నారు. -
చెన్నై- విశాఖ పారిశ్రామిక కారిడార్
ఢిల్లీ: చెన్నై- విశాఖ పారిశ్రామిక కారిడార్కు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రత్యేక రాయితీలు కోరుతున్నట్లు ఆమె తెలిపారు. బెంగళూరు - చెన్నై, బెంగళూరు - ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు నిర్మలాసీతారామన్ చెప్పారు. విశాఖ - చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ** -
31,334 ఎకరాలు పరిశ్రమలకు అనువైన భూములు
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి అంతా వరంగల్ కేంద్రంగానే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. హైదరాబాద్-వరంగల్-భూపాలపల్లి ప్రాంతాలను కలుపుతూ పారి శ్రామిక కారిడార్ ఏర్పాటు అంశం ఇప్పుడు ప్రతిపాదన దశలో ఉంది. హైదరాబాద్-వరంగల్ నగరాల మధ్య పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పరిశ్రమలకు అనువైన భూముల కోసం రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశంలో జిల్లాలో పారిశ్రామిక భూములు లేవని మన అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్... పారిశ్రామిక భూముల గుర్తింపు ప్రక్రియను మరోసారి చేపట్టారు. పూర్తిగా చదును చేసి నీటి సరఫరా ఉన్న వాటినే కాకుండా... వ్యవసాయానికి పనికిరాని భూములన్నీంటినీ గుర్తించాలని ఆదేశించారు. రెవెన్యూ యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా మరోసారి భూములను పరిశీలించింది. వ్యవసాయానికి యోగ్యంకాని భూములను గుర్తించింది. ఇలా జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్లలో కలిపి 31,334 ఎకరాల పారిశ్రామిక భూములు ఉన్నాయని నిర్ధారించారు. మన జిల్లాలోనే అవకాశాలు.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పరిశ్రమల అభివృద్ధికి వరంగల్లోనే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి నది నుంచి నీటిని, సింగరేణి బొగ్గును వనరులుగా వినియోగించుకోవచ్చని పేర్కొంటోంది. కరెంటు ఉత్పత్తికి సంబంధించి సింగరేణి కొ త్తగా చేపట్టనున్న గనులు జిల్లాలోనే ఉన్నాయి. వీటితో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇలా అన్ని వనరులతో పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో అనువైన భూ ములను రెవెన్యూ శాఖ గుర్తించింది. ఇప్పటికే ప్రతిపాదన దశలో పలు పరిశ్రమలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ జిల్లాలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఈ పరిశ్రమ మంజూరైతే 500 ఎకరాలు అవసరం ఉంటుంది. రూ.5 వేల కోట్లతో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగానే ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే రైల్యే వ్యాగన్ వర్క్షాప్ ఏర్పాటుకు భూమి విషయమే అడ్డంకిగా మారింది. 55 ఎకరాల్లో రూ.150 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. వరంగల్-స్టేషన్ఘన్పూర్ మధ్యలో దీని ఏర్పాటుకు నిర్ణయించారు. టెక్స్టైల్ పారిశ్రామిక పార్క్ను సైతం ఇదే ప్రాంతంలో నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే చేపట్టిన లెదర్పార్క్ ఉంది. జిల్లాలో భూపాలపల్లి ప్రాంతంలోనే కొత్తగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు బయ్యారంలో కాకుండా మహబూబాబాద్ పరిసరాల్లో లేదా ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్న మణగూరు-రామగుండం రైల్వే లైను ఏర్పాటు అయితే బొగ్గు ఆధారిత పరిశ్రమలు మరికొన్ని పరిశ్రమలు జిల్లాలో కొలువుదీరే అవకాశం ఉంది. ఇలా కొత్త పరిశ్రమల ఏర్పాటు ఆవశ్యకత నేపథ్యంలో జిల్లాలోని భూములను గుర్తించారు. -
జిల్లాలో పదిలక్షల ఎకరాలకు సాగునీరు
మహబూబ్నగర్ విద్యావిభాగం: జిల్లాలోని పది లక్షల ఎకరాలకు సాగునీరు అం దించడమే తన ప్రధాన లక్ష్యమని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు జితేందర్రెడ్డి అన్నారు. ఆదివారం పాలమూరు రెడ్డి సేవా సమితి బాలుర వసతి గృహంలో జిల్లాలోని రెడ్డి ప్రతినిధులను సన్మానించారు. సమితి అధ్యక్షుడు టి.ఇంధ్రసేనారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎం.పి. జితేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పేద రెడ్డి పిల్లల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జల్లాలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేసి అందరికి ఉపాధి కల్పిస్తామన్నారు. సమితి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కల్యాణ మండపానికి తన వంతు సహకారమందిస్తానన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ సమాజంలో రెడ్లు ముఖ్యభూమికను పోషిస్తున్నారన్నారు. జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ నవీన్కుమార్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రెడ్డి సోదరులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అందరికి తనవంతు సేవలందిస్తానన్నారు. మహబూబ్నగర్ మున్సిపల్ ఛైర్పర్సన్ రాధ, కౌన్సిలర్లు విఠల్రెడ్డి, రవికిషన్రెడ్డి, పాండురంగారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు మల్లు సరస్వతిని సేవా సమితి సభ్యులు సన్మానించారు. అథితులుగా హాజరైన జయరామ మోటర్స్ అధినేత బెక్కరి రాంరెడ్డి బాలబాలికల వసతి గృహానికి *10లక్షల విరాళం ప్రకటించారు. కళ్యాణ మండపం నిర్మాణానికి మల్లు నర్సింహ్మారెడ్డి 2లక్షలు, షాద్నగర్ విష్ణువర్ధన్రెడ్డి *50వేలు విరాళం ప్రకటించారు. చదువులో విశేష ప్రతిభ కనభర్చిన ముచ్చింతల నివాసి సందీప్రెడ్డికి వైద్య విద్య ఎంబిబిఎస్ పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం అందిస్తామని, బి.ఇడి విద్యార్థి లక్ష్మణ్కు చదువు ఖర్చు బరిస్తామని రెడ్డి సేవా సమతి అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో సలహాదారు వి.మనోహర్రెడ్డి, ప్రొద్దుటూరి ఎల్లారెడ్డి, గౌరవ అధ్యక్షుడు వి.చిన్నారెడ్డి, పి.రాఘవరెడ్డి, ప్రచార కార్యదర్శి యన్.సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీటి సాకుతో ‘సీమ’కు వెన్నుపోటు
సందర్భం చెన్నై, ముంబై, బెంగళూరు వంటి రాజధానులేవీ జీవనదుల పక్కన లేవు. ఆయా రాష్ట్రాలకు మధ్యలో లేవు. అంతమాత్రాన అవి గొప్ప రాజధానులుగా వెలుగొందడం లేదా? కర్నూలును రాజధానిని చేస్తే కృష్ణ, తుంగభద్ర నదుల నీటిని వినియోగించుకోవచ్చు. ‘మా హక్కుల్ని కోరుకోవాల్సి వస్తే చందమామను కోరుకుంటాం, నక్షత్రాలను కోరుకుంటాం, సమస్త ప్రపంచాన్నీ కోరుకుంటాం. ఎందుకంటే వాటన్నిటినీ మేం కోల్పో యాం కనుక’ - మఖ్దూం ఒకప్పుడు రాజధానిని కోల్పోయి న రాయలసీమ వాసులు యాభై ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు రాజధానిని కోరుకుంటున్నారు. శతాబ్ద కాలంగా అనేక అన్యాయాలకు గురైన ఈ ప్రాంత వాసులకు ఇప్పుడు రావాల్సిన రాజధానిని దక్కకుండా చేసే ప్రయత్నాలు మళ్లీ జరుగుతున్నాయి. శివరామకృష్ణ కమిటీ రాష్ట్రంలో చేస్తున్న పర్యటన పూర్తి కాకముందే, కమిటీ నివేదిక సమర్పించక ముందే విజయవాడ-గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా అదే పాట అందుకున్నారు, నీటిపారుదల శాఖ మంత్రి దేవి నేని ఉమామహేశ్వర రావు విజయవాడలోనే తమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది చట్టాన్ని అతిక్రమించడమే అవుతుంది. రాజధానిని ముందే నిర్ణయిస్తే, ఈ కమిటీ వేయడం సీమ ప్రజలను వంచించడానికి కాక మరి దేనికి?అన్యాయాలకు వందేళ్లు: సీమకు జరుగుతున్న అన్యాయాల పరంపరకు వందేళ్ల చరిత్ర ఉంది. కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి జిల్లాల్లో 36 లక్షల ఎకరాలకు నీరందించడాని కి బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన మెకంజీ పథకం అమలుకాలేదు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో 7.2 లక్షల ఎకరాలకు నీరందించడానికి ఉమ్మడి మద్రాసు రాష్ర్టంలో రూపొందించిన కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టును తమిళులకు నీళ్లివ్వాల్సి వస్తుందన్న సాకుతో అటకెక్కిం చారు. కృష్ణా-పెన్నార్కు బదులుగా నాగార్జున సాగర్ను నిర్మించడం వల్ల సీమకు కృష్ణా జలాలు వచ్చే అవకాశానికి శాశ్వత సమాధి కట్టినట్టయింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక శ్రీభాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలును రాజధానిగా చేసినా, అది మూ డేళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఆ ఒడంబడికలో ఇతర ఏ ఒక్క అంశమూ అమలు కాలేదు. బళ్లారిని నాటి మైసూరు రాష్ట్రానికి ఇచ్చేయడం వల్ల సీమ తుంగభద్ర నీటిపైన హక్కును కూడా కోల్పోయింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే నాటికే రాయలసీమ, సర్కారు జిల్లాల మధ్య ఉన్న అంతరం ఇప్పుడు మరింత పెరిగిపోయింది. తెలంగాణ కన్నా రాయలసీమ ఎంతో వెనుకబడి ఉందని శ్రీకృష్ణ కమిటీ కూడా స్పష్టం చేసింది. హైదరాబాద్తో కూడిన తెలంగాణ కావాలని వారు కోరి సాధించుకున్నారు. సర్కారు జిల్లాల వారు భద్రాచలం డివిజన్లోని చాలా భాగాన్ని కోరి సాధించుకున్నారు. పూర్వపు ఆంధ్ర రాష్ట్రాన్ని పునరుద్ధరించారు కనుక అప్పటి రాజధాని కర్నూ లును పునరుద్ధరించాలని సీమవాసులు కోరడం తప్పా? భూమి, నీటి లభ్యత: సీమలో ఏ జిల్లాలో చూసినా కావలసినంత భూమి లభిస్తుంది. రాయలసీమలో నీటి సమస్యను చూపించి ఇక్కడ రాజధాని రాకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుంది. చెన్నై, ముంబై, బెంగళూరు వం టి రాజధానులేవీ జీవనదుల పక్కన లేవు. ఆయా రాష్ట్రాలకు మధ్యలో లేవు. అంతమాత్రాన అవి గొప్ప రాజధానులుగా వెలుగొందడం లేదా? కర్నూలును రాజధానిగా పునరుద్ధరి స్తే అక్కడ కృష్ణ, తుంగభద్ర నదుల నీటిని వినియోగించుకోవచ్చు. సీమలో మరోచోట రాజధానిని పెట్టదలుచుకున్నా, చెన్నైకు తెలుగు గంగను తరలిస్తున్నట్టు తరలించడం పెద్ద సమస్య కాదు. సీమపై చిన్నచూపు: ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఏమివ్వ చూపి నా అంతా సర్కారు జిల్లాలకే అన్నట్టుగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. చెన్నై నుంచి విశాఖ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ అని, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ కూడా సర్కారు జిల్లాలకేనని చెప్పేస్తున్నారు. రాయల సీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ ప్రాంత వాసులు ఆలస్యంగానైనా గ్రహించారు. సీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. సీమలో రాజధానిని ఏర్పాటు చేయని పక్షంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాలని కూడా పిలుపు నిస్తున్నారు. తెలంగాణ విడిపోతే ఎప్పటికైనా ప్రత్యేక రాయలసీమ ఉద్యమం రాక తప్పదని శ్రీకృష్ణ కమిటీ హెచ్చరించడాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) రాఘవ శర్మ -
వరంగల్కు పట్టనున్న మహర్ధశ
-
తుమకూరుకు త్వరలో మోడీ రాక?
ఈనెల 22న లేదా ఆగస్టు 9న వచ్చే అవకాశం సాక్షి, బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తుమకూరుకు వస్తున్నట్లు సమాచారం. కేంద్ర బడ్జెట్లో తుమకూరుకు పారిశ్రామిక కారిడార్ను ప్రకటించిన నేపథ్యంలో తుమకూరు శివార్లలోని వసంత నరసాపురలో 100 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఫుడ్పార్క్కు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రానికి వస్తున్నట్లు తెల్సింది. ఈనెల 22న లేదా ఆగస్టు 9న ప్రధాని నరేంద్రమోడీ మొదట బెంగళూరు నగరానికి అక్కడి నుంచి తుమకూరుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని పదవిని చేపట్టిన తరువాత మొట్టమొదటి సారిగా నరేంద్రమోడీ రాష్ట్రానికి వస్తుండడంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర బీజేపీ వర్గాలు కసరత్తులు చేస్తున్నాయి. -
ఉత్తరాదిపైనే...
కరుణ చూపని జైట్లీ బడ్జెట్ తుమకూరులో పారిశ్రామిక కారిడార్ మైసూరులో టెక్స్టైల్ క్లస్టర్ బెంగళూరుకు బయో టెక్నాలజీ సెంటర్ ఊసేలేని ఐఐటీ, ఐఐఎంల ఏర్పాటు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఆయన చూపంతా ‘ఉత్తరాది’పైనే ఉన్నట్లు భావించాల్సి వస్తోందని వ్యాఖ్యలు వినిపించాయి. మొత్తానికి రాష్ట్రానికి జైట్లీ ఎంతో కొంత విదిల్చారు. తుమకూరులో పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి రూ.100 కోట్లు, మైసూరులో టెక్స్టైల్ క్లస్టర్ కోసం రూ.200 కోట్లు కేటాయించారు. బెంగళూరుకు బయో-టెక్నాలజీ సెంటర్ను మంజూరు చేశారు. బెంగళూరు-ముంబై ప్రాథమిక వసతుల కారిడార్ను నిర్ణీత గడువులోగానే పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. అయితే మెట్రో రైలు గురించి ఆయన ఈ బడ్జెట్లో ఊసెత్తలేదు. అలాగే దీర్ఘకాలంగా రాష్ట్రానికి ఐఐటీ, ఐఐఎంలను మంజూరు చేయాలన్న విజ్ఞప్తులూ అరణ్య రోదనగానే మిగిలాయి. ఐటీ రంగంతో పాటు తయారీ రంగంలో దేశంలోని అన్ని రాష్ట్రాల వారికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్న బెంగళూరు పట్ల కేంద్రం చిన్న చూపు చూసిందని చెప్పక తప్పదు. మినీ ఇండియాగా మారిన బెంగళూరులో ప్రాథమిక వసతుల కల్పనకు కేంద్రం కూడా తన వంతు సాయాన్ని అందించాలని వరుస ప్రభుత్వాలు చేస్తున్న విజ్ఞప్తులు కేంద్ర పాలకుల చెవికెక్క లేదు. రాష్ర్ట పరంగా చూస్తే ఈ బడ్జెట్ నిరాశాదాయకమనే చెప్పాలి. ఈ బడ్జెట్పై ప్రముఖుల అభిప్రాయాలు... అవాస్తవిక బడ్జెట్ ప్రధాని నరేంద్ర మోడీ తన కలలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ద్వారా మార్కెట్ చేయడానికి ప్రయత్నించారు. రాష్ట్రానికి ఐఐటీ, ఏఐఐఎంఎస్లను మంజూరు చేయాలని ఎన్నో సార్లు కోరాం. విజ్ఞాన రాజధానిగా పేరు పొందిన బెంగళూరు పట్ల చిన్న చూపు చూడడం తగదు. ఎలాంటి కేటాయింపులు లేకుండానే పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. అహ్మదాబాద్, లక్నోల పట్ల ప్రత్యేక ప్రేమ చూపించారు. మొత్తానికి ఇది కంటి తుడుపు బడ్జెట్. - సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి ఆర్థిక పునశ్చేతనం దేశ ఆర్థిక పునశ్చేతనానికి ఉపకరించే బడ్జెట్. సామాన్యులపై భారం వేయలేదు. మధ్య తరగతి వారికి అనుకూలమైనది. ప్రాథమిక సదుపాయాలు, వ్యవసాయ వృద్ధికి ఊతం లభిస్తుంది. గత యూపీఏ సర్కారు దేశ ఆర్థిక స్థితిని చిన్నాభిన్నం చేసింది. దానిని సరి చేసే దిశగా ఇదో ముందడగు. - అనంత కుమార్, కేంద్ర మంత్రి నీరుగారిన నిరీక్షణ ఎన్నికల సందర్భంగా అనేక మార్పులకు శ్రీకారం చుడతామని ఆర్భాటంగా ప్రకటనలు చేసిన బీజేపీ తన తొలి బడ్జెట్లోనే నిరాశకు గురిచేసింది. ఉద్యోగాలు, సృజన లాంటి రంగాల అభివృద్ధికి ఎలాంటి పథకాలను ప్రకటించలేదు. మొత్తానికిది నిరాశాదాయకమైన బడ్జెట్. - కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సమగ్రమైన బడ్జెట్ వ్యవసాయ, విద్యుత్, ప్రాథమిక వసతులు, తయారీ, సేవా రంగాలకు సముచిత ప్రాధాన్యతనిచ్చిన సమగ్ర బడ్జెట్. ఆర్థికాభివృద్ధిపైనే ఈ బడ్జెట్ దృష్టి కేంద్రీకరించింది. తుమకూరు సహా వంద స్మార్ట్ సిటీలను ప్రకటించడం ద్వారా పట్టణాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. నాబార్డుకు నిధుల కేటాయింపు పెంపు గ్రామీణాభివృద్ధికి ఊతమిస్తుంది. - సందీప్ కుమార్ మైని, చైర్మన్, సీఐఐ కర్ణాటక సగటు బడ్జెట్... ‘పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం కలిగించే బడ్జెట్. ఇన్వెస్టర్లకు, స్టాక్ మార్కెట్కు కూడా అనుకూలమైనదే. రెవెన్యూ వసూళ్లను సరళీకృతం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆదాయ పన్ను పరిమితిని పెంచడం మధ్య తరగతి వారికి ఊరట. అయితే ఆర్థిక సంస్కరణల ఊసు లేకపోవడం, ప్రధాన పన్ను విధానం అలాగే కొనసాగడం కాస్త నిరుత్సాహకరం. మొత్తానికిది సగటు బడ్జెట్.’ - కుమార్ జాగిర్దార్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సభ్యుడు -
‘చుక్..చుక్’ కలలకు గ్రీన్ సిగ్నలేనా!
సాక్షి, కాకినాడ : నాటి ఎన్డీఏ హయాంలో పునాదిరాయి పడిన రైల్వేప్రాజెక్టులకు నేటి ఎన్డీఏ ప్రభుత్వంలోనైనా మోక్షం లభించకపోతుందా, రైల్వే మంత్రి సదానందగౌడ్ మంగళవారం ప్రవేశపెట్టనున్న రైల్వేబడ్జెట్ అయినా తమ ఆకాంక్షలను సాకారం చేయకపోతుందా అని జిల్లావాసులు ఆశపడుతున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించడంతో పాటు రాష్ర్ట విభజన నేపథ్యంలో మరికొన్ని ప్రాజెక్టులు, రైళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ- చెన్నైల మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో కాకినాడ-బాపట్ల మధ్య కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ను పట్టాలెక్కించడంతో పాటు నర్సాపురం నుంచి మచిలీపట్నం-రేపల్లె-నిజాంపట్నంల మీదుగా బాపట్ల వరకు పొడిగిస్తూ, కాకినాడ-మచిలీపట్నం-నిజాంపట్నం ఓడరేవులను కలుపుతూ కొత్తలైన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వందలకోట్లు ఇస్తున్నా చిన్నచూపే.. దక్షిణ మధ్య రైల్వేకి రూ.900 కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చి పెడుతున్న మన జిల్లా పట్ల కేంద్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతూనే ఉన్నాయి. దశాబ్ద కాలంగా యూపీఏ- 1, 2 హయాంలో ప్రతి రైల్వే బడ్జెట్లో మొండిచేయే మిగిలేది. ఈఏడాది ఫిబ్రవరి 12న అప్పటి రైల్వేమంత్రి మల్లిఖార్జునఖార్గే ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లా మీదుగా కొత్తగా సికింద్రాబాద్-విశాఖపట్నం ఏసీ ఎక్స్ప్రెస్ మినహా ఒరిగిందేమీ లేదు. జిల్లా కేంద్రమైన కాకినాడను మెయిన్లైన్కు అనుసంధానించాలన్నది దశాబ్దాల కల. అనుసంధానానికి కాకినాడ-పిఠాపురంల మధ్య 21 కిలోమీటర్ల బ్రాడ్గ్రేజ్ లైన్ వేయాలి. రూ.126 కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు 2012 బడ్జెట్లో రూ.5 కోట్లు కేటాయిస్తే 2013లో రూ.కోటి మాత్రమే విదిల్చారు. ఈ బడ్జెట్లోనైనా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తారని కాకినాడ వాసులు ఆశిస్తున్నారు. కోనసీమకు రైల్వేకూత వినిపించేనా? కోటిపల్లి-నర్సాపురం రైల్వేప్రాజెక్టుకు దివంగత లోక్సభాపతి జీఎంసీ బాలయోగి కృషితో 2000 నవంబరు 16న నాటి ఎన్డీఏ హయాంలో పునాదిరాయి పడింది. 55 కిలో మీటర్ల ఈ లైన్ నిర్మాణ వ్యయం 2000లో రూ.329 కోట్లు కాగా ప్రస్తుతం రూ.1100 కోట్లకు చేరింది. ట్రాక్, స్టేషన్ నిర్మాణాలకు 161.43 ఎకరాలు సేకరించగా,ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం రూ.70 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంట్లో అధిక మొత్తం పరిహారానికి, మిగిలింది సర్వేలకు ఖర్చుచేశారు. నిర్మాణ వ్యయంలో 25 శాతం నిధులు ఇచ్చేందుకు దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చినా కేంద్రం పట్టించుకోనేలేదు. ఎంపీలు హామీలు నిలుపుకోవాలి.. కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ సర్వేకు 2012 బడ్జెట్లో ఆమోదం తెలిపినా నేటికీ నిధులు కేటాయించలేదు. కాకినాడ నుంచి ఢిల్లీ, కోల్కతా, వారణాసిలకు కొత్త రైళ్లు, కాకినాడ రాజమండ్రిల మీదుగా హైదరాబాద్, తిరుపతిలకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లను నడపాలని, సర్కార్ ఎక్స్ప్రెస్ను పుదుచ్చేరి వరకు పొడిగించాలన్న డిమాండ్లు ఈసారైనా కార్యరూపం దాలుస్తాయని ఆశిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న కాకినాడ- కోటిపల్లి లైన్లో రాయగడ వరకు పాసింజర్ రైలును కొత్తగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మెయిన్లైన్, కోనసీమ రైల్వేలైన్ సాధిస్తామని కాకినాడ, అమలాపురం ఎంపీలు తోట నరసింహం, పండుల రవీంద్రబాబు ఎన్నికల్లో హామీలిచ్చారు. తోట లోక్సభలో టీడీపీ పక్ష నేతగా ఉన్నందున పెండింగ్ రైల్వేప్రాజెక్టులను పట్టాలెక్కిస్తారని ఆశిస్తున్నారు. -
అవినీతికే బీజేపీ పట్టం
రాష్ర్టంలో జైలుకెళ్లిన తొలి మాజీ సీఎం యడ్యూరప్పే ఆయనకు బీజేపీలో మళ్లీ పగ్గాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జోరుగా అవినీతి యూపీఏ అధికారంలోకి వస్తే ఇండస్ట్రియల్ కారిడార్ మా పార్టీలో మోడీ లాంటి వారు చాలా మంది ఉన్నారు బళ్లారి, మంగళూరు బహిరంగ సభల్లో రాహుల్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు/సాక్షి, బళ్లారి/బళ్లారి టౌన్ : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కమలనాథులు అవినీతికే పట్టం కడుతున్నారని ఏఐసీసీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన బళ్లారి బహిరంగ సభలో మాట్లాడుతూ.. నిత్యం కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడే వారికి.. వారు పాలిస్తున్న రాష్ట్రాల్లోని అవినీతి కన్పించకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ హయాంలో ముఖ్యమంత్రిగా పని చేసిన యడ్యూరప్ప అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లిన విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి అవినీతి కుంభకోణాల వల్ల జైలుకు వెళ్లడం రాష్ర్ట రాజకీయ చరిత్రలోనే బీజేపీ నేతలు సాధించిన ఘనతని ఎద్దేవా చేశారు. జైలు నుంచి వచ్చిన ఆయన్ను మళ్లీ పార్టీలో చేర్చుకోవడం చూస్తే వారి లక్ష్యం అవినీతికే పట్టం కట్టడమేనన్నది స్పష్టమవుతోందన్నారు. బళ్లారిలో జరిగిన అవినీతి కుంభకోణాల ప్రతిపైసా తిరిగి బళ్లారి ప్రజలకు చేరేలా కృషి చేస్తామన్నారు. యూపీఏ తిరిగి అధికారంలోకి వస్తే బొంబాయి-చెన్నై, కోల్కతా-బెంగళూరు మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేస్తామన్నారు. కర్ణాటకతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. తన అవ్వ ఇందిర చిక్కమగళూరు నుంచి ఎంపీగా, తన తల్లి సోనియాగాంధీ బళ్లారి నుంచి లోక్సభ మెంబర్గా గెలుపొందారని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ బీజేపీ పాలనలో రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ అదుపు తప్పిందన్నారు. బళ్లారి జిల్లాలో హిట్లర్ పాలన ఉండేదన్నారు. శ్రీరాములు గత ఎన్నికలలో బీఎస్ఆర్ సీపీ స్థాపించి.. నేడు బీజేపీలోకి చేరడం సబబు కాదన్నారు. కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మాట్లాడుతూ.. తాను ప్రధాని మంత్రి అవుతున్నట్లు భ్రమల్లో మోడి తేలుతున్నాడని, కానీ ఆయన ఎప్పటికీ ప్రధాని కాలేరని, అంతటి అర్హత ఆయనకు లేదని విమర్శించారు. అధికారం అందరికీ... మంగళూరులో రాహుల్ దేశాధికారం అందరి చేతుల్లో ఉండాలని తమ పార్టీ కోరుకుంటుంటే, బీజేపీ మాత్రం ఒకే వ్యక్తి చేతిలో ఉండాలని అభిలాషిస్తోందని రాహుల్ విమర్శించారు. మోడిని వారు దేశ రక్షకుడిగా చెప్పుకుంటున్నారని, అలాంటి రక్షకులు తమ పార్టీలో లెక్కలేనంత మంది ఉన్నారని అన్నారు. మంగళూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్లో ఆంతరంగిక ఎన్నిక (ప్రైమరీస్) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడాన్ని ప్రస్తావిస్తూ, గతంలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసేవారని తెలిపారు. అయితే తొలిసారిగా తాము పార్టీ స్థానిక కమిటీలకు ఈ బాధ్యతను అప్పగించామని చెప్పారు. ఆ విధంగానే ఇక్కడ జనార్దన పూజారి అభ్యర్థి అయ్యారు కనుక, ఆయనకు మద్దతునిచ్చి గెలిపించాలని కోరారు. ఐటీలో బెంగళూరు పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎలా మార్మోగి పోతున్నదో, మంగళూరుకూ అదే వైభవాన్ని కల్పిస్తామని తెలిపారు. నగర ప్రజల సహకారంతో కాంగ్రెస్ పార్టీ ఈ లక్ష్యాన్ని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.