Jishnu Dev Verma
-
భారత్.. ఆధ్యాత్మిక స్ఫూర్తి
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మికత, ధర్మ పరిరక్షణలో ప్రపంచానికి భారత్ స్ఫూర్తిదాయకమని.. ప్రజలంతా వాటిని ఆచరించి శాంతి పొందాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉద్ఘాటించారు. ధర్మ రాజ్యం అంటే.. రూల్ ఆఫ్ లా అని.. సరైన విలువలు, సరైన ఆలోచన, సేవలు, కరుణ, నీతి, నైతికత పాటించడమే ధర్మమని వివరించారు. దేశం ధర్మ రాజ్యంగా ప్రగతి బాట పయనించాలని మహాత్ముడు అభిలాషించారని చెప్పారు. ఆర్థిక భారతమే కాదు.. వికసిత్, విరాసిత్ భారత్ ఆవశ్యకతనూ ప్రధాని మోదీ వెల్లడించారన్నారు. మనసును నిగ్రహించుకుని చట్టపరమైన, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడంపై బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో జాతీయ న్యాయనిపుణుల సదస్సు శనివారం హైదరాబాద్లోని శాంతి సరోవర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్తోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్టితోపాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు మాట్లాడారు. గుడిలో పూజలు, అర్చన, ప్రదక్షిణలు చేయడం మాత్రమే కాదు, ధర్మాన్ని పాటించడం కూడా ఆధ్యాత్మికమే అని గవర్నర్ అభిప్రాయపడ్డారు. శాంతి లేని బతుకు నిరర్థకమని.. స్వామి వివేకానందుడే స్ఫూరిగా ఆధ్యాత్మికాన్ని ఆచరించాలని సూచించారు. ఆధ్యాత్మికాన్ని పెంపొందించడంలో బ్రహ్మకుమారీల పాత్ర అభినందనీయమన్నారు. మితిమీరిన ‘ఇన్స్టంట్’కు అలవాటుపడితే అనారోగ్యాన్ని ఆహ్వానించినవారవుతారని హెచ్చరించారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి: జస్టిస్ ఎస్వీ భట్టి న్యాయమూర్తులు, న్యాయవాదులు సానుకూల ధృక్పథంతో ముందుకు సాగినప్పుడే అసాధ్యాలు కూడా సుసాధ్యం కాగలవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సారస వెంకటనారాయణ భట్టి చెప్పారు. న్యాయవాదులకు స్వీయ అవగాహన ఉండాలని, కేసును, కక్షిదారుడిని అర్థం చేసుకున్నప్పుడే సమర్థ వాదన సాధ్యపడుతుందన్నారు. గెలుపోటములను ఒకేలా స్వీకరించాలని.. అపజయానికి కుంగిపోవడం, విజయానికి పొంగిపోవడం వృత్తినే కాదు, వ్యక్తిత్వాన్నీ దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు. ఏం చేస్తున్నాం.. ఎలా చేస్తున్నాం.. అనే సమీక్ష అందరికీ అవసరమన్నారు. వృత్తిపరంగా ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయని.. కొన్నిసార్లు మనసు కలుషితం అవుతుందని చెప్పారు. సానుకూలత లేకుండా సరైన నిర్ణయం తీసుకోలేమని చెబుతూ.. జరిగిందేదో జరిగిపోయింది.. సానుకూలంగా ముందుకెళ్తాను అనే ధోరణిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి, జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్గౌడ్, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ వి.ఈశ్వరయ్య, జస్టిస్ బీడీ రాథి, బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ ఎం.రాజేందర్రెడ్డి, మాజీ అడ్వొకేట్ జనరల్లు దేశాయి ప్రకాశ్రెడ్డి, బీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.జీఎస్టీ.. దేశ ఆర్థిక చరిత్రలో ఓ మలుపు: గవర్నర్ వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టడం మన దేశ ఆర్థిక చరిత్రలో ఒక మలుపు అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. శనివారం తాజ్ దక్కన్ హోటల్లో తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో జీఎస్టీ రూపకల్పనలో కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ పాత్రపై సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ మధ్య సమన్వయం అవసరమన్నారు. ఒకే దేశం.. ఒకే పన్ను విధానానికి జీఎస్టీ దోహదం చేసిందన్నారు. సాహసోపేతమైన సంస్కరణల మాదిరిగానే జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు అవాంతరాలు తప్పలేదని పేర్కొన్నారు. ఎక్కడైతే ప్రజలకు న్యాయం అందుతుందో.. అక్కడ ధర్మంతోపాటు రాజుకు బలమైన పునాది ఏర్పడుతుందని కౌటిల్యుడు చెప్పిన మాటలను ఉదహరించారు. పన్ను చెల్లింపుదారులందరూ ప్రభుత్వం అందిస్తున్న వన్ టైమ్ వడ్డీ మాఫీ పథకాన్ని ఈ నెల 31లోగా పన్ను చెల్లించి లబ్ధి పొందాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల కమిషనర్ కె.హరిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్టి మాట్లాడారు. ఎఫ్టీసీసీఐ జీఎస్టీ కమిటీ చైర్మన్ మొహమ్మద్ ఇర్షాద్ అహ్మద్, బాంబే హైకోర్టు సీనియర్ న్యాయవాదులు లక్ష్మీకుమారన్, శ్రీధరన్ తదితరులు పాల్గొన్నారు. -
దేశానికి దిక్సూచి
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ కేవలం పురోగమించడమే కాకుండా రూపాంతరం చెందుతోంది. సమ్మిళితత్వం, స్వయం సమృద్ధి, సాధికార తెలంగాణ అనే విజన్.. సాహసోపేత సంస్కరణలు, ప్రజా కేంద్రీకృత సుపరిపాలన, నిర్ణయాత్మక నాయకత్వంతో సాకారమవుతోంది. అన్ని వర్గాల సంక్షేమానికి, సుస్థిర పురోగతికి ప్రభుత్వం బాటలు వేస్తోంది సమానత్వం, పురోగతిలో దేశానికి దిక్సూచి అయ్యే తెలంగాణ నిర్మాణానికి సంఘటితంగా, విశ్వాసంతో, స్థిరమైన నిబద్ధతతో అందరం కలిసి ముందుకు సాగుదాం..’ అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బుధవారం ఉదయం ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి అమలు, లక్ష్యాలు, ప్రభుత్వ విజయాలను వివరించారు. గవర్నర్ మాట్లాడుతున్నంతసేపు ప్రధాన ప్రతిపక్ష సభ్యులు నిరసన నినాదాలు చేస్తూనే ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చేయి చూపటం ద్వారా పలుమార్లు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. మరోవైపు గవర్నర్ కీలకాంశాలను ప్రస్తావించినప్పుడల్లా..అధికార పక్ష సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం ప్రకటించారు. గవర్నర్ 35 నిమిషాల పాటు ఆంగ్లంలో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రానికి రైతాంగమే ప్రాణం ‘రాష్ట్రంలోని ప్రతి పౌరుడు కలలుగన్న దిశలో పురోగమించేందుకు అవసరమైన అవకాశాలను కల్పించే నిబద్ధతకు అద్దం పట్టేదిగా ఈ బడ్జెట్ సమావేశం ఉండనుంది. తెలంగాణ రాష్ట్రానికి రైతాంగమే ప్రాణం. మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేందుకు వారి కృషే కీలకం. అలాంటి రైతన్నల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. తొలుత హామీ ఇచ్చినట్టుగా రూ.2 లక్షలు చొప్పున పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రూ.20,616.89 కోట్ల మొత్తంతో 25.35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. రైతు భరోసా పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని ఎకరాకు రూ.12 వేలకు పెంచింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమిలేని వ్యవసాయ కార్మీకులకు ఎన్నడూ లేని విధంగా సహాయం చేస్తూ ఏడాదికి రూ.12 వేలను సమకూరుస్తోంది. 566 రైతు వేదికలను ఏర్పాటు చేసింది. 260 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ ఆవిర్భవించింది. సన్న రకం వరి ధాన్యానికి కింటాల్కు రూ.500ల బోనస్ చొప్పున రూ.1,206.44 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్ట పరిచేందుకు తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ను ఏర్పాటు చేసింది..’ అని గవర్నర్ చెప్పారు. గేమ్ ఛేంజర్గా మహాలక్ష్మి పథకం ‘బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన మహాలక్ష్మి పథకం గేమ్ ఛేంజర్గా మారింది. ఇప్పటివరకు మహిళలకు రూ.5,005.95 కోట్లు ఆదా చేసింది. ఇటీవలే ఆమోదించిన ఇందిరా మహిళాశక్తి మిషన్ పాలసీ ద్వారా రూ.లక్ష కోట్ల ఆర్థిక సాయ లక్ష్యంతో లక్షమంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం తయారు చేస్తోంది. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందిస్తోంది. 43 లక్షల కుటుంబాలకు రూ.500కే ఎల్పీజీ సిలిండర్ అందిస్తోంది. మహిళా సంఘాలకు 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టులను కేటాయించింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు సాధికారతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాదిలో 55 వేల మంది ప్రభుత్వోద్యోగాలు పొందారు. ఇది ఎన్నడూ సాధించని విజయం. ప్రపంచ స్థాయి అథ్లెట్లను తయారు చేయడానికి యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సమీకృత గురుకులాల ప్రారంభంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అత్యంత నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధమవుతోంది. పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి రంగారెడ్డి జిల్లాలో యంగ్ ఇండియా పోలీసు స్కూల్ను ఏర్పాటు చేస్తోంది..’ అని గవర్నర్ తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు, ఎస్సీ వర్గీకరణకు బిల్లులు ‘రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించడం ద్వారా ప్రభుత్వం సాహసోపేత మార్పు దిశగా ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. సామాజిక న్యాయాన్ని అందించే దిశగా వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక బిల్లును ప్రతిపాదించింది. షెడ్యూల్డు కులాల ఉప వర్గీకరణ కోసం ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. అత్యంత అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ కులాలకు రిజర్వేషన్ ప్రయోజనాలను మరింత న్యాయోచితంగా, సమతుల్యంగా అందించడమే దీని ఉద్దేశం..’ అని జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. దావోస్లో ‘తెలంగాణ రైజింగ్’ ‘దావోస్లో తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ 49,500 మందికి ఉద్యోగాలను కల్పించేలా రూ.1,78,950 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. తెలంగాణకు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగేలా పర్యాటక రంగాన్ని ప్రభుత్వం సమగ్రంగా అభివృద్ధి చేయనుంది. ఇందుకు ప్రత్యేక పర్యాటక విధానాన్ని సిద్ధం చేసింది. భూ పరిపాలనను క్రమబదీ్ధకరించడానికి, పౌరులందరికీ భూ భద్రతను కల్పించడానికి, భూ వివాదాలను తగ్గించడానికి, భూ రికార్డులలో పారదర్శకతను పెంపొందించడానికి భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టింది. సుస్థిర ప్రపంచ శ్రేణి నగర నిర్మాణం కోసం ప్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయబోతోంది..’ అని గవర్నర్ చెప్పారు. ప్రతి కేటాయింపు వెనుక ప్రజల ఆకాంక్షలు ‘బడ్జెట్ కేవలం అంకెల కూర్పు కాదు. ప్రభుత్వ భవిష్యత్తు ప్రాధాన్యతలు, విజన్కు ప్రతిబింబం. మన పాలసీలను, కార్యక్రమాలను, సంక్షేమ చర్యలను తెలియజేసే ఒక ఆర్థిక నమూనా. కొన్నిసార్లు అంకెలు భయపెట్టినప్పటికీ, ప్రతి కేటాయింపు వెనుక ప్రజల ఆకాంక్షలు ఉంటాయని గుర్తించాలి. యువ, డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సంకల్పం దృఢమైంది. ప్రవేశపెట్టిన ప్రతి పాలసీ, ప్రతి కార్యక్రమం, ప్రతి సంస్కరణ ప్రజల సాధికారతకు, సమ్మిళిత వృద్ధి కోసం ఉద్దేశించిందే. ప్రస్తుత తెలంగాణ అవకాశాలు, అభివృద్ధి, సాధికారతగల రాష్ట్రంగా ఉంది. రేపటి తెలంగాణ మరింత ఉజ్వలంగా, ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయ పరిపుష్టి, సాంకేతిక విజ్ఞాన వినూత్నత, సామాజిక న్యాయంలో అగ్రగామిగా నిలవబోతోంది. డాక్టర్ అబ్దుల్ కలామ్ అన్నట్లు ‘‘కలలు కనండి, కలలు ఆలోచనలుగా మారుతాయి, ఆ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి’’. ప్రజల కలలను ఈ ప్రభుత్వం విశ్వసిస్తుంది, విజన్, సంకల్పం, కార్యాచరణ ద్వారా వాటిని వాస్తవాలుగా మారుస్తుంది..’ అని గవర్నర్ చెప్పారు. జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేయడాన్ని, సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు తదితర అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. -
యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో గవర్నర్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న శ్రీస్వామి అమ్మవార్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్టా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.శ్రీస్వామిని దర్శించుకున్న గవర్నర్కు ముఖ మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ భాస్కర్రావు.. శ్రీస్వామి వారి లడ్డూ ప్రసాదంతో పాటు శ్రీనృసింహస్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్తర మాడవీధిలోని యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఆయన వెంట కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి తదితరులున్నారు. యాదగిరి క్షేత్రంలో వైభవంగా శ్రీచక్ర తీర్థంయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమానుసారం కొనసాగుతున్నాయి. ఆలయంలో సోమవారం ఉదయం నిత్యపూజలు చేసిన ఆచార్యులు ప్రథమ ప్రాకారంలోని ఉత్తర దిశలో ఏర్పాటు చేసిన యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం శ్రీచక్ర ఆళ్వారుడికి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, ఆలయ మాడ వీధుల్లో ఊరేగించి విష్ణు పుష్కరిణిలో శ్రీచక్ర తీర్థ స్నానం చేపట్టారు.ఈ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. రాత్రి ఆలయంలో శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం జరిపించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో ఉదయం అష్టిత్తర శతఘటాభిõÙకం రాత్రి శృంగార డోలోత్సవం నిర్వహిస్తారు. శృంగార డోలోత్సవంతో 11 రోజుల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. -
18 లేదా 19న రాష్ట్ర బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసన మండలి 12న ఉదయం 11 గంటలకు సమావేశం అవుతాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 12న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, బీఏసీలో చర్చ అనంతరం సభా నిర్వహణ తేదీలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించనున్నారు. రెండు కీలక బిల్లులు ఈసారే..: బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజు 12వ తేదీన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. అనంతరం సభ వాయిదా పడనుంది. తర్వాత రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చ జరిగిన అనంతరం తీర్మానాన్ని ఆమోదించనున్నారు. ఆ తర్వాత హోలీ, ఆదివారం సెలవులు ఉండటంతో సోమవారం మళ్లీ సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.అదే రోజు ఎస్సీ వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై చర్చ అనంతరం ఆమోదించి, బీసీల రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ ముందుకు తేనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన అనంతరం ఈ నెల 18 లేదా 19 తేదీల్లో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్, శాఖలవారీ పద్దులపై చర్చ అనంతరం 27న ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఉగాది, రంజాన్ పర్వదినాల నేపథ్యంలో 27వ తేదీతో సమావేశాలు ముగిస్తారని అధికారులు చెబుతున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల గవర్నర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాల్లో కూడా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.ఇక, తెలంగాణలో సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy), మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ బుధవారం అయ్యారు. రాజ్భవన్లో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో సీఎం వెంట ఉప ముఖయమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, నేటి నుంచి ప్రారంభమైన కులగణన వివరాలను గవర్నర్కు సీఎం వివరించారు. ఈ ప్రక్రియకు సంబంధించి సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, సర్వే తీరు, పూర్తి స్థాయి వివరాలను గవర్నర్కు అందించారు.కులగణన అంశంతో తెలంగాణ దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా నిలుస్తుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మగ్ర సర్వేను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్ను రేవంత్ ఆహ్వానించారు. -
గవర్నర్ తో సీతక్క భేటీ
-
గవర్నర్తో సీతక్క భేటీ.. కీలక బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో ఇవాళ (మంగళవారం) తెలంగాణ మంత్రి సీతక్క రాజ్భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. గవర్నర్తో భేటీ అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. ‘‘ 2022లో ములుగును మున్సిపాలిటీగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపి గవర్నర్కు పంపింది. రెండు సంవత్సరాలుగా పెండింగ్లోనే ములుగు మున్సిపాలిటి అంశం ఉంది. ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు మరో ఐదు బిల్లుకు ఆమోదం తెలుపాలని ఈ సందర్భంగా గవర్నర్కు విజ్ఞత్తి చేశాం. అదిలాబాద్ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి విషయాన్ని తెలియజేసాం. అదిలాబాద్, నాగర్ కర్నూల్ చెంచు ప్రాంతాల్లో పర్యటించాలని గవర్నర్ను కొరాం. గవర్నర్ ములుగులో ఓ గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దత్తత గ్రామాల లిస్ట్ గవర్నర్కు పంపాం, అదిలాబాద్ జిల్లా పర్యటనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ములుగు మున్సిపాలిటీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉందని తెలిసింది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాము’’ అని సీతక్క పేర్కొన్నారు.Met Telangana Governor @JishnuDevVerma at Raj Bhavan, appealed him to approve the long-pending bill that grants municipal status to Mulugu. The bill, passed by the Assembly in 2022, has faced delays due to technical and legal issues. Despite being included in the Telangana… pic.twitter.com/MEYb5Jigtv— Danasari Seethakka (@meeseethakka) September 24, 2024చదవండి: బరాజ్ల వైఫల్యంలో 20 మంది ఇంజనీర్లు! -
తెలంగాణ గవర్నర్తో డీఆర్డీఓ మాజీ చీఫ్ భేటీ
హైదరాబాద్, సాక్షి: ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జి సతీష్ రెడ్డి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాజ్భవన్కు వెళ్లిన ఈ డీఆర్డీవో మాజీ చీఫ్.. రాష్ట్రంలో ఏరోనాటిక్స్, అంతరిక్ష,రక్షణ రంగాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై గవర్నర్తో కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణదేవ్కు సతీష్ రెడ్డి మిషన్ శక్తి నమునా జ్ఞాపికను అందజేశారు. -
రామకృష్ణ మఠం సేవలు ఎనలేనివి: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
హైదరాబాద్: యువత వ్యక్తిత్వ వికాసానికి, శీల నిర్మాణానికి రామకృష్ణ మఠం అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొనియాడారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక జ్యోతి వెలిగించేందుకు, రామకృష్ణ మఠం దశాబ్దాలుగా చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. వ్యక్తుల సౌశీల్యంపై దేశ సౌశీల్యం ఆధారపడి ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో అంతర్భాగమైన వివేకానంద ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రజతోత్సవ వేడుక సభ కు గవర్నర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. నిరంతర అభ్యాసంతోనే పరిపూర్ణత సాధ్యమవుతుందని కార్య్రక్రమానికి హాజరైన విద్యార్థులకు సూచించారు. 1893 సెప్టెంబర్ 11 న చికాగో విశ్వవేదిక సాక్షిగా స్వామి వివేకానంద హిందూ ధర్మ గొప్పతనాన్ని చాటిచెప్పారని గవర్నర్ గుర్తుచేశారు. స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు జిష్ణు దేవ్ వర్మ సూచించారు. ఇరవై ఐదేళ్ళ క్రితం సెప్టెంబర్ 11 న హైదరాబాద్ రామకృష్ణ మఠంలో నాటి రామకృష్ణ మఠం, మిషన్ జాతీయ సర్వాధ్యక్షుడు స్వామి రంగనాథానంద వివేకానంద ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ విభాగాన్ని ప్రారంభించారని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. ఇప్పటివరకు ఇరవై లక్షల మందికి పైగా యువత కు వ్యక్తిత్వ వికాసం, శీల నిర్మాణం, యోగ, ధ్యానం, కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చామన్నారు. యువతకు విలువలను, నైపుణ్యాలను అందించేందుకు వి.ఐ.హెచ్.ఈ ఇరవై ఐదు ఏళ్లుగా పని చేస్తోందని చెప్పారు. కార్యక్రమం లో రామకృష్ణ మిషన్, మఠం జాతీయ ఉపాధ్యక్షుడు స్వామి సుహితానంద, డెక్స్ టెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకుడు శరద్ సాగర్, వి.ఐ.హెచ్.ఈ ఫాకల్టీ సభ్యులు, వాలంటీర్లు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కూచిపూడి నృత్యకళాకారిణి రాచర్ల నవ్య నేతృత్వంలో బాల్ వికాస్ విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
సుస్థిర అభివృద్ధి సాధించాలి
హనుమకొండ అర్బన్: చారిత్రక వారసత్వ నగరం ఓరుగల్లు సుస్థిర అభివృద్ధి సాధించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన అయన హనుమకొండ కలెక్టరేట్లో జిల్లాకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు, ప్రఖ్యాత కవులు, కళాకారులు, రచయితలు, సామాజిక కార్యకర్తలతో భేటీ అయ్యారు. అదే విధంగా నగరంలోని వేయిస్తంభాల దేవాలయం, భద్రకాళి, పద్మాక్షి ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. కాకతీయ ఆలయాల శిల్పకళను పరిశీలించారు. వరంగల్ కోట, వరంగల్ ఎన్ఐటీలను సందర్శించి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా హనుమకొండ రెడ్క్రాస్ను సందర్శించి తలసేమియా, సికిల్సెల్ ఎనిమియా అదనపు బ్లాక్ను ప్రారంభించారు. రెడ్క్రాస్ చేపడుతున్న కార్యక్రమాల పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వరంగల్ నగరం సుస్థిర అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదాదేవి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. లక్నవరం సరస్సులో బోటింగ్మంగళవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో బసచేసిన గవర్నర్ బుధవారం ఉదయం సరస్సులో మంత్రి సీతక్క, అధికారులతో కలిసి బోటింగ్ చేశారు. సరస్సు అంతా కలియదిరిగి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. -
ప్రభుత్వ పథకాలు భేష్
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, యాదాద్రి: షెడ్యూల్డ్ ప్రాంతాల అభివృద్ధికి, పేదలు, గిరిజనులు, ఆదివాసుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. ప్రభుత్వ పథకాలు బాగున్నాయంటూ కితాబిచ్చారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాలకు సర్కారు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో గిరిజనులు, ఆదివాసులు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మంగళవారం మూడు రోజుల రాష్ట్ర పర్యటన ప్రారంభించిన గవర్నర్.. యాదాద్రి జిల్లా పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో ములుగు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు చేరుకున్నారు. మంత్రి ధనసరి సీతక్క (అనసూయ), భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారు. కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్ఓలు ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధిపై ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ములుగు జిల్లాలో కంటైనర్ హాస్పిటల్ వినూత్నంగా ఏర్పాటు చేయడంపై మంత్రి సీతక్కను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. రామప్ప గుడి, కోటగుళ్లు సందర్శన ములుగు జిల్లాకు చెందిన రచయితలు, కవులు, కళాకారులు, జాతీయ, అంతర్జాతీయ క్రీడా అవార్డు గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో జిష్ణుదేవ్ వర్మ సమావేశమయ్యారు. రామప్ప గుడి, సరస్సును సందర్శించారు. రామలింగేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప ఆలయ నిర్మాణం, విశిష్టత, శాండ్ బాక్స్ టెక్నాలజీ, శిల్పసంపద రమణీయతను తెలుసుకున్నారు. రామప్ప దేవాలయం మహాద్భుత కట్టడమని పేర్కొన్నారు.అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లు గణపేశ్వరాలయాన్ని గవర్నర్ వర్మ సందర్శించారు. తర్వాత లక్నవరం చేరుకుని రాత్రిబస చేశారు. ఈ కార్యక్రమాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ రణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు. కాగా గవర్నర్ బుధ, గురువారాల్లో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజలు బాగుండాలని యాదాద్రీశుని కోరుకున్నా అంతకుముందు ఉదయం రాజ్భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన గవర్నర్ తొలుత యాదాద్రికి చేరుకున్నారు. విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్ర దేవాదాయశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖల కమిషనర్ ఎం.హనుమంతరావు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి భాస్కర్రావు ఆధ్వర్యంలో గవర్నర్కు అధికారులు, వేద పండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గవర్నర్ ముందుగా శ్రీస్వామివారి పుష్కరిణి వద్ద స్నాన సంకల్పం చేశారు. అఖండ జ్యోతి దీపారాధన చేసి మొక్కు టెంకాయ సమర్పించారు. తూర్పు రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోనికి ప్రవేశించారు. ధ్వజ స్తంభం వద్ద మొక్కిన తర్వాత అంతరాలయంలో అర్చన పూజచేశారు. దర్శనానంతరం గవర్నర్కు మహా మండపంలో వేద మంత్రాలతో వేదాశీ్వరచనం చేశారు. ఆలయం కట్టడాలను పరిశీలించిన గవర్నర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ ఈఓ భాస్కర్రావు స్వామి వారి మెమొంటోను అందజేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి స్వామి వారి ప్రసా దాన్ని అందజేశారు. కలెక్టర్ హనుమంత్ కె.జెండగే, పలువురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆయన వెంట ఉన్నారు. కాగా తెలంగాణ ప్రజలు బాగుండా లని లక్ష్మీనరసింహస్వామిని కోరుకున్నానని గవ ర్నర్ దేవాలయం వెలుపల మీడియాతో చెప్పారు. -
తెలంగాణ రాజ్ భవన్ లో జెండా ఎగురవేసిన గవర్నర్
-
తెలంగాణ కొత్త గవర్నర్గా జిష్ణు దేవ్ వర్మ..
-
గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర నాలుగో గవర్నర్గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శాంతికుమారి ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త గవర్నర్కు అభినందనలు తెలిపారు. జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రజలకు కొత్త గవర్నర్ సందేశం విభిన్న సంస్కృతులు, సుసంపన్నమైన వారసత్వం, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రజలకు సేవ చేయడం తనకు దక్కిన అదృష్టమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ఈ అవకాశం ఇచి్చన రాష్ట్రపతి, ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన సందేశాన్ని విడుదల చేశారు. సమృద్ధిగా సహజ వనరులు, సారవంతమైన వ్యవసాయ భూములతోపాటు వ్యాపార, వాణిజ్యానికి కేంద్రంగా తెలంగాణ ఉందన్నారు. యంగ్ అండ్ డైనమిక్ సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వానికి, మంత్రివర్గానికి అభినందనలు తెలియజేశారు.ప్రజాస్వామ్యం, న్యాయం, కరుణ వంటి విలువలతో కూడిన మన రాజ్యాంగం నిర్దేశించిన బాటలో కలిసి నడుస్తూ మార్పు దిశగా ప్రయాణాన్ని ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. ఆర్థికాభివృద్ధి, సామాజిక సమానత్వం, పర్యావరణ పరిరక్షణతో కూడిన సుస్థిర అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమన్నారు. యువత, విద్య, సాధికారత, ఆరోగ్య సంరక్షణను ప్రాధాన్య అంశాలుగా తీసుకుంటామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవను ప్రశంసించారు. విమానాశ్రయంలో ఘనస్వాగతం: శంషాబాద్: ప్రమాణ స్వీకారానికి ముందు రాష్ట్ర నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమానాశ్రయంలో గవర్నర్కు పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు సాయుధ దళాలు గౌరవవందం చేశాయి. -
తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు.జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర నాలుగవ గవర్నర్గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ గవర్నర్లుగా ఇప్పటి వరకు ఈఎస్ఎల్ నరసింహన్, తమిళిసై సౌందరరాజన్, ఇన్చార్జి గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.కాగా, జిష్ణుదేవ్ వర్మ బుధవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిష్ణుదేవ్ వర్మకు సాయుధ దళాలు గౌరవ వందనం చేశాయి.