kauravas
-
రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలతో ఎంపీగా అనర్హత వేటు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో తలనొప్పి మొదలైంది. మహాభారతంలోని కౌరవులను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో పోలుస్తూ రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒకరు కేసు వేశారు. గతంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్లోని హరిద్వార్ కోర్టులో కమల్ భదౌరియా అనే వ్యక్తి పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసు ఈనెల 12వ తేదీన విచారణకు రానుంది. కమల్ న్యాయవాది చెప్పిన ప్రకారం.. ఈ జనవరి తొమ్మిదో తేదీన భారత్ జోడో యాత్రలో భాగంగా హరియాణాలోని అంబాలా పట్టణంలోని ఒక కూడలిలో రాహుల్ ప్రసంగించారు. ‘ కౌరవులు ఎవరో మీకు తెలుసా ? మొదట మీకు 21 శతాబ్దపు కౌరవుల గురించి వివరిస్తా. వాళ్లంతా ఖాకీ రంగు నిక్కర్లు వేసుకుంటారు. చేతిలో లాఠీ పట్టుకుని ‘శాఖ’లు నిర్వహిస్తారు. భారత్లోని ఇద్దరు, ముగ్గురు అపర కుబేరులు వీరికి మద్దతుగా నిలుస్తున్నారు’ అని రాహుల్ ప్రసంగించారని తన పిటిషన్లో కమల్ పేర్కొన్నారు. ‘21వ శతాబ్దంలో కౌరవులు ఇంకా ఉన్నారు అంటే అది ఆర్ఎస్ఎస్ సభ్యులే’ అని ప్రసంగించి ఆర్ఎస్ఎస్ పరువుకు రాహుల్ తీవ్ర భంగం కల్గించారని ఆరోపించారు. ‘మోదీ అని ఇంటిపేరు ఉన్నవాళ్లంతా దొంగలే’ అని వ్యాఖ్యానించారన్న కేసులో దోషిగా తేలడంతో సూరత్ కోర్టు రాహుల్కు ఇప్పటికే రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెల్సిందే. ఎగువ కోర్టులో అప్పీల్కు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును తాత్కాలిక నిలుపుదల చేసిన విషయం తెల్సిందే. -
Bharat Jodo Yatra: 21వ శతాబ్దపు కౌరవులు!
అంబాలా/చండీగఢ్: ఆరెస్సెస్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సంఘ్ సభ్యులు 21వ శతాబ్దపు కౌరవులని మండిపడ్డారు. భారతీయ విలువలకు సంఘ్ వ్యతిరేకమని ఆరోపించారు. సంఘ్ కార్యకర్తలు హర హర మహాదేవ్, జైశ్రీరామ్ అంటూ ఏనాడూ నినదించలేదని ఆక్షేపించారు. భారత్ జోడో యాత్రలో సోమవారం హరియాణాలోని అంబాలాలో ఆయన మాట్లాడారు. ‘‘మహాభారతం హరియాణాతో ముడిపడి ఉంది. కౌరవులెవరు? మొదట 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెప్పబోతున్నా. వారు చేతిలో లాఠీలు పట్టుకుంటారు. శాఖలు నిర్వహిస్తుంటారు. మన దేశంలోని బిలియనీర్లు ఆ కౌరవుల ఎదుట సాగిలపడుతున్నారు. పాండవులెప్పుడైనా పెద్ద నోట్లను రద్దు చేశారా? తప్పుడు జీఎస్టీ అమలు చేశారా?’’ అని ప్రశ్నించారు. పాండవులు తపస్వులు గనుక ఎన్నడూ అలా చేయలేదన్నారు. పరస్పరం జైశ్రీరామ్ అంటూ పలుకరించుకోవాలని ప్రజలకు సూచించారు. రాహుల్ ‘పూజారి’ వ్యాఖ్యలపై విమర్శలు న్యూఢిల్లీ:తపస్వులకే తప్ప పూజారులకు భారత్లో స్థానం లేదన్న వ్యాఖ్యలతో రాహుల్ తమను చులకన చేశారంటూ ఆలయ పూజారులు మండిపడ్డారు. ప్రయాగ్రాజ్ సహా పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. -
MLA Rema: శాసన సభను కౌరవ సభగా మార్చొద్దు!
తిరువనంతపురం: అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు.. మహిళా ఎమ్మెల్యేపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో కేరళ అసెంబ్లీ అట్టుడుకి పోతోంది. సభకు క్షమాపణలు చెప్పి.. వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తూ కార్యకలాపాలకు అడ్డుతగులుతోంది ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్. అయినా ఎల్డీఎఫ్ కూటమి ప్రభుత్వం మాత్రం తగ్గట్లేదు. కేరళ అసెంబ్లీని మహిళలను వేధించే కౌరవ సభగా మార్చొద్దంటూ వేడుకున్నారు ప్రతిపక్ష నేత ఎం సతీశన్. ప్రోగ్రెసివ్ స్టేట్గా చెప్పుకునే కేరళలో.. విధవత్వాన్ని ఆమె తలరాతగా నిర్ధారించే స్థితికి రావడం దురదృష్ణకరమని వ్యాఖ్యానించారాయన. గత వారం పోలీస్ శాఖ నిధుల విజ్ఞప్తుల విషయంలో అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా.. ఎమ్మెల్యే కేకే రేమాను రెచ్చగొట్టేలా సీపీఐ(ఎం) ఎమ్మెల్యే మణి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఒక గొప్పావిడ సీఎం పినరయి విజయ్కు వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ఆమె తన భర్తను పొగొట్టుకుని విధవ అయ్యింది. అది ఆమె తలరాత. మేమేం దానికి బాధ్యులం కాదు’’ అంటూ ఎమ్మెల్యే మణి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సభ ఒక్కసారిగా భగ్గుమంది. మణి వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తం చేస్తూ సభ కార్యాకలాపాలను అడ్డుకున్నాయి ప్రతిపక్షాలు. ‘‘మణిని తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని కోరాం. ఆపై సీఎం పినరయి విజయన్ను జోక్యం చేసుకోమని అడిగాం. ఈ రెండూ చేయలేదు. ఇది నియమసభ. దీన్నొక మహిళలను వేధించే దుర్యోధనులు, దుశ్వాసనులకు నెలవైన కౌరవ సభగా మార్చొద్దు’’ అంటూ ఎమ్మెల్యే సతీశన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మణి వ్యాఖ్యలను పరిశీలిస్తామని డిప్యూటీ స్పీకర్ చిట్టాయమ్ గోపకుమార్ హామీ ఇవ్వడంతో ప్రతిపక్షం కాస్త శాంతించింది. అయితే సోమవారం మహిళా కాంగ్రెస్ నిరసనల్లో భాగంగా.. మణి ముఖాన్ని చింపాజీ కటౌట్తో ప్రదర్శించి నిరసన వ్యక్తం చేసింది. కేరళ కాంగ్రెస్ ఈ చర్యను సమర్థించుకుంది. ఇక తన భర్తను చంపినా.. ఇంకా పగతో రగిలిపోతూనే ఉన్నారంటూ ఎమ్మెల్యే రేమా సైతం మణి కామెంట్లపై మండిపడ్డారు. కొన్నేళ్ల కిందట.. సీపీఐ(ఎం) రెబల్ టీపీ చంద్రశేఖరన్ను పార్టీ వెలివేసింది. ఆ తర్వాత రెవల్యూషనరీ మార్కిస్ట్ పార్టీని(RMPI) స్థాపించారు. ఆయన 2012 మే 4వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. ఆ కేసులో సీపీఎం యాక్టివిస్టులను అరెస్ట్ చేసి శిక్షించారు. అప్పటి నుంచి పార్టీ బాధ్యతలను చూసుకుంటూ.. సీపీఐ(ఎం)పై, సీఎం విజయన్పైనా వీలుచిక్కినప్పుడల్లా విరుకుపడుతున్నారు కేకే రేమా. ప్రస్తుతం ఆమె వడకారా నియోజకవర్గపు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. -
ఆ రాక్షసులను తరిమి కొట్టాలి
ఎప్పుడూ పాండవుల పక్షమే వహించి మాట్లాడే భీష్మ ద్రోణాదులకు కౌరవులు చేసేదంతా తప్పే అని స్పష్టంగా తెలుసు. కానీ దుర్యోధనుడి పక్షాన్నే వహించేవారు. అయితే భీష్మద్రోణాదుల ఈ ప్రవర్తనకు కారణం వారిలో చేరుకున్న అసురులు అనే విషయాన్ని మాత్రం ఎప్పటికీ మరువకూడదు. భీష్మాదుల లోపలికి చేరుకున్న దైత్యులు కురుక్షేత్రయుద్ధం వంటి ముఖ్యమైన సంఘటనలప్పుడు దుర్యోధనుడి పక్షాన్నే ఉండి మాట్లాడేటట్లు చేశారు. భీష్మాచార్యుడంతటి మహాజ్ఞాని సైతం దైత్యశక్తి పూనినప్పుడు దానికి లోబడి తన ధర్మనిష్టను, న్యాయమార్గాన్నీ పోగొట్టుకున్నాడు. మనిషిని చంపకుండా హింసించే పెద్ద శత్రువు దుర్బుద్ధి. మనిషి తన దుర్బుద్ధితో తన జీవితాన్నే పూర్తిగా పోగొట్టుకుంటాడు. ఇది అధర్మం అని తెలిసినా మనస్సు దానినే చేయమని ప్రేరేపిస్తుంది. మన మనస్సులో చెడు ఆలోచనలు వచ్చిన వెంటనే ‘ఇది నా సహజమైన గుణం కాదు. ఏదో దుష్టశక్తి ప్రభావంతో నేనిలా చేస్తున్నాను’ అని తెలుసుకొని, మనలో ఉన్న దురాలోచన అనే రాక్షసుణ్ణి బయటికి పంపాలి. అప్పుడు మనం మనంగానే ఉంటాం. -
‘కౌరవ’ వ్యాఖ్యలతో సంబంధం లేదు
న్యూఢిల్లీ: కౌరవులందరూ టెస్ట్ట్యూబ్ బేబీలని ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ఛాన్స్లర్ జి.నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు శాస్త్రీయంగా ఆమోదయోగ్యం కావని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె విజయ్ రాఘవన్ తెలిపారు. పంజాబ్లోని జలంధర్లో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో అంశాలను, వక్తలను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్(ఐఎస్సీఏ) వక్తల ప్రసంగాలను వడపోత చేయలేదన్నారు. ఓసారి వక్తను ఎంపిక చేసుకున్నాక, వాళ్లు మాట్లాడే అంశంపై ఎలాంటి తనిఖీలు, వడపోతలు జరగవని తేల్చిచెప్పారు. ‘శాస్త్రవేత్తలు ఏదైనా పిచ్చిమాటలు మాట్లాడినప్పుడు ఆ వర్గం నుంచి నిరసనలు ఎదుర్కొంటారు. ఓ రాష్ట్ర విశ్వవిద్యాలయానికి వీసీగా ఉండీ నాగేశ్వరరావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం’ అని రాఘవన్ వ్యాఖ్యానించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో పాల్గొన్న నాగేశ్వరరావు కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలనీ, డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం కంటే దశావతారం మరింత అర్థవంతంగా ఉందనీ, రావణుడికి 24 విమానాలు, విమానాశ్రయాలు ఉన్నాయని సెలవిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుతమున్న గైడెడ్ మిస్సైల్ టెక్నాలజీని శ్రీరాముడు, విష్ణువు వాడారన్నారు. -
గాంధారి గుడ్డి ప్రేమ
భారతంలోని స్త్రీ పాత్రలలో గాంధారిది విశిష్ఠ పాత్ర. రాజభోగాలతో తులతూగవలసిన ఆమెను మానసిక క్షోభ నిరంతరం వెన్నంటింది. తాను పెళ్లాడబోయేది పుట్టుగుడ్డివాడైన ధృతరాష్ట్రుని అని తెలిసి, భర్తకు లేని చూపు తనకు కూడా ఉండనక్కరలేదని తనకు తానే స్వచ్ఛందంగా కళ్లకు గంతలు కట్టుకుంది. అయితే, దీనివల్ల ఆమె ఏమి ప్రయోజనం సాధించిందో అర్థం కాదు. ఒకవేళ పతివ్రతా స్త్రీగా అలా చేసిందే అనుకుంటే, ఆమె కన్న నూటొక్క మంది సంతానం ఏమైపోవాలి? అసలు కౌరవుల పతనానికి వారి తల్లిదండ్రుల మితిమీరిన ప్రేమాభిమానాలే కారణం. పిల్లలు తప్పు చేస్తుంటే, అహంకరిస్తుంటే, విచ్చలవిడితనంతో ప్రవర్తిస్తుంటేæ మురిసిపోతూ చూస్తూ ఊరుకున్నారు గాంధారీ ధృతరాష్ట్రులు. ఫలితం... కురుక్షేత్ర యుద్ధంలో కొడుకులందరూ దిక్కులేని చావుచస్తుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఊరుకుండిపోవలసి వచ్చింది. అప్పటికీ ఆమె తన తప్పిదాన్ని గుర్తించలేదు. భీముని గదాప్రహారానికి తొడలు విరిగి నేలకూలిన కుమారుని చూసి జాలిపడలేదు పైపెచ్చు... ‘ఆ చావు సావదగు ఆ న్నీచునకున్‘ ఆ నీచునికి (అధముడికి) అట్లాంటి చావు తగినదే... అంది. స్వయంగా తన కడుపున పుట్టిన పెద్దకుమారుడు. అసలు ఆ దుర్యోధనుడు నీచుడెలా కాగలిగాడు? పాండవుల వలె కౌరవులు సంస్కారవంతులెలా కాలేకపోయారు? బిడ్డలకు ప్రథమగురువు తల్లి. తండ్రి జాత్యంధుడు. కన్నతల్లి నేత్రపట్టం గట్టుకుని త్యాగమయ జీవితం గడిపినందువలన ఒనగూడిన ప్రయోజనం ఏ మాత్రమూ భారతమున కానరాదు. మరి కన్నపిల్లల భవిష్యత్తును ఎవరు తీర్చిదిద్దాలి? మేనమామ శకునిపై బడింది. శకుని కుటిలబుద్ధి అతనిని ఆత్మీయుడుగా చేసింది. కురుసార్వభౌముడైన భర్త, మహా బల పరాక్రమవంతులైన నూరుగురు కొడుకులు, అందచందాలలో, ఆస్తి అంతస్తులలో కొడుకులకు ఏమాత్రం తీసిపోని కోడళ్లు, మనవలు, మనవరాళ్లు, ఒక్కగానొక్క కూతురు దుస్సల, అల్లుడు సైంధవుడు... వీరందరి సమక్షంలో రాజమాతగా కలకాలం సుఖశాంతులతో జీవితం వెళ్లబుచ్చవలసిన గాంధారి, దుర్భర గర్భశోకాన్ని ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? వందమంది కుమారుల గర్భశోక మొకవైపు, ఉన్న ఒక్క కుమార్తె విధవ కావటం మరోవైపు ఆమెను నిలువునా కుంగదీశాయి. దీని బదులు కురుసార్వభౌముని పట్టమహిషిగా, 100 మంది కోడళ్లకు అత్తగా, రాజమాతగా యుద్ధం ప్రకటించిననాడే నేత్ర పట్టం తీసివేసి దుర్యోధన సార్వభౌముని శిక్షించకల్గిన మాతగా జీవించి ఉంటే, భారతకథ ఏవిధంగా ఉండేదో కదా? అందుకే అన్నారు, బిడ్డలు చెడిపోయారంటే, తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదే బాధ్యత. ఎందుకంటే, పిల్లలకు మంచి చెడ్డలు చెప్పకపోవడం ఆమెదే తప్పు కదా.. – డి.వి.ఆర్. భాస్కర్ -
కృతవర్మ
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 26 మహాభారత యుద్ధం తరువాత కౌరవులవైపు యుద్ధం చేసినవాళ్లల్లో మిగిలినవాళ్లు ముగ్గురు; అశ్వత్థామా కృపాచార్యుడూ కృతవర్మాను. వీళ్లల్లో అశ్వత్థామా కృపాచార్యుడూ కౌరవులు కారు; కృతవర్మేమో యాదవుడు. యాదవు డంటే, శ్రీకృష్ణుడి వైపువాడు. ఇతను భోజ వంశంవాడు గనక భోజుడనీ అంటారు. ఇతని తండ్రి హృదీకుడు. హృదీకుడికి దేవబాహువూ శతధన్వుడూ పుట్టిన తరు వాత కృతవర్మ పుట్టాడు. కుంతి యాదవ స్త్రీ గనక యాదవులు పాండవులకు చుట్టాలు. యాదవుడయ్యుండీ కృతవర్మ మాత్సర్యం కొద్దీ, దుర్యోధనుడి వైపు యుద్ధం చేశాడు. శల్యుడూ పాండవుల వైపు పోరాడవలసినవాడే గానీ పొగడ్తలకూ మెరమెచ్చులకూ లొంగి, మదం కొద్దీ దుర్యోధనుడి కొమ్ముకాశాడు. ఈ మాత్సర్యానికి మూలం సత్యభామ. సత్యభామ సత్రాజిత్తు కూతురు. ఆమెను కృతవర్మకిచ్చి పెళ్లి చేస్తానని మొదట్లో సత్రాజిత్తు వాగ్దానం చేశాడు. కానీ పరి స్థితులు కలిసిరాక, ఆమెను శ్రీకృష్ణుడికిచ్చి పెళ్లి చేశాడు. కృతవర్మకు తలకొట్టినట్ట యింది. శిశుపాలుడు కూడా ఇలాగే తనకు భార్య కావలసిన రుక్మిణిని కృష్ణుడు ఎత్తుకుపోయాడని గగ్గోలు పెట్టాడు. కృష్ణుడిని నానా తిట్లూ తిట్టాడు. దానికి అతను యుద్ధానికి చాలా ముందుగానే తన బతుకునే పోగొట్టుకున్నాడు. కృతవర్మ మాత్రం బయటపడకుండా పగతోనూ ద్వేషంతోనూ రగిలి పోతూ యుద్ధమప్పుడు కృష్ణుడికి వ్యతిరేకి అయిన దుర్యోధనుణ్ని బలపరచడానికి నడుము కట్టాడు. ధర్మా ధర్మాలను తూచకుండా కృష్ణుడితో విరోధం ఒక్కటే మిషగా పెట్టుకొని పాండ వులతో పోరాడడానికే సిద్ధమయ్యాడు. కృతవర్మ మాత్సర్యానికి మూలమైన సత్యభామ తండ్రి సత్రాజిత్తు. వృష్ణి వంశీ యుడైన నిమ్నుడి కొడుకు. ఇతను సూర్యు డికి భక్తుడూ సఖుడూను. సూర్యుడు సత్రాజిత్తుకు శ్యమంతకమణిని ఇచ్చాడు. అది మెడలో వేసుకొని సూర్యుడిలాగ వెలిగిపోయేవాడు సత్రాజిత్తు. ఒకసారి శ్రీకృష్ణుడు ఆ మణిని ఉగ్రసేన మహారాజుకు ఇస్తే బాగుంటుందని సూచించాడు. అంతటి బంగారాన్నిచ్చే మణి, ప్రజల్లో ఒకడి దగ్గర ఉండడం కన్నా రాజు దగ్గర ఉంటే, దాని లాభాన్ని రాజ్యం లోని ప్రజలందరూ పొందవచ్చునని కృష్ణుడి ఉద్దేశం. కానీ, డబ్బుమీద వ్యామోహం కొద్దీ సత్రాజిత్తు, కృష్ణుడి ప్రతిపాదనను కాదన్నాడు. ఓసారి, ఆ మణిని మెడలో వేసుకొని ఠీవిగా సత్రా జిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు వేటకెళ్లాడు. ఆ మణి ఎర్రగా మాంసమ్ముక్కలాగ ఉండ డంతో ఒక సింహం ప్రసేనజిత్తునీ అత నెక్కిన గుర్రాన్నీ చంపి, మణిని ఎత్తుకొని పోయింది. ఆ సింహాన్ని జాంబవంతుడనే భల్లూకం చంపి... మణిని గుహలో తన పిల్లల పిల్లలకు ఆటవస్తువుగా వేలాడ దీశాడు. అడిగినప్పుడు ఇవ్వలేదని శ్రీకృష్ణుడే ప్రసేనుణ్ని చంపి, మణిని తీసు కొనిపోయాడని సత్రాజిత్తు అపనిందను మోపాడు. ఆ నీలాపనిందను పోగొట్టుకో డానికి శ్రీకృష్ణుడు కొంతమందిని వెంట బెట్టుకొని అడవిలోకి వెళ్లాడు. చనిపోయి పడి ఉన్న గుర్రాన్నీ ప్రసేనజిత్తునీ సింహాన్నీ వరుసగా చూసుకుంటూ భల్లూక గుహ దగ్గరికి చేరాడు శ్రీకృష్ణుడు. గుహ లోపలికి పోయి మణిని తీసుకోబోతూంటే, జాంబ వంతుడు వచ్చి, శ్రీకృష్ణుడితో ఇరవై ఎని మిది రోజుల పాటు కుస్తీ పట్టాడు. చివరికి శ్రీకృష్ణుడిలో శ్రీరాముణ్ని చూసి, మణితో బాటు తన కూతురు జాంబవతిని కూడా ఇచ్చి పంపించాడు. బంగారం ఇచ్చే మణే ఇంత అనర్థాన్ని తెస్తుందని సత్రాజిత్తు అనుకోలేదు. ఈ కథ అంతా మనం వినా యకచవితి వ్రతం చేసేనాడు చదువు కొనేదే. దీని తరవాత జరిగిందే కృతవర్మకీ అతని అన్న శతధన్వుడికీ పైకి చూపించ లేని కోపాన్నీ మాత్సర్యాన్నీ తెచ్చిపెట్టింది. మాత్సర్యంలో అసూయా ఈర్ష్యా మాత్రమే గాక, పగా ద్వేషమూ వెర్రికోపమూ ఆవేశమూ మత్తుతో కూడిన ఉద్రేకమూ ఉన్నాయి. వీటన్నిటికీ ప్రతీకే కృతవర్మ. కృష్ణుడు మణిని తీసుకొని రాగానే సత్రాజిత్తు, కృష్ణుడి లాంటి అతిశక్తిమంతు డితో వైరం తెచ్చుకున్నానని నొచ్చుకుంటూ దానికి ఏవిధంగా పరిహారం చెల్లించాలా అని ఆలోచించాడు. అంతకుముందు తన కూతురు సత్యభామను నిమ్నుడి కొడుకు కృతవర్మకు ఇచ్చి పెళ్లిచేద్దామనుకొన్నాడు. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని పక్కకు పెట్టి, ఆమెను కృష్ణుడికిచ్చి పెళ్లి చేశాడు. దీనితో కృతవర్మ గుండెల్లో కోపం ప్రజ్వరిల్లింది. అయితే, ఈ కోపాన్ని కృష్ణుడి ముందు అతను చూపించలేడు. దానికి కారణం శ్రీకృష్ణుడి శక్తి అమానుషమైనది కావడమే. అతనంటే వల్లమాలిన భయమే కృత వర్మకి. కానీ కోపమూ దిగమింగరానిదే. అంచేత, అది ద్వేషంగానూ పగగానూ అసూయగానూ మాత్సర్యంగానూ ఈర్ష్య గానూ మారింది. కావాలనుకొన్నదీ, రావాలనుకొన్నదీ పోయినా రాకపోయినా అహంకారం దెబ్బతింటుంది; అసంతృప్తి కలుగుతుంది. సత్యభామ తనకు గానీ తన కుటుంబంలో ఎవరికైనాగానీ భార్య కావల సినది, శ్రీకృష్ణుడి పరమైపోయిందని కృత వర్మకు ఒకటే కుతకుతా దిగులూను. అవి తీరేవి కావు గనక పగా కక్షా రూపాల్ని దాల్చాయి. పగా ఉద్రేకమూ ఎవరినైనా ధర్మాన్ని మరిచిపోయేలాగ చేస్తాయి. ఆత్మ వికాసానికి పనికివచ్చే పనుల్ని మరిచి పోయి, తాను పోగొట్టుకున్నది తనకు ఎలా రాగలదా అనే తీరిక లేని ఆలోచన లతో తన బతుకునే నరకం చేసుకుం టాడు, ఈ మాత్సర్యానికి గురి అయిన వాడు కృతవర్మ. ఆ మాత్సర్యాన్నే కవచంగా ధరించి, కృష్ణుడికి ఎదురుగా యుద్ధం చేద్దామని నిశ్చయించుకున్నాడు. లక్కింటిలో పాండవులు కాలిపోయా రన్న మాటను విని, శ్రీకృష్ణుడు, తనకు వాళ్లు పోలేదని తెలిసినప్పటికీ తెలియ నట్టుగా, భీష్ముడూ ధృతరాష్ట్రుడూ గాంధారీ మొదలైనవాళ్లతో కలిసి ‘అయ్యో, పాపం! అందరూ ఒక్కసారిగా పోవడం దురదృష్టకరం’ అని చెప్పి ధర్మోదకాల్ని ఇవ్వడానికి బలరాముడితో సహా హస్తినా పురానికి వెళ్లాడు. ఇదే అదను అని కృత వర్మా అక్రూరుడూ కలిసి శతధన్వుణ్ని ‘మనను మోసం చేసిన సత్రాజిత్తును అతని తమ్ముడి దారిపట్టేలాగ ఎందుకు చేయకూడద’ంటూ ప్రేరేపించారు. ఆ రాత్రి అతను ఆవేశంతో సత్రాజిత్తును చంపేసి, స్యమంతకమణిని తీసుకొచ్చి వచ్చాడు. సత్యభామ తన తండ్రిని చంపే శారని కృష్ణుడికి వర్తమానం పంపింది. బలరామకృష్ణులు హుటాహుటిన వచ్చి, శతధన్వుడి వెంటబడ్డారు. వాళ్లు వస్తున్నా రని తెలిసి స్యమంతకమణిని అక్రూరుడి దగ్గర వదిలి, శతధన్వుడు గుర్రం మీద పారిపోయాడు. కృష్ణుడు అతన్ని వెంబడించి చంపేశాడు. సత్యభామ దక్కకపోవడమూ తన అన్నను చంపడమూ కృతవర్మలో పగనీ అసూయనీ ఇబ్బడి ముబ్బడిగా చేశాయి. అతను, తనవాళ్లందరూ ధర్మరాజువైపు చేరినా, తాను మటుకు దుర్యోధనుడి పక్షాన పోరాడటానికి నిశ్చయించు కున్నాడు. ఈ నిశ్చయం వెనక ఉన్న కారణం కృష్ణుడంటే మాత్సర్యం తప్ప మరొకటి కాదు. పగకూ అసూయకూ వెర్రికోపానికీ మాత్సర్యానికీ కళ్లు పచ్చ బారి అన్నీ పచ్చగానే అవుపిస్తాయి; అసలైన రూపం వాటికి అవుపించదు. పాండవులంటే ప్రత్యేకమైన ద్వేషమేమీ లేదు కృతవర్మకు; తతిమ్మా యాదవులన్నా పగా లేదు. కృష్ణుణ్ని వ్యతి రేకించడమే ధ్యేయంగా అధర్మపక్షాన చేరాడు. జయద్రథుణ్ని రక్షించడం కోసం ద్రోణుడి వెనక నిలిచాడు. అర్జునుడు శకట వ్యూహంలో ముఖాన ఉన్న ద్రోణుడితో కొంతసేపు యుద్ధం చేసి, అనవసరంగా కాలహరణం జరుగుతోందని శ్రీకృష్ణుడు హెచ్చరించడంతో గురువుకు ప్రదక్షిణం చేస్తూ అతన్ని దాటి కృతవర్మను ఎదిరిం చాడు. ‘కృతవర్మ మీద దయ చూపించ వలసిన పనిలేదు; సంబంధీకుడని ఉపేక్షించకుండా వీణ్ని చంపెయ్యి’ అని కృష్ణుడు అర్జునుడితో అన్నాడు. అయినా అర్జునుడు సంబంధాన్ని దృష్టిలో పెట్టు కొని, కృతవర్మ దొరికినా చంపకుండా మూర్ఛపరిచి, ముందుకు వెళ్లిపోయాడు. సాత్యకి కూడా తన గురువు అర్జునుడిలాగే ద్రోణుణ్ని తప్పించుకొని పోతూ ఉంటే, కృతవర్మ అతన్ని నిలవరించాడు. సాత్యకి భోజుడి సారథి తల నరకడంతో అతని గుర్రాలు అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టాయి. అప్పుడు తానే తన రథాశ్వాలను అదుపులో పెట్టుకుంటూ ఏ భయమూ లేకుండా తిరిగి ఎదిరించడానికి వచ్చే లోపులో సాత్యకి ముందుకు వెళ్లిపో యాడు. అప్పుడక్కడకు వచ్చిన భీమ సేనుణ్ని ఎదుర్కొన్నాడు కృతవర్మ. అతని పరాక్రమం ముందు పాండవులు ముందుకు సాగలేకపోయారు. భీముడి వింటినీ ధ్వజాన్నీ ముక్కలు చేసి అతన్ని కృతవర్మ రథం నుంచి కిందికి పడిపోయే లాగ చేశాడు. అప్పుడు ధర్మరాజూ మొదలైన మహారథులు భోజుణ్ని, అంటే, కృతవర్మను బాణాలతో పీడించడం మొదలుపెట్టారు. ఇంతలో భీముడికి మెలకువ వచ్చి, భోజుడి వక్షస్సు మీద ఐదు బాణాలతో దాడిచేసి దెబ్బతీశాడు. పక్కనున్న శిఖండి కూడా విజృంభించాడు. కృతవర్మ శిఖండి వింటిని విరగ్గొట్టాడు. శిఖండి కోపంతో కత్తీ డాలూ తీసుకొని విరుచుకుపడ్డాడు. తన డాలును గిరగిరా తిప్పుతూ తనను కాపాడుకుంటూ తన కత్తిని భోజుడి రథం మీదకు విసిరాడు, అది కృతవర్మ ధనుస్సును ముక్కలు చేసింది. మరో విల్లు తీసుకొని అతను శిఖండిని ముప్పుతిప్పలు పెట్టాడు. అతను రథం మీద చతికిలపడిపోయాడు. ఇదంతా కృతవర్మ వీరోచిత పోరాటమే. సౌప్తిక పర్వంలో కృతవర్మ కసాయి వాడుగా అవుపిస్తాడు. అప్పుడు అశ్వత్థామకు బాసటగా నిలిచిన ఇద్దరిలో కృతవర్మ ఒకడు; రెండోవాడు కృపాచార్యుడు. అశ్వత్థామ పాంచాలుర శిబిరంలోకి పోయి, నిద్రపోతూన్న ధృష్టద్యుమ్నుణ్నీ శిఖండినీ ద్రౌపదేయుల్నీ ఊచకోత కోస్తూ ఉంటే, తతిమ్మావాళ్లు కంగారుతో కాందిశీకులై అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉంటే, శిబిర ద్వారంలో కసాయివాళ్లలాగ నిలుచున్న కృతవర్మా కృపాచార్యుడూ వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. శిబిరం నుంచి వచ్చిన ఒక్క క్షత్రియుడూ వీళ్ల చేతుల్లోంచి తప్పించుకోలేదు. అశ్వత్థామకు ఇంకా ప్రీతిని కలిగిద్దామని వాళ్లున్న దిక్కును మినహాయించి తతిమ్మా మూడు దిక్కుల్లోనూ నిప్పంటించారు ఈ ప్రబుద్ధులిద్దరూను. తాము చేసిన ఈ ‘గొప్ప’ కార్యాన్ని చెప్పడానికి సగం ప్రాణంతో గిలగిలా కొట్టుకొంటూన్న దుర్యోధనుడి దగ్గరికి వెళ్లారు ఈ ముగ్గురూను. యుద్ధం తరవాత పాండవుల వైపు ఏడుగురూ ధార్తరాష్ట్రుల వైపు ముగ్గురూ మిగిలారు: పాండవులైదుగురూ శ్రీకృష్ణుడూ సాత్యకీ వెరసి ఏడుగురు; కృపుడూ కృతవర్మా అశ్వత్థామా వెరసి ముగ్గురు ఇటువైపు. ‘అశ్వత్థామా! నువ్వు ఈ కృపకృత వర్మలతో కలిసి చేసిన ఈ కార్యం భీష్ముడు గానీ మీ తండ్రిగానీ కర్ణుడుగానీ చేయ లేదు’ అని సంతోషిస్తూ దుర్యోధనుడు తుదిశ్వాస విడిచాడు. కృష్ణుడికి వ్యతి రేకంగా యుద్ధం చేసి కృతవర్మ సాధించింది ఇంతే. తరవాత మౌసల పర్వంలో యాదవులందరితో బాటూ కృతవర్మా పోయాడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
ద్రుపద ధృష్టద్యుమ్నులు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 20 పృషతుడనే రాజు పాంచాల దేశాన్ని పరిపాలించేవాడు. అతని కొడుకు పేరు ద్రుపదుడు. ఇతన్ని యజ్ఞసేనుడని కూడా పిలుస్తారు. ద్రుపదుడికి పుట్టిన వాళ్లం దరూ గడ్డుగడ్డువీరుల్ని వధించడానికి పుట్టినవాళ్లే. కౌరవులపైనున్న హేమా హేమీల్లో భీష్ముడూ ద్రోణుడూ ముఖ్యమైన వాళ్లు. వాళ్లను జయించడం దాదాపుగా అసంభవమే. భీష్ముడికేమో స్వచ్ఛంద మరణమనే అరుదైన వరముంది. ఎవడూ తనకుగా తాను చావాలని కోరుకోడు గదా! మరి అటువంటివాణ్ని చంపడానికి ఎటువంటివాడు ఎలాగ పుట్టాలో భగ వంతుడికే ఎరుక! నముచి అనే రాక్షసుడు, తాను తడిదానితో గానీ పొడిదానితో గానీ చావకూడదన్న అపురూపమైన వరాన్ని కోరుకొన్నాడు. నముచి కోసం తడీ పొడీ కానిదైన నురుగు చావై కూర్చుంది. నురుగు నీళ్ల నుంచి వచ్చింది గనక తడిదేమో అనిపిస్తుంది; కాని అది పొడిగా ఉన్నట్టుగా ఉంటుంది. వజ్రాయుధానికి నురుగును పట్టించి ఇంద్రుడు నముచిని చంపాడు. ‘నముచి’ అంటే, వదలదని అర్థం. అటువంటి వదలని జబ్బునే ఉపాయంతో పోగొట్టారు. అలాగే, స్వచ్ఛంద మరణమున్న భీష్ముణ్ని చంపించడానికీ రుద్రుడు అంబకు వరమిచ్చాడు. అంబను సాల్వుడనే ఆమె ప్రియుడికి చెందకుండా చేసిన నేరానికి భీష్ముడంటే జన్మజన్మాంతర వైరం పట్టుకొంది అంబను. శివుడు ఆవిడకు ప్రత్యక్షమై, ‘నువ్వు ఆడదానివై పుట్టినా, మగవాడివై మరీ భీష్ముణ్ని చంపుతావు’ అని వరమిచ్చాడు. ఆవిడ యమున ఒడ్డునే చితిని పేర్చుకొని, ‘భీష్ముణ్ని చంపడానికి వెళ్తున్నాను’ అని అంటూ చితిలో ప్రవేశించింది. అదే సమయంలో ద్రుపదుడు మగ సంతానం కోసం ‘నాకు ఆడపిల్లగాదు, మగపిల్లవాడు పుట్టాలి’ అంటూ ఘోర తపస్సు చేశాడు. అతనికీ రుద్రుడే ఎదురుగా అవుపించి, అంబకిచ్చిన వరాన్ని సార్థకం చేయడానికి, ‘నీకు ఆడపిల్లే పుడుతుంది గానీ మగాడిగా మారుతుందిలే తరవాత’ అంటూ వరమిచ్చాడు. భీష్ముడు గొప్ప విలుకాడు. అంచేత అతనికి వ్రతాలూ చాలానే ఉన్నాయి. మనకు తెలిసిన రాజ్య సింహాసనాన్ని ఎక్కకపోవడమూ ఆజన్మాంతం బ్రహ్మచర్యాన్ని పాటించడమూ అనేవే కాకుండా యుద్ధంలో పాటించే వ్రతాలు కూడా కొన్ని ఉన్నాయి. అవే స్వచ్ఛంద మరణాన్ని కూడా దాటి అతని పతనాన్ని శాసించాయి. మహాయుద్ధం ప్రారంభమై తొమ్మిది రోజులైపోయినా భీష్ముడు ధర్మరాజు జయించడానికి పెద్దగోడలాగ నిలుచు న్నాడు. ఇక లాభం లేదని, ధర్మరాజు తన తమ్ముళ్లతోనూ శ్రీకృష్ణుడితోనూ కలిసి, ఆ రోజు రాత్రి, శస్త్ర కవచాల్ని పక్కకు పెట్టి భీష్ముడి దగ్గరికి వెళ్లాడు. ‘‘తాతయ్యా! మేమెలా గెలవగలం?’ అని సూటిగా అడిగాడు. ‘‘అవును, నేను బతికుండగా నీకు జయమెలాగ దొరుకుతుంది? నేను యుద్ధంలో నిలుచుంటే, సాక్షాత్తూ ఇంద్రుడొచ్చినా జయించలేడు. అయితే, నాకు కొన్ని వ్రతాలున్నాయి. శస్త్రం కింద పెట్టేసినవాడితోనూ కిందజారిపడిన వాడితోనూ కవచమూ ధ్వజమూ లేనివాడితోనూ భయంతో పారిపోయే వాడితోనూ ‘నేను నీ వాణ్నే’ అని శరణుజొచ్చినవాడితోనూ స్త్రీతోనూ స్త్రీలాంటి పేరుపెట్టుకొన్నవాడితోనూ ముందు స్త్రీగా ఉండి, ఆ మీద మగవాడిగా మారినవాడితోనూ దెబ్బతిని కలవరపడేవాడితోనూ తన నాన్నకు ఒక్కడే కొడుకైనవాడితోనూ అపకీర్తిమంతుడితోనూ నేను యుద్ధం చేయడానికి ఇష్టపడను. అప్పుడు మహారథులు నన్ను పడగొట్టగలుగు తారు’’ అని తన చావుకు తానే మంత్రం చెప్పాడు భీష్ముడు. శిఖండి మొదట ఆడపిల్ల, ఆ మీదట మగవాడయ్యాడు. అహంకారానికున్న దురభిమానం కొద్దీ అటువంటి శిఖండితో అది యుద్ధం చెయ్యదు. యుద్ధంలో ఉండీ యుద్ధం చెయ్యకపోతే చావు రావడం తథ్యం. అది ఒకలాగ స్వచ్ఛందంగా చావడమే. మగవాడిగా పుట్టకపోయినా శివుడి మాటను బట్టి, ద్రుపదుడు కూతురుగా పుట్టిన ‘అతనికి’ యుద్ధ విద్యను నేర్పించాడు. ద్రోణుడే అతనికి ఆచార్యుడయ్యాడు. అర్జునుడు, భారతయుద్ధం పదోరోజున శిఖండిని తన రథంలో నిలుచోబెట్టుకొని బాణాలు వేయించి, భీష్ముణ్ని అస్త్ర సన్యాసం చేసేలాగ చేసి, ఆ మీద తానే, మర్మాల్ని తాకేలాగ అస్త్రాల్ని వేసి, అతన్ని పడగొట్టాడు. ఎంతటివాడైనా చావు ముందు తలవంచవలసిందే. స్వచ్ఛంద మరణాల్లాంటివెన్నైనా అతన్ని కాయలేవు. కౌరవులవైపు యుద్ధం చేసిన ప్రము ఖుల్లో రెండోవాడు ద్రోణుడు. ద్రోణుడు నిజానికి ద్రుపదుడికి సహాధ్యాయుడే. ఇద్దరూ కలిసి అగ్నివేశుడి దగ్గర విలు విద్యను అభ్యసించారు. ద్రుపదుడు క్షత్రియుడే గానీ ద్రోణుడంతటి విలుకాడు గాడు. ద్రోణుడు బ్రాహ్మణుడే అయినా సర్వ క్షత్రియులకూ పరశురాముడి మాదిరిగా భయంకరుడు. ఇతను పరశురాముణ్నించే అస్త్రాలను నేర్చు కున్నాడు. అదీగాక, బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని అభ్యసించినవాడు. ద్రోణుడికి కృపితో పెళ్లై అశ్వత్థామ పుట్టిన తరవాత చాలా దారిద్య్రాన్ని అనుభ వించాడు. పృషతుడు పోయిన మీదట, ద్రుపదుడు పాంచాల రాజయ్యాడు. చిన్నప్పటి సఖిత్వాన్ని పురస్కరించుకొని ఎంతో కొంత ఇవ్వకపోతాడా అన్న భరోసాతో ద్రుపదుడి దగ్గరికి పోయి, ఆ మునపటి సఖిత్వాన్ని గుర్తుకు తీసుకు రాబోయాడు. స్నేహం ఇద్దరు సమానుల మధ్య ఉంటుంది గానీ ఒక పేదవాడికీ రాజుకీ మధ్య ఉండదు. రాజుకీ రాజుకీ మధ్య స్నేహం కుదురుతుంది. ఇటువంటి మాటలతో అవమానాన్ని పొంది, ద్రోణుడు వెళ్లిపోయాడు గానీ అతని గుండెలో ఒక బ్రాహ్మణుడికి ఉండదగని ప్రతీకార జ్వాల మాత్రం మండుతూనే ఉంది. పాండవులకూ కౌరవులకూ విలు విద్యను నేర్పడానికి ముందే గురువేతనం ఇదీ అని చెప్పాడు. అర్జునుడు ఆ ప్రతీ కారాన్ని తీర్చిపెట్టాడు. అహిచ్ఛత్రాన్ని ముట్టడించి, ద్రుపదుణ్ని బందీ చేసి, ద్రోణుడి ముందు నిలబెట్టాడు అర్జునుడు. అప్పుడు ద్రోణుడు, ‘ఇప్పుడు నేను పాంచాల రాజును. అయినా స్నేహితుడిగా నీకు దక్షిణ పాంచాలాన్ని ఇస్తాను. ఉత్తర పాంచాలానికి మాత్రం నేనే రాజుని. ఇప్పుడు నీకూ నాకూ రాజులుగా స్నేహం కుదురుతుంది గదా’ అని ద్రుపదుణ్ని కించపరుస్తూ మాట్లాడాడు. అప్పణ్నించీ ద్రుపదుడికి రెండు కోరికలు బయలుదేరాయి. ద్రోణుణ్ని తానెలాగూ విలుయుద్ధంలో గెలవలేడు. అతన్ని చంపగలిగే పుత్రుడుంటేనే తన కోపం చల్లారుతుంది. అర్జునుడు గొప్ప వీరుడు గనక అతన్ని తన అల్లుడిగా చేసుకొనే వీలు కలగాలి. నిజానికి, తనను బంధించి ద్రోణుడి ముందు నిలబెట్టిన వాడే అయినా అర్జునుడంటే తోటి మేటి శూరుడిగా అభిమానం ఉండడానికి కారణం తనూ తనలాటి యుద్ధసాధకుడు కావడమే. తన కోరికల్ని తీర్చుకోవడం కోసం యాజుడూ ఉపయాజుడూ అనే యజ్ఞ నిర్వాహకుల్ని ఆశ్రయించాడు. యాజుడు చేయించిన యజ్ఞంలో, అగ్ని లోంచి కవచాన్ని ధరించిన తేజోవంతుడూ శరఖడ్గధనుర్ధారీ అయిన రథికుడొకడు పుట్టుకొని వచ్చాడు. అతనే ధృష్టద్యుమ్నుడు. ధృష్టత్వమంటే అదరని బెదరనితనం. అటువంటివాడు ఎదురుగా ఎవరున్నా సహించడు. అగ్నిలోంచి పుట్టాడు గనక కాంతిరూపుడతను. పాండవులకు ధృష్టద్యుమ్నుడే సేనాపతి. కౌరవులకేమో వరసగా ఐదుగురయ్యారు సేనాపతులు - భీష్మ ద్రోణ కర్ణ శల్య అశ్వత్థామలు. ఒకడు అహంకారమూ రెండోవాడు సంస్కారమూ మూడోవాడు లోభమూ నాలుగోవాడు మదమూ ఐదో వాడు ఆశయమూను. అటు, పాండవుల ఏకైక సేనాపతి, ధృష్టద్యుమ్నుడంటే ఎవరు? ‘ధృష్ట’ అంటే ధైర్యంతో కూడిన విశ్వాసం; ద్యుమ్నమంటే కాంతీ బలమూ కీర్తీను. అంచేత, ధృష్టద్యుమ్నుడంటే నిబ్బరమైన కాంతి అని అర్థం. ఏ కలతనూ కలగనీయని ప్రశాంతమైన లోపలి ప్రకాశం, సత్యాన్ని తటాలున ప్రకటింపజేసే ఆగమ దీప్తి - అంటే, స్వయంగా దానికదే లోపల నుంచి వచ్చి అర్థాన్ని ప్రకాశింపజేసే సహజమైన విజ్ఞానం. అది ఎప్పటికీ తప్పుదారి పట్టిం చదు. ప్రశాంతమూ నిర్దుష్టమూ అయిన ఈ కాంతే, ఇష్టం లేకపోయినా బలవం తంగా చేయించి మరీ ఏడిపించే అల వాటునీ జిడ్డులాగ వదలని సంస్కారాన్నీ నిర్బంధించి కాల్చివేయగలదు. అహంకా రమూ అలవాటూ కక్కుర్తీ నీల్గుడూ ఆగమకాంతి ముందు నిలవలేవు. అయితే, లోపల పోగై ఉండే కోరికలు, మోసం తోనూ దుర్మార్గంతోనూ ఆగమకాంతిని ఆర్పివేయగలవు. ఆ కారణంగానే ధృష్టద్యు మ్నుడు నిద్రపోతూంటే, అశ్వత్థామ చేతిలో పశువు మాదిరిగా చచ్చిపోయాడు. యజ్ఞసేనుడు చేసిన ఆ యజ్ఞవేదిక నుంచే ద్రౌపది కూడా పుట్టింది. ఆవిడ, మొత్తం ధార్తరాష్ట్రులకే కాదు, హేమాహేమీలైన రాజులందరికీ కాళరాత్రి అయింది, ‘సర్వయోషిద్వరా కృష్ణా నినీషుః క్షత్రియాన్ క్షయం’ (ఆదిపర్వం 166-48) మరి ఇటువంటి పిల్లల్ని కన్న తండ్రి ద్రుపదుడంటే ఎవరబ్బా అని సహజం గానే మనకు అనిపిస్తుంది. ‘ద్రుతం పద్యం యస్య సః’ - అంటే, త్వరత్వరగా పురోగ మించేవాడని ద్రుపదమనే పదానికి అర్థం. తీవ్రమైన సంవేగంతో, అంటే, అత్యంత వైరాగ్యంతో ఆత్మదిశగా పెద్ద పెద్ద అంగలేస్తూ నడిచే ఇతను, ఏ కలతా లేని అనాసక్తికి ప్రతీక. ‘ద్రుపదాదివ ముంచతు; ద్రుపదాదివేన్ముముచానః; స్విన్నస్స్నాత్వీ మలాదివ’ అంటూ తైత్తిరీయ బ్రాహ్మణంలో (2-4-4-10) ఒక మంత్రం ఉంది. చెమటతో ముద్దైన వాడు స్నానం చేసి బాగుపడ్డట్టు, ద్రుపదం అనే శిక్షాపరికరం నుంచి విడివడడమన్నట్టుగా పాపం నుంచి విడదీయమని ఈ ప్రార్థన అర్థం. ద్రుపదమంటే కాలికి కట్టే ఒక పెద్ద దుంగ; అది నేరం చేసినవాణ్ని బంధించి కదలనీయదు. ద్రుపదమనే మాటకు మనం చెప్పుకొన్న రెండు అర్థాల్నీ కలుపు కుంటే, ‘భౌతికమైన ఆసక్తి అనే ద్రుపదం నుంచి విడివడి, త్వరగా, తీవ్రమైన వైరాగ్యమనే ఉపాయంతో బ్రహ్మపదానికి అభిముఖంగా ద్రుతగతితో సాగిపోయే వాడ’ని అర్థం. ఇటువంటి ద్రుపదుడి ఆధ్యాత్మికమైన ఉత్సాహ భక్తులనే అగ్ని నుంచి పుట్టినవాళ్లే ధృష్టద్యుమ్నుడూ ద్రౌపదీను - ఆగమశక్తీ కుండలినీ శక్తీను. - డా॥ముంజులూరి నరసింహారావు -
కౌరవుల పేర్లన్నీ మీకు తెలుసా?
-
కౌరవుల పేర్లన్నీ మీకు తెలుసా?
మహాభారతం గురించి విన్నారు కదా.. టీవీలలో కూడా చాలామంది బీఆర్ చోప్రా తీసిన మహాభారతం సీరియల్ కూడా చూసే ఉంటారు. అందులో పాండవుల పేర్లు ఐదూ మీకు తెలుసు కదూ. మరి కౌరవుల పేర్లు తెలుసా? దుర్యోధనుడు, దుశ్శాసనుడు .. వీళ్లిద్దరి పేర్లు చాలామంది చెబుతారు. మహా అయితే మరికొందరు మాత్రం పాండవ పక్షపాతి అయిన వికర్ణుడి పేరు కూడా చెప్పగలరు. కానీ మొత్తం అందరి మంది పేర్లు చెప్పగలరా? పిల్లలే కాదు.. పెద్దవాళ్లలో కూడా నూటికి 99 మందికి ఆ పేర్లు తెలియకపోవచ్చు. అందుకే.. పిల్లలు, పెద్దవాళ్లు అందరికీ విజ్ఞానం పెంచేందుకు కల్చర్ మెషీన్, షిట్జెంజిగిల్స్ అనే గ్రూపు ఒక అద్భుతమైన వీడియోను రూపొందించింది. కరావోకే స్టైలులో కలిసి పాడేలా ఈ కౌరవుల పాటను వారు రూపొందించారు. ఈ పాటను చూస్తే మొత్తం కౌరవులందరి పేర్లూ ఇట్టే తెలిసిపోతాయి. సరదాగా ఈ పాట చూడండి.. మీరు కూడా కౌరవులందరి పేర్లు నేర్చుకోండి మరి!! -
మోడీ దుర్యోధనుడా?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దుర్యోధనుడా? మంగళవారం లోకసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆ మాట అనలేదు కానీ అన్నంత పని చేశారు. అయితే దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని రంగరించి ఆ అర్థం వచ్చేలా చెప్పారు. పార్లమెంటులో చర్చ జరుగుతూండగా లోకసభలో విపక్ష నేత మల్లికార్జన్ ఖర్గే 'లోకసభలో కాంగ్రెస్ సభ్యులు 44 మంది కావచ్చు. కానీ పాండవులూ సంఖ్యలో తక్కువే. కానీ పాండవులెప్పుడూ కౌరవులకు భయపడలేదు.' అన్నారు. కాంగ్రెస్ సంఖ్యా బలం గురించి మాట్లాడుతూ ఆయన ఈ మాటన్నారు. బిజెపిని కౌరవసేనగా పోల్చారు ఆయన. అలా మోడీని దుర్యోధనుడని అనకుండా అనేశారు.