kho kho championship
-
ఇపుడీ గేమ్ గ్లోబల్ లెవల్ గర్వంగా ఉంది : ఖోఖో వరల్డ్కప్ గెలిచిన రైతుబిడ్డ
మొదటిసారిగా ప్రవేశపెట్టినఖోఖో వరల్డ్ కప్ 2025నుమన పురుషుల జట్టు గెలిచింది.అంతకంటే ఘనంగా మహిళాజట్టు కూడా గెలిచింది.బరిలో ఎవరి సత్తా వారిదే అన్నట్టుగాసాగిన ఈ వరల్డ్కప్లో23 దేశాలు పాల్గొంటే వారిపై గెలుపుకుమన మహిళాజట్టును ముందుండి నడిపించింది కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే. పుణెకు చెందిన ఈ రైతుబిడ్డముంబైలో టాక్స్ అసిస్టెంట్గా పని చేస్తోంది. ఆమె పరిచయంసరే. ముందు ఏం జరిగిందో చూద్దాం. గ్రూప్ స్టేజ్లో ఫస్ట్ మేచ్ పాకిస్తాన్తో పడింది. గెలిచారు. ఆ తర్వాత గట్టి జట్లయిన ఇరాన్, సౌత్ కొరియా, మలేసియా జట్లతో గెలిచారు. ఆ తర్వాత గెలుచుకుంటూ వచ్చి క్వార్టర్ ఫైనల్స్లో అత్యంత గట్టి జట్టు బంగ్లాదేశ్ను మట్టి కరిపించారు. సెమి ఫైనల్స్లో దక్షిణాఫ్రికా పరిస్థితి కూడా అంతే అయ్యింది. ఇక జనవరి 19న ఫైనల్స్. ప్రత్యర్థి జట్టు నే పాల్. ఈ జట్టుకు ఖోఖో బాగా వచ్చు. పైగా యంగ్ ప్లేయర్లు చాలామంది ఉన్నారు. కాని భారత జట్టులో యంగ్ ప్లేయర్లతో పాటు అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. తోడు కెప్టెన్గా 15 ఏళ్ల అనుభవం ఉన్న ప్రియాంక ఉంది. ఖోఖోలో టచ్ పాయింట్లు ఉంటాయి. ఫైనల్స్లో భారత్ 78 టచ్ పాయింట్లతో నే΄ాల్ను 40 పాయింట్లతో కట్టడి చేసి ఘన విజయం సాధించింది. చరిత్రలో మొట్టమొదటిసారి ఖోఖో వరల్డ్ కప్ జరిగితే (జనవరి 13–19, న్యూఢిల్లీ) 23 దేశాలు పాల్గొంటే వాటన్నింటిని ఓడించి కప్ను సొంతం చేసుకుంది భారత మహిళా ఖోఖో జట్టు. అలా ప్రియాంక ఇంగ్లే తన జట్టుతో పాటు చరిత్రలో నిలిచిపోయింది.ఇంతకాలం క్రికెట్కు క్రేజ్ ఉండేది. ఆ తర్వాత కబడ్డీ రంగం మీదకు వచ్చింది. ఇప్పుడు ఖోఖో. ఈ ఆటకు ఒలింపిక్స్లో చోటు దక్కితే ఒలింపిక్స్ మెడల్ సాధించడమే తమ లక్ష్యం అంటున్నారు ప్రియాంక ఇంగ్లే. చూడబోతే అదేం పెద్ద విషయం కానట్టుంది.వీధి ఆటపుణెలో రైతు కుటుంబంలో జన్మించిన ప్రియాంక తన స్కూల్లో ఐదో ఏట ఖోఖోలో చేరింది. అయితే తల్లిదండ్రులు పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. ‘ఇది వీధి ఆట. బస్తీల్లో ఆడే ఆట. ఈ ఆటతో ఏం ప్రయోజనం’ అన్నారు. అయితే 8వ తరగతి వచ్చేసరికి నేషనల్స్కు ఆడటం మొదలుపెట్టింది. మెడల్స్ కూడా సాధించ సాగింది. అప్పుడు తల్లిదండ్రులు మనమ్మాయి బాగా ఆడుతోందని ప్రోత్సహించారు. ప్రియాంక ఇప్పటికి 23 నేషనల్ టైటిల్స్ గెలిచింది. నాల్గవ ఆసియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్మెడల్ సాధించింది. అయినప్పటికీ ఆమె కెప్టెన్ అవుతానని ఊహించలేదు. వరల్డ్ కప్ 2025 పోటీలు జనవరి 13 నుంచి మొదలవనుండగా 11వ తేదీన, రెండురోజుల ముందు ఆమెను కెప్టెన్గా అనౌన్స్ చేశారు. ‘మట్టి మీద ఆడే ఆట నుంచి మ్యాట్ మీద ఆడే ఆట వరకూ ఎదిగిన ఖోఖోలో నేనూ సభ్యురాలు కాగలిగినందుకు గర్వించాను’ అంటుంది ప్రియాంక.బరువైన ట్రోఫీవరల్డ్ కప్ ప్రారంభమైనప్పటి నుంచి వేదిక మీద ఉంచిన ట్రోఫీని మహిళాజట్టు సభ్యులందరూ తాకి చూశారు. ‘అది చాలా బరువున్న ట్రోఫీ. దానిని పట్టుకుని ఫొటో దిగడం సాధ్యం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను’ అంటుంది ప్రియాంక. వరల్డ్ కప్ కోసం నెల రోజుల పాటు సాగిన క్యాంప్లో కోచ్లు 15 మంది గట్టి ప్లేయర్లను తీర్చిదిద్దారు. డిఫెండర్స్, అటాకర్స్, వజీర్స్ అనే మూడు కేటగిరీల్లో ఆటగాళ్లు తర్ఫీదు అవుతారు. ప్రియాంక ఆల్రౌండర్. ‘ఫైనల్స్లో నేపాల్ వస్తుందని మాకు తెలుసు. ఫస్ట్ హాఫ్లో వారిని తట్టుకోవడం కొంచెం కష్టమైంది. అయితే సెకండ్ హాఫ్లో మేము స్ట్రాటజీ మార్చి గెలిచాం. మా జట్టులో యంగ్ ప్లేయర్ల దూకుడు తగ్గిస్తూ అనుభవంతో ఆడుతూ ఈ గెలుపు సాధించాను’ అంది ప్రియాంక.ఎం.కామ్ చేసి గవర్నమెంట్ టాక్స్ విభాగంలో ఉద్యోగం చేస్తోంది ఫ్రియాంక. ‘ఖోఖో ఆటగాళ్లకు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి. సాయం కూడా అందుతోంది. రోజులు బాగున్నాయి. మా మహారాష్ట్రలో ఖోఖో బాగా ఆడతాం. మా రాష్ట్రానికి నేను సరైన ట్రోఫీనే అందించాను’ అని ΄పొంగియింది ప్రియాంక. ఇదీ చదవండి: ట్రంప్ విందులో నీతా స్పెషల్ లుక్.. ఈ చీరకు 1900 గంటలు పట్టిందట! -
Kho Kho World Cup: రెండు ప్రపంచకప్లు మనవే..
న్యూఢిల్లీ: భారత ఖోఖో మహిళల జట్టు ప్రపంచకప్లో విజేతగా నిలిచిన కాసేపటికే.. భారత పురుషుల జట్టు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నేపాల్తో జరిగిన తుదిపోరులోభారత్ 54-36 తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన భారత పురుషుల జట్టు.. అదే జోరును ఇక్కడ కూడా కొనసాగించింది. ప్రత్యర్థి నేపాల్ ను కట్టిపడేసిన భారత్.. విశ్వవిజేతగా అవతరించింది. మొట్టమొదటి ఖోఖో వరల్డ్కప్లో భారత మహిళలు, పురుషుల జట్లు చాంపియన్స్గా నిలవడంవిశేషం. ముందుగా జరిగిన మహిళల ఖోఖో వరల్డ్కప్ ఫైనల్లో ఖోఖో ప్రపంచకప్(Kho Kho World Cup 2025) విజేతగా భారత్ మహిళల జట్టు అవతరించింది.ఈ ప్రపంచకప్లో ఆద్యంతం చెలరేగిపోయిన భారత జట్టు(India).. ఫైనల్లో కూడా సత్తాచాటి విజేతగా నిలిచింది. ఈరోజు(ఆదివారం) జరిగిన ఫైనల్లో భారత జట్టు 78-40 తేడాతో నేపాల్(Nepal) జట్టును ఓడించింది. ఫలితంగా తొలి ఖోఖో ప్రపంచకప్లో జగజ్జేతగా నిలిచింది.ఈ ఫైనల్లో టాస్ గెలిచిన నేపాల్.. ముందుగా భారత్ ను అటాక్ రమ్మని ఆహ్వానించింది. ఇది ఆతిథ్య భారత్కు వరంగా మారగా, పర్యాటక జట్టు నేపాల్కు శాపంగా మారింది. ఆది నుంచి రెచ్చిపోయిన భారత జట్టు. నేపాల్ను వరుస విరామాల్లో తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఎక్కడా కూడా నేపాల్కు అవకాశం ఇవ్వకుండా భారత్ తన ఆధిపత్యాన్నిప్రదర్శించింది. కడవరకూ ఇదే ఆట తీరుతో చెలరేగిపోయిన భారత జట్టు.. నేపాల్ను మట్టికరిపించి ప్రపంచకప్ను ముద్దాడింది.ఇరు జట్లకు వైఎస్ జగన్ అభినందనలుఖోఖో వరల్డ్కప్-2025లో విశ్వవిజేతలుగా నిలిచిన భారత మహిళల, పురుషుల జట్లకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్లో మరిన్ని టోర్నీల్లో రాణించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
ఖో-ఖోకు పెరుగుతున్న స్పాన్సర్షిప్
భారతీయ క్రీడగా పేరొందిన ఖో-ఖోకు స్పాన్సర్షిప్ పెరుగుతోంది. ఈ ఆటను మరింత మందికి చేరువ చేసేందుకు కార్పొరేట్ కంపెనీలు తమ సహకారం అందిస్తున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు లభించే దిశగా ఖో-ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్ఐ) పని చేస్తోంది. 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఖో-ఖోను చాలాకాలంగా దక్షిణ ఆసియాలో ఎక్కువగా ఆడుతున్నారు. అయితే క్రికెట్ అంతటి ప్రజాదరణ పొందడంలో మాత్రం వెనకబడింది. ఈ పరిస్థితిని మార్చి ఖోఖోను ప్రపంచ వేదికలపై నిలబెట్టే ప్రయత్నాన్ని కేకేఎఫ్ఐ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ సంస్థ మరిన్ని స్పాన్సర్షిప్లకు కోసం చూస్తోంది.ఖో-ఖో ప్రపంచకప్కేకేఎఫ్ఐ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఖో-ఖో ప్రపంచకప్ను ఆవిష్కరించింది. జనవరి 13 నుంచి 19 వరకు దీన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో 23 దేశాలకు చెందిన జట్లు పోటీపడ్డాయి. ఏరియల్ డ్యాన్సర్లతో సహా ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనలు, స్టార్ పెర్ఫార్మర్ షిమాక్ దావర్ కొరియోగ్రఫీతో ఈ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలు నిర్వహించారు.స్పాన్సర్ షిప్లుఖో-ఖోను ఆధునీకరించడంలో భాగంగా కేకేఎఫ్ఐ క్రీడా ప్రాంగణాల్లో మార్పులు చేస్తోంది. గతంలో ఇది మట్టి కోర్టుల్లో జరిగేది. దాన్ని ఇండోర్ మ్యాట్లపై జరిగేలా చేసింది. ఇది ఆటగాళ్లకు, ప్రేక్షకులకు అనుకూలంగా మారింది. ఈ వాతావరణం స్పాన్సర్ షిప్లను కూడా ఆకర్షించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఖో-ఖో ప్రపంచకప్నకు ఈజ్ మై ట్రిప్, జీఎంఆర్ ఏరో, జొమాటో, బ్లాక్ బెర్రీస్, టాటా వంటి బ్రాండ్లు మద్దతు ఇస్తున్నాయి. డిస్నీ+ హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డీడీ స్పోర్ట్స్ వంటి ప్రధాన నెట్వర్క్ల్లో ఈ టోర్నమెంట్ ప్రసారం అవుతోంది. ఈ టోర్నమెంట్లకు 200 మిలియన్లకు పైగా వ్యూయర్షిప్ ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు పోయిందా? బ్లాక్ చేయండిలా..అల్టిమేట్ ఖో-ఖో (యూకేకే) లీగ్క్రికెట్లో ఐపీఎల్, కబడ్డీలో ప్రో కబడ్డీ లీగ్ ఎలాగో ఖో-ఖోలోనూ అల్టిమేట్ ఖో-ఖో (యూకేకే) లీగ్ను 2022లో ప్రారంభించారు. ఇందులోనూ ఫ్రాంచైజీలుంటాయి. ప్రో కబడ్డీ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్ తరువాత దేశంలో అత్యధికంగా వీక్షించిన క్రికెటేతర క్రీడా టోర్నమెంట్గా యూకేకే ప్రజాదరణ పొందింది. లీగ్ మొదటి సీజన్లో 64 మిలియన్ల వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. -
అంతర్జాతీయ ఖోఖోలో.. 'సైరా' అనిపించిన తెలంగాణ సాయిరాజ్..
ఆదిలాబాద్: లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన సాయిరాజ్ అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో ఇండియా తరఫున పాల్గొని బంగారు పతకాన్ని సాధించాడు. ఇటీవల నేపాల్దేశంలో జరిగిన అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో రాణించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో కోచ్ అన్నపూర్ణ, గ్రామస్తులు అతడిని అభినందించారు. -
రంగారెడ్డి మహిళల జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఖో–ఖో చాంపియన్షిప్లో రంగారెడ్డి జిల్లా మహిళల జట్టు సత్తా చాటింది. మేడారంలో నాలుగు రోజుల పాటు జరిగిన ఈ టోరీ్నలో విజేతగా నిలిచి టైటిల్ను కైవసం చేసుకుంది. మహిళల ఫైనల్లో రంగారెడ్డి 11–9తో కరీంనగర్పై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో మహబూబ్నగర్ 8–5తో వరంగల్పై నెగ్గింది. పురుషుల విభాగంలో వరంగల్ చాంపియన్గా నిలిచింది. తుదిపోరులో వరంగల్ 11–8తో కరీంనగర్ను ఓడించింది. రంగారెడ్డి 9–7తో హైదరాబాద్పై గెలుపొంది మూడోస్థానాన్ని దక్కించుకుంది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ములుగు అదనపు ఎస్పీ సాయి చైతన్య ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
తెలంగాణ జట్టుకు రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఖో–ఖో చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు రాణించింది. సీఐఎస్సీఈ నేషనల్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోరీ్నలో తెలంగాణ రన్నరప్గా నిలిచి రజతాన్ని గెలుచుకుంది. ఆతిథ్య ఉత్తర్ప్రదేశ్ జట్టు విజేతగా నిలిచింది. ఘజియాబాద్ వేదికగా పోటీలు జరుగగా... రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సెయింట్ జోసెఫ్ (హబ్సిగూడ) విద్యార్థి జి. కృషితా రెడ్డి టోర్నీ ఆసాంతం ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం కృషితా రెడ్డిని అభినందించింది. ఆమె త్వరలో జరుగనున్న ఎస్జీఎఫ్ఐ అండర్–14 పోటీల్లో పాల్గొనే జట్టులోనూ స్థానం దక్కించుకుంది. -
జీసీపీఈ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి పురుషుల ఖో–ఖో టోర్నమెంట్లో జీసీపీఈ దోమలగూడ జట్టు టైటిల్ను కైవసం చేసుకుంది. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ కాలేజి (నారాయణగూడ) ప్రాంగణంలో జరిగిన ఈ టోర్నీలో జీసీపీఈ జట్టు విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో జీసీపీఈ 8–7తో నిజాం కాలేజిపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో సిద్ధార్థ కాలేజి 8–1తో భవన్స్ న్యూ సైన్స్ (నారాయణగూడ) జట్టును ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్ల్లో నిజాం 14–9తో భవన్స్పై, జీసీపీఈ 14–7తో సిద్ధార్థ జట్లపై గెలుపొందాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త కార్యదర్శి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
విజేత కోఠి ఉమెన్స్ కాలేజి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి మహిళల ఖో–ఖో చాంపియన్షిప్లో ఆతిథ్య కోఠి ఉమెన్స్ కాలేజి జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో కోఠి ఉమెన్స్ జట్టు 10–1తో సెయింట్ ఆన్స్ (మెహిదీపట్నం) కాలేజీని చిత్తుగా ఓడించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో వికారాబాద్ సాంఘిక సంక్షేమ కాలేజి జట్టు 4–1తో ఎల్బీనగర్ సాంఘిక సంక్షేమ కాలేజిపై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్ల్లో కోఠి ఉమెన్స్ జట్టు 11–1తో వికారాబాద్ సాంఘిక సంక్షేమ కాలేజిపై, సెయింట్ ఆన్స్ (మెహిదీపట్నం) 16–2తో ఎల్బీ నగర్ సాంఘిక సంక్షేమ కాలేజిపై విజయం సాధించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఠి ఓయూసీడబ్ల్యూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రోజారాణి, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి వి. దీపిక, ఓయూ ఐసీటీఎస్ కార్యదర్శి బి. సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఖో–ఖో విజేత సెయింట్ పాయ్స్
సాక్షి, హైదరాబాద్: వైఎంసీఏ నారాయణగూడ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్గిల్ విక్టరీ స్పోర్ట్స్ మీట్లో సెయింట్ పాయ్స్ బాలికల జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఖో–ఖో సీనియర్ బాలికల టైటిల్పోరులో సెయింట్ పాయ్స్ హైస్కూల్ 25–23తో మంచి స్కూల్ బాలాపూర్పై విజయం సాధించింది. జూనియర్ బాలుర ఫైనల్లో శ్రీవిద్య హైస్కూల్ 25–17తో శ్రీ మోడల్ హైస్కూల్ను ఓడించింది. జూనియర్ బాలికల కేటగిరీలో బేగాస్ హైస్కూల్ 8–3తో సెయింట్ ఫిలోమినా హైస్కూల్పై గెలుపొందింది. మరోవైపు వాలీబాల్ ఈవెంట్లో శ్రీవిద్య సెకం డరీ స్కూల్ తిలక్నగర్ చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో శ్రీవిద్య స్కూల్ 25–17తో దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్ (కర్మన్ఘాట్)పై గెలిచింది. -
ఆంధ్రప్రదేశ్కు మూడోస్థానం
సాక్షి, హైదరాబాద్: జూనియర్ సౌత్జోన్ జాతీయ ఖో–ఖో చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ బాలుర జట్టు మూడో స్థానంలో నిలిచింది. సరూర్నగర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్లో కేరళ బాలికల జట్టు, తమిళనాడు బాలుర జట్టు విజేతలుగా నిలిచాయి. ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో తమిళనాడు 12–11తో కేరళపై గెలుపొందింది. బాలికల టైటిల్ పోరులో కేరళ 11–7తో కర్ణాటకను ఓడించింది. బాలికల విభాగంలో కర్ణాటక... బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ మూడోస్థానంలో నిలిచాయి. ఈ టోర్నీ ఆసాంతం రాణించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు నితీశ్ ‘బెస్ట్ చేజర్’ అవార్డును అందుకున్నాడు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 6 రాష్ట్రాలకు చెందిన 12 జట్లు పాల్గొన్నాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
రాష్ట్ర ఖో–ఖో జట్ల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఖో–ఖో చాంపియన్షిప్లో పాల్గొనే రాష్ట్ర బాలబాలికల జట్లను గురువారం ప్రకటించారు. ఈ జట్లు మణిపూర్లోని తౌబాల్ నగరంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే జాతీయ ఖో–ఖో టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. బాలబాలికల జట్లకు కోచ్గా ఎన్. కష్ణమూర్తి, మేనేజర్గా గోపాల్ వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. వారికి స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో తెలంగాణ జట్లు రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఖో–ఖో సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి వై. శ్రీనివాసరావు, ఉమ్మడి కార్యదర్శి కె. రామకష్ణ, కోశాధికారి ఎన్. కష్ణమూర్తి, మేనేజర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. జట్ల వివరాలు బాలురు: బి. మహేశ్, బి. సోమరాజు, జగతిబాబు, అశోక్ (రంగారెడ్డి), బి. ప్రవీణ్, మాజిద్ పాషా, డి. వినయ్ (వరంగల్), బి. రమేశ్, కె. రమేశ్(ఆదిలాబాద్), నరసింహస్వామి, ధీరజ్ (హైదరాబాద్). బాలికలు: బి. రేణుక, కె. అనూష (రంగారెడ్డి), ఎ. సంధ్య, పొనిక, శిరీష (వరంగల్), స్రవంతి, మహేశ్వరి (హైదరాబాద్), సి. కారుణ్య, లావణ్య, పరిమళ (నల్లగొండ), జి. కష్ణమ్మ (మహబూబ్నగర్), శారద సోని (ఖమ్మం). -
తెలంగాణ జట్లకు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ కప్ జాతీయ ఖో–ఖో చాంపియన్షిప్లో తెలంగాణ రాష్ట్ర జట్లు రాణించాయి. సరూర్నగర్ ఖో–ఖో స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో మహిళల, పురుషుల విభాగాల్లో మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. మహిళల టైటిల్పోరులో మహారాష్ట్ర 15–6తో కర్ణాటకపై గెలుపొంది చాంపియన్గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో విదర్భపై తెలంగాణ గెలుపొందింది. పురుషుల ఫైనల్లో మహారాష్ట్ర 22–5తో కొల్హాపూర్పై విజయం సాధించింది. ఈ కేటగిరీలో తెలంగాణ మూడోస్థానంలో, కేరళ నాలుగో స్థానంలో నిలిచాయి. టోర్నీ ముగింపు కార్యక్రమంలో ‘శాట్స్’ ఎండీ ఎ. దినకర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత ఖో–ఖో సమాఖ్య కార్యదర్శి మహేందర్ సింగ్ త్యాగి, తెలంగాణ ఖో–ఖో సంఘం కార్యదర్శి వై. శ్రీనివాస రావు, రంగారెడ్డి జిల్లా ఖో–ఖో సంఘం కార్యదర్శి కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బెంగాల్పై తెలంగాణ గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ కప్ ఖో–ఖో చాంపియన్షిప్లో తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సరూర్నగర్లో శనివారం జరిగిన మూడు మ్యాచ్ల్లో తెలంగాణ ఒక మ్యాచ్లో గెలిచి రెండింటిలో పరాజయం పాలైంది. పురుషుల తొలి మ్యాచ్లో తెలంగాణ 11–9తో పశ్చిమ బెంగాల్పై గెలుపొందగా, రెండో మ్యాచ్లో 4–13తో మహారాష్ట్ర చేతిలో పరాజయం పాలైంది. మహిళల విభాగంలోనూ మహారాష్ట్ర 10–6తో తెలంగాణ జట్టుపై విజయం సాధించింది. ఇతర మహిళల మ్యాచ్ల్లో కర్ణాటక 12–2తో పశ్చిమ బెంగాల్పై, పశ్చిమ బెంగాల్ 22–3తో ఢిల్లీపై, కర్ణాటక 19–4తో విదర్భపై, పశ్చిమ బెంగాల్ 4–0తో విదర్భపై, విదర్భ 8–7తో పశ్చిమ బెంగాల్పై గెలుపొందాయి. -
ఖో–ఖో క్రీడాకారులకు నగదు బహుమతి
సాక్షి, హైదరాబాద్: దక్షిణాసియా క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన రాష్ట్ర క్రీడాకారులకు ‘శాట్స్’ నగదు బహుమతిని అందజేసింది. భారత్కు ప్రాతినిధ్యం వహిం చిన రాష్ట్ర క్రీడాకారులు రంజిత్, నందినిలకు శాట్స్ ఎండీ ఎ. దినకర్బాబు రూ. 1.25 లక్షల చెక్ను అందజేశారు. మొత్తం 8 దేశాలు తలపడిన ఈ టోర్నీలో భారత్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా దినకర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రం నుంచి మరింత మంది క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించేలా క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖో–ఖో సంఘం కార్యదర్శి శ్రీనివాస్ రావు, సంయుక్త కార్యదర్శి రామకృష్ణ, పీఈటీలు పరమేశ్, సోని పాల్గొన్నారు. -
తెలంగాణ జట్లకు కాంస్యాలు
జాతీయ ఖో-ఖో చాంపియన్షిప్ సాక్షి, హైదరాబాద్: సీనియర్ సౌత్జోన్ జాతీయ ఖో-ఖో చాంపియన్షిప్లో తెలంగాణ జట్లు రాణించాయి. కర్ణాటకలోని గుల్బర్గాలో జరిగిన ఈ టోర్నీలో రాష్ట్ర పురుషుల, మహిళల జట్లు కాంస్య పతకాలను సాధించాయి. మూడో స్థానం కోసం ఆదివారం జరిగిన మ్యాచ్ల్లో తెలంగాణ పురుషుల జట్టు 9-8తో ఆంధ్రప్రదేశ్పై, మహిళల జట్టు కూడా 5-4తో ఆంధ్రప్రదేశ్పైనే గెలిచి మూడో స్థానంలో నిలిచాయి. అనంతరం రాష్ట్ర ఖో-ఖో సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి రామకృష్ణ విజేత జట్లకు ట్రోఫీలను ప్రదానం చేశారు. -
రంగారెడ్డి ‘డబుల్’ ధమాక
రాష్ట్ర స్థాయి ఖో-ఖో టోర్నీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి జూనియర్ ఖో-ఖో చాంపియన్షిప్లో రంగారెడ్డి క్రీడాకారులు సత్తా చాటారు. గద్వాలలో జరిగిన ఈ టోర్నమెంట్లో బాలబాలికల విభాగాల్లో టైటిల్స్ను చేజిక్కించుకున్నారు. గురువారం జరిగిన బాలుర ఫైనల్లో రంగారెడ్డి జట్టు 14-12తో కరీంనగర్పై విజయం సాధించింది. సెమీస్లో రంగారెడ్డి 10-6తో వరంగల్పై, కరీంనగర్8-7తో ఖమ్మంపై గెలుపొందారుు. తర్వాత జరిగిన బాలికల ఫైనల్లోనూ రంగారెడ్డి జట్టు 6-4తో కరీంనగర్ జట్టును ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో రంగారెడ్డి 8-5తో నిజామాబాద్పై గెలుపొందగా... కరీంనగర్ 6-5తో మహబూబ్నగర్ను ఓడించింది.