Last journey
-
ఛత్తీస్గఢ్ అమరులకు ఘన నివాళులు
దంతెవాడ: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడలో బుధవారం మావోయిస్టుల మందుపాతర పేల్చిన ఘటనలో అమరులైన 10 మంది పోలీసు సిబ్బంది, ఒక డ్రైవర్కు ఘనంగా నివాళులర్పించారు. కర్లి ప్రాంతంలోని పోలీస్లైన్స్లో గురువారం జరిగిన కార్యక్రమంలో మృతుల కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం రోదనలు, భారత్ మాతా కీ జై నినాదాలతో ప్రతిధ్వనించింది. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తదితరులు హాజరై మృతులకు పూలతో నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను బఘేల్ ఓదార్చారు. అనంతరం జవాన్ల భౌతికకాయాలను వాహనాల్లో సొంతూళ్లకు తరలించారు. సీఎం బఘేల్ కూడా భుజం కలిపి ఒక జవాను మృతదేహాన్ని వాహనం వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాలు వృథా కావని, మావోయిస్టులపై పోరు మరింత తీవ్రతరం చేస్తామని చెప్పారు. దంతెవాడ జిల్లా అరన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసుల వాహనాన్ని నక్సల్స్ మందుపాతరతో పేల్చిన ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు(డీఆర్జీ) విభాగానికి చెందిన 10 మంది జవాన్లు, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. శవపేటికను మోస్తున్న సీఎం బఘేల్ -
తోడెవరూ రాక... తోపుడు బండిపై..
యశవంతపుర: కరోనా వైరస్ అన్ని బంధాలను తెంచివేస్తోంది. ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. తాజాగా ఇటువంటి ఘటన కర్ణాటకలో బెళగావి జిల్లా అథణిలో జరిగింది. పట్టణానికి చెందిన నిరుపేద సదాశివ హిరట్టి (55) శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. అతడు కరోనాతో చనిపోయి ఉంటాడని బంధువులు, ఇరుగుపొరుగు వారెవరూ రాలేదు. దీంతో ఆయన భార్య, 13 ఏళ్ల కుమారుడు, మరొకరి సాయంతో మృతదేహాన్ని తోపుడు బండిపై శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. -
కరోనా మృతుల కోసం ‘లాస్ట్ రైడ్ సర్వీస్’
రాయదుర్గం: కరోనాతో చనిపోయిన వారిని ఖనన స్థలానికి తరలించేందుకు వీలుగా ఏర్పాటుచేసిన ‘లాస్ట్ రైడ్ సర్వీస్’అంబులెన్స్ వాహనాన్ని శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో కమిషనర్ వీసీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. సజ్జనార్ మాట్లాడుతూ కరోనాతో మృతిచెందిన వారిని ఆస్పత్రి నుంచి ఖననానికి తీసుకెళ్లడం, ఖననం చేయడం సమస్యగా మారిందన్నారు. అటువంటి సమయంలో ఫీడ్ ది నీడీ టీమ్ కరోనా, నాన్ కరోనా మృతుల ఖననం కోసం ఈ వాహన సేవలను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయకుమార్, ఫీడ్ ది నీడీ టీమ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, ఎన్జీఓ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ప్రతినిధి కళ్యాణ్ రూ.50 వేల చెక్కును సైబరాబాద్ సీపీ సజ్జనార్కు అందించారు. లాస్ట్ రైడ్ సర్వీస్ సేవలిలా.. కరోనాతో లేదా ఇతరత్రా చనిపోయిన వారి మృతదేహాలను ఖననం చేసే స్థలానికి అంబులెన్స్ ద్వారా ఉచితంగానే తరలిస్తారు. రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వర కు ఈ వాహనం అందుబాటులో ఉంటుంది. సంప్రదించాల్సిన నంబర్: 84998 43545. -
వీరుడా.. వీడ్కోలు
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: వీర మరణం పొందిన కల్నల్ సంతోష్బాబుకు జనం అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. ‘జై జవాన్, వందేమాతరం, భారత్ మాతాకీ జై, చైనా ఖబడ్దార్’ అంటూ పెద్దపెట్టున నినదిస్తూ, జాతీయ పతాకాలు చేతబట్టి అంతిమయాత్రలో కదిలారు. ‘వీరుడా నీ త్యాగం ఎప్పటికీ మరువం’అంటూ సూర్యాపేట పట్టణమంతా గొంతెత్తి స్మరించుకుంది. గురువారం ఉదయం 9.40 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమై పట్టణ సమీపంలోని కేసారం గ్రామం వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రానికి 11.30 గంటలకు చేరుకుంది. 5.5 కిలోమీటర్ల మేర రెండు గంటల పాటు సాగిన అంతిమయాత్ర జనసంద్రమైంది. కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు, ప్రజలు, ప్రభుత్వ ప్రముఖుల అశ్రునయనాలు, బాధాతప్తహృదయాల మధ్య సంతోష్బాబు అంత్యక్రియల్ని సైనిక లాంఛనాలతో చేపట్టారు. బిహార్ రెజిమెంట్ 1వ బెటాలియన్ సైనికులు గౌరవ సూచకంగా గాల్లోకి మూడురౌండ్ల కాల్పులు జరిపిన అనంతరం దహన సంస్కారాలు ముగిశాయి. భర్త పార్థివదేహానికి కుమారుడు అనిరుద్తో కలిసి సెల్యూట్ చేస్తున్న సంతోషి కడచూపు వేళ జనమంతా కన్నీటిపర్యంతం బుధవారం రాత్రి 11.40కి కల్నల్ సంతోష్బాబు పార్థివదేహం సూర్యాపేట విద్యానగర్లోని ఆయన నివాసానికి చేరుకుంది. అప్పటికే అమర జవానుకు నివాళులర్పించేందుకు భారీగా జనం తరలివచ్చారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి కల్నల్ను కడసారి చూసేందుకు మరింత పెద్దసంఖ్యలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ.. నివాళులర్పించారు. సంతోష్బాబు పార్థివదేహాన్ని ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై ఉంచారు. సైనిక లాంఛనాలతో ఆర్మీ, నేవీ అధికారులు, సిబ్బందితో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి 10 నిమిషాల పాటు పార్థివదేహానికి గౌరవ వందనం సమర్పించారు. 9.40 గంటలకు బిహార్ రెజిమెంట్ ఫస్ట్ బెటాలియన్కు చెందిన పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో అంతిమయాత్ర ప్రారంభమైంది. విద్యానగర్ నుంచి కేసారంలోని కుటుంబ వ్యవసాయ క్షేత్రంలోని అంత్యక్రియల ప్రాంగణం వరకు ఉన్న 5.5 కిలోమీటర్ల దూరానికి చేరుకునేందుకు 2 గంటలు పట్టింది. 11.30 గంటలకు అంతిమయాత్ర వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంది. దారిపొడవునా ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది కల్నల్ పార్థివదేహం ఉన్న వాహనంపై పూలవర్షం కురిపించారు. జాతీయ పతాకాలతో, జైహింద్ నినాదాలతో ముందు నడిచారు. కల్నల్ సంతోష్బాబు చితికి మధ్యాహ్నం 12.05 గంటలకు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్, కుమారుడు అనిరుధ్ కలిసి నిప్పంటించారు. భార్య సంతోషి, తల్లిదండ్రులు ఉపేందర్, మంజుల కడచూపు వేళ కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబసభ్యులంతా దుఃఖసాగరంలో మునిగిపోయారు. కూతురు అభిజ్ఞ తండ్రి చితిలో కట్టె వేయగానే.. ‘అయ్యో బిడ్డా’అంటూ కుటుంబసభ్యులు విలపించడం అక్కడున్న వారిని కలచివేసింది. సంతోష్బాబు భౌతికకాయం వద్ద గౌరవ వందనం చేస్తున్న ఆర్మీ అధికారులు, జవాన్లు బిహార్ రెజిమెంట్ ఆధ్వర్యంలో.. సంతోష్బాబు 2004లో బిహార్ 16వ రెజిమెంట్లో అధికారిగా చేరారు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన ఫస్ట్ బెటాలియన్ అంత్యక్రియల్ని చేపట్టింది. ఈ బెటాలియన్కు చెందిన 50 మంది జవాన్లు, పదిమంది మేజర్, కల్నల్, కెప్టెన్ ర్యాంకు అధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ముఖ్య అధికారులుగా 54 బెటాలియన్ బ్రిగే డియర్ అగర్వాల్, మేజర్ ఫరీద్, కల్నల్స్ విజయ్, అభినవ్, జాద వ్, లెఫ్ట్నెంట్ కల్నల్స్ శ్రీనివాసరావు, మథి, ప్రత్యేక అధికారి దినేష్కుమార్ హాజరయ్యారు. 12 గంటలకు మూడురౌండ్ల పాటు గాల్లోకి కాల్పులు జరిపిన అనంతరం దహన సంస్కారాలను పూర్తిచేశారు. అంతకుముందు సంతోష్బాబు ఆర్మీడ్రెస్, క్యాప్, జాతీయ పతాకాన్ని ఆయన సతీమణి సంతోషికి ఆర్మీ అధికారి అందించారు. గాలిలోకి కాల్పులు జరిపి సైనిక వందనం సమర్పిస్తున్న జవాన్లు ప్రముఖుల శ్రద్ధాంజలి.. వీరమరణం పొందిన కల్నల్ సంతోష్బాబు అంత్యక్రియలకు రాష్ట్ర ప్రముఖులు హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వ ప్రతినిధిగా విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి బుధవారం రాత్రి నుంచి అంత్యక్రియలు ముగిసే వరకు ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీలు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, వివేక్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్కుమార్, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్.భాస్కరన్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మావతి ఉత్తమ్కుమార్, సంకినేని వెంకటేశ్వర్రావు, జెడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మిలటరీ అధికారులు అందజేసిన భర్త ఆర్మీ దుస్తులను గుండెలకు హత్తుకొని కన్నీటిపర్యంతమవుతున్న సంతోష్బాబు భార్య సంతోషి నివాళులర్పిస్తున్న మంత్రి జగదీశ్రెడ్డి. చిత్రంలో బడుగుల, బూర నర్సయ్యగౌడ్ -
సూర్యాపేట: ముగిసిన కల్నల్ సంతోష్బాబు అంత్యక్రియలు
-
స్వస్థలాలకు చేరిన వీర జవాన్ల మృతదేహాలు
సాక్షి, న్యూఢిల్లీ: లద్దాఖ్లోని గాల్వన్ లోయా వద్ద చైనాతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన సైనికుల మృతదేహాలు బుధవారం వారి స్వస్థలాలకు చేరుకున్నాయి. సోమవారం రాత్రి చైనా దాడిలో 20 మంది భారత సైనికులు వీరమరణం పోందినట్లు ఆర్మీ అధికారులు మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మరణించిన సైనికుల మృతదేహాలను ఉంచిన శవపేటికకు జాతీయా జెండాను కప్పి సైనిక లాంఛనాలతో వారి స్వస్థలాలకు తరలించారు. కాగా మరణించిన సైనికుల్లో బీహార్కు చెందివారు అయిదుగురు, పంజాబ్కు చెందిన నలుగురు, పశ్చిమ బెంగాల్, ఓడిశా, జార్ఖండ్కు రాష్ట్రాలకు చెందిన వారు ఇద్దరూ చొప్పున ఉన్నారు. చత్తీస్గడ్, మధ్యప్రదేశ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ చెందిన ఒక్కొక్కరూ ఉన్నారు. కాగా ఇవాళ సైనికుల మృతదేహాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నాయి. (సూర్యాపేటలో కల్నల్ సంతోష్ అంతిమయాత్ర) మరణించిన సైనికుల పేర్లు.. 1. కల్నల్ బి. సంతోష్బాబు (తెలంగాణ) 2. నాయిబ్ సుబేదార్ నుదురం సోరెన్ 3. నాయబ్ సుబేదార్ మన్దీప్ సింగ్ 4. నాయబ్ సుబేదార్ సత్నం సింగ్ 5. హవిల్దార్ కె పళని 6. హవిల్దార్ సునీల్ కుమా 7. హవిల్దార్ బిపుల్ రాయ్ 8. నాయక్ దీపక్ కుమార్ 9. సిపాయి రాజేష్ ఒరాంగ్ 10. సిపాయి కుందన్ కుమార్ ఓజా 11. సిపాయి గణేష్ రామ్ 12. సిపాయి చంద్రకాంత ప్రధాన్ 13. సిపాయి అంకుష్ 14. సిపాయి గుర్బిందర్ 15. సిపాయి గుర్తేజ్ సింగ్ 16. సిపాయి చందన్ కుమార్ 17. సిపాయి కుందన్ కుమార్ 18. సిపాయి అమన్ కుమార్ 19. సిపాయి జై కిషోర్ సింగ్ 20. సిపాయి గణేష్ హన్స్డా అడ్డుకున్న సంతోష్ నేతృత్వంలోని దళం సూర్యాపేటలో కల్నల్ సంతోష్బాబు అంత్యక్రియలు.. కాగా తెలంగాణకు చెందిన కమాండర్ కల్నల్ సంతోష్బాబు మృతదేహాన్ని బుధవారం రాత్రి దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి హైదరాబాద్లోని హకీంపేటలోని వైమానిక దళానికి తరలించారు. ఆ తర్వాత విద్యానగర్లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. జాతియ జెండా కప్పిన సంతోస్ బాబు శవపేటికను సైనికులు అంబులెన్స్ నుంచి బయటకు తీస్తుండగా అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఉద్వేగానికి లోనవుతూ ‘సంతోష్ బాబు అమర్ హ’ అంటూ నినాదాలు చేశారు. గురువారం ఉదయం కల్నల్ సంతోష్బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ఆయన స్వస్థలం సూర్యాపేటలో ముగిశాయి. సంతోష్ అంత్యక్రియలకు మంత్రి జగదీశ్రెడ్డితో పాటు రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. -
సైనిక లాంఛనాలతో సంతోష్ అంత్యక్రియలు
సాక్షి, సూర్యాపేట : లద్దాఖ్లోని గాల్వన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో మృతి చెందిన కల్నల్ సంతోష్బాబు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో ముగిశాయి. ప్రోటోకాల్ ప్రకారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు కార్యక్రమాలు నిర్వహించారు. సంతోష్ మిలటరీకి చేసిన సేవలకు గుర్తుగా అధికారులు సంతోష్ యునిఫామ్, అతని టోపీని భార్య సంతోషికి అందించారు. సంతోష్బాబు పార్థివ దేహానికి సైనికులు తుపాకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం సంతోష్ తండ్రి ఉపేందర్ అంతిమ సంస్కారాలు నిర్వహించగా, ఆయన వెంట సంతోష్ భార్య సంతోషితో పాటు కుమారుడు ఉన్నారు. అనంతరం తండ్రి ఉపేందర్ సంతోష్ పార్థివదేహాం ఉన్న చితికి నిప్పంటించారు. సంతోష్ అంత్యక్రియలకు హాజరైన వారిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శాసన సభ్యులు గాదరి కిషోర్ , సైది రెడ్డి , చిరుమర్తి లింగయ్య , మాజీ ఎంపీ బూర నర్సయ్య, కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి పల్లంరాజు, పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆయన సతీమణి పద్మావతి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పార్థివదేహం ముందు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. (బలిదానం వృథా కాదు!) కాగా, కల్నల్ సంతోష్ ఇంటి నుంచి కేసారం గ్రామ సమీపం వరకు 5.5 కిలోమీటర్లు మేర మిలటరీ వాహనంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచి సైనిక సిబ్బంది ముందు వరుసలో కవాతు చేస్తూ అంతిమయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ను కడసారి చూసేందుకు దారి పొడవునా భౌతికదూరం పాటిస్తూనే ప్రజలు సెల్యూట్ చేస్తూ ఘన నివాళి అర్పించారు. సంతోష్ అంతిమయాత్రలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులతో పాటు భారీగా ప్రజలు హాజరయ్యారు. (వీరుడా.. వందనం) కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహాన్ని కడచూపు చూసేందుకు బారులు తీరిన బంధువులు, ప్రజలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘ఉన్నావ్’ బాధితురాలికి కన్నీటి వీడ్కోలు
ఉన్నావ్: ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో అత్యాచారం, హత్యకు గురైన బాధితురాలి (23) అంత్యక్రియలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఆదివారం ముగిశాయి. కుటుంబసభ్యులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య యువతి స్వగ్రామంలోనే ఆమె తాత, నానమ్మ సమాధుల పక్కన అంత్యక్రియలు నిర్వహించారు. బాధితురాలిని కడసారి చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. యూపీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, కమల్రాణి వరుణ్, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ సజన్ అంత్యక్రియలకు హాజరయ్యారు. బాధితురాలి కుటుంబానికి ఉన్నావ్ ఎంపీ అన్నూ టాండన్ రూ.5 లక్షల సాయం అందించారు. కాగా, ఈ కేసులో నిందితులను శిక్షిస్తామని సీఎం ఆదిత్యనాథ్ భరోసా ఇచ్చేదాకా అంత్యక్రియలు నిర్వహించేది లేదని పట్టుబట్టిన బాధిత కుటుంబం.. అధికారుల హామీతో వెనక్కుతగ్గింది. ఆ కుటుంబానికి భద్రత ఏర్పాటు చేస్తామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు చేస్తామని లక్నో డివిజినల్ కమిషనర్ వెల్లడించారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న బాధితురాలి సోదరికి ప్రత్యేక భద్రత కల్పిస్తాన్నారు. రక్షణ కోసం ఆయుధాలు కావాలంటే ఇస్తామని చెప్పారు. రేప్ బాధితురాలి ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఏడుగురు పోలీసులను యూపీ ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. పోలీసు భద్రత మధ్య అంతిమ యాత్ర -
విజయకృష్ణ గార్డెన్లో విజయనిర్మల అంత్యక్రియలు
-
అమర జవాన్లకు సెల్యూట్
న్యూఢిల్లీ/లక్నో/జైపూర్: ఉద్వేగం ఉప్పొంగింది. భావోద్వేగాలు పెల్లుబికాయి. మాతృ దేశ సేవలో నేలకొరిగిన అమర జవాన్లకు తుది వీడ్కోలు పలికేందుకు దేశమంతా కదిలొచ్చింది. మేమున్నామంటూ బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచింది. పుల్వామా దాడిలో అసువులు బాసిన ధీశాలుల అంత్యక్రియలు శనివారం దేశవ్యాప్తంగా వారివారి స్వస్థలాల్లో అధికార లాంఛనాలతో జరిగాయి. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన తమ వారి పట్ల గర్వం ఓ వైపు, తమలో ఒకరు ఇక లేరని వేదన మరోవైపు. ఇలా ఒక్కో కుటుంబానిది ఒక్కో కథ..ఒక్కో వ్యథ. ఇంతటి విషాద సమయంలో జాతి అంతా ఒక్కటై ముష్కరుల కుట్రకు బలైన భరతమాత ముద్దు బిడ్డల సేవలను శ్లాఘిస్తూ ఘనంగా నివాళులర్పించింది. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించింది. చాలా ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాల్ని మూసేశారు. తమ గ్రామానికి చేరుకున్న అమర జవాన్ల భౌతికకాయాల్ని కడసారి చూసేందుకు ప్రజలు వీధుల్లో రోడ్లకు ఇరు వైపులా నిలబడ్డారు. పలువురు కేంద్ర మంత్రులు ఢిల్లీ నుంచి తమ స్వరాష్ట్రాలకు వెళ్లి అక్కడి మంత్రులతో కలసి వీర జవాన్ల అంతిమ యాత్రలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం కప్పిన జవాన్ల భౌతిక కాయాలను ఢిల్లీ నుంచి వారి స్వస్థలాలకు సమీపంలోని విమానాశ్రయాలకు తరలించి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వారివారి స్వగ్రామాలకు తీసుకెళ్లారు. ఉత్తరాఖండ్లోని ఓ గ్రామంలో మూడేళ్ల చిన్నారి తన తండ్రి చితికి నిప్పంటించగా, రాజస్తాన్లో రెండు నెలల పసిగుడ్డుతో తండ్రి అంత్యక్రియలు నిర్వహించడం కంటతడిపెట్టించింది. రాజస్తాన్లో... రోషితాష్ లాంబా(జైపూర్), నారాయణ్లాల్ గుర్జార్(రాజసమంద్), జీత్రామ్(భరత్పూర్), భగీరథ్సింగ్(ధోల్పూర్), హేమరాజ్ మీనా(కోట)ల అంతిమయాత్రలో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ‘పాకిస్తాన్ ముర్దాబాద్’, ‘భారత్ మాతాకీ జై’నినాదాలు మిన్నంటాయి. ఉత్తరాఖండ్లో.. ఉద్ధమ్సింగ్ నగర్ జిల్లాలోని మహ్మద్పూర్ గ్రామంలో మూడేళ్ల చిన్నారి తన తండ్రి వీరేంద్రసింగ్ చితికి నిప్పు పెట్టిన దృశ్యం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ సహచరుడికి మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. ఇక డెహ్రాడూన్లో జరిగిన మోహన్లాల్ అంత్యక్రియలకు అశేష జనం హాజరయ్యారు. పంజాబ్లో.. మోగా జిల్లాలోని గలౌటీ కుర్ద్ గ్రామంలో అమర జవాను జైమల్ సింగ్ మృతదేహానికి ఐదేళ్ల ఆయన కొడుకు గురుప్రకాశ్ నిప్పు అంటించాడు. గురుదాస్పూర్లో మణిందర్ సింగ్ భౌతికకాయానికి ఆయన తమ్ముడు, సీఆర్పీఎఫ్ జవాన్ అయిన లక్వీర్ సింగ్ దహన సంస్కారాలు నిర్వహించాడు. ఇక రూప్నగర్లో 26 ఏళ్ల కుల్వీందర్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజలు పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుల్వీందర్ సింగ్ భౌతికకాయాన్ని చూసి ఆయనకు కాబోయే భార్య సొమ్మసిల్లిపడిపోవడం అక్కడున్న వారిని కలచివేసింది. ఒడిశాలో.. పుల్వామా దాడిలో మరణించిన తమ రాష్ట్రానికి చెందిన అమర జవాన్లకు విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. జగత్సింగ్పూర్ జిల్లాకు చెందిన ప్రసన్నకుమార్ సాహూ, కటక్కు చెందిన మనోజ్కుమార్ల భౌతికకాయాలను స్వీకరించేందుకు భువనేశ్వర్ విమానాశ్రయానికి వేలాది మంది తరలివచ్చారు. మహారాష్ట్రలో.. అమర జవాన్లు నితిన్ శివాజీ రాథోడ్(36), సంజయ్ సింగ్ దీక్షిత్(47)ల భౌతికకాయాలను శనివారం ఔరంగాబాద్ విమానాశ్రయం నుంచి వారి స్వగ్రామాలకు పంపించారు. తమిళనాడులో.. అమర జవాన్లు జి.సుబ్రమణ్యం, సి.శివచంద్రన్ భౌతికకాయాలకు తిరుచిరాపల్లి విమానాశ్రయంలో నిర్మలా సీతారామన్ నివాళులర్పించారు. కర్ణాటకలో.. ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న అమర జవాన్ 33 ఏళ్ల హెచ్. గురు భౌతికకాయానికి ముఖ్యమంత్రి కుమారస్వామి నివాళులర్పించారు. ఉత్తరప్రదేశ్లో.. కానౌజ్ జిల్లాలో అమర జవాన్ ప్రదీప్ సింగ్ యాదవ్ అంత్యక్రియల సందర్భంగా ఆయన పదేళ్ల కూతురు సుప్రియ సొమ్మసిల్లింది. ఆయన రెండో కూతురు రెండున్నరేళ్ల చిన్నారిది అక్కడేం జరుగుతోందో అర్థం చేసుకోలేని పరిస్థితి. రాష్ట్రంలోని మహరాజ్గంజ్, ఆగ్రా, మేన్పురి, ఉన్నావ్, కాన్పూర్, దెహాట్, చందౌళి జిల్లాల్లోనూ అమర జవాన్ల అంత్యక్రియల్లో ఇలాంటి గంభీర వాతావరణమే కనిపించింది. మాతృదేశ సేవలో నేలకొరిగిన సైనికుల సాహసాలను కీర్తిస్తూ వేలాది మంది ప్రజలు నినాదాలు చేశారు. పుల్వామా దాడికి కారకులను శిక్షించాలని అంత్యక్రియలకు హాజరైన మంత్రులు, అధికారుల్ని డిమాండ్ చేశారు. దియోరియా జిల్లాలో.. సీఎం యోగి ఆదిత్యనాథ్ వస్తేనే తన భర్త విజయ్ మౌర్య అంత్యక్రియలకు అంగీకరిస్తానని ఆయన భార్య విజయ్ లక్ష్మి పట్టుపట్టారు. మంత్రి అనుపమా జైస్వాల్, ఇతర నాయకులు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చందౌళిలో అవధేశ్ యాదవ్ అంత్యక్రియలు గంగా నదీ తీరంలో నిర్వహించారు. మహరాజ్గంజ్లోని ఓ పాఠశాలకు అమర జవాను పంకజ్ త్రిపాఠి పేరు పెడతామని కేంద్ర మంత్రి శివప్రతాప్ శుక్లా ప్రకటించారు. తుదిహార్లో మహేశ్ యాదవ్ భౌతికకాయం వద్ద రోదిస్తున్న బంధువు.. కర్ణాటకలోని దొడ్డి గ్రామంలో విలపిస్తున్న హెచ్ గురు కుటుంబసభ్యులు ఆగ్రాలో కుశల్కుమార్ భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యుల రోదన.. కోల్కతాలో సుదీప్బిశ్వాస్ భౌతికకాయం వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు -
వాజ్పేయి అంతిమ యాత్రలో ప్రధాని మోదీ, అమిత్ షా
-
అటల్జీకి మోదీ, అమిత్ షా అరుదైన నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అంతిమ యాత్రలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వాజ్పేయి పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా కాలినడకన అంతిమ యాత్రలో ముందుకు సాగిపోతున్నారు. తద్వారా తమ నేతకు కడసారి నివాళులర్పించేందుకు భారీగా తరలివచ్చిన జన సందోహానికి, బీజేపీ నేతలు, శ్రేణులకు స్ఫూర్తిగా నిలిచారు. కాగా తమ మహానేతకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు అశ్రునయనాల మధ్య అంతిమ యాత్ర కొనసాగుతోంది. అంతకుముందు వాజ్పేయి నివాసంనుంచి బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న వాజ్పేయి భౌతికకాయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర ముఖ్యనేతలు నివాళులర్పించారు. కాగా ఈ సాయంత్రం రాష్ట్రీయ స్మృతి స్థల్లో పూర్తి అధికారిక లాంఛనాల మధ్య వాజ్పేయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు స్మృతి స్థల్లో దాదాపు ఏర్పాట్లనీ పూర్తి చేశారు. మాజీ ప్రధాని వాజ్పేయి మృతిపట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్చుక్ వాజ్పేయి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అలాగే నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రులు పీకే గ్యావల్, లక్ష్మణ్ కిరిల్లా, అబ్దుల్ హసన్ మహ్మద్ అలీ, పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి అలీ జఫర్లు సాయంత్రానికి ఢిల్లీ చేరుకుని వాజ్పేయి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆఫ్గనిస్తాన్ మాజీ ప్రెసిడెంట్ హమీద్ ఖర్జాయ్ కూడా అటల్జీకి నివాళులర్పించేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. -
మోసేవారు లేక... సైకిల్పై శవయాత్ర
కలువాయి (నెల్లూరు) : లోకాన్ని వీడిన ఆ దేహాన్ని మోసుకెళ్లేందుకు సమయానికి నలుగురు ముందుకు రాలేదు. చేసేది లేక వరుసకు సోదరుడైన వ్యక్తి సైకిల్పై మృతదేహాన్ని మోసుకెళ్లాడు. కంటతడి పెట్టించే ఈ హృదయ విదారకర దృశ్యం మంగళవారం నెల్లూరు జిల్లా కలువాయిలో కనిపించింది. తమళనాడు రాష్ట్రానికి చెందిన కొందరు కలువాయిలో ఉంటూ చుట్టుపక్కల పల్లెల్లో దుప్పట్ల అమ్మకంతో జీవనం సాగిస్తున్నారు. వారిలో సంబురాజు (70) అనే వ్యక్తి అనారోగ్యంతో అస్వస్థతకు గురికాగా మంగళవారం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడు మృతి చెందాడు. మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు ఎవరూ కనిపించలేదు. దీంతో సంబురాజు మృతదేహాన్ని సోదరుడు గోవిందరాజు తన సైకిల్పై పెట్టుకుని శ్మశానం వరకు తీసుకెళ్లి అక్కడ కూర్చున్నాడు. అది చూసిన కొందరు పంచాయతీ వారికి సమాచారం అందించారు. దీంతో సర్పంచ్ ఇందిర అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు. -
రామానాయుడి అంతిమయాత్ర!