News Channels
-
న్యూస్ చానళ్లపై నిషేధం ఎత్తేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగు న్యూస్ చానళ్లపై మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్లు (ఎంఎస్వోలు) విధించిన అప్రకటిత ఆంక్షలను అంతర్జాతీయ సంస్థలు తప్పుపడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్జే) ఈ అప్రకటిత నిషేధం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిందని, ప్రసారాలు తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బ్రస్సెల్ కేంద్రంగా ఉన్న ఆ సంస్థ సూచించిందని వెల్లడించారు. న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ (ఎన్బీడీఏ) కూడా ఈ అప్రకటిత నిషేధాన్ని ఖండించిందని తెలిపారు. కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి ప్రసారాలు నిలిపివేయడం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనలకు విరుద్ధమని చెప్పిందన్నారు.రాష్ట్రంలోని పాలకులు ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ చర్యల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఇమేజ్ దెబ్బతిందని కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణలో కొన్ని న్యూస్ చానళ్ల ప్రసారాలను అక్కడి కేబుల్ ఆపరేటర్లు నిలిపివేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారన్నారు. ఆ తప్పు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంటే ఆయన తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఉత్తరప్రదేశ్ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (ఎ), 19(1) (జి) భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇస్తోందని చెప్పిందని గుర్తు చేశారు. ప్రజాహితానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి , తెలుసుకోవడానికి కూడా ఆ ఆర్టికల్ హామీ ఇస్తోందని తెలిపారు. కాబట్టి సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీలపై విధించిన అప్రకటిత నిషేధాన్ని వెంటనే తొలగించాలని కోరారు. -
ఎగ్జిట్పోల్స్.. ఏం చెబుతాయో!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శనివారంతో ముగియనుండటంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్పై పడింది. శనివారం చివరి దశలో ఎన్నికలు జరుగుతున్న 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే పోలింగ్ ఏజెన్సీలు, న్యూస్ ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయనున్నాయి. జూన్ ఒకటి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రచురించకుండా న్యూస్ ఛానెల్లను ఎన్నికల సంఘం నిషేధించిన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. దేశంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏ కూటమి ఏర్పాటు చేస్తుందన్న దానిపై అంచనాలను వెల్లడించనున్నాయి. రాజకీయ పండితులు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) విజయం సాధిస్తుందని అంచనా వేస్తుండగా, ఇండియా కూటమి చివరివరకు గట్టిగా పోరాడటంతో ఎగ్జిట్ పోల్స్పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో బీజేపీ సొంతంగా 303 స్థానాలు, ఎన్డీఏ కూటమితో కలిసి 352 స్థానాలు గెలుచుకున్నాయి. -
బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి
న్యూఢిల్లీ: వివిధ టీవీ చానళ్లకు చెందిన కొందరు జర్నలిస్టులు/యాంకర్లు నిర్వహించే కార్యక్రమాలకు, వేదికలకు తమ ప్రతినిధులను పంపించకూడదని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మీడియా కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్(ఎన్బీడీఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి నిర్ణయం ఆందోళనకరమని ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నడుచుకోవడం సరైంది కాదని పేర్కొంది. గతంలో ఇలాంటి పరిణామం ఎనాడూ సంభవించలేదని గుర్తుచేసింది. ప్రమాదకరమైన ఈ ధోరణిని మానుకోవాలని ఇండియా కూటమికి విజ్ఞప్తి చేసింది. మీడియా స్వేచ్చను గౌరవించాలని కోరింది. కొందరు జర్నలిస్టులను/యాంకర్లను బహిష్కరించడం అనేది దేశాన్ని అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) నాటి రోజుల్లోకి తీసుకెళ్తుందని ఎన్బీడీఏ స్పష్టం చేసింది. మీడియాపై విరుచుకుపడితే స్వతంత్ర భావాల వ్యక్తీకరణను, గొంతుకలను అణచివేసినట్లే అవుతుందని తెలియజేసింది. ఈ బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇండియా కూటమికి సూచించింది. -
టీవీ18 బ్రాడ్క్యాస్ట్ లాభం డౌన్
న్యూఢిల్లీ: మీడియా కంపెనీ టీవీ18 బ్రాడ్క్యాస్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 87 శాతం పతనమై రూ. 38 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 312 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 13 శాతం ఎగసి రూ. 1,768 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 1,567 కోట్ల ఆదాయం నమోదైంది. మొత్తం వ్యయాలు 45 శాతం పెరిగి రూ. 1,813 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో టీవీ18 బ్రాడ్క్యాస్ట్ షేరు బీఎస్ఈలో 1.6 శాతం క్షీణించి రూ. 36.5 వద్ద ముగిసింది. చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? -
రెచ్చగొట్టేలా హెడ్లైన్స్ వద్దు: కేంద్రం హెచ్చరికలు
వివాదాస్పదమైన హెడ్డింగ్లు, రెచ్చగొట్టేలా హెడ్లైన్స్, సంచలనాల పేరిట ఇష్టానుసారం కథనాలు ప్రసారం చేయొద్దంటూ టీవీ ఛానెల్స్కు కేంద్రం చురకలంటించింది. న్యూస్ ఛానెల్స్లో టెలికాస్ట్ చేసే కంటెంట్ విషయంలో ఆచీతూచీ వ్యవహరించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ.. శనివారం ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, జహంగీర్పురి హింస నేపథ్యంలో.. పలు మీడియా ఛానెల్స్ వ్యవహరించిన తీరు దృష్టికి రావడంతో సమాచార ప్రసార మంత్రిత్వశాఖ స్పందించింది. ఉక్రెయిన్ పరిణామాలపై.. చాలావరకు న్యూస్ యాంకర్లు అతిశయోక్తితో కూడిన ప్రకటనలు ఇవ్వడం, వివాదాస్పదమైన హెడ్డింగ్లు, ట్యాగ్ లైన్లు తగిలించడం దృష్టికి వచ్చిందని కేంద్రం పేర్కొంది. అలాగే ఢిల్లీ జహంగీర్పురి హింసకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మీడియా ఛానెల్స్ వ్యవహరించిన తీరు.. దర్యాప్తునకు ఇబ్బంది కలిగించిందని కేంద్రం అభిప్రాయపడింది. అలాగే టీవీ ఛానెల్స్లో డిబేట్స్ సందర్భంగా ఘటనలకు సంబంధించి.. నీచమైన భాష, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, సమాజం అంగీకరించలేని రీతిలో భాషను గుర్తించినట్లు పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కంటెంట్ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అడ్వైజరీని విడుదల చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్(నియంత్రణ) చట్టం 1995 ప్రకారం.. టీవీ ఛానెల్స్ నడుచుకోవాలి. ►కుల, మతాలను రెచ్చగొట్టేలా ఎలాంటి ప్రసారాలు ఉండకూడదు. ► ఇంకొకరి పరువు, ప్రతిష్టలను దెబ్బతినేలా ఉద్దేశపూర్వక వార్తలు వేయకూడదు. ► తొందరపాటులో ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా.. వాటిని వెంటనే ప్రసారం చేయకూడదు ► తప్పుడు సమాచారం, అశ్లీల కథనాల వార్తలు వద్దు. ► జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులపై పుకార్లను ప్రసారం చేయకూడదు ► అసత్యాలను వల్లె వేసి అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేయొద్దు ► సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా.. రెచ్చగొట్టేలా పదే పదే ప్రసారం చేయొద్దు ► కథనాలను సగం చెప్పి.. వీక్షకులకు పక్కదారి పట్టించొద్దు. ► వివిధ వర్గాల మనోభావాలను కించపరిచే, దెబ్బతీసే కథనాలు వద్దు. -
లైవ్ టెలికాస్టింగ్లో ఫోన్ చోరీ! కట్ చేస్తే..
కైరో: ఇటీవల కాలంలో సోషల్ మీడియా క్రేజ్ పెరిగిపోవడంతో లైవ్ ఈవెంట్లు కూడా వీటిద్వారానే ప్రసారం కావడంతో వార్తాప్రపంచం అనేది ప్రజలకు మరింత చేరువైంది.. ఇది కాలక్రమంలో టెక్నాలజీ పరంగా వచ్చిన మార్పుగానే చెప్పవచ్చు. ఎక్కువ న్యూస్ టెలికాస్ట్ చేయాలన్న ఉద్దేశంతో చాలా సరికొత్త ఈవెంట్స్తో ప్రేక్షకుల్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. అందలో భాగంగా ఈజిప్ట్లోని ఒక న్యూస్ చానల్ ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తుంటే ఒక విచిత్రం చోటు చేసుకుంది. (చదవండి: అందుకే ఇంగ్లండ్ నుంచి వస్తున్నారు) అసలేం జరింగిందంటే....ఈ జిప్ట్లోని యూమ్ 7 న్యూస్ చానల్ రియల్ టైమ్ ఈవెంట్ అనే సరికొత్త కార్యక్రమంతో ప్రేక్షకులకు మరింత చేరవ కావడానికీ ప్రయత్నిస్తోంది. ఆ తరుణంలో కొన్ని భయంకరమైనవి, ఆసక్తి కలిగించే రియల్టైం ఈవెంట్లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అయితే ఇటీవల ఈజిప్ట్లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రియల్టైం ఈవెంట్లో భాగంగా భూకంపం తర్వాత ప్రజల పరిస్థితి ఎలా ఉంది అనే న్యూస్ని ఫోన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు అనూహ్యంగా ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ రోజు న్యూస్ చానల్ ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యక్షప్రసారంలో న్యూస్ని జర్నలిస్ట్ మహమూద్ రాఘేబ్ నివేదిస్తుండగా బైక్పై వచ్చిన దొంగ అతని ఫోన్ కొట్టేశాడు. ఫోన్ను కొట్టేసిందే తడువు బైక్పై వేగంగా జారుకుంటాడు. ఆ ఫోన్ను చేతిలోనే ఉంచుకుని సిగరెట్ కాలుస్తూ బైక్ను దర్జాగా డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతాడు. కాగా, ఆ ఫోన్ కెమెరా రోలింగ్లోనే ఉందని విషయం దొంగ గ్రహించకపోవడంతో అది ప్రత్యక్ష ప్రసారంలోనే రికార్డు అయ్యింది. తనను ఎవరైనా ఫాలో చేస్తున్నారా అనే అనుమానంతో మధ్యమధ్యలో వెనక్కి చూసుకుంటూ ఉండటం లైవ్ చూసేవారికి నవ్వులు తెప్పించింది. ‘నీ వెనకాల ఎవరూ రావడం లేదు.. కానీ ప్రపంచం మొత్తం నీ దొంగతనం చూస్తుంది’ అని నెటిజన్లు చమత్కరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవ్వడంతో ప్రజలు ఆ దొంగను పట్టుకోవటానికి కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఎయిర్పోర్ట్కి వెళ్లిన ప్రతిసారి ఆ విషయం నన్ను బాధిస్తోంది) -
12 వారాలు న్యూస్ ఛానెల్స్ రేటింగ్ నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ: హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ న్యూస్ ఛానెల్స్తో పాటు బిజినెస్ న్యూస్ ఛానెల్ల వ్యూయర్షిప్ రేటింగ్ను ఎప్పటికప్పుడు విడుదల చేసే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా న్యూస్ ఛానెల్ల వ్యూయరిషిప్ రేటింగ్ను పన్నెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. దీంతో ఈ వారం విడుదల చేయాల్సిన న్యూస్ ఛానెల్ల వ్యక్తిగత రేటింగ్ను బార్క్ ప్రకటించడం లేదని తెలిపింది. బార్క్ తన ప్రకటనలో.. ‘ప్రస్తుతం టెలివిజన్, న్యూస్ ఛానెల్లో జరుగుతున్న అభివృద్ధితో పాటు సంకేతిక లోపాల దృష్ట్యా బార్క్ బోర్డు, సాంకెతిక మండలిని(టెక్ కమిటీని) సంప్రదించినట్లు చెప్పింది. ఈ టెక్ కామ్ రోజువారి ఛానెల్ సముచిత డేటాను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ.. ప్రస్తుత బ్రాడ్కాస్టింగ్ ప్రమాణాల నివేధికను పరీక్షిస్తుంది. రేటింగ్ గణాంకాలను మెరుగుపరచడంతో పాటు . ప్యానెల్ గృహాలలోకి చొరబడే సంభావ్యత ప్రయత్నాలను కూడా గణనీయంగా దెబ్బతీస్తుంది’ అని పేర్కొంది. అయితే టెక్కామ్ పర్యవేక్షలో జరిపే ప్రయోగానికి 8 నుంచి 12 వారాల సమయం పడుతుందని, ఈ నేపథ్యంలో టీవీ, న్యూస్ ఛానెల్ల రేటింగ్ను 12 వారాల నిలిపివేస్తున్నట్లు బార్క్ తన ప్రకటనలో వివరించింది. (చదవండి: లవ్ జిహాద్: వివాహాలపై వివాదాస్పద నిర్ణయం) అలాగే వార్తా ప్రాసారకులకు ప్రాతినిధ్యం వహించే న్యూస్ బ్రాడ్కాస్ట్ర్స్ అసోసియేషన్(ఎన్బీఏ) కూడా బార్క్ నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ సస్పెన్స్ ఖచ్చితమైన రేటింగ్కు ఇచ్చేందుకు సరైన మార్గంగా ఎన్బీఏ ప్రెసిడెంట్ రజత్ శర్మ అన్నారు. ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఇటివల బ్రాడ్స్టింగ్ రేటింగ్స్ను ఎప్పటికప్పుడు వెల్లడించే క్రమంలో రేటింగ్ ఎజేన్సీకి, ప్రసార వార్త మాధ్యమాలకు అపఖ్యాతిని తెచ్చిపెట్టింది. రేటింగ్ డేటాలో హెచ్చుతగ్గులు ఊహించని విధంగా చోటుచేసుకున్నాయన్నారు. అసలు భారత ప్రజలు ఏం చూస్తున్నారో దానిపై ఖచ్చితమైన రేటింగ్ ఇవ్వడంలో కూడా తప్పుడు కథనాలు వచ్చాయన్నారు. అలాగే జర్నలిస్టులపై, జర్నలీజం ఆదర్శాలకు విరుద్ధంగా పనిచేసే సంపాదకియ కాల్స్ తీసుకోవడంలో కూడా తమ సభ్యులపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకే బార్క్ ఈ నిర్ణయం తీసుకుందని, వార్తా ఛానెల్ల రేటింగ్లను, కంటెంటెంట్ను మెరుగుపరచడం కోసమే బార్క్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. (చదవండి: మహా గవర్నర్ రీకాల్కు సేన డిమాండ్) -
నేపాల్లో భారత న్యూస్ చానళ్ల నిలిపివేత
న్యూఢిల్లీ : భారత్కు వ్యతిరేకంగా నేపాల్ వ్యవహరిస్తున్న తీరు ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు నేపాల్లోని రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందకు చైనా, పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ మరోసారి భారత్పై అక్కసు వెల్లగక్కింది. దూరదర్శన్ మినహా భారత్కు చెందిన అన్ని న్యూస్ చానళ్ల ప్రసారాలను గురువారం సాయంత్రం నుంచి కేబుల్ ఆపరేటర్లు నిలిపివేశారు. నేపాల్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రసారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.(నేపాల్ సంక్షోభం: చైనా, పాక్ కుట్రలు!) ‘నేపాల్ ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేకుండా చేస్తున్న ప్రచారం హద్దులు దాటంది. ఇది చాలా దారుణం. వెంటనే ఈ చెత్తను నిలిపివేయాలి’ అని మాజీ ఉప ప్రధానమంత్రి, అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ట చెప్పారు.(ఓలి కోసం రంగంలోకి దిగిన చైనా) -
టీవీ చర్చలలో మహిళల స్థానం ఎక్కడ?
ట్రిపుల్ తలాక్ వంటి విషయాల మీద చర్చలు జరుగుతుంటే, అందులో మహిళల కంటే పురుషులే అధికంగా ఉంటున్నారు. మతాలు, నేరాలకు సంబంధించిన వాటిలో 30 శాతం మంది పాల్గొంటుంటే, ఒక్క మహిళను కూడా ఆహ్వానించటం లేదని ఈ సర్వే చెబుతోంది. క్రీడల విభాగం, వ్యవసాయానికి సంబంధించిన అంశాలలో కూడా స్త్రీలకు స్థానం కల్పించట్లేదు. పోలీసు విభాగం నుంచి ఒక్కరిని కూడా ఆహ్వానించట్లేదని, చర్చా కార్యక్రమాలలో మహిళలు చాలా తక్కువగా ఉంటున్నారని ఈ సర్వే చెబుతోంది. పస్తుతం టీవీ యుగం నడుస్తోంది. వార్తా చానెల్స్లో నిత్యం ఏదో ఒక అంశం మీద చర్చాకార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఇందులో ఎంతోమంది పాల్గొంటూనే ఉంటారు. కానీ, వారిలో మహిళలు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నారు. ఈ విషయం మీద ఎన్డబ్ల్యూఎంఐ (నెట్వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా ఇన్ ఇండియా) ఒక సర్వే నిర్వహించింది.12 భాషలకు చెందిన 28 చానెల్స్లో ఈ సర్వే చేశారు. ఇంగ్లీషు – 6, హిందీ – 4, గుజరాతీ, పంజాబీ, ఉర్దు, తమిళం, తెలుగు, మలయాళం, బంగ్లా, ఒడియా, అస్సామీస్, మరాఠీ భాషలన్నీ కలిపి 18 చానెల్స్లోను ఈ సర్వే నిర్వహించారు. ప్రతి చానెల్ నుంచి ఒక ప్రైమ్టైమ్ న్యూస్ షో, ఒక టాప్ వీక్లీ టాక్ షోల ఆధారంగా రివ్యూ చేశారు. ఇందులో అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, అస్సాం, కోల్కతా, ముంబై, పుణేలకు చెందిన 11 మంది ఎన్డబ్ల్యూ ఎంఐ సభ్యులు పాల్గొన్నారు. ఈ సర్వేలో, మూడు వంతులమంది మేల్ యాంకర్లే ఉన్నారని తేలింది. ఈ వివక్ష హిందీ చానెల్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. భారతీయ టీవీ న్యూస్ చానల్స్లో... ప్రముఖ వ్యాఖ్యాతలుగా మహిళలు 13.6 శాతం, పురుషులు 86 శాతం ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది. సాధారణంగా చర్చాకార్యక్రమాలలో చర్చలో కేవలం ఒక్క మహిళను మాత్రమే ప్రతినిధిగా పిలుస్తున్నాయి చానల్స్. గుజరాతీలో 21 శాతం, తమిళం, పంజాబీలలో 5 శాతం మాత్రమే. బంగ్లా, తెలుగులలో 11 శాతం, మలయాళంలో 10 శాతం ఉన్నారు. మహిళా సమస్యల మీద చర్చించే వారిలో మహిళలు తక్కువగా ఉండటం చాలా ఆశ్చర్యం. రాజకీయాలకు సంబంధించిన చర్చలలో కేవలం 8 శాతం మాత్రమే ఉంటున్నారు. వివక్ష తగ్గాలి... చానెల్స్లో ఈ వివక్ష తగ్గేలా చూడాలని, మహిళలను అన్ని అంశాలకు చెందిన చర్చలలోకి ఆహ్వానించాలని, చర్చలో మహిళల గొంతు ఎక్కువగా వినిపించాలని ఈ సర్వే చేసిన మహిళలు ఆశిస్తున్నారు. సీనియర్ మేల్ యాంకర్లతో ప్రోగ్రాములు చేయిస్తుంటారు కాని, సీనియర్ మహిళలను మాత్రం విధుల నుంచి తొలగిస్తుంటారని, ఇది ఎంతవరకు న్యాయమని వీరు ప్రశ్నిస్తున్నారు. 13.6 శాతం మహిళలు, 86 శాతం పురుషులు ఈ చర్చలలో పాల్గొంటున్నారు. దీనిని బట్టి మహిళలు గొంతు విప్పి తమ సమస్యలను చెప్పుకోలేకపోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. కేవలం సున్నితమైన అంశాలకు మాత్రమే కాకుండా, అన్ని అంశాల మీద చర్చకు మహిళలను ఆహ్వానించాలని చెబుతున్నారు ఈ సర్వే ద్వారా. డా. వైజయంతి (ఢిల్లీలో ఇటీవల జరిగిన 14వ జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సు నుంచి) -
ఆ పత్రికలపై ఫిర్యాదు: రేవంత్రెడ్డి
నమస్తే తెలంగాణ పత్రిక, టీ–న్యూస్, టీవీ– 9, 10 టీవీలు కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, కవిత ను మాత్రమే చూపిస్తున్నాయని, ఇతర పార్టీల నుంచి జాతీయ నాయకులు వచ్చినా కనీసం చూపించడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఆరోపించారు. సీఈఓ రజత్కుమార్ను కలి సిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడా రు. అధికార పార్టీకి మాత్రమే ప్రచారం కల్పి స్తున్న ప్రసార మాధ్యమాలపై నిషేధం విధించాలని, వాటిని వార్త చానళ్లుగా గుర్తించరాదని ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపీ రావత్ బృం దానికి సైతం ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రగతిభవన్ను టీఆర్ఎస్ అసమ్మతి నేతలను బుజ్జ గించడానికి కేటీఆర్ వాడుకుంటున్నారన్నారు. -
హైదరాబాద్లో నకిలీ బాబా అరెస్ట్
-
పవన్ కల్యాణ్పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీహీరో పవన్ కల్యాణ్పై కేసు నమోదైంది. కొన్ని న్యూస్ చానళ్ల విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా పవన్ ప్రవర్తించారంటూ జర్నలిస్టు సంఘాల నాయకులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. చానళ్లలో ప్రసారం కానీ వీడియోలను ట్విటర్లో పోస్ట్ చేసి అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ అంశంపై విచారణ చేపట్టి పలు ఆధారాలు సేకరించారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను పవన్ ట్యాంపరింగ్ చేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పవన్ కల్యాణ్పై ఐపీసీ 469, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వీక్షకుల కోసం చానళ్ల మధ్య పోటీ
రాయదుర్గం: దేశంలో ప్రస్తుతం 400 కంటే ఎక్కువ చానళ్లు వీక్షకుల కోసం పోటీపడుతున్నాయని ప్రముఖ టీవీ యాంకర్ నగ్మా సహార్ అన్నారు. గచ్చిబౌలిలోని మౌలానా అజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రానిక్ మీడియా–ఆబ్జెక్టివిటీ అండ్ ప్రీజుడీసెస్ ఆఫ్ టీవీ న్యూస్ యాంకర్స్’ అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నగ్మా మాట్లాడుతూ.. ఆదాయ వనరుల సేకరణ ప్రతికూల వార్తల సేకరణపై ప్రభావం చూపిస్తోందన్నారు. న్యూస్రూమ్లో అతిథులను పూర్తి స్థాయిలో మాట్లాడనివ్వరని పేర్కొన్నారు. కార్యక్రమంలో మనూ వైస్ చాన్సలర్ డాక్టర్ మహ్మద్ అస్లామ్ పర్వేజ్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డీన్ ప్రొఫెసర్ ఎతేశ్యామ్ ఆహ్మద్ఖాన్ మాట్లాడారు. -
'శ్రీదేవిని చంపింది భారత మీడియానే..!'
-
'శ్రీదేవిని చంపింది భారత మీడియానే..!'
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను, కుటుంబసభ్యులను, తోటి నటీనటులను వదిలి కానరాని దూరాలకు అందాలనటి శ్రీదేవి తరలివెళ్లారు. దశాబ్ధాల పాటు వెండితెరను ఏలిన అతిలోక సుందరి ఇక జ్ఞాపకాల్లోనే మిగిలిపోయింది. వేలాదిమంది అశ్రునయనాల మధ్య బుధవారం శ్రీదేవి అంత్యక్రియలు జరిగాయి. తన నటన, అందం, అభినయం, హావభావాలతో కోట్లాది హృదయాల్లో నిలిచిపోయిన శ్రీదేవి అకాలమరణం ఎంతోమందిని కలిచివేసింది. దుబాయ్లో జరిగిన వివాహ వేడుకకు వెళ్లిన శ్రీదేవి గత శనివారం ప్రమాదవశాత్తూ హోటల్ గదిలో మరణించిన విషయం తెలిసిందే. శ్రీదేవి ఇకలేరు అని తెలిసిన క్షణం నుంచి, ఆమె పార్థీవదేహం ముంబై చేరుకునే వరకు ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఆకస్మిక మృతి కథనాల విషయంలో జాతీయ మీడియా సంస్థలతో పాటు, స్థానిక మీడియా సంస్థలు కూడా అత్యుత్సాహం ప్రదర్శించాయి. అయితే ఇదే అంశంపై దుబాయ్కి చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ ఖలీజ్ టైమ్స్ స్పందించింది. శ్రీదేవి మరణంపై భారతీయ మీడియా వ్యవహరించిన తీరును ఆ సంస్థ తప్పుబట్టింది. శ్రీదేవిని ఆ దేశ మీడియానే హత్య చేసిందనే అభిప్రాయాన్ని వెల్లబుచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న ఓ వ్యక్తి మరణంపై నిజానిజాలు తెలుసుకోకుండా.. అత్యుత్సాహం, అసత్య కథనాలు ప్రచారం చేశారని ఖలీజ్ టైమ్స్ గురువారం ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో ఆ సంస్థ దాదాపు భారతీయుల పరువును తీసింది. భారత్లోని చాలామంది ఇళ్లలో బాత్ టబ్లు ఉండవని, వాటి వాడకం గురించి వారికి తెలియదని అవహేళన చేసింది. మొదట శ్రీదేవి గుండెపోటుతో మరణించినట్టు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె గుండెపోటుతో కాదు.. స్పృహ కోల్పోయి తన హోటల్లో గదిలోని బాత్టబ్లో ప్రమాదవశాత్తు పడిపోవడం వల్ల చనిపోయిందని, దీని వెనుక ఎలాంటి నేరపూరిత కారణం కనిపించడం లేదని దుబాయ్ పోలీసులు తేల్చారు. అయితే, ఆ సంఘటనపై అసలేం జరిగిందో తెలుసుకోకుండానే శ్రీదేవి డెత్ మిస్టరీ అంటూ తమ డిటెక్టివ్ కథనాల ప్రసారాన్ని, బాత్ టబ్లో సన్నివేశాలను చూపుతూ భారత మీడియా అత్యుత్సాహం చూపడాన్ని ఖలీజ్ టైమ్స్ విమర్శించింది. అన్నీ టీవీ ఛానెళ్లు తమ క్రియేటివిటీకి పదునుపెట్టి బాత్టబ్లో సీన్స్ను చిత్రీకరించడంపై విచారం వ్యక్తం చేసింది. అదే విధంగా రాజకీయ ప్రముఖులైన సుబ్రమణ్య స్వామి, అమర్ సింగ్లు శ్రీదేవి మృతిపై చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ కథనంలో పేర్కొనడం గమనార్హం. సంఘటన జరిగినప్పటి నుంచి తమ సంస్థ ప్రతినిధులు వాస్తవ సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నించారని.. కానీ భారతీయ మీడియా తమ సమాచారాన్ని వక్రీకరిస్తూ విభిన్న కథనాలను ప్రసారం చేసిందని ఖలీజ్ వెల్లడించింది. దుబాయ్లో శ్రీదేవి మరణం ప్రమాదవశాత్తూ అని తేలినా.. కొంతమంది జర్నలిస్టులు ఆమె మృతి వెనుక ఇదే రహస్యమంటూ.. కాస్మోటిక్ సర్జరీలు, శరీరంలో ఆల్కహాలు జాడలు ఉన్నాయనే కథలు అల్లడం తమను ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపింది. ఇలాంటి ఘటనలను మానవతా దృక్పథంతో చూడాలని, కానీ కొన్ని న్యూస్ ఛానెళ్లు మరీ అత్యుత్సాహంతో వెర్రితలలు వేసి శ్రీదేవిని హత్య చేశాయన్న వ్యాఖ్యలు చేసింది. -
బాత్టబ్లో రిపోర్టర్.. నెటిజన్ల విస్మయం!
అతిలోకసుందరిగా పేరు గడించిన శ్రీదేవికి దేశవ్యాప్తంగా పాపులారీటీ ఉంది. ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఆమెకు అభిమానులు ఉన్నారు. ఈ పాపులారిటీ నేపథ్యంలోనే ఆమె ఆకస్మిక మృతి కథనాల విషయంలో జాతీయంగా, దాదాపు అన్నిరా ష్ట్రాల్లోనూ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. దుబాయ్లో శ్రీదేవి ఆకస్మిక మృతి.. ఈ తర్వాత చోటుచేసుకున్న ఒకింత నాటకీయ పరిణామాలు.. ఆమె గుండెపోటుతో కాకుండా బాత్టబ్లో మునిగిచనిపోయిందని పోలీసులు తేల్చడం.. ఇవన్నీ న్యూస్ చానళ్లకు కావాల్సినంత సరంజామా ఇచ్చాయి. దీంతో కొన్ని న్యూస్ చానెళ్లు మరీ అత్యుత్సాహంతో వెర్రితలలు వేయడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. శ్రీదేవి ఆకస్మిక మృతి విషయంలో న్యూస్ చానెళ్లు జర్నలిజాన్ని బాత్టబ్కు దిగజార్చడం.. బాత్టబ్లోకి కూరుకుపోయి మరీ కథనాలు ప్రసారం చేయడం నెటిజన్లకు వెగటు పుట్టిస్తోంది. శ్రీదేవి బాత్టబ్లో మునిగిచనిపోయిందని వెల్లడైన ఫిబ్రవరి 26న దాదాపు అన్ని జాతీయ చానళ్లు, ప్రాంతీయ చానళ్లు బాత్రూమ్ను టీవీ స్క్రీన్ మీదకు తీసుకొచ్చాయి. బాత్టబ్ కొలతలు ఇచ్చాయి. తమ కంప్యూటర్ జనరేటెడ్ గ్రాఫిక్ స్కిల్స్కు పదునుపెట్టి.. స్టూడియోలోనే తమ డిటెక్టివ్ బుద్ధికి రెక్కలు విప్పి.. కోడిగుడ్డ మీద ఈకలు పీకన చందంగా కథనాలు వండివార్చాయి. కొన్నిచానళ్లు ఏకంగా బాత్టబ్లో శ్రీదేవి ఫొటోలు పెట్టి.. ‘మోత్కా బాత్టబ్’ అంటూ తమ అతి సృజనాత్మకతను ప్రదర్శించాయి. మరికొన్ని చానళ్లయితే బాత్టబ్లో శ్రీదేవి పడి ఉంటే..బోనీకపూర్ వచ్చి చూసినట్టు తమ ఫోటోషాపింగ్ స్కిల్స్ను ప్రదర్శించుకున్నాయి. 9 pm lineup on English news TV. @republic: Sridevi. @TimesNow: Sridevi. @CNNnews18: Sridevi. @MirrorNow: Sridevi. @NewsX: Sridevi. @ndtv: Sridevi. If only Judge Loya’s death had elicited such sharp and searing scrutiny. pic.twitter.com/6ArTJXqJSv — churumuri (@churumuri) February 26, 2018 శ్రీదేవి మొదట గుండెపోటుతో మరణించినట్టు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె గుండెపోటుతో కాదు.. స్పృహ కోల్పోయి తన హోటల్లో గదిలోని బాత్టబ్లో ప్రమాదవశాత్తు పడిపోవడం వల్ల చనిపోయిందని, దీని వెనుక ఎలాంటి నేరపూరిత కారణం కనిపించడం లేదని పోలీసులు తేల్చారు. అయితే, ఆ సమయంలో ఆమె దేహంలో ఆల్కహాల్ జాడలు ఉన్నాయని ఫోరెన్సిక్ నివేదికలో తేల్చారు. ఈ సమాచారాన్ని పట్టుకొని.. ఒక టీవీ చానల్ బాత్టబ్ మీద వైన్ గ్లాస్.. మరోవైపు శ్రీదేవి ఫొటో పెట్టి కథనాలు వండివార్చింది. ఇక, జాతీయస్థాయిలో పోటాపోటీగా కథనాలు ప్రచురించే రిపబ్లిక్, టైమ్స్ నౌ చానళ్లు కూడా శ్రీదేవి డెత్ మిస్టరీ అంటూ ప్రైమ్టైమ్లో తమ డిటెక్టివ్ కథనాల ప్రసారంలో అత్యుత్సాహం చూపాయి. మిగతా చానళ్లు కూడా ప్రధాన వార్తలు గాలికొదిలేసి.. ప్రైమ్టైమ్ లో శ్రీదేవి మృతి విషయంలోనే చర్చలు నడిపాయి. C'mon, just give them the goddamn Pulitzer already! pic.twitter.com/aU8vBaL0fI — Karnika Kohli (@KarnikaKohli) February 26, 2018 బాత్టబ్లో రిపోర్టర్..! ఓ ప్రాంతీయ చానల్కు చెందిన రిపోర్టర్ బాత్టబ్లోకి దిగి మరీ రిపోర్టింగ్ చేయడంపై సోషల్ మీడియాలో విస్మయం వ్యక్తమవుతుంది. దీనిపై నెటిజన్లు జోకులు, సెటైర్లు పేలుతున్నాయి. శ్రీదేవిది బాత్టబ్ మరణం కాబట్టి బాత్టబ్లోకి దిగారు.. ఒకవేళ ఎవరైనా ఉరివేసుకుంటే..రిపోర్టర్ కూడా ఉరి వేసుకున్నట్టు కనిపిస్తూ.. రిపోర్టింగ్ చేస్తారా? నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి శ్రీదేవి మృతి విషయంలో కొన్ని చానళ్లు సాగించిన చిలువలపలువల ప్రచారం,చానళ్ల అత్యుత్సాహంపై సోషల్ మీడియా ఘాటుగా స్పందించింది.‘ఇప్పుడు నడుస్తోంది బ్యాడ్ జర్నలిజం కాదు.. బాత్టబ్ జర్నలిజం’ అంటూ కత్తి మహేశ్ టీవీ చానళ్ల ధోరణిపై ట్వీట్ చేశారు. మొత్తానికి ఓవైపు టీవీ చానళ్ల వికృత ధోరణిని పరిహాసిస్తూనే.. మరోవైపు శ్రీదేవి మృతివిషయంలో వదంతులు ప్రచారం చేయకుండా ఆమె ఆత్మకు శాంతి చేకూరేలా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తూ..నెటిజన్లు పెద్ద ఎత్తున లెట్హార్రెస్ట్ఇన్పీస్ యాష్ట్యాగ్ను ట్రెండ్ అయ్యేలా చేశారు. One anchor is in "the" bathroom, complete with a wine glass! Wow! Excuse me while I step out to bang my head against a wall. BRB. pic.twitter.com/XTdLNI2ckO — Sachin Kalbag (@SachinKalbag) February 26, 2018 Thank God it's bath tub. As somone pointed out, what if it was a fire. pic.twitter.com/as6kqQTMem — Kathi Mahesh (@kathimahesh) February 27, 2018 .@abpnewstv decides to give a platform to all the WhatsApp crap floating around on her death. "Did plastic surgery kill her?" is the important question being probed. pic.twitter.com/f1S0Yyklbp — Manisha Pande (@MnshaP) February 26, 2018 -
బ్రేకింగ్ న్యూస్ బిజినెస్ న్యూస్గా మారాయి
-
బ్రేకింగ్ న్యూస్ బిజినెస్ న్యూస్గా మారాయి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పలు ప్రధాన న్యూస్చానల్స్లో ప్రసారమవుతున్న బ్రేకింగ్ న్యూస్.. బిజినెస్ న్యూస్గా మారాయని, జర్నలిస్టులు బిజినెస్ ట్రేడర్స్గా మారారని సీనియర్ జర్నలిస్ట్, ఇండియాటుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ అన్నా రు. ఆదివారం బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్స్కూల్లో లిటరరీ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘మీడియా ఇన్ ది ఏజ్ ఆఫ్ బ్రేకింగ్ న్యూస్’అన్న అంశంపై జరిగిన సదస్సులో రాజ్దీప్ సర్దేశాయ్ ప్రసంగించారు. దేశంలో ప్రస్తుతం 397 న్యూస్, కరెంట్ అఫైర్స్ చానల్స్ ఉన్నాయని.. ఇవన్నీ రాజకీయ నాయకులు, పార్టీ లు, బిల్డర్ల చేతిలోనే ఉన్నాయని, వీరంతా తమ వాణిజ్య, రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం చానల్స్ నడుపుతున్నారన్నారు. క్రమేణా నైతిక విలువలు కనుమరుగవుతుండటంతో ప్రస్తుతం మీడియా విశ్వసనీయత కోల్పోతోందన్నారు. తెలుగు రాష్ట్రా ల్లోని 25 ప్రధాన న్యూస్ చానల్స్ రాజకీయ పార్టీల చేతిలోనే ఉన్నాయని గుర్తుచేశారు. పలు ప్రధాన చానల్స్లో ప్రసారమవుతున్న వార్తల్లో వాస్తవికత ఉండట్లేదని, టీవీ స్టూడియోల్లో అర్థవంతమైన చర్చలకు బదులు అనవసర వివాదాలు జరుగుతూండటం దురదృష్టకరమన్నారు. సోషల్ మీడియాలో స్వేచ్ఛ అపరిమితమని.. కానీ బాధ్యత శూన్యంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు స్వేచ్ఛా గొంతుక వినిపించేందుకు బెటర్ మీడియా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో హైదరాబాద్, ముంబై, కోల్కతా, ఢిల్లీ న్యూస్ కాపిటల్స్గా మారాయన్నారు. -
టీవీ చానల్స్ చర్చలతో భాషా తీవ్రవాదం
పణజి : టీవీ చానల్స్లో రోజూ ప్రసారం అవుతోన్న చర్చా కార్యక్రమాలపై సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎదుటివారిని ఓడించడమే లక్ష్యంగా.. చాలా సార్లు అడ్డదిడ్డంగా, కొన్నిసార్లు జుగుప్సాకరంగా, అంతూపొంతూ లేకుండా సాగుతోన్న టీవీ చర్చా కార్యక్రమాలు దేశంలో భాషా ఉగ్రవాదాన్ని పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. నిజమైన ప్రజాస్వామిక భావనలకు ఇలాంటి చర్చలు అవరోధాలని ప్రసూన్ జోషి అభిప్రాయపడ్డారు. ఆదివారం పణజి(గోవా)లో ఇండియా ఫౌండేషన్ వారు నిర్వహిస్తోన్న ‘ఇండియా ఐడియాస్ కంక్లేవ్-2017’ లో ఆయన మాట్లాడారు. ‘టీవీ చర్చల్లో.. ఆయా పక్షాలకు చెందిన కొందరు సుశిక్షితులు గెలుపు కోసమే వాదించడం చూస్తూంటాం. వారి ముందు.. విషయపరిజ్ఞానం ఉన్నవాళ్లు సైతం డీలా పడిపోతుంటారు. ఎదుటివారు వాదనను మొదలుపెట్టేలోపే ఇటు నుంచి దాడి పూర్తవుతుంది. ఇది సరైన విధానం కాదు. నిజంగా ప్రజాస్వామ్యంగా ఉండాలనుకున్నప్పుడు.. వాదనలు వినే, వాదనలు గెలవడంలో కొత్త మార్గాన్ని కనుగొనవలసి ఉంది’’ అని ప్రసూన్ జోషి అన్నారు. ప్రసూన్ జోషి (ఫైల్ ఫొటో) -
ఇంత అమానుషమా!
వారం రోజుల వ్యవధిలో చానెళ్లలో కనబడిన వేర్వేరు దృశ్యాలు మానవత్వం గల ప్రతి ఒక్కరినీ కదిలించాయి. తొలి ఉదంతం ప్రభుత్వాసుపత్రిలో క్షయ బారిన పడి తనువు చాలించిన భార్య మృతదేహాన్ని భుజానకెత్తుకుని 60 కిలోమీటర్ల దూరం లోని స్వగ్రామానికి బయల్దేరిన ఒక నిరుపేద గిరిజనుడికి సంబంధించింది. అతని వెంట ఉబికివస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ నడుస్తున్న పన్నెండేళ్ల వారి కుమార్తె కూడా ఉంది. ఒడిశాలో ఆకలి, దారిద్య్రం విలయతాండవం చేస్తున్న కలహండి జిల్లాలోనిది ఈ ఘటన. వారిద్దరూ ప్రధాన రహదారిపై ఆ మృతదేహంతో పది పన్నెండు కిలోమీటర్లు నడిచాక పాత్రికేయుల కంటబడ్డారు కాబట్టి అది ప్రపంచా నికి వెల్లడైంది. రెండో ఉదంతం కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిందే. బాలాసోర్ జిల్లాలో మరణించిన 80 ఏళ్ల వృద్ధురాలి భౌతికకాయాన్ని నడుం దగ్గర విరిచి ఒక కట్టెకు కట్టి మోసుకెళ్తున్న దృశ్యమది. యధాతథ స్థితిలో మృతదేహం తరలింపు సాధ్యం కాదు గనుక అలా చేశానని ఆ ఘోరానికి పాల్పడ్డ వ్యక్తి సంజాయిషీ ఇచ్చాడు. తన కళ్లెదుటే ఇలా జరగడం చూసి వృద్ధురాలి కొడుకు రోదిస్తుండటం కూడా ఆ దృశ్యంలో కనబడింది. మరొకటి మధ్యప్రదేశ్లోనిది. జబ్బుపడిన భార్యను ఆసుపత్రిలో చేర్పించేందుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో కన్నుమూసిందని తెలియగానే ఆమె భర్తను, వారి అయిదునెలల పసికందునూ, వృద్ధురాలైన వారి బంధువునూ బస్సునుంచి గెంటేసిన ఉదంతమది. ఎడతెరపిలేని వర్షం, పైగా అటవీ ప్రాంతం... అలాంటిచోట నిర్దాక్షిణ్యంగా మృతదేహంతో సహా వారందరినీ నెట్టేస్తే ఎవరూ నోరెత్తలేదు. గంట తర్వాత అటుగా వాహనంలో వెళ్తున్న న్యాయ వాదులు వారిని గమనించి అంబులెన్స్ రప్పించి వారి స్వస్థలానికి చేర్చారు. ఈలోగా మృతదేహంతో ఆ ముగ్గురూ తడిసిముద్దయ్యారు. వీటన్నిటా బాధితులు అట్టడుగు వర్గాలవారు. పూటకు గతి లేని నిరుపేదలు. ఆ ప్రాంతాలన్నీ కనీస సౌకర్యాలు కూడా కరువై చెప్పనలవికాని కష్టాలు పడు తున్నవి. ఈ ఘటనల సమయంలో యాదృచ్ఛికంగా కెమెరాలు ఉండటంవల్ల అవి బయటి ప్రపంచానికి వెల్లడయ్యాయిగానీ అక్కడ బతుకులీడుస్తున్నవారికి మాత్రం అలాంటివి కొత్తగాదు. నిత్యం ఛీత్కారాలు... నక్సలైట్లో, వారి సానుభూతిపరులో కావొచ్చునన్న అనుమాన దృక్కులూ, వాటి పర్యవసానాలూ ఆ పేదజనానికి సర్వసాధారణం. భార్య శవాన్ని భుజాలకెత్తుకుని మధ్య యుగాల ఆవలినుంచి నాగరిక ప్రపంచంలోకి నడిచి వస్తున్నవాడిగా కనబడిన ఆదివాసి వల్ల మాత్రమే ఇప్పుడు కలహాండి ప్రాంతం వార్తలకెక్కలేదు. కొన్నేళ్లక్రితం ఆకలిచావులతో, అటు తర్వాత నుంచి నక్సల్ ఉద్యమంతో, ఎన్కౌంటర్ ఉదంతాలతో అది మార్మోగు తూనే ఉంది. మైనింగ్ కోసం వేదాంత ప్రాజెక్టుకు విలువైన అటవీభూముల్ని కట్టబెట్టడాన్ని నిరసిస్తూ గిరిజనులు కొన్నేళ్లుగా అక్కడ ఉద్యమిస్తున్నారు. పోలీసు కాల్పులు, చావులు, నిర్బంధాలు, కేసులు, జైళ్లు వారి జీవితంలో భాగమై పోయాయి. రెండేళ్లక్రితం ఇదే కలహండి జిల్లాలో వెట్టిచాకిరీ వెతల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినందుకు ఒక లేబర్ కాంట్రాక్టర్ ఇద్దరు యువ కుల చేతులు నరికి నడిరోడ్డుపై పడేసి పరారయ్యాడు. వారి ఆర్తనాదాలు విన్నవారు ఆసుపత్రిలో చేర్పించబట్టి ఆ యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇవన్నీ చూసినప్పుడూ, విన్నప్పుడూ ఇంత అమానవీయమైన, అమానుషమైన సమా జంలో మనం ఉన్నామా అన్న దిగ్భ్రాంతికి లోనవుతాం. ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం వల్ల ఒరిగిందేమిటన్న సందేహం కలుగుతుంది. అట్టడుగు, నిరుపేద వర్గా లను తాకని అభివృద్ధి వల్ల ప్రయోజనమేమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇలాంటి ఉదంతాలు బట్టబయలైనప్పుడల్లా ఆవేదన చెందినట్టు, చర్యలు తీసుకుంటున్నట్టు కనబడటం మన ప్రభుత్వాలకు మామూలే. ఆ తర్వాత మళ్లీ మరొకటేదో మీడియాలో వెల్లడై పరువు పోయాక మళ్లీ ఈ తంతు అంతా పునరావృతమవు తుంది. ఒడిశా, మధ్యప్రదేశ్లు కాబట్టి పాత్రికేయులు ఈ ఘటనలను కనీసం లోకం దృష్టికి తీసుకురాగలిగారు. అదే ఆ పక్కనున్న ఛత్తీస్గఢ్ అయితే కేసులు, జైళ్లు తప్పకపోవచ్చు! ఆ రాష్ట్రంలో పాత్రికేయులు అక్రమ కేసుల్లో చిక్కుకుని జైళ్లలో మగ్గుతున్నారని భారతీయ జర్నలిస్టుల యూనియన్(ఐజేయూ) నాలుగు నెలల క్రితం ప్రకటించింది. ఒడిశా, మధ్యప్రదేశ్లు రెండూ తమ రాష్ట్రాల్లో జరిగిన ఉదంతాలపై స్పందిం చాయి. బాధ్యులైనవారిపై చర్య తీసుకున్నాయి కూడా. భార్య శవాన్ని మోసుకెళ్లిన ఉదంతంలో ఒక నర్సును సస్పెండ్ చేసి, ఆసుపత్రి సెక్యూరిటీ బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీ కాంట్రాక్టును ఒడిశా రద్దు చేసింది. బహుశా వృద్ధురాలి శవాన్ని విరిచిన వ్యక్తిని పనిలోకి రానీయొద్దని కూడా ఆదేశాలిచ్చి ఉంటుంది. మధ్యప్రదేశ్ సర్కారు బస్సు డ్రైవర్నూ, కండక్టర్నూ అరెస్టు చేసింది. బస్సు పర్మిట్ను రద్దు చేసింది. ఈ అరకొర చర్యలే వ్యవస్థనంతటినీ ప్రక్షాళన చేస్తాయా? మారుమూల ప్రాంతాలకు వైద్య సౌకర్యాలనూ, రవాణా సదుపాయాలనూ కల్పించలేని తమ అశక్తత మాటేమిటి? వెనకబడిన ప్రాంతాలనూ, దారిద్య్రరేఖకు దిగువు నున్నవారిని అదే స్థితిలో శాశ్వతంగా ఉంచేసిన తమ చేతగానితనం సంగతేమిటి? అందుకు సిగ్గుపడాల్సింది పోయి, బహిరంగ క్షమాపణ అడగాల్సిందిపోయి కింది స్థాయి వ్యక్తులపై చర్య తీసుకుంటే సరిపోతుందా? నిజానికిది ఒడిశా, మధ్యప్రదేశ్లకు పరిమితమైంది కాదు. కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వా సుపత్రిలో ఒక శిశువును మూషికాలు కొరికి చంపేస్తే... విజయవాడ ప్రభుత్వాసు పత్రిలో చీమలు కుట్టి మరో శిశువు కన్నుమూసింది. అప్పుడూ ఇలాగే కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. బట్టబయలు కానంతవరకూ బాగున్నట్టు భ్రమింపజేయడం, వెల్లడయ్యాక కపటనాటకా లాడటం పాలకులు సాగిస్తున్నంత కాలమూ ఈ స్థితి మారదు. నిర్మాణాత్మకమైన పథకాల అమలుకు పోరాడితేనే, పాలకులపై ఒత్తిడి తెస్తేనే మార్పు సాధ్య మవుతుంది. -
చానళ్ల పాత్ర ప్రశంసనీయం
సాక్షి, సిటీబ్యూరో: పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రసారం చేసి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే బాధ్యతను తెలుగు టీవీ చానళ్లు తీసుకోవడం ప్రశంసనీయమని సినీ నటి మంచులక్ష్మి అన్నారు. బంజారాహిల్స్లోని తాజ్డెక్కన్లో గురువారం సాయంత్రం ఏడో యూనిసెఫ్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. గౌరవ అతిథిగా హాజరైన మంచులక్ష్మి మాట్లాడుతూ...పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, సంరక్షణ తదితర అంశాలపై టెలివిజన్ చానళ్లు కథనాలు ప్రసారం చేసి పిల్లల సమస్యల గొంతుకగా మారడం అభినందనీయమన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, గోపాల కృష్ణ గోఖలే అవార్డు గ్రహీత ఎస్.ఉమాపతి మాట్లాడుతూ... టీవీ చానళ్లలో ప్రసారమైన పిల్లల సమస్యల కథనాలు బాగున్నాయని, అయితే వీటికి న్యాయ సంబంధమైన అభిప్రాయాలు కూడా చొప్పిస్తే అర్థవంతంగా ఉంటుందన్నారు. అవార్డులు అందుకున్న చానళ్లివే.. ఐ న్యూస్ (స్ఫూర్తిదాయకం ఇంటర్ బాలిక-అనూష శీర్షికతో కథనం), టీవీ9(పసి వయస్సులో ప్రాణాంతక చక్కెర వ్యాధి), వీ6(సమస్యల మండటం గట్టు కథనం), జెమినీ న్యూస్(అమ్మానాన్న దూరమైతే..), ఈటీవీ ఏపీ(డిటెన్షన్ అవసరమా, అనర్థమా..?పై చర్చ, ర్యాగిం గ్ రాక్షసిపై కథనం), హెచ్ఎంటీవీ(దేవరకొండ అమ్మాయిలు), వనిత టీవీ(అక్షరధామం...హతునూర్ మండలం అనే కథనం), 10 టీవీ(మాతాశిశు మరణాలపై కథనం)లకు అవార్డులు దక్కాయి. ఏపీ, తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల యూనిసెఫ్ ఆఫీస్ చీఫ్ ఫీల్డ్ రూత్ లియోనో, సీఎంఎస్ డెరైక్టర్ పీఎన్ వసంతి పాల్గొన్నారు. -
యాకూబ్ కేసులో చానళ్లు ‘లక్ష్మణ రేఖ’ దాటాయి: కేంద్రం
న్యూఢిల్లీ: యాకూబ్ మెమన్ ఉరితీత కేసు కవరేజ్లో కొన్ని వార్తా చానళ్లు హద్దులు మీరాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ అన్నారు. ప్రోగ్రాం కోడ్ను ఉల్లంఘించకుండా వారే స్వీయ నియంత్రణ పాటించాలని బుధవారమిక్కడ ఓ సదస్సులో పేర్కొన్నారు. ఇటీవల పంజాబ్లో ఉగ్రవాదుల దాడి సమయంలో ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని తమ శాఖ చేసిన సూచనలను కొన్ని చానళ్లు పెడచెవిన పెట్టాయన్నారు. యాకూబ్ ఉరితీత కేసు కవరేజిలో కొన్ని చానళ్లు లక్ష్మణ రేఖను దాటాయని, టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు చోటా షకీల్ (మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు)తో మాట్లాడించాయని అన్నారు. -
తెలంగాణలో TV9, ABN ప్రసారాల బంద్
-
నేటితో రాజకీయ ప్రత్యక్ష ప్రసారాలకు తెర!
- సోమవారం సాయంత్రం నుంచి అమలు - అన్ని టీవీ చానళ్లకూ నోటీసులు - వీడియో కాన్ఫరెన్స్లో భన్వర్లాల్ ఆదేశం - ఆచరణ సాధ్యం కాదంటున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్:ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా సోమవారం సాయంత్రంతో తెలంగాణలో ప్రచార గడువు ముగుస్తున్న నేపథ్యంలో సీమాంధ్రలో జరిగే రాజకీయ నాయకుల ప్రచారాన్ని వార్తా చానళ్లు(టీవీలు) ప్రత్యక్ష ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) భన్వర్లాల్ ఆదివారం ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై నిర్వహించిన విసృ్తతస్థాయి వీడియో కాన్ఫరెన్స్లో పోలీసు, రెవెన్యూ అధికారులకు భన్వర్లాల్ ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు. నిబంధనల ప్రకారం పోలింగ్ జరగడానికి 48 గంటల ముందు నుంచి ఆయా నియోజకవర్గాల్లో ప్రచార ఘట్టానికి తెరపడుతుంది. దీన్ని పక్కాగా అమలు చేయడంతో పాటు బల్క్ ఎస్సెమ్మెస్లు, వాయిస్ కాల్స్ను నియంత్రించడానికి పోలీసు, రెవెన్యూ విభాగాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ మేరకు ఆయా సెల్ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకు లేఖలు రాస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాటి సీఈఓ వీడియో కాన్ఫరెన్స్లో ప్రత్యక్ష ప్రసారాల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు భన్వర్లాల్ పైవిధంగా ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణలో ప్రచార గడువు సోమవారం సాయంత్రంతో ముగుస్తున్నప్పటికీ.. సీమాంధ్రలో మే 4వ తేదీ సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారానికి గడువుంది. మరోపక్క తెలంగాణలో ఎన్నికలు జరిగే 30వ తేదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తిరుపతిలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇతర పార్టీల కీలక నేతలు సైతం అదేరోజు అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయా నేతలు గుప్పించే హామీలు, లేవనెత్తే అంశాలు తెలంగాణలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని సీఈఓ అభిప్రాయపడ్డారు. దీనిని కట్టడి చేయడం కోసం ఎన్నికల కోడ్తో పాటు సంబంధిత చట్టాల్లోని అంశాలను ప్రస్తావిస్తూ వార్తా చానళ్ల యాజమాన్యాలకు సోమవారం నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.ప్రాంతీయ చానళ్ల ప్రధాన కార్యాలయాలన్నీ హైదరాబాద్లోనే ఉన్నందున నగర పోలీసులకు ఈ బాధ్యతలను అప్పగించారు. అయితే, ఈ విధానం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా అమలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ రకంగా నోటీసులు ఇచ్చినా ఫలితం ఉండదని వారు అంటున్నారు. దీన్ని అమలు చేయాలంటే దేశ వ్యాప్తంగా వివిధ దశల్లో పోలింగ్ జరిగిన ప్రతిసారీ జాతీయ చానళ్ల ప్రసారాలను ఆపాల్సి ఉంటుందని, మరోపక్క ఇంత తక్కువ సమయంలో కేవలం పోలీసు విభాగం నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు ఆపడమనేది ఆచరణ సాధ్యం కాదని పేర్కొంటున్నారు. అయితే, అమలు సాధ్యాసాధ్యాలను పక్కనబెట్టి.. సీఈఓ ఇచ్చిన ఆదేశాలను అన్ని వార్తా చానళ్ల యాజమాన్యాలకు తప్పనిసరిగా తెలియజేయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఎన్నికల సంఘం నుంచి మరోసారి స్పష్టత తీసుకోవడంతో పాటు రాజకీయ ప్రత్యక్ష ప్రసారాలపై సీఈఓ ఇచ్చిన ఆదేశాలను సంబంధిత సెక్షన్ల సహితంగా చానళ్ల దృష్టికి తీసుకెళ్లి, లిఖిత పూర్వక మార్గదర్శకాలు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పోలింగ్ ఏర్పాట్లపై నగర కమిషనర్ అనురాగ్ శర్మ సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.