operation success
-
జూలియట్ మళ్లీ ఆడుకుంది!
న్యూఢిల్లీ: హుషారుగా గెంతుతూ చలాకీగా తిరుగుతూ తమ కుటుంబంలో భాగమైపోయిన ఏడేళ్ల శునకం గుండె జబ్బుతో బాధపడటం చూసి ఆ కుటుంబం అల్లాడిపోయింది. ఎలాగైనా అది మళ్లీ హుషారుగా తిరిగితే చాలు అని మనసులోనే మొక్కుకున్నారు. వారి బాధను అధునాతన చికిత్సవిధానంతో పోగొట్టారు ఢిల్లీలోని ఒక మూగజీవాల వైద్యుడు. రెండేళ్ల క్రితం అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఒక నూతన వైద్యవిధానంతో డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్యబృందం ఆ శునకానికి కొత్త జీవితం ప్రసాదించింది. ఏమిటీ సమస్య? ఏడేళ్ల బీగల్ జాతి శునకం జూలియట్ రెండేళ్లుగా మైట్రల్ వాల్వ్ సమస్యతో బాధపడుతోంది. గుండెలో ఎడమ ఎగువ కరి్ణక నుంచి జఠరికకు వెళ్లాల్సిన రక్తం తిరిగి కరి్ణకలోకి లీక్ అవుతోంది. దీంతో గుండె కొద్దికొద్దిగా కుంచించుకుపోయి, ఊపిరితిత్తుల్లో నీరు చేరి మృత్యువు ఒడికి చేరే ప్రమాదముంది. దీంతో విషయం తెల్సుకున్న ఢిల్లీలోని ఈస్ట్ కైలాశ్ ప్రాంతంలోని మ్యాక్స్ పెట్జ్ ఆస్పత్రిలోని డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్య బృందం ఆపరేషన్ చేసేందుకు ముందుకొచి్చంది. చిన్న జీవాలకు గుండె ఆపరేషన్లు చేయడంలో శర్మ నిష్ణాతునిగా పేరొందారు. ‘‘ అమెరికాలోని కొలర్యాడో స్టేట్ యూనివర్సిటీలో రెండేళ్ల క్రితమే ఈ కొత్త ఆపరేషన్ విధానం అమల్లోకి వచి్చంది. ట్రాన్స్క్యాథటర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్(టీఈఈఆర్) విధానంలో మే 30న జూలియట్కు గుండె ఆపరేషన్ చేశాం. ఓపెన్ హార్ట్ సర్జరీలాగా దీనికి పెద్ద కోత అక్కర్లేదు. చాలా చిన్న కోత సరిపోతుంది. గుండె ఊపిరితిత్తుల బైపాస్ మెషీన్తో పని ఉండదు. గుండె కొట్టుకుంటుండగానే ఆపరేషన్ చేసేయొచ్చు. ఛాతీ వద్ద అత్యల్ప రంధ్రం చేసి మెషీన్ను పంపి గుండె కవాటం ద్వారాన్ని సరిచేస్తాం’’ అని శర్మ వివరించారు. ఆపరేషన్ చేసి రెండు రోజులకే జూలియట్ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అది ఆరోగ్యంగా ఆటుకుంటూ కుటుంబంలో మళ్లీ సంతోషాన్ని నింపింది. ఈ తరహాలో 80 శాతం మరణాలు భారత్సహా ప్రపంచవ్యాప్తంగా శునకాలు ఎదుర్కొంటున్న హృద్రోగ సమస్యల్లో ఈ తరహావే 80 శాతం ఉండటం గమనార్హం.శునకాల మరణాలకు ప్రధాన కారణాల్లో ఈ సమస్య కూడా ఒకటి. ఆసియా ఖండంలో శునకాలకు ఈ తరహా ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి అని ఆ వెటర్నరీ ఆస్పత్రి తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేసిన రెండో ప్రైవేట్ వైద్య బృందం వీళ్లదేనని ఆస్పత్రి పేర్కొంది. -
శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయం దగ్గర ఆపరేషన్ చిరుత ఎట్టకేలకు సక్సెస్ అయ్యింది. బోను దాకా వచ్చి.. ఎరకు చిక్కకుండా ఐదు అటవీశాఖ అధికారుల్ని ముప్పు తిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. దీన్ని పట్టుకోవడానికి ఐదు బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేశారు.ఈ చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూలో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్కు తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. -
దటీట్ భారత్ నేవీ.. 40 గంటల రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
ఢిల్లీ: భారత నావికాదళం మరోసారి సత్తా చాటింది. అరేబియా సముద్రంలో హైజాక్కు గురైన నౌకలో ఉన్న 17 మందిని ఎంతో సాహసోపేతంగా కాపాడింది. సుమారు 40 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిపి నౌకలో ఉన్న 35 మంది సముద్రపు దొంగలను పట్టుకుంది. వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్ 14న అరేబియా సముద్రంలో ఎంవీ రుయెన్ నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. సముద్రంలో దోపిడీకి ఈ నౌకను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నౌనకు రక్షించేందుకు భారత నేవీ రంగంలోకి దిగింది. నౌక రక్షణ కోసం ఆపరేషన్ చేపట్టింది. సుమారు 40 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి నౌకను రక్షించారు. ఈ ఆపరేషన్లో మొత్తం 35 మంది సముద్రపు దొంగలు లొంగిపోగా.. నౌకలోని 17 మంది సిబ్బంది సురక్షింతంగా ఉన్నట్టు నేవీ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో ఐఎన్ఎస్ కోల్కత్తా, యుద్ధనౌక ఐఎన్ఎస్ సుభద్ర, ఆధునిక డ్రోన్లు, P8I పెట్రోలింగ్ విమానాలు ఉపయోగించినట్టు ఇండియన్ నేవీ తెలిపింది. హైజాక్కు గురైన ఎంవీ రుయెన్ పూర్తిగా భారత నావికాదళం ఆధీనంలో ఉన్నట్టు పేర్కొంది. Indian Navy warship INS Kolkata has taken 35 sea pirates in custody on board and started sailing towards the Indian west coast along with the 17 crew members of the merchant vessel MV Ruen. Indian Navy had forced the pirates to surrender after a major operation on high seas:… pic.twitter.com/CvZ6cC8NtR — ANI (@ANI) March 17, 2024 ఇదిలా ఉండగా.. ఈ నెల 15వ తేదీన భారత నేవీ ఆపరేషన్ చేపట్టే ముందు సముద్రపు దొంగలను లొంగిపోవాలని సూచించింది. లేకపోతే వారిపై దాడులు ప్రారంభించాలని మెరైన్ కమాండోలకు నేవీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమాలియా సముద్రపు దొంగలు నేవీ అధికారులపై కాల్పులు జరిపారు. అనంతరం ఏ మాత్రం బెదరకుండా రెస్క్యూ కొనసాగించిన నేవీ సముద్రపు దొంగలు లొంగి పోయేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను కూడా ఇండియన్ నేవీ రిలీజ్ చేసింది. #IndianNavy thwarts designs of Somali pirates to hijack ships plying through the region by intercepting ex-MV Ruen. The ex-MV Ruen, which had been hijacked by Somali pirates on #14Dec 23, was reported to have sailed out as a pirate ship towards conducting acts of #piracy on high… pic.twitter.com/gOtQJvNpZb — SpokespersonNavy (@indiannavy) March 16, 2024 ఇక,అంతకుముందు బంగ్లాదేశ్కు చెందిన ఓ నౌకను సైతం ఇండియన్ నేవీ రక్షించింది. భారత నావికాదళం అరేబియా సముద్రంలో జరిగిన సంఘటనలను తక్షణమే పరిష్కరించడం, వాణిజ్య నౌకలను రక్షించడానికి అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది. దీంతో, భారత నావికాదళంపై ప్రపంచదేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. -
కుక్కర్లో ఇరుక్కున్న చిన్నారి తల.. డాక్టర్ ఫీజు ఒక్క రూపాయే!
ఆగ్రా: పొరపాటున చిన్నారి తల ప్రెజర్ కుక్కర్లో ఇరుక్కుపోయింది. తల ఇరకడంతో ఆ చిన్నారి గిలగిలకొట్టుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తలను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో తల బయటకు వచ్చేలా ప్రయత్నాలు చేశారు. అయినా ఫలించలేదు. ఇలా కాదని వెంటనే ఆస్పత్రికి పరుగున వెళ్లారు. వైద్యులు మొదట ఆశ్చర్యానికి గురయి అనంతరం అత్యంత జాగ్రత్తతో కుక్కర్ను తొలగించి చిన్నారి తలను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. తమ కుమారుడిని కాపాడడంతో ఆ కుటుంబసభ్యులు వైద్యుల కాళ్లపై పడి ‘మీరు దేవుళ్లు’ అని కీర్తించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. (చదవండి: ఎంత వేధించిందో: పెళ్లాం వేధింపులు తట్టుకోలేక పోలీస్స్టేషన్కే నిప్పు) ఆగ్రా లోహమండి ప్రాంతంలోని ఖటిపరాలో ఉన్న మేనమామ ఇంటికి కుటుంబసభ్యులు వచ్చారు. తమతోపాటు 18 నెలల చిన్నారిని వెంట తీసుకున్నారు. ఇంట్లో అందరూ తమ పనుల్లో మునిగి ఉండగా ఈ చిన్నారి ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ప్రెజర్ కుక్కర్తో ఆడుకుంటుండగా పొరపాటున తల కుక్కర్లో ఇరుక్కుపోయింది. బాలుడు ఎందుకు రోదిస్తున్నాడో చూసిన కుటుంబసభ్యులు షాక్కు గురయ్యారు. కుక్కర్ నుంచి తలను బయటకు తీసేందుకు తమకు తోచిన విధంగా ప్రయత్నించారు. చివరకు ఫలితం లేకపోవడంతో వెంటనే ఎస్ఎం ఛారిటబుల్ ఆస్పత్రికి తరలించారు. కుక్కర్ను తొలగిస్తున్న ఎస్ఎం ఛారిటబుల్ ఆస్పత్రి వైద్యులు (ఫొటో: IndiaToday) అక్కడ వైద్యులు మొదట పరిశీలించి అత్యంత క్లిష్టమైన కేసుగా భావించారు. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా బాలుడి ప్రాణానికి ప్రమాదం పొంచి ఉండడంతో వైద్యులు చాలా జాగ్రత్తతో తీసేందుకు ప్రయత్నించారు. అతికష్టమ్మీద దాదాపు రెండున్నర గంటలపాటు శ్రమించి విజయవంతంగా చిన్నారి తలను బయటకు తీశారు. డాక్టర్ ఫర్హాత్ ఖాన్ నేతృత్వంలో వైద్య బృందం ఈ ఆపరేషన్ను విజయవంతంగా చేశారు. కుక్కర్ను అత్యాధునిక యంత్రంతో కట్ చేయడంతో చిన్నారి తల క్షేమంగా బయటకు వచ్చింది. అయితే ఈ చికిత్సకు వైద్యులు ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకోవడం విశేషం. బాధితులు పేదలు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని డాక్టర్ ఫర్హాత్ఖాన్ తెలిపారు. చదవండి: పవిత్రబంధంలాంటి ఈ భార్యాభర్తలను ఆదుకోండి -
‘ఆపరేషన్ శక్తి’ సాగిందిలా!
పోఖ్రాన్ పరీక్షలు.. భారతదేశం తన అణు పాటవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సందర్భమది. తొలిసారి 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో పోఖ్రాన్–1 పేరిట ‘స్మైలింగ్ బుద్ధ’ అనే కోడ్తో అణు పరీక్షలు నిర్వహించగా, 1998లో ప్రధాని వాజ్పేయి ఆదేశాలతో ఆపరేషన్ శక్తి(పోఖ్రాన్–2) పేరుతో అణు పరీక్షలు నిర్వహించారు. కానీ 1974తో పోల్చుకుంటే 1998లో అణు పరీక్షల నిర్వహణకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అమెరికా నిఘా సంస్థ సీఐఏకు చెందిన శక్తిమంతమైన ఉపగ్రహాలు ఈ ప్రాంతంలో నిఘా పెట్టడంతో వ్యూహాత్మకంగా వాటిని బురిడీ కొట్టిస్తూ అధికారులు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరిపి 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించిన 58వ ఇంజనీరింగ్ రెజిమెంట్ కమాండర్ కల్నల్ (రిటైర్డ్) గోపాల్ కౌశిక్ , చేతన్ కుమార్లను టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూ చేసింది. నాటి ఆపరేషన్ సందర్భంగా తీసుకున్న జాగ్రత్తలపై తమ అనుభవాలను వీరిద్దరూ మీడియాతో పంచుకున్నారు. ఎన్నో జాగ్రత్తలు.. ఈ విషయమై కల్నల్ గోపాల్ కౌశిక్ మాట్లాడుతూ.. ‘1974తో పోల్చుకుంటే 1998లో ఆపరేషన్ శక్తి సందర్భంగా భారత్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చి ంది. ఎందుకంటే తొలిసారి అణు పరీక్షలు నిర్వహించినప్పుడు భారత్ సామర్థ్యం, ఉద్దేశం గురించి ఎవ్వరికీ తెలియదు. అలాగే అణు బాంబును ఎక్కడ పరీక్షిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల కార్యకలాపాలపై దృష్టి సారించేందుకు అవసరమైనన్ని ఉపగ్రహాలు అమెరికా వద్ద అప్పట్లో లేవు. కానీ 1998 నాటికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే 1995–96లో భారత్ అణు పరీక్షలకు రహస్యంగా చేస్తున్న ఏర్పాట్లు బయటకు పొక్కడంతో అమెరికా సహా అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి ఎదురైంది. దీంతో పరీక్షల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా పోఖ్రాన్ గురించి ప్రపంచం మొత్తానికి తెలియడంతో శక్తిమంతమైన అమెరికా నిఘా ఉపగ్రహాలు ఈ ప్రాంతంపై ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవి’ అని తెలిపారు. ఎదురైన సవాళ్లు ఎన్నో.. అణు పరీక్షల ఏర్పాట్ల సందర్భంగా ఎదురైన ప్రతికూల పరిస్థితులపై కౌశిక్ స్పందిస్తూ.. ‘ఈ పరీక్షల ఏర్పాట్లలో శాస్త్రవేత్తలు, అధికారులకు వాతావరణం ప్రధాన సవాలుగా నిలిచింది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 51 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటే శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్ 3 డిగ్రీలకు పడిపోయేది. అంతేకాకుండా ఈ ప్రాంతమంతా విషపూరితమైన పాములు, తేళ్లు ఉండేవి. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. దీంతోపాటు అణు బాంబుల్ని భూమిలోపల అమర్చేందుకు తవ్విన ఆరు గుంతల్లో నీటి ధార రావడం మరో తలనొప్పిగా మారింది. విపరీతమైన వేడి ఉన్న ఈ ప్రాంతంలో వర్షపు కోట్ ధరించి అణు బాంబును అమర్చేందుకు తవ్విన గుంతల్లో దిగి పనిచేయడం శాస్త్రవేత్తలు, సైనికులకు ఇబ్బందికరంగా తయారైంది. అలాగే వీటిలో అమర్చిన లోహపు పరికరాలు నీటి ప్రభావంతో తుప్పుపట్టడం మొదలుపెట్టాయి. దీంతో నీటిని బయటకు తోడేద్దామని తొలుత అనుకున్నాం. అయితే నీటి ప్రభావంతో మారిపోయే ఇసుక రంగును, అక్కడ మొలిచే పచ్చికను సైతం విదేశీ నిఘా ఉపగ్రహాలు గుర్తించే వీలు ఉండటంతో మరో మార్గాన్ని అన్వేషించాం. దూరంగా ఉన్న ఇసుకలో పైపుల్ని లోతుగా పూడ్చి వాటిద్వారా నీటిని పంపింగ్ చేసేవాళ్లం. దీంతో పైకి కన్పించకుండానే నీళ్లు పూర్తిగా ఇంకిపోయేవి’ అని అన్నారు. ‘తవ్విన గుంతల్లో అణు బాంబుల్ని అమర్చిన అనంతరం వాటిని ఇసుక బస్తాలతో నింపడం మరో సవాలుగా నిలిచింది. ఇసుక బస్తాలను పైనుంచి విసిరేస్తే అణు బాంబులు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు, అధికారులు చురుగ్గా ఆలోచించారు. ఓ జాలీ లాంటి పరికరంతో బ్యాగుల్ని జారవిడిచే అంశాన్ని పరిశీలించారు. కానీ ఇలా 6,000 ఇసుక బస్తాలను జారవిడిచేందుకు వారం పట్టే అవకాశం ఉండటంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. చివరికి బిలియర్డ్స్ ఆటలో వినియోగించే క్యూ స్టిక్స్తో సరికొత్త ఆలోచన వచ్చింది. గుంతల్లో పైపుల్ని ఒకదానిపక్కన మరొకటి అమర్చిన అధికారులు, వాటిపై ఇసుక బస్తాలను జారవిడిచారు. ఈ వ్యూహం పనిచేయడంతో ఏర్పాట్లు పూర్తిచేసి 1998 మే 11 నుంచి 13 మధ్య ఐదు అణు పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించాం’ అని తమ అనుభవాలను పంచుకున్నారు. పగలు క్రికెట్.. రాత్రి ఏర్పాట్లు ‘అమెరికా నిఘా ఉపగ్రహాల్ని పక్కదారి పట్టించేందుకు వినూత్నంగా ఆలోచించాం. పోఖ్రాన్ ప్రాంతంలో ఆర్మీ అధికారులు, శాస్త్రవేత్తలు పగటిపూట క్రికెట్ ఆడేవారు. దీంతో చుట్టుపక్కల ఉండే జనాలు బాగా గుమిగూడేవారు. జనసంచారం ఉండటంతో విదేశీ నిఘా వర్గాలు పోఖ్రాన్లో రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎంతమాత్రం అనుమానించలేదు. సాధారణ సైనికులే అక్కడ ఉన్నారని భావించాయి. కేవలం రాత్రిపూట మాత్రమే ప్రయోగ పనుల్ని చేపట్టేవారు. అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్ ఆర్.చిదంబరం, బార్క్ మాజీ చీఫ్ అనీల్ కకోద్కర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్కలాం సహా 100 మంది శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. శాస్త్రవేత్తల కదలికల్ని నిఘా ఉపగ్రహాలు గుర్తించకుండా వారందరూ సైనిక దుస్తులు ధరించేవారు. అబ్దుల్ కలామ్ను మేజర్ జనరల్ పృథ్వీరాజ్ అని, చిదంబరాన్ని మేజర్ నటరాజ్గా వ్యవహరించేవారు’ అని కౌశిక్ చెప్పారు. -
బయటకొచ్చారు సరే.. అసలు లోపలికెందుకెళ్లినట్టు?
మే సాయ్ : 13 మంది కోసం.. 18 రోజుల నిరిక్షణ, థాయ్లాండ్ నౌకాదళ సిబ్బందితో పాటు వివిధ దేశాల నిపుణులు సాయంతో 3 రోజుల పాటు ఏకధాటిగా చేపట్టిన సహాయక చర్యలు.. వెరసి ఎట్టకేలకు థాయ్లాండ్లోని థామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న వారు క్షేమంగా బయటపడ్డారు. దాంతో గుహలో చిక్కుకున్న 13 మంది తల్లిదండ్రులే కాక మొత్తం ప్రపంచం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం వీరందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అందరిని తొలిచివేస్తొన్న ప్రశ్న ఒక్కటే. అందేంటంటే థామ్ లువాంగ్ గుహలు చాలా ప్రమాదాకరమైనవని థాయ్లాండ్ వాసులకు తెలుసు. వర్షాకాలంలో ఈ గుహల్లోకి ప్రవేశించాలని ఎవరూ అనుకోరు. అలాంటిది ఈ విషయాలన్ని తెలిసి కూడా వీరంతా గుహలోకి ఎందుకు ప్రవేశించారు? సరే, పిల్లల కంటే తెలియదు.. మరి కోచ్ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఆయన పిల్లలను గుహ లోపలికి వెళ్లకుండా వారించక పోవడమే కాక స్వయంగా కోచ్ కూడా గుహలోకి ఎందుకు వెళ్లాడు? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం గుహ నుంచి బయటపడిన వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా కోలుకున్న తర్వాత అసలు వీరు గుహలోకి ప్రవేశించడానికి గల కారణాలు తెలియ వస్తాయి. ప్రస్తుతం వీరందరిని ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఇన్నాళ్లు వీరంతా అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నారు. అందువల్ల ఎటువంటి అంటు వ్యాధులు ప్రబలే అవకాశం లేకుండా వీరందరిని ప్రత్యేకంగా ఉంచారు . కాగా గుహ నుంచి బయటపడిన వారంతా దాదాపు రెండు కేజీల బరువు తగ్గినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం గురించి వైద్యులు ‘గుహలో ఉన్న వారి గురించి బయట ప్రపంచానికి తెలిసిన తర్వాతనే వీరికి ఆహారం అందించే ఏర్పాట్లు చేయగలిగాము. కానీ అంతకు ముందు వారు కేవలం గుహలో ఉన్న మురికి నీటినే తాగి ఆకలి తీర్చుకున్నారు. అందువల్లే బరువు తగ్గారు. ఇప్పుడు కూడా వీరికి కేవలం పాలను మాత్రమే ఇస్తున్నాము. అందులోనూ ఎక్కువ ప్రోటీన్లు ఉండేలా చూస్తున్నాం’ అన్నారు. అంతేకాక ‘వీరిలో కొందరు కండరాల నొప్పులతో మరికొందరు జలుబు, దగ్గు,జ్వరం లాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఎంత లేదన్నా వీరందరిని ఓ వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాలి. కాబట్టి అంత వరకూ తల్లిదండ్రులను వీరిని చూడటానికి అనుమతించం’ అని తెలిపారు. ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా నిల్చుని అద్దాలలోంచి చూడటానికి మాత్రమే అనుమతినిచ్చినట్లు తెలిపారు. దాదాపు 20 మంది ఆస్ట్రేలియన్ సహాయక సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. వీరిలో రిచర్డ్ హారిస్ ధైర్యసాహసాలు అందరిని ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ ఆపరేషన్లో సహకరించిన వారందరిని థాయ్ ప్రభుత్వ ప్రత్యేకంగా సత్కరించింది. ఈ ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బందికి థాయ్ ప్రజలు మాత్రమే కాక మొత్తం ప్రపంచం అంతా ధన్యవాదాలు తెలుపుతోంది. -
'ఆపరేషన్ థాయ్' విజయవంతం
మే సాయ్: థాయ్లాండ్లో గుహలో చిక్కుకున్న చివరి ఐదుగురిని సహాయక బృందాలు మంగళవారం క్షేమంగా బయటకు తీసుకొచ్చాయి. దీంతో మూడు రోజులుగా థాయ్లాండ్ నౌకాదళ సిబ్బందితో కలసి వివిధ దేశాల నిపుణులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. 18 రోజుల నరక యాతన తర్వాత మొత్తం 13 మంది గుహ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఓ ఫుట్బాల్ జట్టుకు చెందిన 12 మంది బాలురు, వారి కోచ్ జూన్ 23న థాయ్లాండ్లోని థామ్ లువాంగ్ గుహలోకి వెళ్లి, భారీ వర్షాల కారణంగా బయటకు వచ్చే దారి మొత్తం పూర్తిగా నిండిపోవడంతో, గుహ ప్రవేశ ద్వారం నుంచి లోపలికి రెండున్నర మైళ్ల దూరంలో చిక్కుకుపోయారు. మొత్తం 13 మందిలో ఆదివారం నలుగురిని, సోమవారం మరో నలుగురిని సహాయక బృందాలు గుహ నుంచి బయటకు తీసుకుకొచ్చారు. మిగిలిన నలుగురు పిల్లలతోపాటు వారి కోచ్ను మంగళవారం రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కోచ్, పిల్లలంతా క్షేమంగా∙ఉన్నారని అధికారులు చెప్పారు. వివిధ దేశాలకు చెందిన నిపుణులు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, సాంకేతిక రంగ నిపుణుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలన్ మస్క్ తదితర ప్రముఖులు పిల్లలను రక్షించేందుకు అవసరమైన సాయం చేస్తామని ప్రకటించారు. కేవలం పిల్లలను కాపాడేందుకే ఎలన్ మస్క్ ఏకంగా ఓ చిన్నపాటి జలాంతర్గామిని తయారు చేయించి పంపారు. ట్రంప్ సహా ఎంతోమంది ప్రముఖులు సహాయక బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. గుహ నుంచి బయటపడతారో లేదో కూడా తెలియకపోయినా మనోధైర్యం కోల్పోకుండా ఇన్నాళ్లూ గుహలోనే కాలం గడిపిన బాలురను పలువురు ప్రశంసిస్తున్నారు. మరోవైపు బాలురను కాపాడేందుకు గుహలోకి వెళ్లిన వైద్యుడు, డైవర్లంతా క్షేమంగా బయటపడినట్లు థాయ్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. సాధ్యమవుతుందని కూడా ఎవరూ ఊహించని దానిని తాము చేసి చూపించామని ఈ ఆపరేషన్కు నేతృత్వం వహించిన చియాంగ్ రాయ్ గవర్నర్ నరోంగ్సక్ ఒసటనకోర్న్ అన్నారు. పకడ్బందీ వ్యూహంతో విజయం చిన్నారులను కాపాడేందుకు థాయ్ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహాన్ని రచించింది. తొలుత ఈ ఆపరేషన్ను వర్షాలు తగ్గాకే చేపట్టాలని భావించారు. గుహలోని నీటిని పెద్దపెద్ద మోటార్ల ద్వారా బయటకు తోడేందుకు ప్రయత్నించినా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. గుహలో ఆక్సిజన్ సిలిండర్లు అమర్చడానికి వెళ్లిన డైవర్ సమన్ గుణన్ శుక్రవారం మృతి చెందడం ప్రమాద తీవ్రతను తెలియజేసింది. అనేక మార్గాలను అన్వేషించిన అనంతరం చివరకు నీటిలోనే పిల్లలను బయటకు తీసుకురావాలని ప్రభుత్వం తీర్మానించింది. పక్కా ప్రణాళికను సిద్ధం చేసి గజ ఈతగాళ్లను రంగంలోకి దించింది. ఆదివారం నుంచి డైవర్లు పిల్లలను బయటకు తీసుకురావడం ప్రారంభించారు. క్షణక్షణం ఉత్కంఠను రేపుతూ మొత్తం మూడు రోజుల పాటు ఈ మిషన్ కొనసాగింది. అమెరికా, బ్రిటన్, డెన్మార్క్ వంటి వివిధ దేశాలకు చెందిన మొత్తం 13 మంది సుశిక్షితులైన డైవర్లు ఈ మిషన్లో పాల్గొన్నారు. వారికి రక్షణగా మరో అయిదుగు థాయ్ నేవీ సీల్స్ (నౌకాదళ సిబ్బంది) ఉన్నారు. నీటిలో భయపడకుండా మందులు నీటిలోనూ పిల్లలను బయటకు తీసుకొస్తున్న సమయంలో పిల్లలెవరూ భయపడకుండా ఉండేందుకు డైవరు ఏర్పాట్లు చేశారు. ఇరుకు దారుల్లో ఈదేటపుడు ఆందోళన చెందకుండా ప్రత్యేక మందులిచ్చామని, అవి మత్తుమందులు కావని అధికారులు తెలిపారు. డైవర్లు ప్రతీ బాలుడి ముఖానికి మాస్క్ తొడిగారు. ఈదేటపుడు వెట్ సూట్ వేశారు. బూట్లు వేసి, హెల్మెట్ పెట్టారు. ఒక్కో బాలుడి వెంట ఇద్దరు డైవర్లు ఉన్నారు. ఒక డైవర్ ఆక్సిజన్ ట్యాంక్ని పట్టుకుంటే అతని వెనుక భాగాన బాలుడిని కట్టారు. మరో డైవర్ బాలుడి వెనకాల ఇంకో ఆక్సిజన్ ట్యాంక్ పట్టుకుని పిల్లాడు ఎలా ఉన్నాడో జాగ్రత్తగా గమనించారు. పిల్లలు చిక్కుకున్న ప్రదేశం నుంచి గుహ వెలుపలి వరకు 8 మిల్లీ మీటర్ల మందమున్న తాడు కట్టారు. డైవర్లు ఆ తాడు వెంబడి ఈదుతూ పిల్లలను బయటకు తీసుకొచ్చారు. చీకట్లో వర్షపు నీరు, బురద, రాళ్ల మధ్య ఇరుకైన దారుల్లో ఈదుకుంటూ పిల్లల్ని తీసుకొచ్చారు. ఇరుకుప్రాంతాల్లో డైవర్లు తమ ఆక్సిజన్ ట్యాంక్ని బయటకు తీసి పిల్లల్ని సన్నటి దారిగుండా లాగి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల పిల్లలు దాదాపు పావుగంటపాటు నీటిలోనే ఉండాల్సి వచ్చింది. ఒక్కో బాలుడిని బయటకు తేవడానికి డైవర్లకు అయిదుగంటల సమయం పట్టింది. బాలురను రక్షించేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలన్ మస్క్ తయారు చేయించిన చిన్నపాటి జలాంతర్గామి సాంకేతికత పరంగా బాగున్నప్పటికీ ఆచరణలో అది పనికి రాదని, రక్షించేందుకు దాన్ని వాడలేమని సహాయక పర్యవేక్షక నిపుణులు స్పష్టంచేశారు. 18 రోజుల్లో ఏం జరిగింది? (గుహలో చిక్కుకున్న వైల్డ్బోర్స్ ఫుట్బాల్ జట్టు సభ్యులు, కోచ్(ఎడమ) (ఫైల్)) ♦ జూన్ 23: ఉదయంపూట కోచ్తో కలిసి గుహలోకి విహారయాత్రకు వెళ్లారు. లోపలికెళ్లగానే అప్పుడే భారీ వర్షం మొదలై గుహద్వారం మొత్తం నీటితో నిండిపోవడంతో గుహలోనే చిక్కుకున్నారు. చీకటి పడినా పిల్లలెవ్వరూ ఇళ్లకు రాకపోవడం, ఎక్కడున్నారో తెలీకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుహ ప్రవేశ ద్వారం వద్ద వారి సైకిళ్లు కనిపించడంతో అర్ధరాత్రి నుంచే గాలింపు చేపట్టారు. ♦జూన్ 25: పిల్లల పాదముద్రలు, చేతిముద్రలను గుర్తించిన సహాయక బృందం. ♦ జూన్ 26: గుహలోకి ప్రవేశించిన దాదాపు 12 మంది థాయ్ నౌకాదళ సిబ్బంది. బురదనీటితో గుహ దారి నిండిపోవడం వల్ల వాళ్లు లోపలికి వెళ్లడం కష్టంగా ఉందన్న హోం మంత్రి. ♦ జూన్ 27: భారీ వర్షంతో గాలింపు చర్యలకు అంతరాయం. గుహ దారుల్లో పెరిగిన నీటి ప్రవాహం. థాయ్ సహాయక బృందానికి జతకలిసిన అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల సిబ్బంది. ♦ జూన్ 28: నీటిని బయటకు తోడడం, గుహలోకి చేరుకునేందుకు ఇతర మార్గాల కోసం అన్వేషణ ప్రారంభం. ♦ జూన్ 30: వర్షాలు తగ్గడంతో మళ్లీ ఊపందుకున్న గాలింపు చర్యలు. పిల్లలను బయటకు తెచ్చేందుకు సాయమందించడం కోసం ఆస్ట్రేలియా, చైనాల నుంచి కూడా వచ్చిన పలువురు నిపుణులు. ♦ జూలై 2: బాలురు, వారి కోచ్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, పిల్లలతో మాట్లాడి వీడియో రికార్డ్ చేసుకొచ్చిన ఇద్దరు బ్రిటిష్ డైవర్లు. తాము ఆరోగ్యంగానే ఉన్నామన్న పిల్లలు. ♦ జూలై 4: ఆహారం, ఔషధాలతో బాలుర వద్దకు చేరుకున్న ఏడుగురు నౌకాదళ సిబ్బంది, ఓ వైద్యుడు. వారిని బయటకు తెచ్చేందుకు అనువైన పరిస్థితులపై చర్చ. ♦ జూలై 5: నీటిని బయటకు తోడే ప్రక్రియ విస్తృతం. డైవింగ్ ఎలా చేయాలో పిల్లలకు శిక్షణనిచ్చిన సహాయక సిబ్బంది. ♦ జూలై 6: గుహలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతుండటంపై ఆందోళన. ఆక్సిజన్ అందక సహాయక బృందంలోని ఓ డైవర్ మృతి. మళ్లీ భారీ వర్షాలు మొదలైతే పిల్లలు మరిన్ని రోజులు గుహలోనే ఉండాల్సి వస్తుందనీ, వారిని త్వరగా బయటకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామన్న అధికారులు. ♦ జూలై 8: ఎట్టకేలకు పిల్లలను బయటకు తెచ్చే ప్రక్రియ మొదలు. వరద నీటితో నిండిన ఇరుకైన దారుల గుండా నలుగురు పిల్లలను సురక్షితంగా గుహ నుంచి బయటకు తెచ్చిన డైవర్లు. ♦ జూలై 9: మరో నలుగురు బాలురను బయటకు తెచ్చిన సహాయక బృందం ♦ జూలై 10: మిగిలిన నలుగురు బాలురు, కోచ్ను కూడా రక్షించిన సిబ్బంది. 18 రోజుల యాతన నుంచి వారికి విముక్తి. (పిల్లలను రక్షించిన తరువాత స్థానిక మీడియా కేంద్రంలో స్థానికుల సందడి ) -
మరో నలుగురు బయటకు
మే సాయ్: థాయ్లాండ్లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్నవారిలో మరో నలుగురు విద్యార్థుల్ని సహాయక బృందాలు సోమవారం రక్షించాయి. ఆదివారం నలుగురు విద్యార్థుల్ని కాపాడిన 10 గంటల తర్వాత మిగిలినవారిని బయటకు తీసుకొచ్చేందుకు సోమవారం సహాయక చర్యల్ని ప్రారంభించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ సాగిన ఈ ఆపరేషన్లో మరో నలుగురు విద్యార్థుల్ని డైవర్లు గుహ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరందరిని థాయ్ రాయల్ పోలీస్ హెలికాప్టర్ ద్వారా 56 కి.మీ దూరంలో ఉన్న చియాంగ్రాయ్ ప్రచనుక్రోహ్ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఈ ఘటనలో ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థుల సంఖ్య 8కి చేరుకుంది. ప్రస్తుతం సహాయక కోచ్ ఎకపాల్(25)తో పాటు నలుగురు విద్యార్థులు ఇంకా గుహలోనే ఉన్నారు. జూన్ 23న తామ్ లూవాంగ్ గుహలోకి వెళ్లి చిక్కుకున్న 12 మంది విద్యార్థులతో పాటు కోచ్ను రక్షించేందుకు థాయ్లాండ్ అధికారులు ఆదివారం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, సోమవారం చీకటిపడటంతో ఆపరేషన్ను నిలిపివేసిన అధికారులు.. మంగళవారం సహాయక చర్యల్ని పునరుద్ధరించనున్నారు. వాతావరణం అనుకూలం.. ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్న చియాంగ్ రాయ్ ప్రావిన్సు గవర్నర్ నరోంగ్ సక్ మీడియాతో మాట్లాడుతూ.. తొలిరోజు లాగే సోమవారం కూడా సహాయక చర్యలకు వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపారు. గుహలోని పరిస్థితులపై అవగాహన ఉండటంతో ఆదివారం సహాయక చర్యల్లో పాల్గొన్న డైవింగ్ నిపుణుల్నే సోమవారం రంగంలోకి దించామన్నారు. ఆపరేషన్కు ముందు గుహలోని మార్గంలో ఆక్సిజన్ సిలిండర్లను చేరవేశామన్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తొలి బాలుడ్ని తీసుకురాగలమని అంచనా వేసినప్పటికీ.. సాయంత్రం 5.40 గంటలకే బయటకు తీసుకొచ్చామని నరోంగ్సక్ తెలిపారు.మిగిలిన ముగ్గురిని కూడా దాదాపు 3 గంటల వ్యవధిలోనే బయటకు తీసుకొచ్చామన్నారు. శారీరకంగా దృఢంగా ఉన్న విద్యార్థులనే తొలుత బయటకు తెచ్చేందుకు ప్రాధాన్యమిచ్చామని అన్నారు. వీరిని స్ట్రెచర్ల సాయంతో హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించామన్నారు. విద్యార్థులతో పాటు కోచ్ను కాపాడేందుకు 50 మంది థాయ్లాండ్ డైవర్లు, 40 మంది అంతర్జాతీయ డైవింగ్ నిపుణులు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడి వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ.. ఎగువ ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గుహలో నీటి ప్రవాహం పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. తామ్ లువాంగ్ గుహలోని నీటిని భారీ మోటార్ల సాయంతో తోడేస్తున్నట్లు పేర్కొన్నారు. అనుకున్నదాని కంటే తొందరగానే విద్యార్థుల్ని గుహ నుంచి బయటకు తీసుకొస్తున్నామని నరోంగ్సక్ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ఆపరేషన్ ముగిసే అవకాశముందన్నారు. కాగా, సోమవారం గుహ నుంచి బయటకొచ్చిన నలుగురు విద్యార్థుల వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. విద్యార్థులంతా క్షేమమే కానీ.. చియాంగ్ రాయ్ ఆస్పత్రి ప్రస్తుతం చికిత్స పొందుతున్న 8 మంది విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సీనియర్ వైద్యుడొకరు తెలిపారు. తమకు ఆహారం అందించాల్సిందిగా విద్యార్థులు కోరారన్నారు. అయితే వీరికి ఇన్ఫె క్షన్ సోకి ఉండొచ్చన్న అనుమానంతో ప్రస్తు తం వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు. ఇలా గుహల్లో చిక్కుకున్న సందర్భాల్లో వ్యక్తులకు హైపోథెర్మియా(శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోవడం), పక్షులు, గబ్బిలాల విసర్జితాల కారణంగా శ్వాససంబంధ వ్యాధు లు వచ్చే అవకాశముందన్నారు. విద్యార్థులను 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్నాక తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. అరుదైన ఆహ్వానం తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న వైల్డ్ బోర్స్ జట్టుకు అరుదైన ఆహ్వా నం లభించింది. నిర్ణీత సమయంలోగా అందరూ బయటకు రాగలిగితే రష్యా రాజధాని మాస్కోలో ఆదివారం జరిగే సాకర్ ప్రపంచకప్ ఫైనల్కు రావాలని ఈ జట్టు సభ్యుల్ని ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాన్టీనో ఆహ్వానించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న తమ విద్యార్థులు తిరిగివచ్చాక వారికోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని మే సాయ్ ప్రసిత్సర్త్ పాఠశాల యాజమాన్యం తెలిపింది. -
ఆపరేషన్ థాయ్; మరో నలుగురు క్షేమం
మే సాయ్ : థాయ్లాండ్లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 13 మందిని రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఆదివారం 12 గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్లో నలుగురు విద్యార్థుల్ని బయటకు తీసుకు రాగా, సోమవారం నాడు మరో నలుగురిని కాపాడినట్లు తెలిసింది. గుహ నుంచి బయటకు వచ్చిన వీరిని సైనిక హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గుహ నుంచి క్షేమంగా బయటపడిన విద్యార్థుల పేర్లను మాత్రం అధికారులు వెల్లడించడం లేదు. దాంతో గుహ నుంచి బయటపడినవారిలో తమ పిల్లలు ఉన్నారా? లేదా? అనే విషయం తల్లిదండ్రులకు ఇంతవరకూ తెలియలేదు. ఈ విషయం గురించి తల్లిదండ్రులు ‘మా పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారనుకుంటున్నాం. అందుకే మిగతా వారిని కూడా క్షేమంగా బయటకు తీసుకువచ్చే వరకూ ఇక్కడే ఉంటాం’ అని తెలిపారు. అయితే విద్యార్ధులను తల్లిదండ్రుల వద్దకు పంపించకుండా ఉండటానికి కారణం ఉందంటున్నారు డాక్టర్లు. ఈ విషయం గురించి థాయ్లాండ్ ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ జెస్సడ చోకేడమాంగ్సూక్ ‘విద్యార్ధులను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి ముందు కొన్ని రోజుల పాటు వారిని ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం మంచిది. ఎందుకంటే ఇన్నిరోజులు వారు గుహలో అసాధారణ పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఒకటి, రెండు రోజులు పరీక్షించి, వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకున్న తర్వాత పిల్లల్ని తిరిగి వారి కుటుంబాల చెంతకు చేరుస్తాం’ అన్నారు. ఈ విషయం గురించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటి సైకాలజిస్ట్ డాక్టర్ జెన్నిఫర్ వైల్డ్ ‘గుహ నుంచి క్షేమంగా బయటపడిన వారు మిగతా వారి గురించి ఆలోచించడం అవసరం. ఎందుకంటే వారి మిత్రులు ఇంకా గుహలోనే ఉన్నారు. కనుక వారంతా బయటకొచ్చిన తర్వాత అందరిని ఒకే సారి వారి కుటుంబాల చెంతకు చేర్చడం మంచిది అన్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను దూరంగా ఉంచడం బాధకరమైన విషయమే. కానీ ఇది వారు ఒకరికోసం ఒకరు ఆలోచించాల్సిన సమయం. అందరూ క్షేమంగా బయటపడిన తర్వాత వారు కలసికట్టుగా ముందుకు సాగడం గురించి ఆలోచించాలి’ అన్నారు. అంతేకాక ‘ఇన్ని రోజులు గుహలో ఉండి బయటపడిన తర్వాత వారికి కొన్ని ఆందోళనలు కలిగే అవకాశం ఉంది. కొందరు ఆ భయం నుంచి ఇంకా తేరుకోలేక పోవచ్చు. ఒత్తిడి వల్ల తలనొప్పి, కడుపునొప్పి వంటి అనారోగ్యాలు కలగవచ్చు. అందుకే పిల్లలను కొన్నాళ్ల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం అవసరం’ అని తెలిపారు. -
ఫుట్బాల్ టీమ్ అందరూ మృత్యుంజయులే
-
ఆపరేషన్ ‘థాయ్’ సక్సెస్
మే సాయ్: థాయ్లాండ్లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 13 మందిని రక్షించేందుకు తొలిరోజు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఆదివారం 12 గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్లో నలుగురు విద్యార్థుల్ని బయటకు తీసుకొచ్చారు. కోచ్తో పాటు మిగిలిన 8 మంది విద్యార్థుల్ని రక్షించేందుకు సోమవారం ఆపరేషన్ ప్రారంభిస్తామని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. గుహ నుంచి బయటకు వచ్చిన వీరిని సైనిక హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాము కాలం, నీటితో పోటీపడి సహాయక చర్యల్ని చేపడుతున్నట్లు ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్న చియాంగ్ రాయ్ ప్రావిన్సు గవర్నర్ నరోంగ్సక్ అన్నారు. వాతావరణశాఖ హెచ్చరికలతో.. రాబోయే 3–4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో తొలుత బాలుర కుటుంబాలకు సమాచారమిచ్చిన అధికారులు ఆపరేషన్ను ప్రారంభించారు. ఒక్కో బాలుడ్ని ఇద్దరు డైవర్లు 4 కి.మీ మేర సురక్షితంగా తీసుకొచ్చేలా ప్రణాళికలు వేశారు. వీరు దారితప్పకుండా మార్గంపొడవునా తాళ్లను అమర్చారు. తర్వాత 15 మంది అంతర్జాతీయ డైవింగ్ నిపుణులతో పాటు ఐదుగురు థాయ్ నేవీ సీల్స్ రంగంలోకి దిగారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ చేపట్టిన ఆపరేషన్లో నలుగురు పిల్లల్ని గుహ నుంచి బయటకు తీసుకురాగలిగారు. ఈ సందర్భంగా గుహలోని ఆక్సిజన్ స్థాయి తగ్గిపోకుండా కిలోమీటర్ మేర ప్రత్యేకమైన పైపుల్ని అమర్చారు. నీటిని నిరంతరాయంగా తోడేస్తుండటంతో గుహలోని నీటి మట్టం కాస్త తగ్గడం సహాయక చర్యలకు సాయపడింది. గుహలోని ఇరుకు మార్గాలు, బురద నీటితో దారి కన్పించకపోవడం, ఈ పిల్లలకు ఈత రాకపోవడం సహాయక చర్యలకు ప్రధాన అవరోధాలుగా మారాయి. ఈ విద్యార్థుల్ని బయటకు తీసుకొచ్చేందుకు గుహ పైభాగంలో దాదాపు 400 మీటర్ల మేర 100 రంధ్రాలను తవ్వినప్పటికీ ఫలితం లేకపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలింపు గుహ నుంచి బయటకు తీసుకొచ్చిన నలుగురు చిన్నారుల్ని అధికారులు వెంటనే హెలికాప్టర్లో చియాంగ్ రాయ్ ప్రచనుక్రోహ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి 35 మంది వైద్యులు చికిత్సచేస్తున్నారు. కాపాడిన నలుగురు పిల్లల్లో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వైద్యుడొకరు తెలిపారు. దక్షిణ థాయ్లాండ్లోని ఓ స్కూల్కు చెందిన వైల్డ్ బోర్స్ అనే సాకర్ జట్టు కోచ్తో పాటు 12 మంది విద్యార్థులు తామ్ లువాంగ్ గుహను జూన్ 23న సందర్శించారు. వీరు గుహలోకి వెళ్లగానే భారీ వర్షాలతో వరద పోటెత్తి ప్రవేశమార్గం మూసుకుపోయింది. ముందుకొచ్చిన ఎలన్ మస్క్.. చిన్నారుల్ని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి స్పేస్ఎక్స్, బోరింగ్ కంపెనీ నిపుణుల్ని ఘటనాస్థలానికి పంపినట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, స్పేస్ఎక్స్ అంతరిక్ష సంస్థ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ తెలిపారు. పిల్లల్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకమైన చిన్న సబ్మెరైన్ను పంపామన్నారు. చిన్నారుల్ని బయటకు తెచ్చేందుకు థాయ్లాండ్ ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. జూన్ 23 నుంచి.. జూన్ 23: సహాయక కోచ్ ఎకపాల్(25)తో కలసి 12 మంది విద్యార్థులు తామ్ లువాంగ్ గుహలోకి ప్రవేశించారు. ప్రవేశద్వారం వరదనీటితో మునిగిపోవడంతో వీరంతా లోపల ఇరుక్కున్నారు. జూన్ 24: గుహ ప్రవేశద్వారం వద్ద విద్యార్థుల సైకిళ్లు, కాలి గుర్తుల్ని అధికారులు కనుగొన్నారు. జూన్ 26: వరదతో గుహాలోని పట్టాయ బీచ్ ప్రాంతం ఇరుకుగా మారడంతో లోపలకు వెళ్లిన నేవీ సీల్ డైవర్లు వెనక్కువచ్చారు. జూన్ 27: దాదాపు 30 మంది అమెరికా పసిఫిక్ కమాండ్ సైనిక నిపుణులు, ముగ్గురు బ్రిటిష్ డైవర్లతో కలసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కానీ వరద ప్రవాహం కారణంగా ఎలాంటి పురోగతి కన్పించలేదు. జూన్ 28: గుహలోని నీటిని తోడేసేందుకు పంపుల్ని ఏర్పాటుచేశారు. విద్యార్థుల్ని రక్షించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు. జూలై 2: 12 మంది విద్యార్థులతో పాటు కోచ్ ఎకపాల్ సజీవంగా ఉన్నట్లు బ్రిటిష్ డైవర్లు గుర్తించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వీరికి ఆహారం, మందుల్ని అందించారు. జూలై 6: రక్షించేందుకు వెళ్లిన సమన్ కునన్ అనే నేవీ సీల్ కమాండర్ ట్యాంక్లో ఆక్సిజన్ అయిపోవడంతో చనిపోయారు. జూలై 8: సహాయక ఆపరేషన్ను ముమ్మరం చేసిన అధికారులు నలుగురు విద్యార్థుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. విలన్ కాదు.. హీరో ఎకపాల్ చాన్తవాంగ్(25).. 12 మంది చిన్నారులు ప్రమాదంలో చిక్కుకోవడానికి ఇతనే కారణమని పలువురు మొదట్లో విమర్శించారు. కానీ గుహలో చిన్నారులు అనారోగ్యానికి గురికాకుండా ఎకపాల్ జాగ్రత్తలు తీసుకున్నాడని లోపలకు వెళ్లిన డైవర్లు తెలిపారు. గతంలో బౌద్ధ సన్యాసిగా ఉన్న ఆయన విద్యార్థులు మానసికంగా కుంగిపోకుండా ధ్యానం, ఇతర అంశాలపై దృష్టి సారించేలా చేశాడని వెల్లడించారు. పదేళ్లకే తల్లిందండ్రులను కోల్పోయిన ఎకపాల్ ఓ బౌద్ధాశ్రమంలో సన్యాసిగా చేరారు. మూడేళ్ల క్రితం సన్యాస దీక్షను వదిలిపెట్టిన ఎకపాల్ తన అమ్మమ్మను చూసుకునేందుకు మే సాయ్కు వచ్చేశారు. అక్కడే ఉన్న ఓ స్కూల్లో ఉన్న వైల్డ్ బోర్స్ అనే సాకర్ జట్టుకు సహాయక కోచ్గా చేరారు. గుహలో 15 రోజుల పాటు చిక్కుకున్నా చిన్నారులు మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఎకపాల్ జాగ్రత్తలు తీసుకున్నారు. చివరికి తన ఆహారం, నీటిని సైతం ఆకలితో ఉన్న చిన్నారులకు ఇచ్చేశారు. దీంతో ఆయన ప్రస్తుతం గుహలో నీరసంతో బలహీనంగా తయారయ్యారు. సాకర్తో విద్యార్థుల్ని చదువుపై దృష్టి సారించేలా చేయొచ్చని నమ్మిన ఎకపాల్.. పాఠశాలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు సాకర్ దుస్తులు, షూలు ఇచ్చేలా ప్రధాన కోచ్ నొప్పరట్ను ఒప్పించారు. కాగా, ఎకపాల్ కారణంగానే తమ చిన్నారులు ఇంకా ప్రాణాలతో ఉన్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యాఖ్యానించడం గమనార్హం. -
94 నిమిషాల్లో 323.5 కిలోమీటర్లు!
థానే: దేశంలో మరో అరుదైన ఘటనకు మహారాష్ట్ర వేదికైంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ బాలుడి గుండెను గ్రీన్ కారిడార్ ద్వారా కేవలం 94 నిమిషాల్లో 323.5 కిలోమీటర్లు తరలించి నాలుగేళ్ల చిన్నారికి వైద్యులు విజయవంతంగా అమర్చారు. ఔరంగాబాద్లో రోడ్డు ప్రమాదానికి గురైన బాలుడు(13) శుక్రవారం చనిపోవడంతో అక్కడి ఎంజీఎం ఆస్పత్రిలో గుండెను మధ్యాహ్నం 1.50కి సేకరించారు. అనంతరం పోలీసులు, అధికారులు, ప్రజల సహకారంతో గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేసి 4.8 కి.మీ దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తిచేసి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి చార్టెడ్ విమానంలో ముంబై విమానాశ్రయానికి మధ్యాహ్నం 3.05 గంటలకు చేరుకున్నారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేయడంతో కేవలం 19 నిమిషాల్లోనే గుండె సబర్బన్ ములుంద్లోని ఫోర్టిస్ ఆస్పత్రికి చేరుకుంది. గుండె సమస్యతో ఫోర్టిస్లో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల చిన్నారికి ఈ గుండెను వైద్యులు అమర్చారు. బాలికకు ఆపరేషన్ విజయవంతమైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
అజిత్కు ఆపరేషన్ సక్సెస్
చెన్నై : నటుడు అజిత్కు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. అజిత్ ఆరంభం చిత్రం షూటింగ్ సమయంలో గాయాల పాలైన విషయం తెలిసిందే. ఆయన మోకాలుకు బలమైన గాయమైంది. వైద్యులు అప్పుడే శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. అయితే వరుసగా చిత్రాలు అంగీకరించడంతో అజిత్ తన కాలికి తాత్కాలికి వైద్యం చేయించుకుంటూ శస్త్ర చికిత్సను వాయిదా వేస్తూ వచ్చారు. ఇటీవల వేదాళం చిత్ర షూటింగ్ సమయంలోనూ అదే కాలికి దెబ్బ తగలగా ఆ నొప్పితోనే షూటింగ్ను పూర్తి చేశారు. గురువారం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అజిత్ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆయనకు ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని, రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశార్జ్ అవుతారని తెలిసింది. అజిత్ త్వరలో అమెరికా వెళ్లనున్నట్లు, అక్కడ రెండు నెలలు విశ్రాంతి తీసుకుని చెన్నైకి తిరిగి రానున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
అరుదైన ఆపరేషన్ విజయవంతం
-
ఆపరేషన్ సక్సెస్