Rajinikant
-
Pooja Hegde: రజనీకాంత్ తో ఐటెం సాంగ్..
-
సూపర్ స్టార్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టిన శ్రద్ధా శ్రీనాథ్
-
పేద ప్రజల కోసం రజనీ బిగ్ ప్లాన్?
పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు అందించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో భారీ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. వాస్తంగా రాజకీయాల్లోకి రావాలనుకున్న ఆయన వయసు రిత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు వస్తాయిని వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే.. రాజకీయాల్లోకి రానప్పటికీ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆయన తన రాజకీయ పార్టీని సమాజ్ సేవా సంఘ్గా మార్చిన విషయం తెలిసిందే. కొన్నేళ్లుగు తనను అభిమానించే ప్రజలకోసం తాను ఏమైనా చేయాలని ఆలోచించిన రజనీకాంత్.. పేదల కోసం ఒక ఆసుపత్రిని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం తమిళనాడులోని చంగల్పట్టు జిల్లా తిరుప్పురూర్లో 12 ఎకరాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. కొద్దిరోజుల క్రితమే అక్కడి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందర్శించి తాను కొనుగోలు చేసిన 12 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ కూడా ఆయన చేయించుకున్నారు. చెన్నై, తిరుప్పురూర్ మధ్య ఉన్న దూరం దాదాపు 45 కి.మీ ఉంది. అందరికీ అందుబాటులో అక్కడ ఆసుపత్రిని నిర్మించాలని రజనీ ఉన్నారట. త్వరలో భూమి పూజ కూడా రజనీ ప్రారంభించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ స్థలంపై కచ్చితమైన సమాచారం ఇంకా బయటకు రానప్పటికీ ఆసుపత్రి నిర్మాణం కోసమే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇక రజనీకాంత్ సినిమాల టాపిక్లోకి వస్తే.. ఇటీవల ఆయన నటించిన 'లాల్ సలామ్' సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఇక కొత్త చిత్రం 'వెట్టయాన్' విషయానికొస్తే, అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో నెలలో షూటింగ్ కూడా పూర్తి కానుంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ ఓ చిత్రంలో నటిస్తారు. -
తలైవాతో కేజీఎఫ్ రాకీభాయ్ అదిరిపోయే కాంబినేషన్
-
రజినీకాంత్ చంద్రబాబు ఫోన్ కాల్ పై సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు....
-
ప్రత్యేక పాత్రలో రజినీకాంత్.. ప్రారంభమైన షూటింగ్
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం 'లాల్ సలాం'. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హోలీ రోజున ప్రారంభమైంది. ఈ చిత్రంలో సూపర్స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ తన ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ.. 'విభిన్నమైన సినిమాలు నిర్మించడంలో లైకా ప్రొడక్షన్స్ ముందుంటుంది. అందులో భాగంగా లాల్ సలాం సినిమాను నిర్మిస్తున్నాం. ఇందులో ఓ పవర్ఫుల్ పాత్ర ఉంది. అందుకే సూపర్స్టార్ రజినీకాంత్గారిని రిక్వెస్ట్ చేశాం. ఆయన ఈ రోల్లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ మళ్లీ మెగా ఫోన్ పట్టారు.'అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. Lights 💡 Camera 🎥 🎬 Action 😎✨#LalSalaam 🫡 Shoot starts today! 😌 Happy #HOLI everyone! 💫 🎬 @ash_rajinikanth 🎶 @arrahman 🌟 @rajinikanth @TheVishnuVishal & @vikranth_offl 🤝 @gkmtamilkumaran 🪙 @LycaProductions #Subaskaran pic.twitter.com/SHYXxnGYod — Lyca Productions (@LycaProductions) March 7, 2023 -
కూతురుతో కలిసి రజనీని కలిసిన శరత్ కుమార్
నటుడు శరత్ కుమార్ తన కూతురు, నటి వరలక్ష్మి శరత్ కుమార్తో కలిసి ఆదివారం సూపర్స్టార్ రజనీకాంత్ను కలిశారు. వీరిని తలైవా సాదరంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని నటుడు శరత్ కుమార్ తన ట్విట్టర్లో పొందుపరిచారు. మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటుడు శరత్ కుమార్ పెరియ పళవేట్టరైయర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం చూసిన రజనీకాంత్ శరత్ కుమార్కు ఫోన్చేసి ప్రశంసించారు. అందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే తాను రజనీకాంత్ కలిసినట్లు శరత్ కుమార్ పేర్కొన్నారు. కూతురు వరలక్ష్మి కూడా రావడంతో తాజాగా నటిస్తున్న చిత్రాలపై కొద్దిసేపు చర్చించినట్లు వెల్లడించారు. -
రజనీకాంత్ పొలిటికల్ రీ ఎంట్రీ.. హాట్ టాపిక్గా వారి భేటీ!
సాక్షి, చెన్నై : సూపర్స్టార్ రజనీకాంత్ న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఒక్క రోజు తర్వాత తమిళనాడు గవర్నర్ రవిని కలుసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సోమవారం రజనీకాంత్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ రవితో దాదాపుగా 30 నిమిషాల సేపు మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో ప్రధానిని రజనీకాంత్ కలిశారని వార్తలొచ్చాయి. గవర్నర్ భేటీ అయిన తలైవా సమావేశానంతరం విలేకరులతో మాట్లాడారు. తాను రాజకీయాలపైనే గవర్నర్తో చర్చించానని చెప్పారు. అయితే తానేం మాట్లాడానో మీడియాకు వెల్లడించలేనన్నారు. తనకు భవిష్యత్లో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని పునరుద్ఘాటించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాలు, పెరుగు వంటి నిత్యావసరాలపై జీఎస్టీ వడ్డించడం గురించి విలేకరులు ప్రశ్నించగా నో కామెంట్ అంటూ వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: వెంకయ్య నాయుడికి తృణమూల్ ఎంపీ ‘చిక్కు’ ప్రశ్న -
రజనీకాంత్కి మరోసారి విలన్గా రమ్యకృష్ణ..?
రజనీకాంత్కి మరోసారి విలన్గా మారుతున్నారు రమ్యకృష్ణ. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ఆగస్టులో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్కు ఫైనల్ టచ్ ఇవ్వడంతో పాటు, ఈ మూవీలో నటించనున్న ఇతర నటీనటుల ఎంపిక పనిలో ఉన్నారట నెల్సన్. కాగా ఈ చిత్రంలో రజనీ సరసన ఐశ్వర్యారాయ్ నటిస్తారని, కీలక పాత్రలో హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ యాక్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ విలన్ రోల్కు రమ్యకృష్ణను సంప్రదించారట నెల్సన్. కథ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. 1999లో రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘పడయప్ప’ (తెలుగులో ‘నరసింహ’) చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో రమ్యకృష్ణ నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరోసారి ఆమె అలాంటి పాత్రలోనే నటించనుండటంపై ఇండస్ట్రీలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. -
రజనీ నెక్స్ట్ మూవీ ఆమె డైరెక్షన్లోనేనా?!
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ‘అన్నాత్తే’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన రజనీ రాజకీయ అరంగేట్రం, ఇటూ ఆయన నెక్ట్ మూవీ డైరెక్టర్ ఎవరన్నది హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే రజనీకి ఇటీవల ఎంతో మంది డైరెక్టర్లు కథ వివరించారట. అందులో యువ దర్శకులతో పాటు ఆయన కూతురు సౌందర్య కూడా ఉండటమే ఇందుకు కారణం. కాగా ప్రస్తుతం రజనీ నటిస్తున్న సినిమా, సినిమాకు ఇదే ఆయన చివరి మూవీ అని త్వరలోనే నటకు గుడ్బై చెప్పబోతున్నట్లు పుకార్లు పుట్టుకోస్తున్నాయి. అంతేగాక ఆయన రాజకీయ ప్రవేశంపై కూడా రూమార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కోసం కూతురు సౌందర్య స్క్రిప్ట్ సిద్దం చేయడంతో మరీ రజనీ తదుపరి చిత్రం ఎవరీ డైరెక్షన్లో అనేది చర్చనీయాంశం మారింది. అయితే ఆయన చివరిగా కూతురు డైరెక్షన్ నటించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అంతేగాక ఆయన అమెరికా నుంచి తిరిగి రాగానే ఈ ప్రాజెక్ట్కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని తెలుస్తోంది. కాగా ఇప్పటికే సౌందర్య రజనీతో యానిమేటెడ్ మూవీని డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఎన్నికలకు దూరంగా రజనీకాంత్ స్నేహితుడు
సాక్షి, చెన్నై: పార్టీ ప్రకటించినా, మేనిఫెస్టో విడుదల చేసినా, 234 స్థానాల్లో ఒంటరి సమరం అన్న నిర్ణయం తీసుకున్నా, చివరి క్షణంలో ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్టు తలైవా రజనీకాంత్ సన్నిహితుడు అర్జునమూర్తి బుధవారం చెన్నైలో ప్రకటించారు. తాను ప్రకటించనున్న పార్టీకి సమన్వయకర్తగా అర్జునమూర్తిని రజనీకాంత్ నియమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలతో అనారోగ్య కారణాలతో పార్టీ పెట్టడం లేదని, రాజకీయాలకు ఇక దూరమని రజనీకాంత్ ప్రకటించారు. దీంతో గత నెల అర్జునమూర్తి సొంత పార్టీగా ఇండియా మక్కల్ మున్నేట్ర కట్చిని ప్రకటించుకున్నారు. ఈ పార్టీకి ఎన్నికల కమిషన్ రోబో చిహ్నం కేటాయించింది. దీంతో గతవారం ఎన్నికల మేనిఫెస్టోను సైతం అర్జున మూర్తి విడుదల చేశారు. 234 స్థానాల్లోనూ తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. వివిధ పార్టీల్లోకి వెళ్తున్న రజనీకాంత్ అభిమానులు తన వైపు రావాలని పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారంతో నామినేషన్ల గడవు ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటిస్తారనుకున్న అర్జునమూర్తి బుధవారం ఓ ప్రకటన చేశారు. అందులో తాను ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. తన పార్టీకి ప్రచారంగా సిద్ధం చేస్తున్న రోబో ఇక్కడకు రావడానికి మరింత సమయం పడుతుందని వివరణ ఇచ్చారు. కరోనా వ్యాప్తి పెరుగు తుండడంతో మద్దతుదారుల ఆరోగ్య క్షేమాన్ని కాంక్షించి పోటీ చేయడం లేదని ప్రకటించారు. రజనీ పార్టీ ప్రకటన ముందే యూటర్న్ తీసుకుంటే, ఆయన సన్నిహితుడు పార్టీ ప్రకటించి, మేనిఫెస్టో విడుదల చేసి, ఎన్నికల కమిషన్ కేటాయించిన రోబో చిహ్నాన్ని భుజానకెత్తుకుని నామినేషన్ల చివరి క్షణంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల బరిలో విజయకాంత్ సతీమణి -
పారితోషికంలో ప్రభాస్ రికార్డు!
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ఆయన ఇమేజ్ కూడా ఒక్కసారిగా అందనంత ఎత్తుకు వెళ్లింది. ప్రభాస్ ఇప్పుడు ఏ సినిమాలు చేసినా అవి పలు భాషాల్లోకి డబ్బింగ్ అవుతున్నాయి. అక్కడ కూడా మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. బాహుబాలి తరువాత ప్రభాస్ చేసిన సాహో సినిమా ఆశించినంత స్థాయిలో హిట్ కాలేకపోయినా, వసూళ్లు మాత్రం బాగానే రాబట్టింది. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రాన్ని మహానటి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్గా ప్రభాస్కు 100 కోట్లు ముట్టనున్నట్లు తెలుస్తోంది. సినిమాకు ఇచ్చేది రూ. 70 కోట్లు కాగా, డబ్బింగ్ రైట్స్ కోసం మరో రూ. 30 కోట్లు ప్రభాస్కు ఇవ్వనున్నారని టాలీవుడ్ సమాచారం. ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంది ఇప్పటి వరకు సూపర్స్టార్ రజనీకాంత్ మాత్రమే. ఆయన దర్బార్ సినిమాకు రూ.70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ ఆయనను మించిపోయాడు. దీంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా రికార్డు సృష్టించనున్నారు. ప్రభాస్ తాజా సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించనుంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. చదవండి: దీపిక రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? -
నవంబర్లో షురూ
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన స్నేహితుడు, హీరో కమల్హాసన్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనుందనే వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ నటించనున్న ఈ 169వ చిత్రానికి ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్హాసన్ నిర్మించనున్నారు. రజనీకాంత్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నందున ఈ ప్రాజెక్టును నిలిపివేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ‘రజనీ–కమల్ సినిమా ఆగిపోయిందన్నది కేవలం పుకారు మాత్రమే.. ఈ ఏడాది నవంబరులో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది’ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమా గురించి ఏప్రిల్లో అధికారికంగా ప్రకటించాలనుకున్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రకటించలేదు. పైగా రజనీకాంత్ ఈ చిత్రానికి డేట్స్ ఖరారు చేయాల్సి ఉందట. నవంబరులో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. కాగా ఈ చిత్రంలో రజనీతో కమల్ వెండితెరను పంచుకుంటారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. వీరిద్దరూ కలిసి చివరిసారిగా ‘గిరఫ్తార్’ అనే హిందీ సినిమాలో కనిపించారు. ప్రస్తుతం రజనీకాంత్ శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తుండగా, శంకర్ దర్శకత్వంలో కమల్హాసన్ ‘భారతీయుడు 2’ సినిమాలో నటిస్తున్నారు. -
మామ వర్సెస్ అల్లుడు
మామాఅల్లుళ్ల సవాల్ సినిమాల్లో భలే సరదాగా ఉంటాయి. నువ్వా? నేనా? అని మామా అల్లుళ్లు తలపడటం సినిమాల్లో చూస్తుంటాం. ఇప్పుడు తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర మామాఅల్లుళ్లు రజనీకాంత్, ధనుష్ తలపడే అవకాశం కనిపిస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. మరోవైపు దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘పటాస్’. మెహరీన్, స్నేహా కథానాయికలు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ‘పటాస్’ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. దాంతో వచ్చే ఏడాది పొంగల్కి బాక్సాఫీస్ దగ్గర మామాఅల్లుళ్ల క్లాష్ ఏర్పడనుందని భావిస్తున్నారంతా. ఏం జరుగుతుందో చూడాలి. -
తొలిచూపు ప్రేమను నమ్ముతా : హీరోయిన్
తొలిచూపు ప్రేమను నమ్ముతున్నానంటూ హీరోయిన్ త్రిష.. ట్విటర్లో పోస్ట్ చేసిన ఫొటో వైరల్గా మారింది. అదేంటి త్రిష మళ్లీ ప్రేమలో పడిందా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే త్రిష మాట్లాడుతోంది మనిషి గురించి కాదు.. తనకెంతో ఇష్టమైన డాల్ఫిన్ గురించి. ప్రస్తుతం హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న త్రిష.. ఓ డాల్ఫిన్ను ముద్దాడుతూ దిగిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే భావనను నమ్ముతున్నానంటూ’ క్యాప్షన్ జత చేశారు. కాగా ఈ అమ్మడు ప్రేమలో పడిందని చాలాసార్లు సామాజిక మాధ్యమాల్లో కథనాలు వచ్చాయి. 2014లో నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్తో ప్రేమపెళ్లికి సిద్ధమైందంటూ కథనాలు వచ్చాయి. పెళ్లికి ముందే ప్రేమికుల చిహ్నమైన తాజ్మహల్ను ప్రియుడితో కలిసి ఆమె చుట్టివచ్చారు. దీంతో పెళ్లి పీటలెక్కడమే తరువాయి అనుకున్నారు. కానీ అనూహ్యంగా వీరు బ్రేకప్ చేసుకున్నారు. ప్రస్తుతం త్రిష కెరీర్పై దృష్టి సారించారు. 12 ఏళ్ల నటనా జీవితంలో ఎన్నో విలక్షణమైన పాత్రలతో నటిగా నిరూపించుకున్నారు. ఎందరో స్టార్ హీరోలతో జతకట్టిన త్రిషకు.. ఇంతవరకు రజనీకాంత్తో కలిసి నటించే లేదనే లోటు ఉండేది. ప్రస్తుతం ‘పేట’ సినిమాతో ఆ వెలితి కూడా తీరనుంది. -
‘రజనీ ఆలోచనలు ప్రమాదకరం’
తమిళ సినిమా : రజనీకాంత్ ప్రమాదకరమైన ఆలోచనపరుడని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ధ్వజమెత్తారు. కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు కోసం జరుగుతున్న తమిళుల పోరాటం సినీ రంగంలోనూ సమస్యలకు దారి తీస్తోంది. ముఖ్యంగా రజనీకాంత్పై పలువురు సినీ ప్రముఖులు మాటల దాడి చేస్తున్నారు. కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు కోసం సినీ దర్శకుడు కే.భారతీరాజా నేతృత్వంలో తమిళగ కళై ఇళక్కియ పన్బాటు పేరవై అనే సంఘాన్ని నెలకొల్సి పోరాటం చేస్తున్నారు. ఇటీవల ఆందోళన కార్యక్రమంలో ఒక పోలీస్ దాడికి గురయ్యారు. ఈ సంఘటనపై నటుడు రజనీకాంత్ ఇది హింసకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రజనీ వ్యాఖ్యలపై దర్శకుడు భారతీరాజా వర్గం మండిపడుతోంది. ఇదే విషయంపై నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ స్పందిస్తూ కావేరి మేనేజ్మెంట్ ఏర్పాటు కోసం తాము శాంతియుత పోరాటం చేస్తున్నామన్నా రు. ఈ పోరాటంలో ఒక పోలీస్ను బాధించటం బాధాకరమేనన్నారు. అయితే ఈ అంశంపై నటుడు రజనీకాంత్ ఇది హింసకు పరాకాష్ట అని పేర్కొనే ముందు పోరాటంలో ఏం జరిగిందన్నది తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. పోరాటంలో పాల్గొన్న దర్శకుడు భారతీరాజా, గీతరచయిత వైరముత్తు వంటి వారు ఆయన స్నేహితులేనని, వారిని అడిగి తెలుచుకోవచ్చుగా అని ప్రశ్నించారు. జల్లికట్టు పోరాటంలో జరిగిన దాడి గురించి రజనీ స్పందించలేదని, ఒక పోలీసు ఎత్తిపడేయడంతో మహిళ ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన గురించి ఆయన స్పందించలేదన్నారు. అలాంటిది కావేరి మేనేజ్మెంట్ బోర్డు కోసం జరుగుతున్న పోరాటంతో గాయాలపాలైన పోలీస్ విషయంలో హింసకు పరాకాష్ట అని పేర్కొన్న రజనీకాంత్ ఆలోచనలు ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. ఇటీవల అత్యాచారం కారణంగా బలైన చిన్నారి ఆసిఫా ఉదంతంపై కూడా రజనీ స్పందించలేదన్నారు. అలాంటి రజనీ రాజకీయాల్లోకి రావడాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. తమిళనాడును తమిళుడే పాలించాలన్నది తమ లక్ష్యమని సీమాన్ పేర్కొన్నారు. -
నా అభిమానులే మీకు పాఠాలు చెబుతారు
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయ నాయకులెవ్వరూ తన అభిమానులకు పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని, వారే ఎదుటి వారికి పాఠాలు చెప్పగల నేర్పులని నటుడు రజనీకాంత్ విమర్శకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చెన్నైలో ప్రజా సంఘాల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 32 ఏళ్ల చరిత్ర కలిగిన అభిమాన సంఘాల నుంచి తమ పార్టీ ఉద్భవిస్తోందని, తాము ఇప్పుడు చేయాల్సిందల్లా వాటిని మరింత బలోపేతం చేయడమేనని అన్నారు. జిల్లాల్లో ఇన్చార్జ్ల నియామకం పూర్తయ్యాక రాష్ట్ర పర్యటన చేపడతానన్నారు. కమల్ సమర్థుడు.. ఇటీవల పార్టీ స్థాపించిన సహ నటుడు కమల్ హాసన్పై రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. కమల్ సమర్థుడని, ఆయన ప్రజల విశ్వాసం చూరగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రాబోతున్న తనది, కమల్ది రెండు వేర్వేరు దారులని, అయినా ఇద్దరి అంతిమ లక్ష్యం ప్రజా సంక్షేమమేనని అన్నారు. -
‘పవన్ నీకు దమ్ము, ధైర్యం లేదనుకుంటారు’
సాక్షి, హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని ఈ శతాబ్దపు అత్యున్నత ఘటన అని అభివర్ణించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తాజాగా తమిళ ప్రజలంతా ఆయనకే ఓటేస్తారని, అతనిపై పోటీ చేయడం దండుగ అని పేర్కొన్నాడు. కొంతమంది తమిళ ప్రజలు తమ గౌరవాన్ని కోల్పోయారని, అది రజనీ తీసుకొస్తానని చెప్పడం గొప్ప విషయమని ప్రశంసించాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ విషయాలను రజినీకాంత్తో పోలుస్తూ మరో కామెంట్ చేశాడు. ఇప్పటికే కేసీఆర్-పవన్ భేటీపై అవసరం ఎంతటికైనా మారస్తుందన్న వర్మ ..'సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడులోని అన్ని స్థానాల్లో పోటీ చేసినట్లుగానే పవన్ కూడా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని స్థానాల్లో పోటీచేయాలి. అలా జరగకపోతే రజినీకాంత్లో ఉన్న దమ్ము, ధైర్యం పవన్లో లేవని ఆయన అభిమానులు భావిస్తారు. ఒకవేళ రజినీకాంత్లా కాకుండా తక్కువ స్థానాల్లో పోటీ చేస్తే మాత్రం అది మన తెలుగువారి ప్రతిష్టకే అవమానకరం' అని ఫేస్బుక్లో సంచలన పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని, మా నేత రెండు రాష్ట్రాల్లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తారని ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కాగా రాంగోపాల్ వర్మ ట్విట్టర్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ‘ట్విట్టర్ అజ్ఞాతవాసిలోకి వెళ్లిన నేను పవన్ అజ్ఞాతవాసితో స్పూర్తిని పొంది తిరగి వచ్చా అని’ సెటైరిక్ ట్వీట్ చేశాడు. Twitter Ajnaatavaasam loki velina nenu p k ajnaatavaasi tho inspire ayyi malli vachcha pic.twitter.com/nzjjDcHw5B — Ram Gopal Varma (@RGVzoomin) 2 January 2018 -
రజనీ అడిగినా ‘2.0’ చేయనన్నా!
లడ్డూ లాంటి ఛాన్స్ చేతిదాకా వస్తే చటుక్కున లాగేసుకోవాలని ఎవరైనా అనుకుంటాం. లూస్ చేసుకుంటే లాస్ అవుతాం కదా! కానీ, ఆ లడ్డూ ఆఫర్కి మనం అర్హులమా? కాదా? అని ఆలోచించేవాళ్లు మాత్రం లాస్ గురించి ఆలోచించకుండా వదిలేసుకుంటారు. ఆమిర్ ఖాన్ అదే చేశారు. మరి... దాదాపు 400 కోట్ల సినిమాని వదులుకోవడం అంటే నటుడిగా నష్టమే కదా? రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ ‘2.0’ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ‘‘ఈ సినిమాలో మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది’’అని ఆమిర్ ఖాన్కి స్వయంగా రజనీ ఫోన్ చేశారట. కానీ, ఆమిర్ చాలా వినయంగా ఆ అవకాశాన్ని తిరస్కరించారు. ఆయనకు ‘2.0’ స్క్రిప్ట్ మొత్తం తెలుసు. వసూళ్ల రికార్డులు బద్దలు కొడుతుందని కూడా అనుకున్నారట. మరి.. ఎందుకు చేయకూడదనుకున్నారో ఆమిర్ మాటల్లో తెలుసుకుందాం. ‘‘నిజానికి ‘2.0’ ప్లాన్ చేసినప్పుడు రజనీకి కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దాంతో ఆ సినిమా చేయలేనేమోననుకుని నన్ను చేయమన్నారు. ‘ఏ సమస్య ఉన్నా ఫర్వాలేదు.. మీరే చేయాలి’ అన్నాను. ఎందుకంటే, రజనీలా నేను మేజిక్ చేయలేను. ఆయనలా నేను యాక్ట్ చేయలేను. ఆ స్క్రిప్ట్ గురించి ఎప్పుడు తలుచుకుని కళ్లు మూసుకున్నా... నాకు రజనీయే కనిపించేవారు. దాంతో శంకర్ దగ్గర ‘నేను చేయలేను. ఈ సినిమా రజనీ మాత్రమే చేయగలరు’ అని చెప్పాను. నేను రజనీ అభిమానిని. ఫస్ట్ పార్ట్ (‘రోబో’) చూశాను. ఆయన అద్భుతంగా నటించారు. ఆ నటన నా మనసులో నాటుకుపోయింది. ‘2.0’ ఎన్ని భాషల్లో విడుదలైతే అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అవుతుంది’’ అని ఆమిర్ పేర్కొన్నారు. జనవరి 25న ఈ సినిమా విడుదల కానుంది. -
అమ్మకు రజనీకాంత్ కుటుంబం నివాళి
-
అమ్మకు రజనీకాంత్ కుటుంబం నివాళి
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళులు అర్పించారు. జయలలిత పార్థివదేహం ఉంచిన చెన్నైలోని రాజాజీ పబ్లిక్ హాల్కు రజనీ తన కుటుంబ సభ్యులతో కలసి వచ్చారు. రజనీ వెంట భార్య లత, అల్లుడు ధనుష్, కుమార్తెలు ఉన్నారు. జయలలిత భౌతికకాయానికి నివాళులు అర్పించిన రజనీ.. ఆమె నెచ్చెలి శశికళను పరామర్శించారు. రజనీ కటుంబ సభ్యులు కూడా శశికళను ఓదార్చారు. జయలలిత పార్థివదేహం పక్కన ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడితో రజనీకాంత్ కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆరాధ్య నాయకురాలు అమ్మను చివరిసారి చూసి నివాళులు అర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. కన్నీటి వీడ్కోలు పలికేందుకు లక్షలాది జనం రాజాజీ హాల్ కు వస్తున్నారు. -
రజనీకాంత్ ప్రజలకు సందేశం ఇస్తే..
పుదుచ్చేరికి బ్రాండ్ అంబాసిడర్గా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహరించాలని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కోరారు. రజనీకాంత్ ప్రజలకు సందేశం ఇస్తే ఆరోగ్యకరమైన పుదుచ్చేరిగా మారుతుందని అన్నారు. ప్రాస్పరస్ పుదుచ్చేరి కార్యక్రమాన్ని ఆమె ఆదివారం ప్రారంభించారు. పుదుచ్చేరికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాలంటూ గతంలో కూడా కిరణ్ బేడీ రజనీకాంత్ను కోరారు. మే 29న పుదుచ్చేరి లెఫ్టినెంగ్ గవర్నర్గా కిరణ్ బేడీ బాధ్యతలు చేపట్టాక ప్రతి శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మున్సిపల్ కార్మికులతో కలసి వ్యర్థపదార్థాలను తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కిరణ్ బేడీ కోరారు. ఇంటి పరిసరాలు, రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరికి అన్నివిధాలా సాయం చేస్తోందని, పుదుచ్చేరి ఇండస్ట్రియల్ కారిడర్గా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.