Samrat Reddy
-
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటుడు సామ్రాట్ భార్య
నటుడు సామ్రాట్ రెడ్డి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇక క్యారెక్టర్ ఆర్టీస్ట్గా కెరీర్ ప్రారంభించిన సామ్రాట్.. వైఫ్ ఆఫ్ రామ్, పంచాక్షరి వంటి సినిమాల్లో లీడ్ రోల్లో నటించారు. ఆ తర్వాత హీరో నాని హోస్ట్ చేసిన బిగ్బాస్ సీజన్ 2లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇంతకుముందు హర్షితా రెడ్డి అనే యువతితో సామ్రాట్కు వివాహం జరిగింది. అయితే విబేధాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. 2020లో కాకినాడకు చెందిన అంజనా శ్రీలిఖిత అనే అమ్మాయితో సామ్రాట్కు రెండో విహాహం జరిగింది. ఆగస్టు 15న సామ్రాట్ భార్య లిఖిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇండిపెండెన్స్ రోజును ఇలా సెలబ్రేట్ చేసుకోవడం డిఫరెంట్ ఫీలింగ్ అంటూ సామ్రాట్ తన కూతురితో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన పలువురు ప్రముఖులు సామ్రాట్ దంపతులకు శుభాంకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Samrat Reddy (@samratreddy) -
బిగ్బాస్ కంటెస్టెంట్ రెండో వివాహం
నటుడు, బిగ్బాస్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. అంజనా శ్రీ లిఖిత అనే యువతి మెడలో బుధవారం మూడు ముళ్లు వేసి వివాహ బంధంతో ఒకటయ్యారు. కోవిడ్ కారణంగా ఎలాంటి హడావిడి లేకుండా కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో ఈ పెళ్లి కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు బిగ్బాస్లో తన స్నేహితులైన తనీష్, దీప్తీ సునాయనా కూడా హాజరయ్యారు. సామ్రాట్ పెళ్లి వార్త తెలిసిన నెటిజన్లు, అభిమనులు నటుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పెళ్లికి సంబంధించిన వీడియోను సామ్రాట్ సోదరి, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ శిల్పా రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: నటుడు సామ్రాట్ సోదరికి కరోనా ఇక క్యారెక్టర్ ఆర్టీస్ట్గా కెరీర్ ప్రారంభించిన సామ్రాట్.. వైఫ్ ఆఫ్ రామ్, పంచాక్షరి వంటి సినిమాల్లో లీడ్ రోల్లో నటించారు. ఆ తర్వాత హీరో నాని హోస్ట్ చేసిన బిగ్బాస్ సీజన్ 2లో పాల్గొని మరింత పేరు సంపాదించాడు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఆట మీద దృష్టి పెడుతూ టాప్ 5కు చేరాడు. ఇదిలా ఉండగా సామ్రాట్కు ఇది రెండో పెళ్లి అన్న విషయం తెలిసిందే. ఇంతకముందు హర్షితా రెడ్డి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ 2018లో కట్నం కోసం వేధిస్తున్నాడని, తనపై హత్య ప్రయత్నం చేశాడని సామ్రాట్పై హర్షిత కేసు నమోదు చేసింది. అనంతరం ఇద్దరి మధ్య తలెత్తిన విబేధాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. చదవండి: నిహారిక పెళ్లి డేట్ ఫిక్స్.. డెస్టినేషన్ వెడ్డింగ్ -
మొక్కలు నాటిన సినీ నటుడు సామ్రాట్
-
‘మై సౌత్ దివా కేలండర్– 2019’
-
మిర్రర్స్ సెలూన్
-
శ్రీవారి సేవలో నటుడు సామ్రాట్
పశ్చిమగోదావరి , ద్వారకాతిరుమల: సినీ నటుడు, బిగ్బాస్–2షో కంటెస్టెంట్ సామ్రాట్రెడ్డి బుధవారం చినవెంకన్న క్షేత్రాన్ని సందర్శించారు. స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు సినిమాల్లో తాను హీరోగా, ప్రతినాయకుడిగా నటించానన్నారు. మూడు నెలలపాటు బిగ్బాస్ షోలో పాల్గొన్నట్టు చె ప్పారు. షో తనకు మరింత గుర్తింపును తేవడంతో పాటు జీవితంలో మలుపుగా నిలిచిందని చెప్పారు. సామ్రాట్తో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. -
సామ్రాట్తో పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు?
బిగ్బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులూ తేజస్వి స్నేహసామ్రాజ్ఞిలా ఉన్నారు. హౌస్ నుంచి బయటికి వచ్చాక కూడా ఆ సామ్రాట్ని– ఈ సామ్రాజ్ఞినీకలిపి చూడటం మానడం లేదు టీవీ వీక్షకులు!అసలు తేజస్వి–సామ్రాట్ల మధ్య ఉన్నది జస్ట్.. క్లోజ్ ఫ్రెండ్షిప్పా? అంతకన్నా ఎక్కువేనా?!ఎలిమినేట్ అయినవారిని మర్చిపోతాం. తేజస్వి మాత్రం ‘ఎలివేట్’ అయ్యారు!! ఎందుకు? చదవండి. తేజస్వితో సాక్షి ఇంటర్వ్యూ. ‘‘నేనసలు బిగ్ బాస్ ఫస్ట్ సీజన్కే వెళ్లాల్సి ఉండింది. కుదరలేదు. తర్వాత ‘మా’ అవార్డ్స్ షో కోసం అన్నపూర్ణ స్టూడియోస్లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ –2 కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. అలా సెకండ్ సీజన్లో బిగ్ బాస్ హౌజ్లోకి ఎంటర్ అయ్యాను. నాతో పాటు ఇంకెవరెవరు హౌజ్లోకి వస్తున్నారో అప్పటికి హాడ్ నో ఐడియా ఎబౌట్ దట్. వెళ్లాకే తెలిసింది ఎవరెవరెవరు ఉన్నారో! ఏడ్చేశాను నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్నకు ఆల్కహాల్ ప్రాబ్లమ్. దాంతో పదిహేడేళ్లకే నేను ఇంట్లోంచి బయటకు వచ్చేశా. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నా. పదేళ్ల నుంచి ఒంటరిగా ఉండటం వల్లేమో బిగ్బాస్ హౌజ్లో ఎలా నడుచుకోవాలో తెలీలేదు. చుట్టూ కెమెరాలున్నాయి అనే ధ్యాస లేకుండా నా స్వభావానికి తగ్గట్టే బిహేవ్ చేశాను. హౌజ్లోకి ఎంటర్ అవగానే అందరితో కలిసిపోయా. కాని అదే తప్పని తర్వాత తెలిసింది. నాకు కన్నింగ్గా ఉండటం రాదు. టీవీలో అందరూ చూస్తుంటారు అన్న స్పృహ లేకుండా పక్కనున్న మనిషి గురించి హౌజ్లో కొంతమంది ఏదిపడితే అది మాట్లాడుతుంటే చాలా కోపం వచ్చేది. దాంతో అరిచేశా. ఒకసారి నానీ నన్ను తిట్టాడు.. చాలా బాధనిపించిఏడ్చాను కూడా. ఫోన్ వెదుక్కున్నా.. ఫోన్, టీవీ, ఫ్రెండ్స్ .. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా.. లిమిటెడ్ సోర్సెస్తో.. పగలు, రాత్రి తేడా తెలియకుండా.. సగం ఆకలి, సగం నిద్రతో హౌజ్లో గడపడం.. యు కాంట్ ఇమాజిన్. అయినా ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఏం జరిగినా వెంటనే ఫోన్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం అలవాటు కదా. ఆ అలవాటుతోనే ఫస్ట్ టూ డేస్ ఫోన్ కోసం చాలా వెదుక్కున్నా. తర్వాత గుర్తుచేసుకుంటే నవ్వొచ్చేది. అప్పటిదాకా మా ఇంట్లో నేను చేయని పనులన్నీ హౌజ్లో చేశాను. బట్టలు ఉతికాను. వంట చేశాను. నా వంటలను అందరూ మెచ్చుకున్నారు. తెలుగులో పొలైట్గా ఎలా మాట్లాడాలో హౌజ్లోనే తెలుసుకున్నా. ప్రాబ్లం వస్తే అందరూ కలిసి ఎలా సాల్వ్ చేసుకోవాలి? పదిమందితో ఎలా సర్దుకుపోవాలి? ఎక్కడ తగ్గాలి? ఎక్కడ నెగ్గాలి? పట్టూవిడుపులు అన్నీ నేర్చుకున్నా. సామ్రాట్.. ట్రోలింగ్.. నిజానికి సామ్రాట్ నాకు ఎనిమిదేళ్ల కిందటే పరిచయం. కామన్ ఫ్రెండ్స్ ద్వారా. అంత క్లోజ్ కాదు అప్పుడు. అసలు సామ్రాట్కి పెళ్లి అయిందని, అది ప్రాబ్లమ్లో ఉందని హౌజ్లో అతనితో మాట్లాడుతుంటేనే తెలిసింది. సామ్రాట్ చాలా జోవియల్గా ఉంటాడు.ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. దాంతో అతనితో కనెక్ట్ అయ్యా. క్లోజ్ ఫ్రెండ్గా మారాడు. అంతమాత్రాన నన్ను ట్రోల్ చేయడమేనా? మైగాడ్ నా క్యారెక్ట్నే అసాసినేట్ చేసేలా బూతులు..! ఒక అమ్మాయి.. ఒక అబ్బాయితో ఎమోషనల్గా అటాచ్ కావడం తప్పా? అది కంప్లీట్ పర్సనల్ థింగ్! నేను ఎవరితో మాట్లాడాలి? నా ఫ్రెండ్స్లిస్ట్లో ఎవరుండాలి? ఎవరితో ఎంత మేరకు స్నేహం చేయాలి.. ట్రోలర్స్ డిసైడ్ చేస్తారా? నా పర్సనల్ స్పేస్ నాకు ఉండదా? హౌజ్లో ఉన్నప్పుడు ఏమీ తెలియలేదు. బయటకు వచ్చాక తెలిసింది. ట్రోలింగ్స్ చాలా ఫ్రస్టేట్ అయ్యా. కుంగిపోయా. అయితే నన్ను ఎంకరేజ్ చేస్తూ కూడా అంతకన్నా ఎక్కువ పోస్టింగ్స్వచ్చాయి. ‘‘తేజా.. నువ్వు లేని బిగ్ బాస్ చూడాలనిపించట్లేదు. నువ్వు మా ఇంట్లో అమ్మాయిలా అనిపిస్తావ్.. బ్లెస్ యూ.. వుయ్ లవ్ యూ’’అంటూ చాలా కాంప్లిమెంట్స్.. యూకే, యూఎస్ నుంచి. ఇక్కడి వాళ్లూ చాలామంది మోరల్గా సపోర్ట్ చేస్తూ మెస్సేజెస్ పెట్టారు. వాటితోనే తేరుకున్నా. ట్రోలింగ్స్ను పట్టించుకోవడం మానేశా. ఇప్పుడు.. నేనే ధైర్యం చెప్పే స్థితిలో ఉన్నా. కొంతమందైతే సామ్రాట్తో పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. ఒక మనిషితో ఉన్న క్లోజ్నెస్ను పెళ్లితో ముడిపెడతారా? వండర్! సామ్రాట్ నాకు మంచి ఫ్రెండ్ ఎప్పటికీ. డౌటే లేదు. హౌజ్ మేట్స్ తనీష్, బాబుగోగినేని గారు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. లైఫ్ పట్ల బాబుగోగినేని గారికి ఎలాంటి అభిప్రాయాలున్నాయో నాకూ అలాంటివే ఉన్నాయి. నేను ఆయనకు అభిమానినైపోయా. తనీష్కు కోపం ఎక్కువ. దాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చేసుకున్నాడు. వాళ్లమ్మ చాలా టెన్షన్ పడ్తుంటే నేను చెప్తున్నా.. డోంట్ వర్రీ ఆంటీ అని. బాబుగోగినేని గారిలాగే వాళ్లావిడ కూడా చాలా స్మార్ట్ (నవ్వుతూ) ఆవిడ, వాళ్ల బాబు చాలా కూల్గా, కాన్ఫిడెంట్గా ఉన్నారు. హౌజ్లో ఉన్న వాళ్లందరికీ కెమెరా ముందు ఎలా ఉండాలో తెలిసిపోయింది. అందుకే అందరూ యాక్షన్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తున్నారు. ఎదిగిన ఫీలింగ్ బిగ్ బాస్ హౌజ్లో చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మళ్లీ వెళ్లే అవకాశం వస్తే వెళ్తా. ఈ ఎక్స్పీరియెన్స్తో హౌజ్లో బాగా ఓవరాక్షన్ చేస్తా. నా విషయంలో నా ఫ్రెండ్స్ చాలా సపోర్టివ్గా ఉంటారు. నేనేంటో వాళ్లకు తెలుసు. ‘‘ షోలో గెలిచొస్తావని పంపిస్తే..ఇలా వచ్చేశావ్’’ అని ఆటపట్టిస్తుంటారు. బేసిగ్గా నేను కొంచెం లౌడ్గా ఉంటా. ఒంటరిపోరాటమే కాబట్టి..అలా అలవాటైంది. పైగా మేల్డామినేటెడ్ సొసైటీ.. మేల్డామినేటెడ్ ఫీల్డ్.. లౌడ్గా లేకపోతే అంతే సంగతి. మొదటి నుంచే స్ట్రాంగే.. బిగ్ బాస్ హౌజ్, ట్రోలింగ్స్ లాంటి అనుభవాలు నన్ను ఇంకా స్ట్రాంగ్ చేశాయి. ఎదిగిన ఫీలింగ్. ఇది కరెక్ట్ .. ఇది రాంగ్ అని నాకు ఎవరూ చెప్పలేదు. సిట్యుయేషన్సే అన్నీ నేర్పాయి. కాబట్టి అవే నాకు పేరెంట్స్. ఫ్రెండ్సే నాకు అన్నీ. డాన్స్ అండ్ వర్క్తో నా లోన్లీనెస్ను ఓవర్కమ్ చేసుకుంటా. నా వెంట నిలిచిన వాళ్లందరికీ థ్యాంక్స్. ఫ్యూచర్ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వస్తే అన్నీ చేశాను. ఇప్పుడు నెట్ఫ్లిక్స్.. ఇంకా అలాంటి చానల్స్కు ట్రావెల్ షో చేయాలనే థింకింగ్ ప్రాసెస్లోఉన్నా. తమిళ్, తెలుగు సినిమా చాన్సెసూ కొన్ని ఉన్నాయి. కథలు వింటున్నా’’ అని తన ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నారు తేజస్వి.. బిగ్బాస్ స్టార్. చూపిస్తున్నది కొన్నే హౌజ్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. 24 గంటలూ కెమెరాల ముందే కదా.. అంతా టెలికాస్ట్ అవుతుందేమో అనుకుంటాం. కాని కావట్లేదు. నా విషయమే తీసుకుంటే.. నేను అరిచినవి మాత్రమే చూపించారు. దానికిముందు కౌశల్ చేసినవి చూపించలేదు. కౌశల్ చేసిన వాటికి కోపమొచ్చి నేనలా అరిచా. అదే హైలైట్ అయింది. సామ్రాట్ విషయంలోనూ అంతే. ముందూవెనకా చూపించకుండా.. జనాలు దేనికి ఎంటర్టైన్ అవుతారో దాన్నే చూపిస్తున్నారు. ఈవెన్ ప్రోమోస్ కూడా అంతే. దీని వల్లే చాలామంది స్క్రిప్టెడ్ షో అనుకుంటున్నారు. టీఆర్పీని దృష్టిలో పెట్టుకుని ఎడిట్ చేస్తున్నారు. 45 నిమిషాల ఎడిటెడ్ వెర్షన్లో అదే నిజమనుకుంటే ఎలా? దానికి ముందు ఏం జరిగిందో.. ఎవరు దేనికి.. ఎందుకు అలా రెస్పాండ్ అవుతున్నారో చూపించకుండా కేవలం రెస్పాన్సెస్నే చూపిస్తున్నారు. న్యాయంగా అనిపించట్లేదు. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలేవీ హౌజ్లో ఉన్నవాళ్లకు తెలియవు. బయటకు వస్తే కాని అర్థంకాదు జరుగుతున్నదేంటో! – శరాది -
బిగ్బాస్ : ఆ జంట వేరు కాబోతోంది!
బిగ్బాస్ ఇంట్లో ఆరోవారం సరద సరదాగా గడిచిపోయింది. ఇంటి సభ్యులంతా కలిసి నిర్మించిన సినిమాపై నాని రివ్యూ ఇచ్చారు. అందరి నటనపై రివ్యూపై ఇస్తూ... రేటింగ్ను ఇచ్చారు. ఇక ఈ వారంలో హైలెట్గా నిలిచిన అంశాలపై ఇంటి సభ్యులతో మాట్లాడారు నాని. అమిత్కు ఇచ్చిన సీక్రెట్ టాస్క్, గణేష్ నెత్తిన గుడ్డు పగలగొట్టడం , గణేష్ ఏడ్వడం.. దీప్తి, గణేష్లు నామినేషన్ గురించి చేసిన హంగామా.. నందిని, కౌషల్ మధ్య జరిగిన సంభాషణలపై నాని చర్చించారు. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తనీష్కు అభినందనలు తెలిపారు నాని. అయితే ఆరో వారం ఎలిమినేషన్ జాబితాలో ఉన్న దీప్తి, తనీష్లు ప్రొటెక్షన్ జోన్లో ఉన్నట్లు నాని ప్రకటించారు. ఇక మిగిలిన ఇద్దరి గురించి అందరికి తెలిసిందే. తేజస్వీ, సామ్రాట్ల జంట గురించి సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. తేజస్వీ చేసే చేష్టలతో విసిగి ఉన్న ప్రేక్షకులు ఆమెని పంపిస్తారో లేక తేజస్వీ చుట్టు తప్పా ఇంకేం పట్టదన్నట్లు ఉండే సామ్రాట్ను పంపిస్తారో చూడాలి. సోషల్ మీడియాలో మాత్రం తేజస్వీకి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. నెటిజన్లు తేజస్వీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేజస్వీ ప్రవర్తన, ఇంట్లో వీరిద్దరు చేసే అతిని చూడలేక ప్రేక్షకులు చివరికి వీరిద్దరిని విడదీయాలని ఫిక్స్ అయినట్టున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ను చూస్తే తేజస్వీ బయటకు వేళ్లే అవకాశమే ఎక్కువగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో... ఎందుకంటే బిగ్బాస్లో ఏమైనా జరుగొచ్చు. -
ధైర్యంగా...
మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో విజయ్ యెలకంటి దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ అండ్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్ ‘వైఫ్ ఆఫ్ రామ్’. సామ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్య పాత్రలు చేసిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై లక్ష్మీ మంచు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ నెల 20న చిత్రం విడుదల కానుంది. ‘‘ఓ ఎన్జీవోలో పని చేసే దీక్ష అనే యువతి భర్త హత్యకు గురవుతాడు. ఆ మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో దీక్ష ధైర్యంగా ఎదుర్కొన్న వింత, భయానక పరిస్థితుల నేపథ్యంలో కథనం సాగుతుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అన్నారు దర్శకుడు విజయ్. ‘‘మంచు లక్ష్మీ కెరీర్లో దీక్ష పాత్ర ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. రీసెంట్గా విడుదల చేసిన ట్రైలర్కు మంచి స్పందన లభించింది. దర్శకుడు రాజమౌళి ట్రైలర్ను మెచ్చుకోవడం హ్యాపీ. ఒట్టావా ఫిల్మ్ ఫెస్టివల్లో ౖ‘వెఫ్ ఆఫ్ రామ్’ చిత్రాన్ని సోషయల్లీ కాన్షియస్ థ్రిల్లర్గా పేర్కొన్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు రఘు దీక్షిత్ సంగీతం అందించారు. -
వైఫ్ ఆఫ్ రామ్కు అరుదైన గౌరవం
లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో దర్శకుడు విజయ్ యెలకంటి రూపొందించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘వైఫ్ ఆఫ్ రామ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం రిలీజ్ కాక ముందే అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. కెనడాలో జరగబోయే ఒట్టావా ఫిల్మ్ ఫెస్టివల్లో అఫీషియల్ స్క్రీనింగ్కు ఈ సినిమా ఎంపికైంది. జూన్ 13నుంచి జరగబోయే ఈ ఫెస్టివల్కు 2 డాక్యుమెంటరీలు, 9 ఫీచర్ ఫిల్మ్స్, 5 షార్ట్ ఫిల్మ్స్ ఎంపికయ్యాయి. వైఫ్ ఆఫ్ రామ్ రిలీజ్ అవ్వకముందే ‘సోషియల్లీ కాన్షియస్ థ్రిల్లర్’గా ఇందులో చోటు సంపాదించుకోవటం విశేషం. భర్తను చంపిన వాళ్లను ఛేదించే క్రమంలో ఓ యువతి ఎదుర్కొన్న వింత పరిస్థితులేంటి అన్నదే ఈ చిత్రకథ. సామ్రాట్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం రఘు దీక్షిత్. కెమెరా: సామల భార్గవ్. -
జైలు నుంచి విడుదలైన సామ్రాట్
-
నాగార్జున, సమంతలతో ఫొటోలు ఎలా దిగింది..?
సాక్షి, హైదరాబాద్ : భార్య ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్టు అయిన సినీ నటుడు సామ్రాట్ రెడ్డి బెయిల్పై విడుదలయ్యాడు. సామ్రాట్రెడ్డికి బుధవారం మియాపూర్లోని 25వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన గురువారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి విడుదల అయ్యాడు. ఈ సందర్బంగా సామ్రాట్ మీడియాతో మాట్లాడుతూ.. 'నా భార్యకు, నాకు మధ్య గొడవలకి కారణం మా అత్తమామలే.. నా పై వేధింపులు, దొంగతనం కేసు పెట్టారు. నా ఫ్రెండ్స్తో స్వలింగ సంపర్కం చేస్తున్నట్లు నాపై లేని నిందలు వేశారు. హర్షితా రెడ్డికి.. సినిమా వాళ్ళు అంటే ఇష్టం లేనప్పుడు పార్టీలకు ఎందుకు వచ్చింది..? నాగార్జున, సమంతలతో ఫొటోలు ఎలా దిగింది..? ఇంట్లో ఉన్న నా వస్తువులు తెచ్చుకుంటే నేను దొంగతనం చేశానని కేసు పెట్టి జైలుకి పంపారు. నేను డ్రగ్స్ తీసుకుంటాననేది ఆరోపణ మాత్రమే.. అందులో ఎంత మాత్రం నిజంలేదు. పార్టీలకు వెళ్లినప్పుడు హుక్కా మాత్రమే తీసుకుంటాను. వేరే అమ్మాయిలతో నాకు ఎఫైర్స్ ఉన్నాయంటున్నారు.. మరో పక్క'గే' అంటున్నారు.. నేను ఆరోపణలు చేయాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. నన్ను జైలుకి పంపించిన తరువాత.. హర్షిత రెడ్డితో కాపురం చేయలేను' అని తెలిపారు. కాగా తన ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారని స్వయంగా అతడి భార్య హర్షితా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు సామ్రాట్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతడిని మియాపూర్ కోర్టులో పోలీసులు హాజరు పర్చారు.14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశాల జారీ చేశారు. అతనికి బెయిల్ మంజూరుచేయాలని సామ్రాట్రెడ్డి తరపున న్యాయవాదులు మంగళవారమే పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న న్యాయమూర్తి వరూధిని కండిషనల్ బెయిల్ మంజూరు చేశారు. ఇద్దరు వ్యక్తులు రూ.25 వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ప్రతి శనివారం సామ్రాట్రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో హజరు కావాలని ఆదేశించారు. -
సామ్రాట్ రెడ్డికి కండిషనల్ బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు సామ్రాట్రెడ్డికి కండిషనల్ బెయిల్ మంజూరైంది. భార్య హర్షితారెడ్డి మోపిన దొంగతనం కేసులో అరెస్ట్ అయిన సామ్రాట్రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ విషయంపై బుధవారం మియాపూర్లోని 25వ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి వరూధిని కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు వ్యక్తులు రూ.25 వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ప్రతి శనివారం సామ్రాట్రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో హజరు కావాలని ఆదేశించారు. -
సామ్రాట్ టార్చర్ పెట్టేవాడు
-
భార్య ఇంట్లో చోరీ: నటుడి అరెస్ట్, జైలుకి తరలింపు
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. తన ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారని స్వయంగా అతడి భార్య హర్షితా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు సామ్రాట్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతడిని మియాపూర్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు.14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశాల జారీ చేశారు. మరోపక్క తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సామ్రాట్ దాఖలు చేసుకున్న పిటిషన్పై కోర్టు నిర్ణయం బుధవారానికి వాయిదా పడింది. దాంతో సామ్రాట్ను పోలీసులు జైలుకు తరలించారు. తన భర్త సామ్రాట్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ గతంలో హర్షితారెడ్డి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో తన ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారు, ఇతర వస్తువుల్ని చోరీ చేశారనే ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు సామ్రాట్పై ఐపీసీలోని 380,427ఆర్/డబ్ల్యూ, 201 సెక్షన్ల కింద కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. అలా చేయడం తప్పే: సామ్రాట్ తనపై వస్తున్న ఆరోపణలను టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డి ఖండించాడు. తన భార్య హర్షిత రెడ్డి, వాళ్ల కుటుంబీకులు చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమని అతడు పేర్కొన్నాడు. ఇంటి నుంచి డబ్బులు, నగలు దొంగిలించానని హర్షిత ఆరోపిస్తూ కేసు పెట్టిందని, అయితే తన ఇంట్లో నుంచి తనకు కావల్సిన వస్తువులు మాత్రమే తీసుకున్నట్లు సామ్రాట్ రెడ్డి తెలిపాడు. ఇంట్లో సీసీ కెమెరాలను తానే ధ్వంసం చేసినట్లు అతడు అంగీకరించాడు. కోపంతోనే అలా చేశానని, అది తన తప్పేనంటూ...అయితే తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని సామ్రాట్ రెడ్డి స్పష్టం చేశాడు. తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారని, అలా అయితే తాను ఇప్పటివరకూ పోలీసులకు ఎందుకు పట్టుబడలేదని ప్రశ్నించాడు. డ్రగ్స్ వాడకంపై పోలీస్ శాఖ సీరియస్గానే ఉందని చెప్పుకొచ్చాడు. కావాలనే తనపై హర్షితా రెడ్డి కుటుంబీకులు ఆరోపణలు చేస్తున్నారని సామ్రాట్ రెడ్డి వాపోయాడు. హర్షితకు సామ్రాట్పై అనుమానం.. సామ్రాట్ ఎవరితో మాట్లాడినా హర్షిత అనుమానపడేదని సామ్రాట్ తల్లి తెలిపారు. హర్షితకు మొదటి నుంచి సామ్రాట్ సినిమాలు చేయడం ఇష్టం లేదని తెలిపారు. ప్రతిదానికీ హర్షిత గొడవ పెట్టుకునేందని చెప్పారు. రెండేళ్ల క్రితం సామ్రాట్, హర్షితకు పెళ్లి అయిందని, మూడు నెలల నుంచి భార్యభర్తల మధ్య గొడవులు జరుగుతున్నాయని తెలిపారు. సామ్రాట్కు లేని అలవాటు లేదు: హర్షిత మరోవైపు సామ్రాట్ రెడ్డి భార్య హర్షిత మాట్లాడుతూ... సామ్రాట్కు అన్ని అలవాట్లు ఉన్నాయని, హుక్కా సెంటర్లో డ్రగ్స్ కూడా తీసుకున్నాడని తెలిపింది. ‘సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలతో సామ్రాట్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎంత నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. నన్ను వదిలించుకోవాలని అని చూడటమే కాకుండా చాలాసార్లు నాపై దాడి చేశాడు. మా ఇంట్లో వస్తువులు కూడా ఎత్తుకెళ్లాడు. తనతో కలిసి ఉండే ఉద్దేశం నాకు లేదు. పెద్దలతో రాజీ ప్రయత్నం చేసినప్పటికీ విఫలం కావడంతోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. కోర్టులోనే అన్ని విషయాలు తెలుస్తాయి.’ అని ఆమె పేర్కొంది. -
సామ్రాట్ సైకోలా ప్రవర్తించేవాడు : హర్షితా రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : చీటికిమాటికి చిరాకు పడుతూ, చేతికిదొరికిన వస్తువులతో కొడుతూ, నోటికొచ్చినట్లు తిడుతూ సామ్రాట్ టార్చర్ పెట్టేవాడని భార్య హర్షితా రెడ్డి చెప్పారు. ఇకనైనా మరతాడని ఎంతోకాలం ఓపికపట్టానని, బాధ భరింలేని స్థితిలో బయటికి వచ్చానని అన్నారు. తన భర్త, టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డిపై కేసులు పెట్టిన హర్షిత.. మంగళవారం మాదాపూర్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘రెండేళ్లు నరకం అనుభవించా :సామ్రాట్తో నా వివాహం జరిగి రెండేళ్లైంది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే అదనపు కట్నం గురించి గొడవలు మొదలుపెట్టారు. అస్తమానం డబ్బులు, నగలు కావాలని అడిగేవాళ్లు. సామ్రాట్ నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నా వాళ్లమ్మ అడ్డు చెప్పకపోయేది. ఫ్యామిలీమెంబర్స్ ముందే నన్ను ఎన్నోసార్లు కొట్టేవాడు. చేతికి ఏది దొరికితే దాన్ని విసిరేసేవాడు. కుర్చీలు, సోఫాలను ఎత్తిపడేసేవాడు. ఇంత జరుగుతున్నా అతనిది తప్పని చెప్పేవాళ్లేలేరు. నా పేరుమీదున్న ఆస్తుల్ని అతనికి రాసివ్వకుంటే బ్రేకప్ అవుతానని బెదిరించేవాడు. సామ్రాట్ కుటుంబం ఒక దశలో నన్ను చంపడానికి కూడా ప్రయత్నించారు. పరిస్థితి దారుణంగా మారడంతో మా ఇంట్లోవాళ్లకు చెప్పాను. అలా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో వాళ్లపై కేసు పెట్టాం. కౌన్సిలింగ్ తర్వాత.. నన్ను మాదాపూర్లోని వేరే ఇంట్లో ఉంచాడు. ఎప్పుడోగానీ ఇంటికి వచ్చేవాడుకాదు, వచ్చినా తిట్టి,కొట్టి వెళ్లేవాడు.. డ్రగ్స్, హుక్కా అతని రెగ్యులర్ హ్యాబిట్స్ : అందరిముందు మంచివాడిలా నటించే సామ్రాట్.. నాతో మాత్రం అంత సైకిక్గా ఎలా బిహేవ్ చేసేవాడో మొదట్లో అర్థంకాలేదు. తర్వాత తెలిసిందేమంటే.. అతనికి లేని చెడు అలవాటులేదు. రెగ్యులర్గా హుక్కా సెంటర్లకు వెళతాడు. నాకు ఇష్టంలేదని చెప్పినా బలవంతంగా ఓ హుక్కా సెంటర్కు తీసుకెళ్లాడు. ఆ వాసనకు ఊపిరాడక నేను బయటికొచ్చేశాను. సామ్రాట్కు డ్రగ్స్ కూడా అలవాటుంది. పెద్ద వుమనైజర్. నా పక్కన కూర్చొనే వేరే అమ్మాయిలను ఫ్లర్ట్ చేసేవాడు. మొత్తంగా ఆయన స్వేచ్ఛకు నేను అడ్డుగా ఉన్నాను కాబట్టి, అగిడినట్లు ఆస్తులు రాసివ్వలేదు కాబట్టి నన్ను చంపడం లేదా వదిలించుకోవాలని అతను భావించాడు. ఆధారాలు లేకుండా చేద్దామనుకున్నాడు : నా సేఫ్టీ కోసమని ఇప్పుడుంటున్న ఇంటి బయట మా వాళ్లు సీసీటీవీ కెమెరాలు పెట్టించారు. సామ్రాట్ ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు వెళ్లేది అంతా రికార్డయింది. నన్ను వదిలించుకోవాలని పూర్తిగా నిర్ణయించుకున్నాడు కాబట్టే.. నా ఇంట్లో అతనికి సంబంధించిన ఆధారాలను చెరిపేద్దామనుకున్నాడు. నేను ఇంట్లో లేనప్పుడు వాళ్ల అక్కతో కలిసి వచ్చి.. సీసీటీవీ రికార్డులను, అతని వస్తువులను తీసుకొని వెళ్లిపోయాడు. పెళ్లన్నా, భార్యన్నా ఏమాత్రం బాధ్యతలేని వ్యక్తి నుంచి నన్ను కాపాడేది ఎవరు, అందుకే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించా’’ అని హర్షితా రెడ్డి చెప్పారు. మనం ఏ జనరేషన్లో ఉన్నాం? : మీడియాతో మాట్లాడుతూ హర్షితా రెడ్డి పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యారు. ‘పిల్లలు ఇలా ఎందుకు తయారవుతున్నారో తల్లిదండ్రులు పట్టించుకోరా? ఎల్లకాలం భరించడానికి నేను బొమ్మనా? మగపిల్లల్ని ప్రాపర్గా ఎడ్యుకేట్ చెయ్యడం పేరెంట్స్ బాధ్యత కాదా? అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో దయచేసి మగపిల్లలకు పిల్లలకు నేర్పించండి.. ఒకవేళ వాళ్లు మాట వినకుంటే దండించండి. మనం ఏ జనరేషన్లో ఉన్నామో కాస్త ఆలోచించండి..’ అంటూ హర్షితా కన్నీటిపర్యంతమయ్యారు. సామ్రాట్ గే! : హీరో సామ్రాట్కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు హర్షిత తండ్రి మధుసూదన్. ‘‘పెళ్లికి ముందు మాకు చాలా అబద్ధాలు చెప్పారు. సినిమాలు మానేశాడని, బిజినెస్ చేస్తున్నాడని, త్వరలో ఓ హోటల్ కూడా కట్టాలనుకుంటున్నాడని మధ్యవర్తి చెప్పాడు. తర్వాత తెలిసిందేమంటే సామ్రాట్ గే అని! నా కూతురిని ఏనాడూ సంతోషపర్చలేదు. ఆస్తుల్ని తన పేరున రాయలని కొట్టేవాడు. చాలా కాలంపాటు ఈ విషయాలేవీ మా అమ్మాయి చెప్పలేదు. చివరికి ఒకసారి తలదిండుతో హర్షితను చంపాలని చూశారు. సడన్గా పనిమనిషి రావడంతో నా కూతురు ఆ గండం నుంచి బయటపడింది’’ అని మధుసూదన్ తెలిపారు. -
పోలీసుల అదుపులో సినీనటుడు సామ్రాట్