senior
-
పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి.. మూడు నెలలకు ట్విస్ట్!
నాకు పెళ్ళయి 3 నెలలు అవుతోంది. నా భార్య బాగా చదువుకుంది. ఉద్యోగం చేస్తుంది. పెళ్ళి చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు అని ఇద్దరం ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళి సమయంలో మా అత్త, మామ వాళ్ళు ఇష్టపూర్వకంగానే నాకు కొంత కట్నం కూడా ఇచ్చారు. పెళ్ళైన ఒక నెల వరకూ చాలా బాగుంది. కానీ అంతలోనే బాగా మారిపోయింది. ప్రతిదానికి అలక, ఏ విషయాన్నైనా సాగదీయడం, నా జీతం నీకు ఇవ్వను, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాననడం, మా అమ్మానాన్నకు డబ్బులు ఇవ్వొద్దు అనడం, వాళ్ళు మన ఇంట్లో ఉండకూడదు అని తరచూ గొడవలు చేయడం, గొడవ అయిన ప్రతిసారి తన కట్నం డబ్బులు తనకు ఇచ్చేయమని రచ్చ చేస్తుంది. గంటలు గంటలు మేకప్ వేసుకోవడం, తయారయి ఫోటోలు దిగడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, తెలియని వాళ్ళతో కూడా గంటలు గంటలు చాటింగ్ చేయడం... వద్దంటే ఏడుస్తోంది. తల గోడకేసి కొట్టుకుంటుంది. మమ్మల్ని బెదిరించడం కోసం తనకు తానే చిన్న చిన్న గాయాలు చేసుకుంటుంది. నేను తనతో ఎంతోమంచి జీవితాన్ని ఊహించుకున్నాను. నా కలల ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నన్ను ఈ సమస్య నుంచి బయటకు తీసుకువచ్చే సలహా ఇవ్వగలరు.– ఆదినారాయణ, హైదరాబాద్ముందుగా మీరు ఒక విషయం గ్రహించాలి. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించరు. అలాగే కలహాలు లేని కాపురాలు కూడా ఉండవు. తల్లిదండ్రుల నుండి వచ్చే వారసత్వ లక్షణాలు, పెరిగిన వాతావరణం ఒక మనిషి వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అతిగా అలగడం, మొండితనం, ఓర్వలేనితనం, తరచు మానసిక సంయమనం కోల్పోవడం, విపరీతమైన కోపం, తమని తాము గాయపరచుకోవడం అనేవి సాధారణంగా ‘బార్డర్లైన్ పర్సనాలిటీ’ అనే ఒక ప్రత్యేకమైన మనస్తత్వం ఉన్న వాళ్ళలో చూస్తాం. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఇతరులతో అంత సులభంగా సర్దుకుపోలేరు. తమ చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో ఒకరకంగా కంట్రోల్ చేయాలని అనుకుంటారు. మీ అత్తమామల సహాయం తీసుకుని మీ భార్యాభర్తలిద్దరూ, మంచి సైకియాట్రిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్ని సంప్రదించండి. మీ ఇద్దరితో వివరంగా మాట్లాడి అవసరమైన సలహాలు, సూచనలు మానసిక వైద్యులు అందిస్తారు. ఆమె మనస్తత్వాన్ని ముందు మీరు అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తన పరిస్థితి గురించి మీకు అవగాహన వస్తే, తనతో ఎలా మసులుకోవాలో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీరూ మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి మీరు కూడా కౌన్సెలింగ్ తీసుకుంటే మంచిది. మీరు తొందరపడి ఎలాంటి తీవ్ర నిర్ణయమూ తీసుకోకండి. మీ బంధాన్ని తెంచుకోవటం సులభం కావచ్చు. దాన్ని జాగ్రత్తగా పదికాలాల పాటు నిలబెట్టుకోవాలంటే ఇరువైపుల నుండి కొంత సర్దుబాటు, సహనం, నిరీక్షణ, త్యాగం అవసరం. మీరు విడాకులు తీసుకున్నా ఇంతకంటే మంచి జీవిత భాగస్వామి దొరుకుతుందన్న గ్యారెంటీ కూడా ఉండకపోవచ్చు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
Senior NTR Unseen And Rare Photos : అన్న గుండె ఆగిన రోజు (ఫొటోలు)
-
Actress Prabha Son Marriage: టాలీవుడ్ సీనియర్ నటి ప్రభ కుమారుడి పెళ్లి.. హాజరైన మెగాస్టార్ (ఫొటోలు)
-
TCS: టీసీఎస్లో మరో పరిణామం.. వైదొలిగిన ఎస్వీపీ
దేశీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో మరో పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీనానాథ్ ఖోల్కర్ పదవి నుంచి వైదొలిగారు. కంపెనీ అనుబంధ విభాగాలకు గ్లోబల్ హెడ్గా ఉన్న ఆయన 34 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత సంస్థను విడిచిపెట్టారు. ఖోల్కర్ స్థానంలో రాజీవ్ రాయ్ను టీసీఎస్ నియమించింది. దీనానాథ్ ఖోల్కర్ 1996లో టీసీఎస్లో డేటా వేర్హౌసింగ్, డేటా మైనింగ్ గ్రూప్ను ప్రారంభించారు. తర్వాత అది బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్రాక్టీస్గా మారింది. తన సుదీర్ఘ అనుభవంలో ఆయన టీసీఎస్ ఈసర్వ్ సీఈవో, ఎండీగా, బీఎఫ్ఎస్ఐ బీపీవో హెడ్గా ఎదిగారు. 2017-22 కాలంలో అనలిటిక్స్, ఇన్సైట్స్ గ్లోబల్ హెడ్గా పనిచేశారు. “నా కెరీర్లో పరిశ్రమలోని అద్భుతమైన నాయకులు, నిపుణులతో, అలాగే టీసీఎస్లో మా భాగస్వాములు, మా కస్టమర్లు, అనేక మంది సభ్యులతో కలిసి పని చేయడం నా అదృష్టం. నేను పనిచేసిన ప్రతి బృందం ప్రత్యేకమైనది. అనేక గొప్ప జ్ఞాపకాలను మిగిల్చింది” అని దీనానాథ్ ఖోల్కర్ తన లింక్డ్ఇన్ పోస్ట్లో పేర్కొన్నారు. -
‘లాయర్ల సీనియర్ హోదా’ అంటే ఏమిటి? నిబంధనలు, అర్హతలు ఏవి?
న్యాయవాదుల హోదా విషయమై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లాయర్ల సుదీర్ఘకాల డిమాండ్కు ముగింపు లభించింది. ఈ విషయంపై గతంలో పిటిషన్ దాఖలైంది. లాయర్కు సీనియర్ పోస్టు ఇవ్వడాన్ని అన్యాయమని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ను కోర్టు తిరస్కరించినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కోర్టు అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023, అక్టోబర్ 19న మొత్తం 535 మంది న్యాయవాదులకు సీనియర్ న్యాయవాది హోదా కల్పించారు. ఇంతకీ సీనియర్ న్యాయవాది అని ఎవరిని పిలుస్తారు? ఇందుకుగల అర్హతలు, నిబంధనలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అడ్వకేట్ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం న్యాయవాదులు రెండు తరగతులకు చెందినవారై ఉంటారు. మొదటిది సీనియర్ న్యాయవాది. రెండవ ఇతర న్యాయవాది. ఒక న్యాయవాది సీనియర్ కావాలనుకుంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఆ హోదాను అందించవచ్చు. సెక్షన్ 23 (5) ప్రకారం కేసును దాఖలు చేసే హక్కు సీనియర్ న్యాయవాదులకు ఉండదు. వారు ఆయా కేసులను పరిష్కరించడమో లేదా కేసును క్రాస్ ఎగ్జామిన్ చేయడమో చేస్తారు. సాధారణ న్యాయవాదులతో పోలిస్తే సీనియర్ న్యాయవాది కేసు దాఖలు చేసే అధికారాన్ని కోల్పోతాడని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సందీప్ మిశ్రా మీడియాకు తెలిపారు. అయితే పలు కేసుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కోర్టు ఈ లాయర్ల నుంచి సలహాలు తీసుకుంటుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సందీప్ మిశ్రాను సీనియర్ లాయర్ హోదా పొందేందుకు వయసుకు సంబంధించిన ప్రమాణాలు ఉంటాయా అని అడగా, దీనికి వయోపరిమితి లేదని బదులిచ్చారు. అయితే ఆ న్యాయవాది ఎన్ని కేసులలో వాదించాడు? అవి ఎలాంటి కేసులు, కేసులలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనే విషయాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. సీనియర్ హోదా పొందడానికి ముందుగా ఎవరైనా న్యాయవాది హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వారి దరఖాస్తులను పరిశీలించి, జాబితాను విడుదల చేస్తారు. తాజాగా 535 మంది న్యాయవాదులకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల హోదా కల్పించింది. కోర్టు వారికి ప్రాధాన్యత ఇస్తుంది. ఏదైనా సందర్భంలో వారి సలహా తీసుకుంటుంది. ఇది కూడా చదవండి: ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ అంటే ఏమిటి? సూర్యుని కన్నా ఎంత శక్తివంతమైనది? -
47 మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులకు సీనియర్ హోదా
సాక్షి, న్యూఢిల్లీ: 47 మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులకు సీనియర్ హోదా ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. వీరిలో తొమ్మిది మంది హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులున్నారు. ఈ నెల 16న జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ 47 మంది మాజీ న్యాయమూర్తుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల నుంచి ఏడుగురు ఉన్నారు. సీనియర్ హోదా పొందిన వారిలో తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ రెడ్డి కాంతారావు, జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్, జస్టిస్ అనుగు సంతోష్ రెడ్డి, జస్టిస్ డాక్టర్ అడ్డుల వెంకటేశ్వర రెడ్డి సీనియర్ హో దా పొందారు. అలాగే, ఏపీ హైకోర్టు మాజీ తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ వి.ఈశ్వ రయ్య, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, మాజీ న్యాయ మూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఉన్నారు. -
చెస్ ఆడుతూ సీనియర్ క్రీడాకారుడి మృతి
హైదరాబాద్: చెస్ ఆడుతూ సీనియర్ క్రీడాకారుడు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్ర, శని, ఆదివారాల్లో స్లాన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలకు దాదాపు 15 రాష్ట్రాలకు చెందిన 700 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. కాగా శనివారం మధ్యాహ్నం అంబర్పేట, 6వ నెంబర్ సర్కిల్ సాయిమిత్ర ఎస్టేట్స్లో నివాసం ఉంటున్న సీనియర్ చెస్ క్రీడాకారులు వి.ఎస్.టి.సాయి (72) కూడా క్రీడను కొనసాగిస్తున్నారు. ఐదవ రౌండ్లో ఉండగా ఒక్కసారిగా గుండెలో నొప్పి వచ్చి పడిపోయాడు. హుటాహుటిన స్లాన్ సంస్థ సిబ్బంది, ఆడిటోరియం సెక్యూనిటీ అంబులెన్స్ను పిలిపించి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాయి మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈయనకు భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. ఎల్ఐసీలో అధికారిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. చెస్ అంటే ప్రాణంగా భావించేవారు. ఎక్కడ టోరీ్నలు జరిగినా తప్పకుండా హాజరయ్యేవారని చెస్ క్రీడాకారులు తెలియజేశారు. నగరానికి చెందిన పలువురు సీనియర్ చెస్ ప్లేయర్లు ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. -
Viral Video: చెప్పినట్టు వినలేదని ఎన్సీసీ జూనియర్లపై సీనియర్ దురాగతం..
ముంబై: ముంబైకి సమీపంలోని థానేకు చెందిన ఓ కాలేజీలో ఓ సీనియర్ ఎన్సీసీ విద్యార్థి జూనియర్ క్యాడెట్లను కర్రతో చితక బాదుతోన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. జూనియర్లను అమానుషంగా కొడుతున్న ఈ వీడియోను చూసి అనేక మంది నెటిజన్లు సీరియస్ అవుతూ ఆ సీనియర్ విద్యార్థిపైనా, కాలేజీ యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసున్నారు. ముంబైకు సమీపంలోని థానే బందొర్కర్ కాలేజీలో జోరువానలో ఓ సీనియర్ ఎన్సీసీ క్యాడెట్ అతను చెప్పిన టాస్క్ చేయలేదన్న నెపంతో ఎనిమిది మంది జూనియర్ క్యాడెట్లను వరుసగా తల బురదనీటిలో ఆనించి వీపు భాగాన్ని పైకి లేపమని కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దృశ్యాలను అక్కడి వారెవరో వీడియో తీసి వైరల్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్సీసీ క్యాడెట్లు అంటేనే క్రమశిక్షణకు మారు పేరు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రమశిక్షణతో కూడిన నడవడికతోపాటు సేవాతత్వాన్ని అలవాటు చేసే విశేష కార్యక్రమం ఎన్సీసీ. అనేక మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ మిగతా వారికి మార్గదర్శకంగా నిలుస్తూ ఉంటారు. అలాంటిది తమ కాలేజీలోని ఎన్సీసీ క్యాడెట్లు ఇంతటి దుశ్చర్యకు పాల్పడటంతో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ సుచిత్రా నాయక్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ సీనియర్ విద్యార్థి కూడా ఎన్సీసీ క్యాండిడేటే కాబట్టి అతనిపై తప్పక చర్య తీసుకుంటాము. మా కాలేజీలో 40 ఏళ్లుగా ఎన్సీసీ ట్రైనింగ్ నిర్వహిస్తున్నాము. కానీ ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదన్నారు. శిక్షకుడు లేని సమయంలో ఆ సంఘటన జరిగిందని మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనివారే అలా ప్రవర్తిస్తుంటారని ఆమె అన్నారు. ఇది కూడా చదవండి: సీఎం ‘కుర్చీ’లో అజిత్ పవార్.. -
కొత్త కోర్టులతో సత్వర న్యాయం అందాలి
విజయనగరం లీగల్: విజయనగరం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన న్యాయస్థానాల ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు అభిలషించారు. ఈ దిశగా న్యాయాధికారులు, న్యాయవాదులు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. విజయనగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో కొత్తగా మంజూరైన అదనపు సీనియర్ సివిల్ కోర్టుని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ దుప్పల వెంకటరమణ ప్రారంభించారు. న్యాయసేవా సదన్లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని జస్టిస్ ఏవీ శేషసాయి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువ న్యాయవాదులకు తగిన శిక్షణ ఇచ్చి మెరికల్లాంటి న్యాయవాదులను అందించాలని సీనియర్ న్యాయవాదులకు సూచించారు. న్యాయవాదులు, న్యాయాధికారులు పరస్పరం గౌరవించుకోవడం ద్వారా సమాజానికి మేలు చేయగలమన్నారు. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ జిల్లా కోర్టు భవన సముదాయాలకు రూ.99 కోట్లతో మంజూరైన కొత్త భవనాలను నాణ్యతగా నిరి్మంచేలా బార్ కౌన్సిల్, యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా జడ్జి బి.సాయి కళ్యాణచక్రవర్తి, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు తదితరులు పాల్గొన్నారు. -
Actress Manjula 10th Death Anniversary: సీనియర్ నటి మంజుల పదో వర్ధంతి (ఫొటోలు)
-
కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం
Cognizant appoints six women svps: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన కార్యనిర్వాహక బృం దంలో ఏకంగా ఆరుగురు మహిళల్ని ఎంపిక చేసింది. కార్పొరేట్ కంపెనీల్లో కీలక పదవుల్లో మహిళలకు చోటు దక్కడం లేదడం లేదన్న ఆందోళన క్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థానాల్లో ఆరుగురు మహిళలను నియమించినట్లు జూలై 19న తెలిపింది. (న్యూయార్క్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్: ప్రత్యేకతను చాటుకున్న నీతా అంబానీ) వీరిలో కొందరికి పదోన్నతి లభించగా, మరికొందరిగా కొత్తగా నియమించుకుంది.తద్వారా బలమైన, విభిన్నమైన సంస్థను నిర్మించడం కొనసాగిస్తోందనే ప్రశంసలు వెల్లు వెత్తాయి. 2023లో జనవరిలో కాగ్నిజెంట్ సీఈవోగా రవి కుమార్ నియామకం తరువాత జరిగిన ఈ పరిణామం ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపింది. మూడు కీలకమైన ఆవశ్యకాలపై దృష్టి సారించడంతో పాటు, నాయకత్వ స్థానాలతో సహా కాగ్నిజెంట్, విభిన్న ప్రతిభను పెంచడం తన ముఖ్య ప్రాధాన్యతలలో ఒకటి సీఈవో ప్రకటించారు ఈ సందర్భాన్ని సమిష్టిగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమని పేర్కొన్న రవికుమార్. వైవిధ్యాన్ని ప్రోత్సహించడం సిస్టమేటిగ్గా ఉండాలి. మహిళా నిపుణులను రిక్రూట్ చేయడం, అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం, నిమగ్నం చేయడం, నిలుపుకోవడం వంటి వాటితో తాము మొదలుపెట్టినట్టు చెప్పుకొచ్చారు. (ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!) శైలజా జోస్యుల కీలక స్థానాల్లో ఆరుగురు మహిళలు ♦ హైదరాబాద్లోని కంపెనీ సెంటర్ హెడ్ శైలజా జోస్యుల ఎస్వీపీగా ప్రమోషన్ లభించింది. 2018లో కాగ్నిజెంట్లో చేరిన శైలజా ఇప్పుడు ఉత్తర అమెరికాలోని వాణిజ్య మార్కెట్లతో పాటు గ్లోబల్ డెలివరీ కోసం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) పరిశ్రమకు SVP, ఇంట్యూటివ్ ఆపరేషన్స్ & ఆటోమేషన్ (IOA)గా ఉన్నారు. చెన్నై తర్వాత 56,000 మంది అసోసియేట్లతో కాగ్నిజెంట్కు హైదరాబాద్ రెండో అతిపెద్ద డెలివరీ కేంద్రం. ♦ 2021లో కాగ్నిజెంట్లో చేరిన ఎలిసా డి రోకా-సెర్రా, SVP, EMEA జనరల్ కౌన్సెల్ అండ్ కాంట్రాక్ట్ లైఫ్సైకిల్ రిస్క్ మేనేజ్మెంట్ (CLRM)గా పదోన్నతి పొందారు. ♦ 2020లో కాగ్నిజెంట్లో చేరిన థియా హేడెన్ ఇప్పుడు ఎస్వీపీ. గ్లోబల్ మార్కెటింగ్. కాగ్నిజెంట్ బ్రాండ్, డిజైన్ , సృజనాత్మక సేవలు, సోషల్ మీడియా, ఆలోచనా నాయకత్వం , రీసెర్చ్కుహేడెన్ బృందం బాధ్యత వహిస్తుంది. ♦ ప్యాట్రిసియా (ట్రిష్) హంటర్-డెన్నెహీ ఎస్వీపీ (హెల్త్కేర్ ప్రొవైడర్/పేయర్ బిజినెస్ యూనిట్)గా పదోన్నతి పొందారు. హెల్త్కేర్ డెలివరీతో సహా అమెరికాలో ఆరోగ్య సంరక్షణ మొత్తం నిర్వహణకు ఆమె టీంమద్దతు ఇస్తుంది. ట్రైజెట్టో కొనుగోలులో భాగంగా ట్రిష్ 2015లో కాగ్నిజెంట్లో చేరారు. ♦ 2020లో కాగ్నిజెంట్కు రిజైన్ చేసిన అర్చన రమణకుమార్ జూలై 5న SVP, ఇండస్ట్రీ సొల్యూషన్స్ గ్రూప్ (ISG)గా తిరిగి కాగ్నిజెంట్లో చేరారు. ♦ సాండ్రా నటార్డోనాటో జూలై 17న కాగ్నిజెంట్లో పార్టనర్షిప్ అండ్ అలయన్స్ ఎస్వీపీగా చేరారు. కాగ్నిజెంట్కు ముందు, నటార్డొనాటో గార్ట్నర్తో 15 సంవత్సరాలు సీనియర్ ఈక్విటీ విశ్లేషకురాలిగా గా వివిధ వృత్తిపరమైన సేవల సంస్థలతో 11 సంవత్సరాల అనుభవం ఉంది. -
ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్న అగ్రహీరోలు
-
అంబేద్కర్ విగ్రహ పనులను పరిశీలించిన స్పెషల్ సెక్రెటరీ శ్రీలక్ష్మి
-
జూనియర్పై సీనియర్ విద్యార్థుల దాడి
-
తెలంగాణ కాంగ్రెస్లో మళ్లీ ముసలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో మళ్లీ ముసలం మొదలైంది. ఆ పార్టీ అసంతృప్త నేతల అత్యవసర భేటీపై హై కమాండ్ సీరియస్ అయ్యింది. సమావేశాలు పెట్టి పార్టీని ఇబ్బందుల్లో నెట్టొందని ఏఐసీసీ హెచ్చరించింది. సమావేశం రద్దు చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది. సీనియర్లకు ఫోన్ చేసిన ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు.. సమస్య ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలన్నారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశం పెట్టి తీరతామని చెప్పిన సీనియర్ నేత వీహెచ్తో సహా అసంతృప్త నేతలంతా ఆదివారం హైదరాబాద్లోని హోటల్ అశోకలో భేటీ అయ్యారు. చదవండి: కేసీఆర్ మాటలు నమ్మొద్దు వీహెచ్పై చర్యలు! కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్)పై పార్టీ పరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి నివాసంలో కాంగ్రెస్ విధేయుల ఫోరం పేరుతో సమావేశమైన మరుసటి రోజున ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్తో కలిసి మంత్రి హరీశ్రావును కోకాపేటలోని ఆయన నివాసంలో వీహెచ్ కలిశారనే ఆరోపణలున్నాయి. ఇరువురు రెండు గంటలకు పైగా సమావేశమయ్యారని పార్టీ నాయకత్వానికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే హరీశ్ను కలిసిన విషయాన్ని గోప్యంగా ఉంచడపై టీపీసీసీ క్రమశిక్షణా సంఘం వీహెచ్కు షోకాజ్ నోటీసులు జారీచేసింది. దీంతోపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే సిఫారసు చేయనున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే, మాజీ ఎంపీ హోదాలో వీహెచ్ సస్పెన్షన్పై ఏఐసీసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని వ్యతిరేకిస్తున్న అసంతృప్త నేతలంతా ఆదివారం హైదరాబాద్లోని హోటల్ అశోకలో భేటీ అయ్యారు. -
కరోనా: మరో సీనియర్ వైద్యుడు కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి ఢిల్లీలోని మరో సీనియర్ వైద్యులు బలయ్యారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీనియర్ వైద్యుడు డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే (78) కోవిడ్-19తో శనివారం మరణించారు. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న ప్రీమియర్ ఆసుపత్రిలో పల్మనాలజీ విభాగానికి డైరెక్టర్, ప్రొఫెసర్గా ఆయన పనిచేశారు.ఎయిమ్స్ మెస్ వర్కర్ ఈ వ్యాధితో మరణించిన ఒక రోజు తర్వాత డాక్టర్ పాండే చనిపోయారు. పాండే మరణాన్ని ధృవీకరించిన మరో సీనియర్ వైద్యులు డాక్టర్ సంగితా రెడ్డి, పల్మోనాలజీలో ఆయన చేసిన కృషిని, సేవలను కొనియాడారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని ప్రకటిస్తూ ఆమె ట్వీట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరినా ఆర్పీసీ క్యాంటీన్ విభాగం నిరాకరించిందంటూ శుక్రవారం ఎయిమ్స్ డైరెక్టర్కు రాసిన లేఖలో తెలిపింది. తమ మాటలను పెడచెవిన పెట్టడం వల్లే మెస్ వర్కర్ చనిపోయాడని వాపోయారు. ఇంతలోనే మరో విషాదం చోటు చేసుకోవడం సిబ్బందిలో ఆందోళన రేపుతోంది. కాగా కరోనా ప్రభావానికి దేశంలో దెబ్బతిన్న రాష్ట్రాలలో ఢిల్లీ ఒకటి. దేశ రాజధానిలో ఇప్పటివరకు 12,319 కేసులు నమోదు కాగా, 208 మరణాలు సంభవించాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తరువాత దేశంలో అత్యధికంగా ప్రభావితమైన నాలుగవ రాష్ట్రం ఢిల్లీ. ప్రధానంగా వైద్యులు, నర్సులు వైరస్ బారిన పడటంతో, హిందూ రావు, బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ హాస్పిటల్, ఢిల్లీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వంటి ఆసుపత్రులకు సీలు వేయవలసి వచ్చిన సంగతి తెలిసిందే. (పోయిన ప్రాణం తిరిగొచ్చింది: పండ్ల వ్యాపారి) చదవండి : ఆర్బీఐకి చిదంబరం కీలక సలహా Deeply saddened to hear that today @covid19 claimed it's most illustrious victim Dr. J.N Pande Director & Prof of Pulmonology @aiims_newdelhi A stalwart of the medical world his work in pulmonology will continue to ensure better health for many My Condolences to his family🙏 pic.twitter.com/ByE83ikItS — Dr. Sangita Reddy (@drsangitareddy) May 23, 2020 -
‘సీనియర్ లాయర్’కి మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లోని న్యాయవాదులకు సీనియర్ హోదా కల్పించే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలను ప్రకటించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ‘‘కమిటీ ఫర్ డెజిగ్నేషన్ ఆఫ్ సీనియర్ అడ్వొకేట్స్’’పేరిట శాశ్వత కమిటీని ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ సీనియర్ న్యాయవాది హోదా కల్పించే అంశానికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు సీనియర్ జడ్జిలతోపాటు బార్ కౌన్సిల్కు ప్రాతినిధ్యం కల్పించాలని పేర్కొంది. న్యాయవాదుల చట్టం 1961లోని సెక్షన్ 16 ప్రకారం సీనియర్ న్యాయవాదిగా హోదా కల్పించే అధికారం సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు లేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తోసిపుచ్చింది. సరైన పద్ధతులను అనుసరించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయని, దీనిని కారణంగా చూపి సెక్షన్ 16ను తొలగించలేమని పేర్కొంది. సీనియర్ అడ్వొకేట్ ఇందిరా జైసింగ్తో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన నాలుగు పిటిషన్లను కొట్టేసింది. తీర్పులో సీనియర్ న్యాయవాదుల నియామకం సజావుగా సాగేందుకు 11 మార్గదర్శకాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేసే కమిటీలో సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల్లోని ఇద్దరు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులకు, అటార్నీ జనరల్ లేదా ఓ రాష్ట్రానికి చెందిన అడ్వొకేట్ జనరల్కు స్థానం కల్పించాలని పేర్కొంది. -
ఫైలు కదలాలంటే చేయి తడపాల్సిందే
రూ.3లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ లంచంతో పాటు అదనంగా 10 శాతం కమీషన్ రాజమహేంద్రవరం క్రైం : పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించేందుకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. భూములు , ఇళ్లు కోల్పోయి బాధలో ఉన్న రైతుల నుంచి రెవెన్యూ అధికారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. అమాయక గిరిజనులు చేసేది లేక బాధను దిగమింగుకొని లంచాలు ఇస్తున్నారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో స్పెషల్ డిఫ్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న డి.పుష్పమణి బ్రోకర్ల ద్వారా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు లంచం డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు మంగళవారం జీలుగు మిల్లి మండలం జిల్లెల గూడెం గ్రామానికి చెందిన గుజ్జు వీరమ్మకు చెందిన 8.18 ఎకరాలకు, రెండున్నర ఎకరాలకు భూమికి భూమి ఇస్తు, మిగిలిన 5.18 ఏకరాల భూమికి నష్టపరిహారం చెల్లించేందుకు రూ.11 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ లంచాన్ని మంగళవారం బ్రోకర్ ద్వారా డి.పుష్పమణి వద్ద డిఫ్యూటేషన్పై చేసిన ఒక అధికారి ప్రస్తుతం రాజమహేంద్రవరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మణికొండ వెంకటరమణప్రసాద్ ద్వారా రూ 3 లక్షలు తీసుకుంటుండగా ఏలూరు రేంజ్ ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ, రాజమహేంద్రవరం రేంజ్ డీఎస్పీ ఎం.సుధాకర్, ఇన్స్పెక్టర్ విల్సన్, ఎస్సై నరేష్లు ఆకస్మిక దాడులు చేసి రెడ్ హేండెడ్గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న అనంతరం ఫోన్లో సంభాషణ మంగళవారం మధ్యహానం లంచం తీసుకున్న మణికొండ వెంకట రమణ ప్రసాద్ రూ 3 లక్షలు లంచం తీసుకొని తన పై అధికారి అయిన డిఫ్యూటీ కలెక్టర్ గి. పుష్పమణికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఏసీబీ అధికారులు రమణ ప్రసాద్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎంత మందికి సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సమగ్రమంగా దర్యాప్తు చేసి దోషుల పై కేసులు నమోదు చేస్తాని ఏలూరు రేంజ్ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపారు. లంచంతో పాటు పరిహారంలో 10 శాతం కమీషన్ పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. నష్టపరిహారం మంజూరు అయి మూడేళ్లు కావస్తున్నా గిరిజన రైతులను కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిప్పుకుంటూ లంచాలు గుంజుతున్నారు. ట్రైబుల్ వెల్ఫేర్ డిఫ్యూటీ కలెక్టర్గా కేఆర్ పురంలో పనిచేస్తున్న డి.పుష్పమణి, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ1కు ఇన్చార్జి కలెక్టర్ గాను, తాడిపూడి ఎత్తిపోతల పథకం (నల్లజర్ల)ఇన్చార్జ్గాను వ్యవహరిస్తున్నారు. 16 నెలలుగా విధులు నిర్వహిస్తున్న డి.పుష్పమణి, బ్రోకర్లు ద్వారా లంచాల దందా నిర్వస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకూరి పేట, లోతుపాలెం శరభవరం, తదితర ప్రాంతాలలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ముందుగా లంచం ఎంత ఇవ్వాలి అనేది బేరం కుదుర్చుకుంటారు. ఇన్స్టాల్ మెంట్లో లంచం చెల్లించే వారి పేరున చెక్కులు ఇస్తుంటారు. నష్టపరిహారం చెల్లించకుండానే రైతుల నుంచి ఖాళీ చెక్కులు తీసుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవీపట్నం మండలంలో ఎకరానికి రూ 7.50 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తున్నారు. నష్టపరిహారం అందాలంటే ముందుగా లంచం సొమ్ము ముట్టాల్సిందే. అనంతరం నష్టపరిహారంలో భూములకు 10 శాతం, ఇళ్ళకు 5 శాతం చొప్పున సొమ్ము గుంజుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అవినీతి పరులపై లోతుగా దర్యాప్తు చేసి గిరిజనుల సొమ్మును దోచుకుంటున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
నేడు జిల్లా సీనియర్ రెజ్లింగ్ జట్ల ఎంపిక
నంద్యాల: రాష్ట్ర సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో పాల్గొనే జిల్లా మహిళ, పురుషుల జట్లను బుధవారం స్థానిక పద్మావతినగర్లోని ఇండోర్ స్టేడియంలో ఎంపిక చేయనున్నటు రెజ్లింగ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పురుషుల ఫ్రీ స్టైల్, గ్రీకో రోమన్ సై ్టల్, మహిళల ఫ్రీసై ్టల్ విభాగాల్లో ఎంపిక చేస్తామన్నారు. 18 ఏళ్లు పైబడిన క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రంతో హాజరు కావచ్చన్నారు. ఎంపికైన జిల్లా జట్టు 30 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగే రాష్ట్రస్థాయి చాంపియన్షిప్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. -
సీపీఐ సీనియర్ నాయకుడి మృతి
రామన్నపేట భారతకమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ ఎర్ర అర్జున్(58) శనివారం మృతిచెందాడు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రామన్నపేట గ్రామపంచాయతీ పరిధి కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన అర్జున్ గీతకార్మికవృత్తిని కొనసాగిస్తూనే సీపీఐ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేశారు. గీతపనివారల సంఘం అధ్యక్షుడిగా, సీపీఐ మండల కార్యదర్శిగా, రామన్నపేట ఎంపీటీసీగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన మృతిపట్ల పార్టీ మండలకార్యదర్శి ఊట్కూరి నర్సింహ, ఎంపీటీసీ ఊట్కూరి శోభ, మాజీవైస్ఎంపీపీ మునుకుంట్ల నాగయ్య, ఉపసర్పంచ్ కూనూరు క్రిష్ణగౌడ్, నాయకులు గంగాపురం యాదయ్య, బడుగు రఘు, వి.భగవంతం, దండుగల సమ్మయ్య, ఎర్ర శేఖర్, శివరాత్రి సమ్మయ్య సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. -
సీనియర్ రెసిడెంట్ల కౌన్సెలింగ్ గందరగోళం
గుంటూరు మెడికల్ : గుంటూరు వైద్య కళాశాలలో శుక్రవారం జరిగిన సీనియర్ రెసిడెంట్ల కౌన్సిలింగ్లో గందరగోళం ఏర్పడింది. మేనేజ్మెంట్ కోటాకు, కన్వీనర్ కోటాకు ప్రత్యేకంగా సీనియర్ రెసిడెంట్ల కౌన్సెలింగ్ నిర్వహించి ఎక్కడ పని చేయాలనే విషయాన్ని ఆర్డర్ ద్వారా ఇస్తామని అధికారులు చెప్పడంతో పీజీ వైద్యులు ఆందోళన చేశారు. మెరిట్ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. కౌన్సెలింగ్ బాయ్కాట్ చేసి డీఎంఈకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీనియర్ రెసిడెంట్లుగా ఏడాదిపాటు పనిచేసేలా అధికారులు సిద్ధమవడంతో బాయ్కాట్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఉదయం 10 గంటలకు ప్రారంభమవ్వాల్సిన కౌన్సెలింగ్ 12 గంటల వరకు నిలిచిపోయింది. ప్రభుత్వం సీనియర్ రెసిడెంట్లకు నెలనెలా గౌరవ వేతనంగా అందజేసే నిధులు విడుదలకు బడ్జెట్ లేవనే సాకుతో ప్రైవేటు వైద్య కళాశాలల్లో పని చేయించాలని చేస్తోందని వైద్యులు వాపోయారు. సీనియర్ రెసిడెంట్లను ప్రైవేటు వైద్య కళాశాలల నిర్వాహకులు రిక్రూట్మెంట్ ద్వారా నియమించుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు కళాశాలల్లో పని చేయబోమని స్పష్టం చేశారు. వైద్యుల ఆందోళనతో స్పందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. గతంలో మాదిరిగానే కౌన్సెలింగ్ నిర్వహించాలని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావుకు ఆదేశాలిచ్చారు. దీంతో మధ్యాహ్నం నుంచి కౌన్సెలింగ్ యథావిధిగా కొనసాగింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఫర్నీకుమార్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్, ఇతర అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. వైద్యులకు మద్దతు తెలిపిన అప్పిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కౌన్సెలింగ్కు వచ్చి వైద్యులకు మద్దతు తెలిపారు. ఎలాంటి జీవో విడుదల చేయకుండా ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ వైద్యులను నియమించాలనుకోవడం దారుణమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధానాన్ని సహించబోమని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా కౌన్సెలింగ్ నిర్వహించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
'ఫిట్'నెస్ టెస్ట్
-
సీనియర్ ఐఏఎస్లో ప్రధాని మోదీ భేటీ
-
'వారి కుటుంబాలకు అండగా ఉంటాం'
-
ప్రేమిస్తున్నానంటూ విద్యార్థిని వేధిస్తున్న సీనియర్
-
నేను... నేనేనా?!
కనువిప్పు మాకు మేము ‘పంచపాండవులు’ అని పేరు పెట్టుకొని ప్రతి తగాదాలో తలదూర్చేవాళ్లం. లెక్చరర్లను ఎదురించేవాళ్లం. ఒకసారి మా ఫ్రెండ్ను సీనియర్ ఎవరో ఏదో అన్నాడని, అతడిని చితకబాదాం. సినిమాల ప్రభావమో ఏమిటోగానీ... గొడవలు పడడం, గొడవల్లో తల దూర్చడం. దీన్ని హీరోయిజంగా భావించేవాడిని. ఇంటర్ చదివే రోజుల్లో అయితే చదువు కంటే గొడవల మీదే ఎక్కువ దృష్టి ఉండేది. మా గ్రూపులో మొత్తం అయిదుగు సభ్యులం. ఒకసారి మా ఫ్రెండ్ను సీనియర్ ఎవరో ఏదో అన్నాడని, అతడిని చితకబాదాం. ఒక వారం తరువాత...ఆ రోజు నేను ఏదో పని ఉండి పక్క ఊరు నుంచి వస్తున్నాను. సమయం రాత్రి పది దాటింది. టీ స్టాల్ దగ్గర ఒక బ్యాచ్ కనిపించింది. మేము చావబాదిన సీనియర్ అందులో ఉన్నాడు. ‘వీళ్లు నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా?’ అని మనసులో అనుకొని వేరే రూట్లో వెళ్లే ప్రయత్నంలో ఉండగానే- ‘‘రేయ్ ఆగరా’’ అనే అరుపు వినిపించింది. నేను పారిపోబోతుండగా...అందరూ ఒక్కసారిగా వచ్చి నా మీద పడ్డారు. ఇష్టమొచ్చినట్లు కొట్టారు. స్పృహ కోల్పోయాను. స్పృహ వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. రెండు వారాల తరువాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాను. కొంత కాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకరోజు మా నాన్న కొన్ని పుస్తకాలు తెచ్చి నా చేతిలో పెట్టి ‘‘ఇవి చదువుకోరా. బోర్ కొట్టదు’’ అన్నారు. అవి ప్రముఖుల జీవిత చరిత్రలు. నా ఆసక్తిని గమనించి మరికొన్ని పుస్తకాలను తెచ్చిచ్చాడు నాన్న. ఆ పుస్తకాలు చదివిన తరువాత జీవితానికి సార్థకత లేకపోతే వృథా అనే భావన ఏర్పడింది. ఇక ఆనాటి నుంచి గొడవలు వదిలేశాను. చదువులో ముందున్నాను. ఇప్పుడు నన్ను ఎవరైనా పొగడుతుంటే ‘నేను నేనేనా?’ అనిపిస్తుంది! -వలస శేషుకుమార్, కాగజ్నగర్