slip
-
జారి పట్టుతప్పినా పడిపోని ఒడుపు
ఫూటుగా తాగిన వ్యక్తి చెరువు గట్టు దిగుతుంటే తూలి పడటం సహజం. ఒకవేళ తూలిపడబోతుంటే తమాయించుకుని నిలబడగలిగితే భలేగా నిలబడ్డాడే అని పక్కన ఉన్నవాళ్లు నవ్వుకుంటూ మెచ్చుకోవడం సహజం. మానవులకు సాధ్యమయ్యే ఇలాంటి పనిని మరమనిషి సైతం సాధించి చూపించింది. మట్టిగట్టుపై నడుస్తూ కాలిజారి గబాలున పడబోతూ రోబోట్ వెంటనే తమాయించుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం అధునాతన రొబోటిక్ సాంకేతికరంగంలో పెద్ద చర్చనీయాంశమైంది. మనిషికి సాధ్యమయ్యే అసంకల్పిత ప్రతీకార చర్యలు మరమనుషులకు సాధ్యమా? అనే చర్చ మొదలైంది. అయితే వీడియో చూసిన వాళ్లలో కొందరు నవ్వు తెప్పించే కామెంట్లు పెట్టారు. ‘‘హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ మనిషిలాగే నడవగలిగే సామర్థ్యం సాధించాలంటే ముందుగా మనిషిలాగా ఇలా జారాలి. వెంటనే సర్దుకొని నిలబడగలగాలి’’అని కామెంట్ చేశారు. ‘పార్టీకి వెళ్లొస్తూ తెల్లవారుజామున నాలుగు గంటలకు నేను ఇలాగే నడుస్తా’అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడీ రోబోలు పిల్లాడిలా నడుస్తున్నాయిగానీ చూస్తుండండి త్వరలో ఇవి తుపాకులు పట్టుకుని మన వెంటే పడతాయి’’అని ఇంకొకరు అన్నారు. ‘‘విమానం మెట్ల మీద, సైకిల్ తొక్కుతూ తరచూ పడిపోయే అమెరికా వృద్ధ అధ్యక్షుడు బైడెన్ కంటే ఈ రోబో చాలా బెటర్. పట్టుతప్పినా పడిపోలేదు’’అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశారు. – న్యూయార్క్ -
కాలు జారిన మోడల్.. షూ కంపెనీదే తప్పంటోంది!
లండన్కు చెందిన ఒక మోడల్ ఊహకందని రీతిలో ప్రమాదం బారినపడింది. దీంతో ఆమె జీవితాంతం హీల్స్ ధరించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఆ మోడల్ సదరు షూ కంపెనీపై £ 100,000 (సుమారు ఒక కోటి రూపాయలు) నష్టపరిహారం కోసం కేసు వేసింది. ఆ షూ కంపెనీకి చెందిన హీల్స్ ధరించడం కారణంగానే తాను ప్రమాదం బారినపడినట్లు ఆ మోడల్ తెలిపింది. న్యూస్ సైట్ ది మిర్రర్ నివేదిక ప్రకారం 31 ఏళ్ల క్లో మికెల్బరో 2018లో మిలన్లోని డిజైనర్ బేస్లో ప్రకటనల షూట్లో పాల్గొంది. వాక్వేపై నడుచుకుంటూ వెళ్తుండగా కాలు స్లిప్ అయి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ మోడల్ కాలి మడమ విరిగింది. తీవ్రమైన నొప్పి, కాలు వాపుతో ఆమె చాలా రోజులు మంచం మీదనే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ఆమెకు హీల్స్ ధరించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో క్లో ఆ షూ కంపెనీ నుంచి పరిహారం పొందేందుకు కోర్టును ఆశ్రయించింది. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇకపై తాను ఎవరికీ డాన్స్ నేర్పించలేనని, తానూ డ్యాన్స్ చేయలేనని, పరిగెత్తలేనని కోర్టు ముందు మొరపెట్టుకుంది. అయితే స్టెల్లా మాక్కార్ట్నీ లిమిటెడ్ షూ కంపెనీ ఆమె వాదనను ఖండించింది. కంపెనీ తరపు న్యాయవాది మైఖేల్ పాట్రిక్ తెలిపిన వివరాల ప్రకారం ఆమెకు నడక మార్గంలో ప్రమాదం జరిగింది. ఆమె తన బరువును నియంత్రించుకోలేక పడిపోయింది. కాగా కేసు కోర్టు విచారణలో ఉంది. ఇది కూడా చదవండి: ఆ గ్రామం కేన్సర్ నిలయంగా ఎందుకు మారింది? -
The Reverse Swing: Colonialism to Cooperation: పీవీ నుంచి వాజ్పేయీకి రహస్య చీటీ!
న్యూఢిల్లీ: దిగ్గజ నేత అటల్ బిహారీ వాజ్పేయీ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత పీవీ నరసింహా రావు ఆయనకు ఓ చీటీ అందించారని తాజాగా విడుదలైన ఒక పుస్తకం ద్వారా వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే.. వాజ్పేయీ ప్రధానిగా కొనసాగిన కాలంలో అంటే 1998–2004 కాలంలో అశోక్ టాండన్ అనే అధికారి ప్రధానమంత్రి కార్యాలయంలో మీడియా వ్యవహారాల ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రాసిన ‘ది రివర్స్ స్వింగ్: కలోనియలిజం టు కోఆపరేషన్’ అనే పుస్తకంలో ఇటీవల విడుదలైంది. దానిని పెట్రోలియం, సహజవాయు, గృహ, పట్టణవ్యవహారాల కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఢిల్లీలో ఆవిష్కరించారు. ఆ పుస్తకంలో మాజీ ప్రధాని వాజ్పేయీ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను టాండన్ పంచుకున్నారు. రాష్ట్రపతిభవన్లో ప్రమాణస్వీకారం వేళ వాజ్పేయీ ప్రధానమంత్రి పదవి చేపట్టినపుడు అదే సమయంలో అక్కడే ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు ఒక చీటీని వాజ్పేయీకి రహస్యంగా అందించారు. ‘అంసంపూర్తిగా మిగిలిపోయిన ఒక పనిని మీరు పూర్తిచేయాలి’ అని ఆ చీటిలో రాసి ఉందట. 1996 సంవత్సరంలో ఈ ఘటన జరిగిందని పుస్తకంలో పేర్కొన్నారు. ‘ పీవీ తాను ప్రధానిగా కొనసాగిన కాలంలో అమెరికా నుంచి తీవ్ర ఒత్తిళ్ల కారణంగా అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించలేకపోయారు. ఆ బాధ్యతలను పీవీనే స్వయంగా వాజ్పేయీకి అప్పగించి ఉంటారు’ అని ఆ పుస్తకంలో టాండర్ రాసుకొచ్చారు. 1996లో వాజ్పేయీ ప్రధాని పదవి చేపట్టడం 13 రోజులకే ప్రభుత్వం కూలడం, 1998లో ప్రధాని పగ్గాలు చేపట్టి విజయవంతంగా ఐదేళ్ల పాలన వాజ్పేయీ పూర్తిచేసుకోవడం తెల్సిందే. 1996లో అణుపరీక్షలకు ప్రయతి్నంచి విఫలమైన ప్రభుత్వం 1998లో పోఖ్రాన్లో విజయవంతంగా పూర్తిచేసి అమెరికాను సైతం విస్మయానికి గురిచేసిన సంగతి తెల్సిందే. రాష్ట్రపతి పదవి తిరస్కరణ! 2002 సంవత్సరంలో ప్రధాన మంత్రిగా దిగిపోయి రాష్ట్రపతి పదవి చేపట్టాలని వాజ్పేయీకి సూచనలు వచ్చాయని, కానీ వాజ్పేయీ అందుకు ససేమిరా అన్నారని పుస్తకంలో ఉంది. ప్రధానిగా వాజ్పేయీ దిగిపోతే ఆ బాధ్యతలు అద్వానీకి అప్పగించాలని చూశారని పేర్కొన్నారు. ‘ ప్రధానిగా ఉన్న వ్యక్తి వెంటనే రాష్ట్రపతి పదవి చేపడితే అది ప్రజాస్వామ్య దేశానికి ఎంతమాత్రం మంచిదికాదు. పరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని తన తోటి మంత్రులతో వాజ్పేయీ అన్నారట. 1996 తర్వాత మెజారిటీ ప్రభుత్వం అమెరికాకు నచ్చలేదట పుస్తకంలో పీవీ ఆలోచనలనూ పొందుపరిచారు. ‘ 1996 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియాలో పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడటం అమెరికాకు ఇష్టంలేదట. వాజ్పేయీ ప్రధాని కావడం అమెరికాకు ఇష్టం లేదనుకుంటా. వాజ్పేయీ ముక్కుసూటి తనం, ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఆయన అణుపరీక్షలకు పచ్చజెండా ఊపేలా ఉన్నారని అమెరికా ప్రభుత్వానికి ఢిల్లీలోని ఆ దేశ రాయబారి సమాచారం చేరవేశారు’ అని పీవీ అప్పట్లో అన్నట్లు పుస్తకంలో పేర్కొన్నారు. -
అమెరికా అధ్యక్షుడికి అతి పెద్ద కష్టం
కొంతకాలం క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ఎయిర్ ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డారు. ఈ విధంగా మూడుసార్లు పడిపోయారు. తరువాత రెయిలింగ్ను పట్టుకుని లేచి విమానంలోకి ఎలాగోలా ఎక్కేశారు. గత నెలలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలోనూ ఇలానే జరిగింది. అయితే బైడెన్ ఇలా పడిపోవడం ఆయకు పలు సమస్యలు తెచ్చిపెడుతోంది. దీనిని నివారించేందుకు ఆయన షార్టర్ స్టెయిర్కేస్ వినియోగించడం రెండితలయ్యిందని ఒక నివేదిక వెల్లడించింది. బైడెన్కు వైట్ హౌస్ రాయితీలు? దీనిని చూస్తుంటే 80 ఏళ్ల బైడెన్కు వైట్ హౌస్ రాయితీలు కల్పిస్తున్నట్లున్నదనే విమర్శలు వస్తున్నాయి. బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో రెండవసారి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటువంటి తడబాటు మరోమారు జరగకుండా వైట్హౌస్ అధికారులు జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం. కొలరాడోలోని వైమానిక దళ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు బైడెన్ ఎయిర్ఫోర్స్ వన్లో ప్రవేశించడానికి షార్టర్ స్టెయిర్కేస్ మరోమారు ఉపయోగించారు. గత ఏడు వారాల్లో బైడెన్ 84 శాతం మేరకు షార్టర్ స్టెయిర్కేస్ వినియోగించారు. బైడెన్ విమానం ఎక్కినప్పుడు, దిగినప్పుడు 37 సార్లు షార్టర్ స్టెయిర్కేస్ ఉపయోగించారని నివేదిక పేర్కొంది. ఒక విశ్లేషణ ప్రకారం అధ్యక్షుడు బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్లో మరొకసారి స్లిప్ కాకుండా ఉండేందుకు తరచుగా షార్టర్ స్టెయిర్కేస్ ఉపయోగిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా.. గత జూన్లో జరిగిన వైమానిక దళ అకాడమీ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న బైడెన్ బిడెన్ వేదికపై పడిపోయిన అనంతరం ఆయన షార్టర్ స్టెయిర్కేస్ వినియోగించడం మరింత పెరిగింది. గత ఏడు వారాల్లో బైడెన్ 84 శాతం మేరకు షార్టర్ స్టెయిర్కేస్ను ఉపయోగించారు. కాగా దీనిపై వ్యాఖ్యానించేందుకు వైట్ హౌస్ అధికారులు నిరాకరించారు. అయితే బైడెన్ సహాయకుడొకరు మాట్లాడుతూ ఈ నిర్ణయం పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నదన్నారు. హిల్లరీ క్లింటన్ మద్దతు మాజీ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కూడా 2024లో బైడెన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు అతని వయస్సు ఒక సమస్య అని పేర్కొన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమేనని అన్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకీ అతనే సరైనవాడని భావిస్తున్నానని తెలిపారు. బైడెన్కు వ్యతిరేకంగా కానీ ప్రత్యామ్నాయంగా గానీ ముందుకు వెళ్లాలనుకోవడంలేదని, తాను బైడెన్ శిబిరానికి చెందిన వ్యక్తినని హిల్లరీ క్లింటన్ అన్నారు. ఇది కూడా చదవండి: ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగతో ప్రేమలో పడింది -
టంగ్ స్లిప్ అయిన బండి
-
ముగ్గుల ఫోటోలు తీస్తుండగా విషాదం..ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి..
సాక్షి, కుషాయిగూడ: పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. అపార్టుమెంట్ ముంగిట వేసిన ముగ్గుల ఫొటోలు తీస్తుండగా జారీ పడి ఓ బాలిక మృతిచెందిన సంఘటన శనివారం కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఉపేందర్యాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాప్రా, సాధనవిహార్ కాలనీ, ఆవాస్ అపార్టుమెంట్లో ఉంటున్న పోతిశెట్టి కిన్నెర (14) 9వ తరగతి చదువుతోంది. శనివారం బోగి పండుగ సందర్భంగా అపార్ట్మెంట్ ఆవరణలో వేసిన ముగ్గులను ఐదో అంతస్తునుంచి సెల్ఫోన్లో ఫొటో తీస్తూ ప్రమాదవశాత్తు జారి కింద పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పెద్దలకు తెలియజేయడమే శాపమైందో ఏమో! ఆ ప్రేమ జంట..) -
కదులుతున్న రైలు ఎక్కబోయి కిందపడ్డ తల్లీకూతురు.. తృటిలో..
ముంబై: ప్లాట్ఫాంపై కదులుతున్న రైలు ఎక్కబోయి తల్లీకూతురు కిందపడ్డారు. అక్కడే ఉన్న రైల్వే పోలీసు, ఓ ప్యాసెంజర్ వీళ్లిద్దరిని ప్రాణాపాయం నుంచి తప్పించారు. ముంబైలోని వాసాయ్ రోడ్ రైల్వే స్టేషన్లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ట్విట్టర్లో షేర్ చేసింది. Prompt action by #RPF Constable Tejaram saved a mother-daughter duo from a major accident in nick of time at Vasai Road railway station while they tried to board a moving train. Your safety is our greatest concern.#MissionJeewanRaksha #BeResponsie #BeSafe @rpfwr1 @rpfwrbct pic.twitter.com/lTUhu2rNOX — RPF INDIA (@RPF_INDIA) December 13, 2022 తల్లీకూతురును రక్షించిన కానిస్టేబుల్ తేజారామ్ను ఆర్పీఎఫ్ ప్రశంసించింది. ఈ ఘటనలో ఇద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది. తమ ప్రాణాలు కాపాడినందుకు రైల్వే కానిస్టేబుల్ తేజారామ్కు తల్లీకూతురు కృతజ్ఞతలు చెప్పారు. చదవండి: పెళ్లి రద్దు.. రూ.50 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసిన అమ్మాయి.. -
భారత్ స్టార్ నీరజ్ చోప్రాకు తప్పిన పెను ప్రమాదం
భారత స్టార్ జావెలిన్ త్రోయర్.. ఒలింపియన్ నీరజ్ చోప్రాకు పెను ప్రమాదం తప్పింది. ఫిన్లాండ్లో శనివారం జరిగిన కూర్తానె గేమ్స్లో నీరజ్ జావెలిన్ను 86.69 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే నీరజ్ చోప్రా ఈ గేమ్లో జావెలిన్ త్రోయింగ్ ప్రయత్నాల్లో రెండుసార్లు ఫౌల్ చేశాడు. ఈ క్రమంలోనే జావెలిన్ త్రో విసరగానే పట్టు తప్పిన నీరజ్ జారి కిందపడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ నీరజ్కు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. కిందపడిన నీరజ్ పైకిలేచి తాను బాగానే ఉన్నానంటూ చిరునవ్వుతో సంకేతాలు ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా అంతకముందే భారీ వర్షం పడడంతో గ్రౌండ్ మొత్తం బురదమయమయింది. వర్షం ముగిసిన వెంటనే ఆటను ప్రారంభించారు. ఆటలో మొదటగా నీరజ్ చోప్రానే జావెలిన్ త్రో విసిరాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఇది ఆయనకు రెండో పోటీ. ఇక్కడ నీరజ్ అథ్లెటిక్స్లో స్వర్ణం గెలుచుకున్న మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. నీరజ్ తర్వాత వాల్కాట్ 86.64 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు. పీటర్స్ 84.75 ఉత్తమ ప్రయత్నంతో మూడో స్థానంలో నిలిచాడు. అదే విధంగా చోప్రాతో పాటు కుర్టానే ఒలింపిక్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న ప్రపంచ పారి జావెలిన్ ఛాంపియన్ సందీప్ చౌదరి కూడా పోటీలో పాల్గొని 60.35 మీటర్ల బెస్ట్ త్రోతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన నీరజ్ పది నెలల తర్వాత ఇటీవల పావో నుర్మీ గేమ్స్లో పాల్గొని రజతం సాధించాడు. ఈ గేమ్స్లో నీరజ్ ఈటెను 89.30 మీటర్ల దూరం విసిరి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. Nasty slip for Neeraj Chopra on a very slippery runway at the Kuortane Games. He seems ok though. pic.twitter.com/6Zm0nlojkZ — jonathan selvaraj (@jon_selvaraj) June 18, 2022 చదవండి: Neeraj Chopra: స్వర్ణం నెగ్గిన నీరజ్ చోప్రా Katherine Brunt: 'ఒక శకం ముగిసింది'.. టెస్టులకు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గుడ్బై -
ఇకపై వాట్సాప్ ద్వారా పెన్షన్ స్లిప్పులు: కేంద్రం
న్యూఢిల్లీ: పింఛన్దారులకు పెన్షన్ స్లిప్పులను వాట్సాప్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా పంపించాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. ఇందుకోసం ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ లాంటి సదుపాయాలతోపాటు సోషల్ మీడియా యాప్లను ఉపయోగించుకోవాలంటూ తాజాగా ఒక ఉత్తర్వు జారీ చేసింది. ప్రభుత్వ పెన్షన్, భత్యాలు, పన్ను కోతలు వంటి పూర్తి వివరాలు పెన్షన్ స్లిప్పులో ఉండాలని పేర్కొంది. ఇలాంటి వివరాలు పెన్షన్ స్లిప్పుల్లో చేర్చేందుకు బ్యాంకులు ఇటీవలే అంగీకారం తెలిపినట్లు పేర్కొంది. -
ఫోన్లో మునిగి.. పట్టాలపై పడి..
-
ఫోన్లో మునిగి.. ఆ యువతి ఏం చేసిందో తెలుసా?
మ్యాడ్రిడ్: స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్ని మరిచిపోతాం అనేందుకు తాజా ఉదాహరణ ఇది. స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లోని ఓ రైల్వే స్టేషన్లో రైలు కోసం కూర్చున్న ఓ యువతి స్మార్ట్ఫోన్లో మునిగితేలుతోంది. ఇంతలో రైలు స్టేషన్లోకి రావడంతో ఆ యువతి ముందుకు అడుగులు వేసింది. రైలు ఇంకా రాకమునుపే.. రైలు ఎక్కే ప్రయత్నం చేసింది. దీంతో రైలు పట్టాలపై పడిపోయింది. ప్రస్తుతం ఈ ఘటన వీడియో వైరల్ అయింది. వీడియో ఆమె పట్టాలపై పడినంత వరకే ఉండటంతో తనకు ఏమైందా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. దీనిపై అధికారులు ట్విటర్లో స్పందిస్తూ.. స్వల్ప గాయాలతో సదరు యువతి బయటపడినట్లు వెల్లడించారు. -
భారీగా పతనమైన చమురు ధర
అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత కిందికి దిగి వస్తున్నాయి. అమెరికా మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 6.50శాతం క్షీణించి 50.47 డాలర్ల వద్ద ముగిసింది. దీంతో ఏడాది కనిష్టానికి చేరాయి. వారంలో రోజుల్లోనే ఏకంగా 11శాతం క్షీణించగా, ఈ త్రైమాసికంలో 40శాతానికి పైగా దిగివచ్చింది. ఆర్థికవృద్ధి మందగమన భయాలతో పాటు క్రూడ్ ఉత్పత్తి పెరుగుదలతో క్రూడాయిల్ పతనమైందని ఎనలిస్టులు చెపుతున్నారు. మరోవైపు ఒపెక్ దేశాలు ఇంధన ఉత్పత్తిలో కోత విధింపుపై సందేహాలు తలెత్తడం కూడా క్రూడాయిల్ ధరలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. భారీగా క్షీణిస్తున్న క్రూడాయిల్ ధరలను అదుపులో తెచ్చేందుకు రష్యా నేతృత్వంలోని ఒపెక్ దేశాలు జనవరి నుంచి రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి కోతకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రపంచదేశాల సూక్ష్మఆర్థిక వ్యవస్థ గణాంకాలుఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడం, తగ్గుతున్నక్రూడ్ ఆయిల్ డిమాండ్, ఈనెలలోఈక్విటీ మార్కెట్లు 9.5శాతం క్షీణతతోపాటు, యూరోజోన్ రుణ సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతూనే ఉండడం తదితర అంశాలన్నీల క్రూడాయిల్ ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయని విశ్లేషకులంటున్నారు. -
హంద్రీనీవా కాలువలో యువతి మృతి
నెహ్రూనగర్ (పగిడ్యాల): మతిస్థిమితం లేని ఓ యువతి ప్రమాదవశాత్తు హంద్రీనీవా కాలువలో పడి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం నెహ్రూనగర్లో చోటుచేసుకుంది. వివరాలివీ.. గ్రామానికి చెందిన వీరమ్మ కూతురు తిరుపతమ్మ(22) పుట్టకతోనే మతిస్థిమితంతో బాధపడుతోంది. కుమార్తెను ఈమె జాగ్రత్తగా చూసుకునేది. అయితే సోమవారం..సీఎం బహిరంగ సభ కోసం ఆమె ముచ్చుమర్రి వెళ్లారు. ఇంటికి తిరిగొచ్చే సరికి కుమార్తె కనిపించలేదు. ఆచూకీ కోసం బంధువులను, ఇరుగుపొరుగు వారిని విచారించినా జాడ కనిపించలేదు. అనుమానం వచ్చిన బంధువులు నివాస ప్రాంతాలకు సమీపంలోని హంద్రీనీవా కాలువ వెంబడి గాలించి తిరుపతమ్మ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై ముచ్చుమర్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బంధువులు పేర్కొన్నారు. -
బ్యాంకు షేర్లకు ఆర్బీఐ షాక్!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థలో అనూహ్యంగా పెరిగిన లిక్విడిటీని నియంత్రించేందుకు తీసుకున్న నిర్ణయం బ్యాంకింగ్ షేర్లకు భారీగా ప్రభావితం చేసింది. ఇంక్రిమెంటల్ నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)ని తాత్కాలికంగా పెంచడంతో బ్యాంకింగ్ సెక్టార్ కి షాకిచ్చింది. మార్కెట్ల ప్రారంభంలోనే బ్యాంక్ నిఫ్టీ 273 పాయింట్లకు పైగా పతనమైంది. పీఎస్యూ బ్యాంక్ సూచీ 3 శాతం పతనంకాగా, బ్యాంక్ నిఫ్టీ కూడా 1.7 శాతం క్షీణించింది. ఆరంభంలో ఎస్బీఐ2.09 శాతం, ఐసీఐసీఐ 1.86శాతం, హెచ్ డీఎఫ్సీ 0.50 శాతం నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్ 1.63 శాతం, బీఓబీ 2.8శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి. మరోవైపు గత శుక్రవారం భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సీఆర్ ఆర్ పెంపుతో మదుపర్లు బ్యాంకింగ్ సెక్టార్ లో అమ్మకాలవైపు మళ్లారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా డిపాజిట్ల వెల్లువ భారీగా పెరగడంతో ఇంక్రిమెంటల్ నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)ని తాత్కాలికంగా 100 శాతానికి పెంచుతూ కేంద్ర బ్యాంకు నిర్ణయం తీసుకుంది. వివిధ బ్యాంకుల్లో కుప్పతెప్పలుగా జమవుతున్న నగదును బ్యాంకులు రిజర్వ్ బ్యాంకుకు మళ్లించే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) బ్యాంకులకు ఈ ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబర్ 16- నవంబర్ 11 మధ్య కాలానికి, అంటే నవంబర్ 26నుంచీ బ్యాంకులు ఈ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని తిరిగి డిసెంబర్ 9న సమీక్షించనున్నట్లు ఆర్బీఐ తెలియజేసింది. ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ను (క్యాష్ రిజర్వ్ రేషి యో) 100 శాతం పెంచినట్టు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. రద్దయిన రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో బ్యాంకు ల్లో భారీగా డిపాజిట్లు పెరిగి నగదు లభ్యత పెరిగినందువల్ల తాత్కాలిక చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మార్కెట్ స్థిరీకరణ పథకం (ఎంఎస్ఎస్) కింద బాండ్లను తగినంత విడుదల చేసిన వెంటనే సీఆర్ఆర్ పరిస్థితిని సమీక్షిస్తామని ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. -
పిల్లలతో రైల్లోంచి దూకిన తల్లి !!
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దారుణం జరిగింది. ఓ మహిళ తన పిల్లలతో కదులుతున్న రైల్లోంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో తల్లి, రెండున్నర ఏళ్ల పాప మృతిచెందగా బాబుకి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు రైల్వే ట్రాక్ పై ఏడాదిన్నర బాబు పడి ఉండటాన్ని గమనించిన ట్రాక్ మెన్ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. వట్లూరు రైల్వే ట్రాక్ సమీపంలో తల్లి, కూతురు మృతదేహాలను అధికారులు గుర్తించారు. రైలు నుంచి జారిపడ్డారా లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్లోంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
రైలు నుంచి జారిపడి బాలుడు మృతి
భిక్నూర్ (నిజామాబాద్) : వేగంగా వెళ్తున్న రైలు నుంచి జారి కిందపడిన ఓ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భిక్నూర్ మండలం తాళ్లమడ్ల సమీపంలో చోటుచేసుకుంది. బోధన్ మండలం పెంటకుర్దు గ్రామానికి చెందిన నర్సింహులు భార్య, కుమారుడితో యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలులో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నర్సింహులు కుమారుడు ఆకాష్(8) తాళ్లమడ్ల గ్రామ సమీపంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు. రాళ్లపై పడటంతో తీవ్రగాయాలపాలైన బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. రైలు కామారెడ్డి స్టేషన్లో ఆగిన తర్వాత కుమారుడు లేడన్న విషయాన్ని నర్సింహులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వారు వెంటనే స్పందించి ఆకాష్ చనిపోయిన విషయం తెలుసుకుని ధ్రువీకరించటంతో అతడు హతాశుడయ్యాడు. -
హాస్టల్ నుంచి మరో హాస్టల్పైకి దూకుతూ..
-
స్లిప్లో దగ్గరగా నిలబడుతున్నారు:వీవీఎస్ లక్ష్మణ్
వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్య లండన్: స్లిప్లో భారత ఫీల్డర్లు ఒకరికొకరు చాలా దగ్గరగా నిలబడుతున్నారని మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. దీనివల్ల క్యాచ్లు తీసుకునే విషయంలో వాళ్ల మధ్య గందరగోళం నెలకొంటుందన్నాడు. ఐదో టెస్టు రెండో రోజు కుక్ ఇచ్చిన రెండు క్యాచ్లను స్లిప్లో విజయ్, రహానే జారవిడిచిన సంగతి తెలిసిందే. ‘మేం ఆడేటప్పుడు మూడు స్లిప్ల మధ్య కాస్త ఖాళీ ఉంచేవాళ్లం. కానీ ప్రస్తుతం చాలా దగ్గరగా నిల్చుంటున్నారు. ఉపఖండంలో ఆడేటప్పుడు వికెట్ నుంచి ఆరు అడుగులు వెనక్కి ఉండాలి. అదే విదేశాల్లో అయితే ఇది 7, 8 అడుగులు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బంతి బౌన్స్ ఎక్కువగా అవుతుంది. ఏదేమైనా స్లిప్ ఫీల్డర్ల మధ్య కొంతైనా ఖాళీ మాత్రం ఉండాల్సిందే’ అని స్లిప్ ఫీల్డింగ్ స్పెషలిస్ట్ లక్ష్మణ్ వెల్లడించాడు. స్లిప్లో ఫీల్డింగ్ చేయడం బ్యాటింగ్, బౌలింగ్ మాదిరిగా చాలా ఆత్మవిశ్వాసంతో కూడుకున్నదని చెప్పాడు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న స్లిప్ ఫీల్డర్లలో ఇది కొరవడిన కారణంగానే క్యాచ్లు మిస్సవుతున్నాయన్నాడు. అయితే క్యాచ్లు తీసుకునే సామర్థ్యం వాళ్లలో ఉందని కితాబిచ్చాడు. ‘గతంలో విజయ్, రహానే అద్భుతమైన క్యాచ్లు తీసుకున్నారు. కాకపోతే నిలకడ ఉండాలి. స్లిప్ ఫీల్డర్లను ధోని పదేపదే మార్చకూడదు. దీని కోసం ప్రత్యేక ఆటగాళ్లను ఏర్పాటు చేసుకోవాలి. మ్యాచ్ కీలక దశలో క్యాచ్లను జారవిడిచారు. దీనివల్ల ఇంగ్లండ్ సిరీస్లో పుంజుకుంది’ అని లక్ష్మణ్ వివరించాడు.