union budjet
-
బడ్జెట్ హల్వా బడ్జెట్ కూర్పు ప్రారంభం
న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్ కూర్పు కార్యక్రమం సంప్రదాయ హల్వా వేడుకతో శనివారం ప్రారంభమైంది. నార్త్బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. హల్వా వేడుకలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది బడ్జెట్ పత్రాల కూర్పులో పాల్గొంటారు. గతంలో ఈ వేడుకలో పాల్గొన్న వారంతా ఆర్థిక శాఖ కార్యాలయం బేస్మెంట్లోకి వెళ్లి, బడ్జెట్ముద్రణలో పాలుపంచుకునేవారు. ఈసారి కోవిడ్ దృష్ట్యా బడ్జెట్ ప్రతుల ముద్రణను రద్దు చేశారు. పార్లమెంట్ సభ్యులకు ఈ దఫా డిజిటల్ రూపంలో బడ్జెట్ వివరాలను అందజేయనున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక ఇలా చేయడం ఇదే మొదటిసారి. ‘కేంద్ర బడ్జెట్ను మొట్టమొదటిసారిగా పేపర్లెస్ రూపంలో ఇస్తున్నాం. ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్లో ప్రవేశపెడతాం’అని ఆర్థిక శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. భారీ కఢాయిలో తయారు చేసిన హల్వాను బడ్జెట్ తయారీలో పాల్గొనే సిబ్బందికి పంచారు. నిర్మల బడ్జెట్ పత్రాలను చూసేందుకు రూపొందించిన మోబైల్ యాప్ను ప్రారంభించారు. బడ్జెట్æ పోర్టల్ నుంచి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి వివరాలను చూడవచ్చు. -
బీజేపీతో ఎలా ముందుకెళ్దాం ?
-
కొన్ని సమస్యల్నే ప్రస్తావించింది
చెన్నై / వాషింగ్టన్: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో కొన్నింటిని మాత్రమే ప్రస్తావించిందని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధాని ఆర్థిక సలహా మండలి మాజీ చైర్మన్ సి.రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ‘ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోవడం, వ్యవసాయ సంక్షోభం ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు. ఈ బడ్జెట్లో వ్యవసాయ సంక్షోభంతో పాటు ప్రైవేటు పెట్టుబడుల గురించి కొద్దిగా ప్రస్తావించారు. కేవలం ఈ బడ్జెట్ సాయంతో ఆర్థిక వృద్ధి సాధ్యమా? అంటే అది అనుమానాస్పదమే. ఒకవేళ దేశంలోకి పెట్టుబడుల రాక పెరిగితే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. అందుకే నేను ఈ బడ్జెట్ కొన్ని సమస్యల్ని మాత్రమే స్పృశించింద నీ, అన్ని సమస్యల్ని ప్రస్తావించలే దని చెప్పాను’ అని రంగరాజన్ వ్యా ఖ్యానించారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యారం గానికి నిధుల కేటాయింపులు పెరగడం ఈ బడ్జెట్ విశేషమని రంగరాజన్ తెలిపారు. ఈ మార్పులు సరైన దిశలోనే సాగుతున్నాయని వెల్లడించారు. ఇకపై ఆర్థికలోటు ఎట్టిపరిస్థితుల్లోనూ పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. జైట్లీ ప్రకటించిన జాతీయ ఆరోగ్య రక్షణ పథకంపై మరింత స్పష్టత రావాల్సిన అవసరముందని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఆచరణీయ బడ్జెట్: పనగరియా కేంద్ర బడ్జెట్ ఆచరణీయంగా ఉందని నీతి ఆయోగ్ మాజీ చైర్మన్ అరవింద్ పనగరియా తెలిపారు. ‘మొత్తం బడ్జెట్లో దాదాపు 10 కోట్ల కుటుంబాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చే జాతీయ ఆరోగ్య రక్షణ పథకం అత్యంత ముఖ్యమైనది. ఇది దేశంలోని ప్రజల్ని సార్వత్రిక ఆరోగ్య బీమావైపు తీసుకెళ్తుంది. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆచరణీయంగా ఉంది. జీఎస్టీ అమలుతో పరోక్ష పన్నులు కేవలం 11 నెలలకే వసూలు చేయగలిగారు. అలాగే నామమాత్రపు వృద్ధిరేటు కూడా అనుకున్నంతగా లేకపోవడంతో ఆర్థిక లోటు 3.2 శాతం నుంచి 3.5 శాతానికి చేరుకుంది’ అని వెల్లడించారు. -
‘ప్రగతిశీల సానుకూల భారత బడ్జెట్’
న్యూఢిల్లీ: 2018–19 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ‘ప్రగతిశీల, సానుకూల భారత్’బడ్జెట్ను ప్రవేశపెట్టిందని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. గ్రామీణ, పట్టణ భారతాల మధ్య ఉన్న అంతరాన్ని రూపుమాపేందుకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని తెలిపారు. ‘ప్రగతిశీల, సానుకూల భారతం కోసం దోహదం చేసే బడ్జెట్ ఇది. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధమ్యాలు మారాయి. ఇది దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి దోహదం చేస్తుంది. సరికొత్త భారతం కోసం చారిత్రక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీకి అభినందనలు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పరిధిలోకి 8 కోట్ల కుటుంబాలను తీసుకురావడం.. సాధారణ ప్రజల జీవితాలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపిస్తోంది. గత కొన్నేళ్లలో వచ్చిన బడ్జెట్లలో రైతులు, ప్రజలకు అత్యంత అనుకూలంగా ఉన్న బడ్జెట్లలో ఇదొకటి. ప్రతి పేద, బలహీన కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యభీమా కల్పించడం ఆరోగ్యరంగంలో తీసుకొచ్చిన గొప్ప మార్పు. ప్రభుత్వం తీసుకురానున్న ఆపరేషన్ గ్రీన్ పథకంతో అద్భుతమైన వ్యవసాయాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోగలం’అని రాజ్నాథ్ వెల్లడించారు. -
‘పేదలు, రైతుల ఆకాంక్షలకు ఊతం’
న్యూఢిల్లీ: ‘ఆర్థికమంత్రి జైట్లీ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని పేదలు, రైతులు, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలకు ఊతమిచ్చేలా ఉందని బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రశంసించారు. ‘గ్రామీణ, వ్యవసాయ రంగాలకు రికార్డు స్థాయిలో నిధుల కేటాయింపులతో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్లడంతో పాటు అద్భుతమైన వ్యవసాయాభివృద్ధి సాధ్యమవుతుంది. రైతుల పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను ప్రభుత్వం ఒకటిన్నర రెట్లు పెంచింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఇది ధ్రువపరుస్తోంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సాధికారత కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి ఈ న్యూ ఇండియా బడ్జెట్ దోహదం చేస్తుంది’అని షా ట్వీటర్లో వెల్లడించారు. బడ్జెట్లో 2018–19 సంవత్సరానికి ముద్ర పథకం కింద రూ.3 లక్షల కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి షా ధన్యవాదాలు తెలిపారు. ఈ బడ్జెట్ రైతులు, గ్రామీణ రంగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా ఉందని పునరుద్ఘాటించారు. 2022 నాటికల్లా సరికొత్త భారతాన్ని ఆవిష్కరించాలన్న ప్రభుత్వ కల సాకారానికి, సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి ఫలాలు అందుకోవడానికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని పేర్కొన్నారు.దాదాపు 10 కోట్ల మందికి ఆరోగ్య రక్షణ కల్పించే మోదీ కేర్ పథకానికి మంచి స్పందన వచ్చిందని వెల్లడించారు. స్వచ్ఛభారత్ కింద 2018–19లో 2 కోట్ల మరుగుదొడ్లు నిర్మించనున్నట్లు షా తెలిపారు. -
లక్ష కోట్లతో ‘రైజ్’
పిట్ట కన్ను మినహా మరేదీ కనిపించనంతటి ఏకాగ్రత పాండవ మధ్యముడిదైతే... గిరిజనుడిగా పుట్టినా, మట్టిబొమ్మలోనే గురువును ఆవాహన చేసి విలువిద్యలో సాటిలేని మేటిగా నిలిచిన పట్టుదల ఏకలవ్యుడిది...! భావి భారత పౌరులను కూడా ఇదే తరహాలో సానపెట్టడమే లక్ష్యమని పేర్కొన్నారు జైట్లీ. గిరిజనుల కోసం ఏకలవ్య గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. విద్యా రంగానికి కేటాయింపులు కూడా భారీగా చేశారు... న్యూఢిల్లీ కేంద్ర బడ్జెట్లో విద్యారంగం అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ రంగానికి రూ.85,010 కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. ఇందులో రూ.35,010 కోట్లు ఉన్నత విద్యారంగానికి, రూ.50,000 కోట్లు పాఠశాల విద్యకు కేటాయించామన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.లక్ష కోట్లతో ‘రివైటలైజింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్ ఇన్ ఎడ్యుకేషన్(రైజ్) పేరిట ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఏజెన్సీ ద్వారా ఈ నిధులు కేటాయిస్తామన్నారు. ‘ప్రధానమంత్రి ఫెలోషిప్ పథకం’కింద ప్రతిఏటా ప్రముఖ విద్యాసంస్థల నుంచి అత్యంత ప్రతిభావంతులైన 1,000 మంది బీటెక్ విద్యార్థులను గుర్తించి, వారికి ఐఐటీలు, ఐఐఎస్సీలో పీహెచ్డీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. అంతేకాకుండా ఆకర్షణీయమైన ఉపకార వేతనం అందజేస్తామని తెలిపారు. 24 కొత్త మెడికల్ కాలేజీలు దేశంలో వైద్యుల–రోగుల నిష్పత్తిలో అంతరాన్ని పూరించేందుకు 24 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రుల స్థాయిని పెంచుతూ ఈ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు కనీసం ఒకటి చొప్పున మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. బ్లాక్ బోర్డుల నుంచి డిజిటల్ బోర్డులకు.. వడోదరలో స్పెషలైజ్డ్ రైల్వే యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే పూర్తిస్థాయిలో రెండు కొత్త ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా ఐఐటీలు, ఎన్ఐటీల్లో స్వయం ప్రతిపత్తి కలిగిన 18 ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్కూళ్లను నెలకొల్పనున్నట్లు తెలిపారు. విద్యారంగంలో నాణ్యత నానాటికీ పడిపోతోందని జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను పాఠశాలలకు రప్పించగలుగుతున్నాం కానీ వారికి నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నామని చెప్పారు. పాఠాలు బోధించే ఉపాధ్యాయుల్లో నాణ్యత పెరిగితే విద్యలోనూ నాణ్యత తప్పనిసరిగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయుల కోసం సమీకృత బీఈడీ కోర్సులను ప్రవేశపెడతామన్నారు. 13 లక్షల మందికిపైగా టీచర్లకు శిక్షణ ఇస్తామన్నారు. ఇటీవల ప్రారంభించిన ‘దీక్షా’పోర్టల్ ద్వారా ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యారంగంలో డిజిటల్కు ప్రాధాన్యం పెరగాల్సి ఉందని వివరించారు. బ్లాక్ బోర్డుల నుంచి డిజిటల్ బోర్డుల వైపు వెళ్లాలని సూచించారు. 50 శాతానికి పైగా గిరిజన జనాభా గల ప్రాంతాలు లేదా 20 వేల గిరిజన జనాభా ఉన్న ప్రతిచోట నవోదయ విద్యాలయాల తరహాలో 2022 నాటికి ‘ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు’ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ వెల్లడించారు. విద్య, వైద్యం సెస్సు 4 శాతానికి పెంపు వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నులపై 3 శాతంగా ఉన్న విద్య సెస్సును ‘విద్య, వైద్యం సెస్సు’కింద 4 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. పేద, గ్రామీణ కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ పెంపు ద్వారా రూ.11 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్ హైలైట్స్ ► 2018–19లో ఎస్సీల సంక్షేమానికి రూ.56,619 కోట్లు.. ఎస్టీల సంక్షేమానికి రూ.39,135 కోట్లు కేటాయింపు. ► ముద్రా పథకం కింద రుణ లక్ష్యం రూ. 3 లక్షల కోట్లు. ► డిజిటల్ ఇండియా పథకానికి రూ. 3,073 కోట్లు కేటాయింపు. ► టెలికం రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 10 వేల కోట్ల కేటాయింపు. ► మౌలిక వసతుల రంగానికి ప్రాధాన్యత. రూ. 5.97 లక్షల కోట్లు కేటాయింపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4.94 లక్షల కోట్లు కేటాయించిన ప్రభుత్వం. ► ప్రతి వ్యాపార సంస్థకు ఆధార్ తరహాలో గుర్తింపు సంఖ్య. ► 2018–19 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.80 వేల కోట్లు. ► గోల్డ్ పాలసీని రూపొందిస్తున్నట్టు ప్రకటన. -
నిధుల ఫ్రీజింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఖజానాపై ఆంక్షలు విధించింది. 2018–19 బడ్జెట్ సమీపిస్తుండటంతో బిల్లుల చెల్లింపులపై అనధికారిక ఫ్రీజింగ్ను అమల్లోకి తెచ్చింది. వేతన బిల్లులు మినహా మిగిలినవాటికి అనుమతి తీసుకోవాలని అన్ని జిల్లాల ట్రెజరీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. గ్రీన్చానల్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు, గురుకులాలు, హాస్టళ్ల బిల్లుల చెల్లింపుపైనా ఆంక్షలు పెట్టింది. మార్చి 12న 2018–19 బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ తయారీ కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో నీటిపారుదల శాఖ ప్రాజెక్టులకు తమ అనుమతి లేకుండా ఆఖరి విడత బిల్లులు చెల్లించొద్దని ఆర్థిక శాఖ కట్టడి చేసింది. గత నెలలో ఆసరా పెన్షన్ల పంపిణీ రాష్ట్రమంతటా ఆలస్యమైంది. ఆర్థిక శాఖ సకాలంలో డబ్బులు విడుదల చేయకపోవటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఒకటో తేదీన చెల్లించే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సైతం ఈ నెలలో 2 రోజులు ఆలస్యమయ్యాయి. 2 నెలలుగా వివిధ శాఖల్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లుల్లేక అవస్థలు పడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బిల్లుల మంజూరుకు ఇబ్బంది పడుతున్నారు. సాగునీటి విభాగంలోనే రూ.6 వేల కోట్లకుపైగా పెండింగ్ బిల్లులున్నాయి. ఫిబ్రవరి 1న చెల్లించాల్సిన జీతాలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహి ళల పింఛన్లకు ఇబ్బంది రాకుండా జాగ్రత్త వహిస్తోంది. ఫిబ్రవరి, మార్చిల్లో అత్యవసర బిల్లులు, జీతాలు తప్ప ఇతర వాటిని నిలిపేసేలా అప్రమత్తం చేసింది. మే లోనే రైతులకు సాగు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా ఒకే నెలలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకానికి భారీ మొత్తంలో నిధులు అవసరం కావటంతో ఆర్థిక శాఖ ఇప్పట్నుంచే ముందు జాగ్రత్త పడుతోంది. ఈ నేపథ్యంలోనే నిధుల సర్దుబాటుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ అనధికార ఫ్రీజింగ్ అమలు చేస్తోంది. -
‘ఆ బాధ్యత నుంచి బ్యాంకులు తప్పించుకోజాలవు’
హైదరాబాద్: నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్యాంకులు వాటిని నియంత్రించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోజాలవని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రంగరాజన్ అన్నారు. 2017 యూనియన్ బడ్జెట్పై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన గందరగోళం ప్రస్తుతం సమసిపోయినప్పటికీ రియల్ఎస్టేట్ వంటి రంగాలపై కొన్ని దుష్ఫలితాలు ఇంకా అలాగే ఉన్నాయని అన్నారు. బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయన్నది నిర్వివాదాంశమని అభిప్రాయపడ్డారు. దీనిని క్యాపిటలైజేషన్ ద్వారా పరిష్కరించాల్సి ఉందని చెప్పారు.